Select Location
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ : కారు ప్రమాదంలో టీడీపీ నేత కుమారుడు మృతి
బాపనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పత్తి గురవయ్య కుమారుడు పత్తి నారాయణ స్వామి హైదరాబాద్‌లో కారు ప్రమాదంలో మృతి. యువ నేత డా. కడియాల లలిత్ సాగర్ స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
View More
Local Updates
08 Dec 2025 15:03 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
ఫారూక్ షుబ్లీ కి వినతి పత్రం అందచేసిన మహమూద్ పీర్
కర్నూలు: కర్నూలుకు చెందిన మహమూద్ పీర్ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయం కి విచ్చేసి, ఫరూక్ షుబ్లీ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెండు వ్యక్తులు విభిన్న విషయాలను చర్చించగా, ఫరూక్ షుబ్లీ ఈ వినతి పత్రం విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారనే తెలిపారు.
View More
Latest News
08 Dec 2025 14:21 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ యాక్ట్ అమలు ఎక్కడ ? అబ్దుల్ సత్తార్
వారసత్వ మసీదులను కాపాడడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌డిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6ను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో గోరంట్ల సర్కిల్‌ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 6 భారత చరిత్రలో రెండు విషాద సంఘటనల రోజు అని చెప్పారు. అదే రోజు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరివాణం బాబ్రీ మసీదు ధ్వంసం… భారత వారసత్వానికి మిగిల్చిన నెగెటివ్ ముద్ర భారతీయులమనుకుంటూ మైనార్టీలపై గుంపు దాడులు, ప్రార్ధనా స్థలాలపై దాడులు, మహిళలను అవమానించటం… ఇలా ప్రజాస్వామ్యాన్ని ఛేదించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు. ప్రజలు ఆకలి, నిరుద్యోగంతో ఆందోళన చెందుతుంటే… కోట్ల రూపాయలు విగ్రహాలు, ఆలయాలకు ఖర్చు చేస్తూ మత పేరుతో మూఢనమ్మకాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వక్ఫ్ సవరణలపైనా ఆయన మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా ఉమ్మీద్ యాప్‌కు గడువు పెట్టడం అన్యాయమని… ముస్లింలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. వక్ఫ్ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అబ్దుల్ సత్తార్ చేసిన ప్రధాన డిమాండ్లు: ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ముస్లింల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. వక్ఫ్ ఉమ్మీద్ యాప్ గడువు పొడగించాలి. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా కార్మిక నాయకులు పఠాన్ సాజిద్ ఖాన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖాజా వలి, బ్రాంచ్ అధ్యక్షులు షఫీగని, అబ్దుల్ రజాక్, ఖాదర్ భాషా, మహమ్మద్ సాధ్ తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
06 Dec 2025 14:35 PM
2
27
Newsread Image

No.1 Short News

Newsread
పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...
చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి (22).. రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి,ఆయన సిబ్బంది.. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పిన బాధితురాలు... నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆసుపత్రి డాక్టర్,సిబ్బంది... నొప్పి తట్టుకోలేక ఈరోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తోడ దగ్గరలో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తింపు... సర్జికల్ బ్లేడుని చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ బంధువులు... ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం... న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకి దిగిన బాధితురాలు బంధువులు... చిన్న ఆపరేషన్ చేయడానికి 2500 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపణ..
View More
05 Dec 2025 12:41 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి అభివృద్ధే నా ఆకాంక్ష: డా|| కడియాల లలిత్ సాగర్
ఈరోజు తన జన్మదినం సందర్భంగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న టిడిపి యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , దర్శి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, నేల నిండా అభివృద్ధి చేకూరాలనే మనస్పూర్తి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Dec 2025 09:56 AM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
రాజమండ్రిలో హోమియోపతి వైద్యుడికి ఘన సన్మానం
రాజమండ్రి (దివాన్ చెరువు): హోమియోపతి వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ జిలానిను ఒక హిందూ సోదరుడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. డాక్టర్ జిలాని గారు అనేక సంవత్సరాలుగా వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావిస్తూ, కులమత భేదాలు లేకుండా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంకు చెందిన ఓ వ్యక్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతడిని రాజమండ్రికి తరలించి డాక్టర్ జిలాని గారి వద్ద చికిత్స అందించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఆయన వైద్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఇదే కాకుండా, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన అల్లుడినే స్వయంగా చికిత్స చేసి బ్రతికించిన ఘటన కూడా ఆయన సేవాభావాన్ని చాటుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ జిలాని గారి మనవడు, సామాజిక కార్యకర్త సయ్యద్ సలీం మాట్లాడుతూ, “మా తాతయ్య గారు వైద్యాన్ని జీవిత ధర్మంగా భావించి సేవ చేశారు. ఆయనకు లభించిన ఈ గౌరవం సమాజానికి గర్వకారణం” అని తెలిపారు.
View More
03 Dec 2025 07:54 AM
2
31
Newsread Image

