బెంగుళూరు టు గుంటూరు డ్రగ్స్ రవాణా–స్మగ్లర్ల అరెస్ట్
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్పస్ ఫండ్ చెక్కులను పోలీస్ కుటుంబ సభ్యులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ది.17.04.2025 తేదిన అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ G.వీరయ్య సతీమణి సౌజన్య లక్ష్మీ గారికి మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ది.21.04.2025 తేదీన మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ K.క్రాంతి కుమార్ సతీమణి శ్రీమతి K. ప్రవీణ గారికి కపోలీస్ శాఖా తరపున అదనపు కార్పస్ ఫండ్ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.100,000/- చొప్పున రూ.2,00,000/-- రూపాయలను ఎస్పీ చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీ అద్దంకి. వెంకటేశ్వర రావు గారు అందజేయడం జరిగింది.
మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.
కరవాది గ్రామానికి చెందిన యువతికి కేంద్ర న్యాయశాఖ లో ఇంటర్న్ షిప్ అవకాశం
ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం ఒక చిన్న గ్రామం కరవది నుంచి వచ్చిన విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో 5 వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని సత్యాల అంజన్ భారత ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం (Department of Legal Affairs) నిర్వహించే జూలై 2025 నెల ఇంటర్న్షిప్ ప్రోగ్రాములో ఎంపికయ్యారు.
ఈ ఇంటర్న్షిప్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూ ఢిల్లీలో జులై 1 నుండి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు కాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈమె ఎంపిక అయ్యారు.
ఇది అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పని చేసే అరుదైన అవకాశం కావడం విశేషం. విద్యార్థిని తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక పోటీదారులను అధిగమించి ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ అవకాశాన్ని ఆమె తన భవిష్యత్ న్యాయ ప్రస్థానానికి ఒక మైలురాయి గా భావిస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వ అతిధి గా మౌలానా అసద్ మదిని కి స్వాగతం పలికిన ఫారూఖ్ షుబ్లీ
ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి NMD ఫరూఖ్ సూచనల మేరకు జమియత్ ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు హజ్రత్ మౌలానా మహమూద్ అసద్ మదని ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలకటం జరిగింది. మౌలానా హుస్సేన్ , ముఫ్తీ ఇలియాజ్ కూడా ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి.
ఆఫీస్ అద్దాలు ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం
కార్లు ధ్వంసం .. ఇంకా కొనసాగుతున్న దాడి
స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు
TEL నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి... PRGI కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు .. త్వరలో జిల్లా DPRO లకు ఉత్తర్వులు.
PRESS REGISTRAR GENERAL OF INDIA
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని RNI లేని పత్రిక లు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పి డి ఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్,PRGI. న్యూ ఢిల్లీ అప్పీలు చేయగా ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి RNI లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు RNI లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీచేసింది దీని గమనించి రాష్ట్ర జిల్లా పౌరసంబంధాల అధికారులు పరిగణించాలని ఆర్ ఎన్ ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సదరు జిల్లా పౌరసంబంధాల అధికారులు సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేశారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో యాంకర్గా విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ పూర్ణ చందర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో తన నివాసంలో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్వేచ్ఛ గతంలో తన తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి రామ్ నగర్లోని వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసించగా, ఇటీవల జవహర్ నగర్లోని ఒక ఇంటికి మారినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒక వ్యక్తితో మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా టీవీ9 సహా పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో జర్నలిస్ట్గా, యాంకర్గా పనిచేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె ఈసీ మెంబర్గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మైనర్ విద్యార్థి పై కేసు నమోదు చేసిన పోలీసులు:
ఒంగోలు క్రైమ్: 8 నెలల గర్భం దాల్చిన దివ్యాంగ బాలిక దుర్ఘటన ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలానికి చెందిన మహిళకు పిల్లలు లేకపోవడంతో తన తమ్ముడు పిల్లల్లోని ఒక కుమార్తెను దత్తత తీసుకొని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బద్రుల ఆశ్రమంలో చేర్పించింది. అనంతరం ఇంటర్మీడియట్ కు బాపట్ల జిల్లాలో బద్రుల ఆశ్రమంలో చేర్పించింది . బాలిక కాలుల్లో నీరు చేరడం వల్ల ఒంగోలు జిల్లాలోని జిహెచ్కి తరలించి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఎనిమిది నెలల గర్భం ధరించిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని మేనత్తకు చేరవేశారు. బాలికను మేనత్త ప్రశ్నించగా ఒంగోలులో బదురుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కొన్ని నెలల క్రితం అర్ధరాత్రి తన వద్దకు వచ్చి నోరు మూసి అత్యాచారం చేశాడని .తన సైగలతో తెలియజేసింది. విషయం తెలుసుకున్న తన మేనత్త ఒంగోలులో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కొత్త ఎలక్ట్రిక్ SUV YU7 లాంచ్ అయిన వెంటనే సంచలనం సృష్టించింది. కేవలం 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు నమోదు చేసింది. మొదటి గంటలోనే 3 లక్షల యూనిట్లు బుక్ చేసుకున్నారు.
