No.1 Short News

Sk.Asma Reporter 9948680044
కరవాది గ్రామానికి చెందిన యువతికి కేంద్ర న్యాయశాఖ లో ఇంటర్న్ షిప్ అవకాశం
ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం ఒక చిన్న గ్రామం కరవది నుంచి వచ్చిన విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో 5 వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని సత్యాల అంజన్ భారత ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం (Department of Legal Affairs) నిర్వహించే జూలై 2025 నెల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములో ఎంపికయ్యారు. ఈ ఇంటర్న్‌షిప్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూ ఢిల్లీలో జులై 1 నుండి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు కాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈమె ఎంపిక అయ్యారు. ఇది అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పని చేసే అరుదైన అవకాశం కావడం విశేషం. విద్యార్థిని తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక పోటీదారులను అధిగమించి ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ అవకాశాన్ని ఆమె తన భవిష్యత్ న్యాయ ప్రస్థానానికి ఒక మైలురాయి గా భావిస్తున్నారు..
Latest News
28 Jun 2025 18:48 PM
3
12

Newsread
For better experience and daily news update.
Download our app from play store.