No.1 Short News

Newsread
అభిమాన నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా
దర్శి నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందిస్తున్న యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జన్మదినం ముందస్తు వేడుకలు జిల్లాలో సందడి చేశాయి. ఆయన తిరుపతి దర్శనానికి వెళుతున్న సంగతి తెలిసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నరసరావుపేటలోని ఆయన నివాసానికి చేరుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవానికి న్యాయం జరిగితేనే నా అసలు జన్మదినం అని భావిస్తున్న డాక్టర్ కడియాల, దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అండగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా, కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చేందుకు అండగా నిలవాలని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, దొనకొండ మండలాల నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
02 Dec 2025 19:46 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
ఉత్తమ పౌరులుగా ఎదగడానికి వ్యక్తిత్వ వికాసం–నైతిక విలువలు కీలకం
దర్శిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రత్యేక విద్యా దినోత్సవం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాద్యాయులు ఖాదర్ మస్తాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కె. యలమందారెడ్డి, కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి బాలికలే రేపటి నవభారత నిర్మాతలని, నైతిక విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతతో సబలంగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం, సేవాతత్పరతను అలవరచుకోవడం విద్యార్థుల నిజమైన పురోగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
View More
02 Dec 2025 18:20 PM
2
18
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండను మార్కాపురం జిల్లా లో కలపాలని డిమాండ్
దర్శి నియోజకవర్గంలోని దొనకొండను కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని డి‌బిహెచ్‌పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏ పనికైనా ఒంగోలుకు 90 కిమీ ప్రయాణం చేయాల్సి వస్తోందని, మార్కాపురం 30 కిమీ దూరంలో ఉండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దొనకొండ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని సుజాత హెచ్చరించారు.
View More
Latest News
02 Dec 2025 16:32 PM
2
26
Newsread Image

No.1 Short News

Newsread
వలీమా ఫంక్షన్ లో వధూవరులను ఆశీర్వదించిన గులాం రసూల్
గుంటూరు: డిసెంబర్ 1, 2025న పొన్నూరు రోడ్ బి కాన్వెన్షన్‌ లో షర్ఫుద్దీన్ వలిమా ఫంక్షన్‌ జరిగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి (తెనాలి పత్తిపాడు) గులాం రసూల్ నేతృత్వంలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్వర్, ఆబాద్, నయీమ్ నాగేశ్వరరావు, వాహబ్, జాని తదితర నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
View More
Local Updates
01 Dec 2025 23:14 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
మైలవరం పాఠశాలకు 162 సైకిళ్లు ఉచితంగా పంపిణీ
అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల కోసం సైకిళ్ల అందజేయడంలో సహకరించిన NREDCAP మరియు ASSIST సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దూరప్రాంతాల్లోని విద్యార్థులు ప్రయాణ సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో, ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో 5,300 మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశాము.
View More
Latest News
01 Dec 2025 22:57 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
తేజస్వి పొడపాటి ఆహ్వానంతో ద్వి కుటుంబ తేనిటీ విందు
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి ప్రత్యేక ఆహ్వానంతో, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు లలిత్ సాగర్ దంపతులు సోమవారం సాయంత్రం ఒంగోలు నివాసంలో తేనిటీ విందులో పాల్గొన్నారు. రెండు కుటుంబాలు స్నేహపూర్వక వాతావరణంలో ఆనందంగా గడిపారు.
View More
Latest News
01 Dec 2025 22:50 PM
0
41
Newsread Image

No.1 Short News

Newsread
కురిచేడు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో, త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ జరిగింది. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, ఆయుధాల నిర్వహణ, శుభ్రత, స్టాఫ్ పనితీరును పరిశీలించిన అధికారులు — పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని, ప్రజలతో మరింత సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఆదేశాలు.
View More
Latest News
01 Dec 2025 21:44 PM
0
45
Newsread Image

No.1 Short News

Newsread
తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ
బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.
View More
30 Nov 2025 18:29 PM
0
62
Newsread Image

No.1 Short News

Newsread
ఉర్దూ భాషాభివృద్ధికి బీజేపీ సహకారానికి హామీ
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉర్దూ భాషాభివృద్ధికి సహకారం అందించాలని కోరగా, భాషకు మతాలతో సంబంధం లేదు… ఉర్దూ అభివృద్ధికి తప్పకుండా తోడ్పాటునిస్తాం అని మాధవ్ హామీ ఇచ్చారు.
View More
Latest News
29 Nov 2025 14:52 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి అభివృద్ధి కి డా|| లక్ష్మీ నిబద్దత,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి వినతి
గత 18 నెలలుగా దర్శి అభివృద్ధి కోసం నిరంతరం పరిగెడుతున్న దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, నియోజకవర్గ ప్రజల ప్రధాన డిమాండ్ అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం కోసం సుమారు ₹2 కోట్లు నిధులు మంజూరు చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో దర్శి కొనసాగింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి లో రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని గ్రామాగ్రామం పర్యటిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ, యువత కోసం ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే దిశగా కృషి చేస్తూనే ఉన్నట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
View More
Latest News
27 Nov 2025 16:22 PM
2
38
Newsread Image

No.1 Short News

Newsread
సీఎం చంద్రబాబు తో ఫారూఖ్ షుబ్లీ ప్రత్యేక భేటీ
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కొత్త జీవం పోసే నాయకునిగా ఎదుగుతున్న చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. నా మీద ఉంచిన నమ్మకాన్ని… పనితో నిరూపిస్తాను!— చైర్మన్ శపథం! ఉర్దూ అకాడమీ అభివృద్ధి, కొత్త కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముందుంచిన ప్రతిపాదనలకు సీఎం సానుకూల స్పందన. యువశక్తికి ప్రేరణగా నిలుస్తూ… ఉర్దూ భాష కోసం కొత్త దిశలో అడుగులు — త్వరలోనే అమలులు! అమరావతి రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాక్!
View More
Latest News
27 Nov 2025 00:09 AM
0
40
Newsread Image

