No.1 Short News

Newsread
దర్శి: పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సమావేశం.
ఎన్నికల సంబంధించి దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి అధ్యక్షతన 9-6-2025 న ఉదయం 11 గంటలకు దర్శి తహశిల్దార్ వారి కార్యాలయం నందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు దర్శి తాసిల్దార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మరణించిన వారిని ఫారం-7 ద్వారా తొలగించాలని,చిరునామా మార్పు అయినవారు వారు ఫారం-8 ద్వారా అప్లై చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు టి. దేవ ప్రసాద్, అఫ్రోజ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,పుల్లలచెరువు సత్యనారాయణ,మారెళ్ళ వెంకటేశ్వర్లు,టి బాబూరావు, మాడపాకుల శ్రీనివాసరావు, యస్ పౌలేసు, పి చిరంజీవి పాల్గొన్నారు.
Local Updates
22 Jun 2025 07:08 AM
4
51

Newsread
For better experience and daily news update.
Download our app from play store.