No.1 Short News

Newsread
2.5 లక్షల LOC చెక్కును అందచేసి డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం గాంధీనగర్ నివాసి బట్టువరపు అడుగుల శ్రీనివాసులకు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,50,000/- LOC చెక్కును దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
26 Nov 2025 20:22 PM
0
50
Newsread Image

No.1 Short News

Newsread
మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావు.. ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణ రాజు.. ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఛైర్మన్‌గా విక్రమ్..ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మౌలానా షిబిలీ..ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రామ్ ప్రసాద్.. పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మధుబాబు.. స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా శంకర్‌రెడ్డి.. కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిన్నప్ప..షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ముక్తియార్.. భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా వీరభద్రరావు.. #AndhraPradesh
View More
Latest News
22 Nov 2025 18:15 PM
0
52
Newsread Image

No.1 Short News

Newsread
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. పదవ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు శుక్రవారం రోజున విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష ఉంటుంది, మార్చి 18న సెకెండ్‌ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు, మార్చి 20న ఆంగ్లం, 23న గణితం, మార్చి 25న భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్), మార్చి28న జీవశాస్త్రం ( బయలాజికల్ సైన్స్), మార్చి 30న సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు మార్చి 31న కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2) పరీక్ష ఉంటుంది. అలాగే ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీన థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వంద మార్కులకు నిర్వహించే పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే పరీక్షలు (సైన్స్, సోషల్) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి11 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
View More
Latest News
21 Nov 2025 19:18 PM
0
52
Newsread Image

No.1 Short News

Newsread
ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు
AP: ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
View More
Latest News
21 Nov 2025 18:59 PM
0
42
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు: గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ—ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్న తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అధికారులు అప్రమత్తంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిరగనీయవద్దని, ముఖ్యంగా రెవిన్యూ, భూముల ఆన్లైన్ ఎంట్రీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూ వివాదాలు వంటి అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక విద్యుత్, పెన్షన్లు, రోడ్లు, డ్రైన్లు, పోలీస్ కేసులు వంటి సమస్యలకు కూడా త్వరితగతిన స్పందించాలని అన్నారు. వచ్చే ప్రజా వేదిక నాటికి అందిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా సాధ్యం కాని సమస్యలు తన ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరవేస్తానని హామీ ఇచ్చారు. దొనకొండలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సోలార్ పార్క్, ఆయుధ తయారీ కేంద్రం వంటి పరిశ్రమలతో ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, టిడిపి సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–యూనిట్–బూత్ ఇంచార్జిలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
21 Nov 2025 14:48 PM
1
48
Newsread Image

No.1 Short News

Newsread
నకిలీ గ్రూపులతో కోట్లు కొల్లగొట్టిన ఆర్పీలు
గుడివాడ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో నకిలీ గ్రూపులు చూపించి సుమారు 3 కోట్ల రూపాయలను ఆర్పీలు దోచుకున్నారు. 60 నుండి 70 నకిలీ గ్రూపులు తయారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పురపాలక సంఘం మెప్మా విభాగంలోని డ్వాక్రా అధికారులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఈ దోపిడీ చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గుడివాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లలోనూ నకిలీ గ్రూపులు ఉన్నట్లు సమాచారం. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేరుతో కొందరు ఆర్పీలు దోపిడిదారులుగా మారి, అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ రుణాలు పొందుతున్నారని తెలుస్తోంది. ఒకే గ్రూపులో ఇప్పటికే సభ్యులుగా ఉన్న మహిళల పేర్లతో మళ్లీ రుణాలు డ్రా చేస్తున్నట్లు బయటపడింది. కొత్తగా నకిలీ గ్రూపుకి సహకరించే ఒక్కో మహిళకు 10 వేల రూపాయిలు వరకు ఇచ్చి వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావలిసిన డాకుమెంట్స్ సేకరించి నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు కాజేస్తున్నారు. ఇలా ఒక్కో గ్రూపుకి సుమారు 20 లక్షల రూపాయల రుణం తీసుకుంటున్నారని సమాచారం. ఒక వార్డులో నకిలీ గ్రూపు సృష్టించి, అప్పటికే గ్రూపులో ఉన్న మహిళ దగ్గరికి వెళ్లి డ్వాక్రా వ్యక్తిగత రుణం పేరుతో ఆమెతో పాటు మరో ఎనిమిది మంది పేర్లను జోడించి గ్రూపు రిజిస్టర్ చేసింది ఓ ఆర్పీ. ఆ రుణంలో 2 లక్షల రూపాయలు సభ్యులకి ఇచ్చి, మిగతా 18 లక్షలు అర్పీ దోచుకున్నారని సమాచారం. మరొక వార్డులో సమైక్య సొమ్ములు తమ కుటుంబ సభ్యులకు ఇచ్చి, సొమ్ములు అన్ని ఖాళీ చేసి అడిగిన మహిళలకు పంగ నామం పెట్టింది ఓ ఆర్పీ. సాధారణ మహిళల పేదరిక నిర్మూలన పథకం పేరుతో ఆర్పీలు కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా ఈ నకిలీ గ్రూపుల తంతు కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని సామాన్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంతే కాక సాధారణ రుణానికి గాను ప్రతి మహిళ నుంచి 2 వేల నుండి 4 వేల రూపాయల వరకు లంచం తీసుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో సమాఖ్య రుణాలు, శ్రీనిధి రుణాలు రాక ఇబ్బందులు పడుతున్న మహిళలు ఉన్నారు. ఇతర జిల్లాల్లో మహిళలు సమాఖ్య పొదుపులతో వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందుతుండగా, గుడివాడలో మాత్రం దోపిడీ మాయం గాథ కొనసాగుతుంది. కొంతమంది ఆర్పీలు తప్ప మిగతా వారు అందరూ నకిలీ గ్రూపులు సృష్టించి దోపిడీ చేయడమే ధ్యేయంగా మారింది. లోన్ పెట్టు – లక్షలు కొట్టు అన్న నినాదంలా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఆర్పీ కింద 25 నుండి 30 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో రుణం కోసం 2500 నుండి 4000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇవ్వకపోతే తరువాత రుణాలు చేయమని బెదిరిస్తున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ. గుడివాడ డ్వాక్రా వ్యవస్థలో నెలకొన్న అవినీతి రొచ్చు అంత లోతైనదని మహిళలు చెబుతున్నారు. ఈ నకిలీ గ్రూపుల ద్వారా కొల్లగొట్టిన డ్వాక్రా సొమ్ములను సంబంధిత ఆర్పీల వద్ద రికవరీ చేసి, పేద మహిళలకు మళ్లించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
View More
Crime News
20 Nov 2025 14:04 PM
1
33
Newsread Image

No.1 Short News

Newsread
ఈరోజు ప్రతి రైతు ఇంట్లో పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, పొట్లపాడు గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. వారితో పాటూ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, అగ్రికల్చర్ రెవిన్యూ, ఎంపీడీఓ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొని రైతును నిలబెట్టే ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడత క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000, పీఎం కిసాన్ కింద గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చే రూ. 2,000 కలిపి 7,000 రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ వ్యవసాయ శాఖ మాత్యులు కే అచ్చం నాయుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో నేడు ఈ పథకాన్ని రైతులకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. ఆనాడు తొలివిడత నిధులు మన దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆనాడు కొందరు వైసీపీ నేతలు హేళన చేశారు ఇప్పుడు ఏం మాట్లాడతారు మాట నిలుపుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి ద్వేయంగా మన ప్రభుత్వం 18 నెలల కూటమి పాలన సాగుతుందన్నారు. ఇటీవల కురిచిన తుఫాను తాకిడి పంట నష్టాలు అంచనా వేయడం జరిగిందని రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అన్నారు.
View More
Latest News
19 Nov 2025 21:18 PM
1
38
Newsread image

No.1 Short News

Newsread
బిడ్డను కాపాడిన దర్శి ఎస్సై మురళి
దర్శి లో రెండేళ్ల బిడ్డతో ఒక మహిళ కురిచేడు రోడ్డులోని సాగర్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.అయితే అటుగా వెళ్తున్న ఎస్సై మురళి గమనించి స్థానికుల సహాయంతో సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న తల్లి బిడ్డను బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిడ్డ పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సకాలం లో స్పందించి ఎసై తల్లిబిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన మహిళను పోలీసులు విచారిస్తున్నారు..
View More
Latest News
19 Nov 2025 20:05 PM
0
54
Newsread Image

No.1 Short News

Newsread
వీరి ఉగ్రవాదం వెనుక ఏ గ్రంథం పనిచేస్తుంది?
ఒక అబద్ధాన్ని నలుగురూ కలిసి ఎంత బలంగా ప్రచారం చేస్తే అది అంత నిజంగా మారిపోతుందన్నది వాట్సాప్ యూనివర్సిటీ సభ్యులు నమ్మే బలమైన ఫిలాసఫీ! వాట్సాప్ యూనివర్సిటీ నడిపే ఫేక్ ప్రోపగాండాకు చదువుసంధ్యలు లేని కొందరు వ్యక్తులు ప్రభావితమవుతుంటారనుకుంటే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ సమాజంలో కొందరు ఉన్నత విద్యావంతులు, మీడియా రంగంలో సైతం పనిచేసే వ్యక్తులు, చివరకు కొందరు నాస్తికులు సైతం ఈ ఫేక్ ప్రోపగాండాకు ప్రభావితమైపోయి కొన్నిసార్లు... ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్లు ఇస్తూ తమ మనసుల్లో ఏ మూలనో దాగున్న మత విద్వేషాన్ని వెళ్లగక్కుతూ సంతృప్తి పడుతుంటారు. చివరకు ఈ మధ్య నా అన్వేషణ పేరుతో ఛానల్ నడిపే యూట్యూబర్ సైతం ముస్లిములందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్ ఇచ్చే స్థితికి దిగజారిపోయాడంటే వాట్సాప్ ఫేక్ ప్రోపగాండా సొసైటీలో ఎంత బలంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్ ఫేక్ ప్రోపగాండాకు ఇతని మానసిక పరిస్థితి ఎంతగా ప్రభావితమైం దంటే... ముస్లిములను ఉగ్రవాదం చెయ్యటానికి ఖురాన్ గ్రంథమే ప్రభావితం చేస్తుందని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది కేవలం ఇతనొక్కడి మానసిక పరిస్థితి మాత్రమే కాదు, ముస్లిం వ్యతిరేకత మెదళ్లలో నింపుకున్న చాలామంది మానసిక పరిస్థితి నేడు ఎలా ఉందంటే... మొత్తం చెడ్డోళ్లంతా పనికట్టుకుని ముస్లిం సమాజంలో మాత్రమే పుట్టారు, అమాయకులు మంచోళ్లంతా హిందూ సమాజంలో పుట్టారని ఊహించుకునేంత స్థితిలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు! ఏ మతానికి చెందిన వాడైనా ఉగ్రవాదానికి పాల్పడితే కచ్చితంగా అందరూ కలిసి అతన్నో నేరస్తుడుగా పరిగణించి ఖండించాల్సిందే కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని స్టేట్మెంట్ ఇవ్వటానికి మించిన అజ్ఞానం, మూర్ఖత్వం మరొకటి ఉండదు. సరే ఉగ్రవాదులంతా ముస్లిములే అన్న బోగస్ థియరీని బలంగా నమ్మే వారు... ఎప్పటివో సంఘటనలు కాదు, ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకు దేశ రహస్యాలు చేరవేస్తూ, ఉగ్రవాదం చేస్తూ పట్టుబడ్డ కొన్ని సంఘటనలకు చెందిన న్యూస్ ఆర్టికల్స్ చదవాలి. నిజంగా ఉగ్రవాదాన్ని ఖురాన్ గ్రంథమే ప్రేరేపిస్తుంది అనుకుంటే మరి వీళ్ల ఉగ్రవాదం వెనుక ఏ గ్రంథం పని చేస్తుందో చెప్పాల్సి ఉంటుంది. నేనైతే ఎప్పుడూ చెప్పేమాట ఒక్కటే... ఉగ్రవాదానికి మతం ఉండదు, మతాన్ని అనుసరించేవాడు ఉగ్రవాదానికి పాల్పడడు. మరి ఉగ్రవాదానికి ఎవడు పాల్పడతారు? అంటే... మత ఉన్మాదాన్ని మతి నిండా నింపుకునే పిచ్చోళ్లే ఉగ్రవాదానికి పాల్పడతారు... ఆ ఉన్మాదులకు హిందూ పేర్లైనా ఉండొచ్చు లేదా ముస్లిం పేర్లైనా ఉండొచ్చు... లేదా వేరే ఏ మతానికి చెందిన పేర్లైనా ఉండొచ్చు...
View More
Latest News
16 Nov 2025 20:46 PM
0
45
Newsread Image

No.1 Short News

Newsread
విమాన ప్రమాదంలో కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం
విమాన ప్రమాదంలో మరణించిన ఓ భారత మహిళా శిఖా గార్గ్(32) కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం అందించనున్నారు. 2019లో మార్చి 10వ తేదీన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ET302 (బోయింగ్ 737MAX) విమానం కూలిన ఘటనలో 157 మంది దుర్మరణం చెందారు. అందులో భారత్‌కు చెందిన శిఖా గార్గ్ కూడా ఉన్నారు.ఈ ప్రమాదానికి గానూ ఆమె కుటుంబానికి 35.8 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని విమాన సంస్థని అమెరికా లోని షికాగో ఫెడరల్ కోర్టు నవంబర్ 12వ తేదీ 2025న ఆదేశించింది. శిఖా గార్గ్ UNOలో కన్సల్టెంట్ గా పనిచేస్తూ నైరోభిలో జరగబోయే UNO సమావేశాలకు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బోయింగ్ కంపెనీ శిఖా గార్గ్ కుటుంబానికి సుమారు 28.45 మిలియన్ డాలర్ల (సుమారు 240 కోట్లు ) చెల్లించాలి ఇందులో ఆమె చనిపోయే ముందు అనుభవించిన బాధకు 10 మిలియన్ డాలర్లు, ఆమె కుటుంబం అనుభవించిన దుఃఖానికి 10 మిలియన్ డాలర్లు. వీటితోపాటు అదనంగా ఆమె భర్త సౌమ్య భట్టాచార్యకు 3.45 మిలియన్ డాలార్లు, వీటికి వడ్డీ 26%తో కలిపి 35.8 మిలియన్ డాలర్లు (సుమారు 300 నుంచి 319 కోట్లు ) చెల్లించనున్నారు.
View More
15 Nov 2025 16:29 PM
1
43
Newsread Image

No.1 Short News

Newsread
వైయస్ఆర్సీపీ దర్శి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగూర్
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి దర్శి నియోజకవర్గ మైనారిటీ సెల్ అనుబంధ విభాగానికి అధ్యక్షులుగా షేక్ నాగూర్ ను నియమిస్తున్నట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది, తనపై నమ్మకంతో తనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారికి షేక్ నాగూర్ కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
14 Nov 2025 22:12 PM
2
43
Newsread Image

No.1 Short News

Newsread
హల్దీ వేడుకలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం నాగంబోట్లపాలెం గ్రామంలో షేక్ రఫీ కుమారుడు కలాం పెళ్లికుమారుని చేయు కార్యక్రమం (హల్దీ)లో దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుడు కలాం ను ఆశీర్వదించారు.
View More
Latest News
14 Nov 2025 21:06 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
బీహార్ లో బిజెపి గెలుపుపై దర్శి లో సంబరాలు
ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శి పట్టణం స్థానిక బిజెపి నాయకులు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్లో సునామి సృష్టించారని రాబోవు స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గాని భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు తిండి నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కాకర్లనాగసాయి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత గురువర్ధన్ రావు, పట్టణ అధ్యక్షులు వల్లభ వరపు అమరేశ్వర రావు అచ్యుత్ శరత్ బచ్చు అనిల్ యువమోర్చా నాయకులు అనిల్, జనసేన నాయకులు పాపారావు, శివ కోటా చారి కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
14 Nov 2025 20:09 PM
1
35
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో స్థానిక ఎన్నికలు.. కీలక అప్డేట్?
ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైంది. నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల SEC తెలిపారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సన్నాహాలు పూర్తి చేసి, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని SEC యోచన చేస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.
View More
Latest News
14 Nov 2025 20:03 PM
0
42
Newsread Image

No.1 Short News

Newsread
చిల్డ్రన్స్ డే వేడుకల్లో విద్యార్థులతో దర్శి సీఐ, ఎస్సై.
చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా, ప్రకాశం దర్శి పోలీసులు దర్శి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. వారితో బాలల దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్లు, రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు మరియు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ శ్రీ వై. రామారావు, ఎస్సై శ్రీ ఎం. మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకుని, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శకత్వం అందించారు. సుమారు 60 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, స్వీట్లు పంచి వారికి ఆనందాన్ని పంచారు.
View More
Latest News
14 Nov 2025 19:52 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
ఉత్తమ మరియు చెత్త స్లీపింగ్ పోజిషన్
రాత్రి ఎంత బాగా నిద్రపోయారో మీ రోజు ఎంత బాగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మరియు తాజా పద్దతిలో రోజును ప్రారంభించాల్సిన అవసరం ఉంది. నిద్ర లేకపోవడం మానసిక స్థితిని ప్రభావితం చేయడమే కాక, అనేక రకాల ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. తీసుకొనే ఆహరం, తీసుకుంటున్న మందులు, నిద్ర యొక్క నాణ్యత మరియు పరిమాణం మరియు ఒత్తిడి మీ నిద్రను ప్రభావితం చేయును. అయినప్పటికీ, మనలో చాలా మంది నిర్లక్ష్యం చేసేది నిద్ర పోయే పొజిషన్. ఇది మీ నిద్రను మాత్రమే కాకుండా మీ వెనుక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బాక్ Back/వెన్నుముక కు కొన్ని ఉత్తమమైన మరియు చెత్త నిద్ర పొజిషన్స్ సరిలేని నిద్ర భంగిమ poor sleeping posture మెడపై అనవసరమైన ఒత్తిడిని కలిగించడమే కాకుండా తుంటి మరియు వెనుక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో వెన్నునొప్పికి కారణమవుతుంది. నిరంతర నొప్పి, ఒక వ్యక్తి యొక్క రోజువారీ దినచర్యకు భంగం కలిగిస్తుంది మరియు నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. వెన్నునొప్పి మరియు నిద్ర లేమితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, మంచి రాత్రి నిద్ర కోసం మంచి నిద్ర పొజిషన్ని అనుసరించడం చాలా ముఖ్యం. నిద్రపోయేటప్పుడు వెన్నెముక యొక్క సహజ వక్రత natural curve ను నిర్వహించడానికి సహాయపడేది మంచి నిద్ర పొజిషన్. పడుకున్నప్పుడు మీ మెడ, వెనుక మరియు తుంటిని సరైన మార్గంలో సమలేఖనం చేసే స్థానం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సహజ వక్రతను నిర్వహిస్తుంది మరియు మీరు నిద్రపోయినప్పుడు వెనుక మరియు వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగించదు. ఉత్తమ మరియు చెత్త స్లీపింగ్ పోజిషన్స్/స్థానాలు: వెనుక మరియు వెన్నెముక back and the spine కు మంచి నిద్ర పోజిషన్స్ మరియు చెడు నిద్ర పోజిషన్స్ ఉంటాయని వైద్య నిపుణులు అంటారు. అందువల్ల వెన్నెముక నిపుణులు రోగులను వెనుక on the back లేదా పక్కకు తిరిగి sideways నిద్రపోవాలని సిఫారసు చేస్తారు, కడుపుపై లేదా పిండం స్థితిలో పడుకోవడం sleeping on the stomach or in the fetal position చాలా చెత్త పోజిషన్స్ . ఉత్తమ స్లీపింగ్ స్థానాలు Best Sleeping Positions: 1.మీ వెనుకభాగంలో నిద్రపోవడం Sleeping on your back: మీరు వెనుకభాగంలో నిద్రిస్తున్నప్పుడు, తల, మెడ మరియు వెన్నెముక తటస్థ స్థితిలో (సరళ రేఖలో) ఉండేలా చూసుకోండి. శరీరమంతా ఒకే సమయంలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు వెన్నెముక మరియు వెనుక భాగాలపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మీరు మోకాళ్ల క్రింద ఒక దిండును ఉంచవచ్చు, ఎందుకంటే ఇది మోకాళ్ల వల్ల వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వెన్నెముక యొక్క సాధారణ వక్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక, తక్కువ వెన్నునొప్పితో బాధపడేవారికి ఇది ఉత్తమమైన స్థానం, వీపు మీద పడుకున్నప్పుడు నొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. 2.పక్కకి తిరిగి నిద్రపోవడం Sleeping sideways: వెనుక మరియు వెన్నెముకకు తదుపరి ఉత్తమ నిద్ర స్థానం పక్కకి తిరిగి నిద్రపోతుంది. ఈ స్థానం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు, నిద్రపోతున్నప్పుడు మీరు పక్కకు తిరగవచ్చు, అంటే మీ కాళ్ళు వెనుక భాగంలో సరైన స్థితిలో ఉంటాయి. భంగిమను స్థిరీకరించడానికి సహాయపడేటప్పుడు మీ మోకాళ్ల మధ్య ఒక దిండు ఉంచడం మంచి ముందు జాగ్రత్త చర్య. మీరు దిండు లేకుండా నిద్రపోతే, మీ శరీరం కిందకు పడిపోతుంది లేదా ముందుకు వస్తుంది, మీ వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి తెస్తుంది. అందువల్ల, పక్కకి నిద్రించేటప్పుడు దిండును ఉపయోగించమని సలహా ఇస్తారు. ఈ నిద్ర స్థానం గట్టి వెనుక stiff back, తక్కువ వెన్నునొప్పి మరియు మెడ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. చెత్త స్లీపింగ్ స్థానాలు Worst Sleeping Positions: 1.కడుపుపై నిద్రపోవడం Sleeping on the stomach: ఇది చెత్త నిద్ర పోజిషన్స్ లో ఒకటిగా పరిగణించబడుతుంది ఎందుకంటే కడుపుపై నిద్రపోవడం మీ వెన్నెముక యొక్క సహజ వక్రతను ప్రభావితం చేస్తుంది. స్థానం వెన్నెముకను పొడిగింపుగా ఉంచుతుంది. కడుపుపై నిద్రించేటప్పుడు మెడ ఒక వైపుకు తిరగడం వల్ల ఇది మెడను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మెడ మరియు వెన్నెముక కండరాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మీ వెనుకభాగంలో నిద్రించడానికి ప్రయత్నించడం మంచిది. 2.పిండం స్థితిలో నిద్రపోవడం Sleeping in the fetal position: ఇది ఒక వ్యక్తి కడుపు లేదా ఛాతీలోకి వంకరగా ఉన్న మోకాళ్ళతో నిద్రించే స్థానం. ఇది చాలా సాధారణ నిద్ర స్థానాలలో ఒకటి. ఇది నిద్రపోలేని అనారోగ్యకరమైన స్థానం. దీనికి కారణం వెన్నెముకను సాధారణమైన S- ఆకారానికి విరుద్ధంగా అసహజమైన C- ఆకారంతో వెన్నెముకను ఒక వంచులో ఉంచుతుంది. ఇది వెన్నెముక డిస్కులను కూడా ప్రభావితం చేస్తుంది. వెన్నెముక డిస్క్‌ లు జెల్లీ లాంటి నిర్మాణాలు, ఇవి మరొక వైపు నుండి ఒత్తిడి తెచ్చినప్పుడు డిస్క్ ఒక వైపు నుండి ఉబ్బిపోయేలా చేస్తుంది. కాబట్టి మీరు ఈ స్థితిలో నిద్రిస్తున్నప్పుడు, ఈ డిస్కులను వెనక్కి నెట్టడం వలన ఇది డిస్క్ ఉబ్బెత్తుకు కారణమవుతుంది మరియు జారిపోయిన డిస్క్ వంటి వెన్నెముక సమస్యల ప్రమాదం మీకు వస్తుంది.అందువల్ల, ఈ స్థితిలో నిద్రపోకుండా ఉండండి.
View More
Education
14 Nov 2025 07:01 AM
1
44
Newsread Image

No.1 Short News

Newsread
తాళ్లూరులో వైసీపీకి షాక్ — 30 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం! 💛
తాళ్లూరు మండలం వైసీపీ వైస్ ఎంపీపీ యిడమ వెంకటేశ్వర రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ యిడమకంటి రమాదేవి , తాళ్లూరు మండలానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దర్శి పట్టణంలోని పి.టి.యస్. కన్వెన్షన్ హాల్ లో జరిగిన టిడిపి ప్రమాణస్వీకార సభ వేదికపై దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , యువనాయకుడు డా. కడియాల లలిత్ సాగర్ సమక్షంలో పార్టీలో చేరిక జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యువ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
View More
13 Nov 2025 19:03 PM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
పేదల గృహప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం అనంతరం నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.
View More
Latest News
12 Nov 2025 19:25 PM
0
35
Newsread Image

No.1 Short News

Newsread
ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నెలల ఇమామ్ & మౌజ్జన్ గౌరవ వేతనాల కొరకు 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది
View More
Latest News
12 Nov 2025 18:30 PM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా వైకాపా ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శి లో స్థానిక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి రోడ్డులోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
12 Nov 2025 18:25 PM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
పక్కా గృహాల భూమి పూజ కార్యక్రమంలో డా||గొట్టిపాటి లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ – ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 క్రింద 54 మంది లబ్ధిదారులకు పక్కా గృహమూల మంజూరు ఉత్తర్వుల పంపిణీ & భూమి పూజ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా|| లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్ళ వలె కలిసి నడుస్తున్నాయని, వైసిపి అవినీతి పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
12 Nov 2025 18:08 PM
0
40
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు లో ఘనంగా నేషనల్ మైనారిటీ డే వేడుకలు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా BJMC రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా , BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజీద్ ఖాన్, BJMC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, కరాటే కోచ్ షేక్ కరీముల్లా మరియు ముస్లిం సోదరులు తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆనాడు త్యాగాలు చేసిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి అని, ఆయన జీవితాంతం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్మికులతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లి పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
11 Nov 2025 18:39 PM
1
28
Newsread Image

No.1 Short News

Newsread
డిప్యూటీ స్పీకర్ RRR తో డాక్టర్ గొట్టిపాటి భేటీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరు jkc కాలేజీ ఆడిటోరియంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు అభినందన కార్యక్రమంలో అతిధిగా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ RRR తో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.
View More
Latest News
07 Nov 2025 19:56 PM
1
52
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలు ప్రకాశం భవన్‌లో జరిగిన జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సాంఘిక శాఖ మంత్రి గౌ. డోలా బాల వీరాంజనేయస్వామి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు గారు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లాలోని ఎమ్మెల్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
View More
07 Nov 2025 19:52 PM
1
58
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:29 PM
1
116
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ.
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:27 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్!
జోహ్రాన్ మమ్దానీ 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 34 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా, అయన ఆండ్రూ క్యూమో (స్వతంత్ర అభ్యర్థి)ను ఓడించి, 50.3% ఓట్లతో గెలిచారు. మమ్దానీ న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి ముస్లిం మేయర్ మరియు ఆధునిక కాలంలో మొదటి ఇమ్మిగ్రెంట్ మేయర్.
View More
Latest News
06 Nov 2025 11:44 AM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు
పార్వతి మన్యం జిల్లాలో ప్రమాదానికి గురైన మరో బస్సు.మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన.ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్.తప్పిన ప్రాణపాయం, మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు.విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు అని సమాచారం.
View More
Latest News
06 Nov 2025 11:28 AM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
కార్తీక పౌర్ణమి మహిళల కోలాటం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామం లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన లో ముఖ్య అతిధులు గా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా కోలాటం ప్రదర్శించి న 40 మంది మహిళలకు డా|| లక్ష్మీ చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో తురకపాలెం గ్రామ టిడిపి నాయకులు, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
View More
Latest News
05 Nov 2025 22:33 PM
1
50
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
టీడీపీ ఓడిపోదు..! మళ్లీ మళ్లీ పవర్ లోకి వస్తాం..! చంద్రబాబులో అంత కాన్ఫిడెన్స్‌కి కారణమేంటి..
వస్తామ్. మళ్లీ మళ్లీ పవర్‌లోకి వస్తాం. అసలు టీడీపీ ఓడిపోదు. రాసి పెట్టుకోండి. గెలుపు మనదే. ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే. ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది. పవర్‌పై బాబు ధీమా వెనుక ప్లానేంటి? రాబోయే ఎన్నికలకు..ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి? అంత గట్టిగా ఓడిపోబోమని చెప్పడానికి కారణమేంటి? ఏపీలో పవర్ షిఫ్లింగ్‌ సిస్టమ్‌ నడుస్తోంది. విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైమ్‌ జగన్‌ పవర్‌లోకి వచ్చారు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ స్లైడ్‌ విక్టరీతో ఏపీని పాలిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి..అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారం తమదేనని ధీమాగా ఉంది. సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంతే అంటున్నారు.చంద్రబాబు మాటల్లో ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్.. చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆశామాషీ కాదు. ఎందుకంటే గ్రౌండ్‌ లెవల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడూ మాట్లాడరు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో నెగెటీవ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు..పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోదు..ఇక నుంచి వచ్చే జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని..ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని బాబు చెప్పుకొస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు ప్లానింగ్..అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మీద ఎక్కడా నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యలు..ఇచ్చి హామీలు ఇలా అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా మెయింటెన్ చేస్తున్నారు. కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు.. బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని.. సంక్షేమ పథకాలు, పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్‌ పెట్టి..సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం, వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో 15ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు, పవన్ చెబుతున్న మాట. మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది. పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. 2024లో కూటమి దాదాపుగా 60శాతం ఓటు షేర్‌ను రాబట్టింది. ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు.గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్‌ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు. సేమ్‌టైమ్‌ అక్రమాలు, అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా గప్‌ చుప్‌ అయిపోయి..మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట. ఇక రాజకీయంగా వైసీపీ 2019కు ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా? ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది? అందుకు విరుగుడు ఏంటి? అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి. ఇలా తనదైన మంత్రాంగంతో..ఏపీ పొలిటికల్‌ గేమ్‌లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బాబు ధీమానే నిజం కాబోతోందా? ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో చూడాలి.
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
46
Newsread image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..
ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
42
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాన్‌ నష్టాలపై కలెక్టర్‌కి నివేదిక సమర్పించిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి
తుఫాన్‌ బీభత్సంతో ధ్వంసమైన రహదారులు, కాలువల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్‌ రాజబాబును కోరారు.ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో యువనేత డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌తో కలిసి ఆమె తుఫాన్‌ కారణంగా జరిగిన ఆస్తి, పంటనష్టాలపై నివేదిక అందజేశారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దర్శి ప్రాంతంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికారుల కృషిని డాక్టర్‌ లక్ష్మి ప్రశంసించారు.
View More
Latest News
05 Nov 2025 19:53 PM
0
24
Newsread Image

No.1 Short News

Newsread
3.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
దొనకొండ మండలం పడమటి వెంకటాపురం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు గారి కుమారుడు శ్రీ సాయి కి ₹3,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి LOC చెక్కును దర్శి టిడిపి ఇంచార్జి డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు నరసరావుపేటలోని తన నివాసం వద్ద బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కంచర్ల శ్రీనివాసరావు, దొనకొండ మండల ఐ.టిడిపి అధ్యక్షులు వై.కే. చౌదరి పాల్గొన్నారు.
View More
05 Nov 2025 18:11 PM
0
50
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (820)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.