ఈ కారు 835 కి. మీ పరిధి, 690 PS పవర్, 15 నిమిషాల్లో 620 కి. మీ ఛార్జింగ్ సామర్థ్యం దీనిని చాలా ప్రత్యేకంగా చేసింది. స్టైలిష్ ఇంటీరియర్స్, హై-టెక్ ఫీచర్లు, గొప్ప భద్రతా వ్యవస్థలతో ఈ SUV టెస్లాకు గట్టి పోటీని ఇస్తోంది.
ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చేసేందుకు వెళ్లి.. బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరులోని అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కొందరు పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్ పైకి వెళ్లింది. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి 13వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.
పల్నాడు జిల్లా అత్తలూరులో నవ వధువుపై అత్యాచారయత్నం.
20 రోజుల క్రితమే యువతికి వివాహం.
భర్త ఇంట్లో లేని సమయంలో భార్యపై అత్యాచారయత్నం.
అత్యాచారయత్నం చేసిన అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు.
మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత.
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలు.
మీ ప్రేమ, ఆశీర్వాదంతో అంతరిక్ష కేంద్రం చేరుకున్నా.. శుభాంశు..
భూమి నుంచి 28 గంటల ప్రయాణం అనంతరం అంతరిక్ష కేంద్రానికి చేరిన శుభాంశు శుక్లా, అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన వెంటనే అక్కడున్న ఇతర వ్యోమగాములతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శుభాంశు మాట్లాడుతూ, 'మీ ప్రేమ, ఆశీర్వాదంతో నేను అంతరిక్ష కేంద్రం చేరుకున్నాను. ఇక్కడ నిలబడటం చూడటానికి తేలికగానే ఉన్నప్పటికీ, నా తల కొంచెం భారంగా, కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది' అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ : కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడిపై ఓ మహిళా కండక్టరు దాడి చేసింది. తోట్లవల్లూరులో పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరు వెళ్లడానికి గురువారం బస్సు ఎక్కాడు. మహిళా కండక్టరు టికెట్ కొట్టడంతో రూ.200ల నోటు ఇచ్చాడు. పెద్ద నోటు ఇస్తే ఎట్లా అని కండక్టర్ అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. కండక్టరు వృద్ధుడ్ని బస్సులోంచి దింపి దుర్భాషలాడతావా అంటూ దాడి చేసింది.
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా..? ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇలా..
Gold Rate: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం వరకు రికార్డు స్థాయి ధరలను నమోదు చేసిన బంగారం.. క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వివాదం సర్ధుమణగడంతోపాటు.. అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ విషయంలో ఇరు దేశాలు వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 930 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ 40 డాలర్లు తగ్గి.. 3,293 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే.. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.5వేలు తగ్గింది. మరోవైపు.. వెండి ధర కూడా తగ్గింది.
Telugu » Education and Job » Job Fair In Parvathipuram Manyam District Under The Auspices Of Andhra Pradesh State Skill Development Corporation Sn Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. అద్భుతమైన ఉగ్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జులై 28న జాబ్ మేళా జరుగనుంది. ఈ మేరకు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారిక ప్రకటన చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇది గొప్ప అవకాశమని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలని తెలియజేశారు.
ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ జాబ్ మేళా జూన్ 28న ఉదయం 9 గంటలకు సాలూరు శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాబ్ మేళాకు వచ్చేవారు తమ బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు రెండు ఫోటోలను తీసుకొని రావాలి. మరిన్ని వివరాల కోసం, ఏదైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 94947 77553, 73825 590223 లకు సంప్రదించాలని కోరా
కొత్త స్మార్ట్ఫోన్ కావాలా? జూలైలో రాబోయే కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. నథింగ్ నుంచి శాంసంగ్ వరకు..!
Upcoming Smartphones : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? జూలై మొదటి వారంలో కొత్త స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. నథింగ్ నుంచి శాంసంగ్ వంటి బ్రాండ్ల నుంచి సరికొత్త ఫోన్లు (Upcoming Smartphones) లాంచ్ కానున్నాయి. అద్భుతమై ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3, వన్ప్లస్ నార్డ్ 5, వన్ప్లస్ నార్డ్ CE వంటి ఫోన్ల ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. జూలైలో వచ్చే ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ 3 :
భారత మార్కెట్లో ఈ నథింగ్ ఫోన్ వచ్చే జూలై 1, 2025న లాంచ్ కానుంది. లీకైన నివేదికల ప్రకారం.. 6.7-అంగుళాల LTPO OLED డిస్ప్లే కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 5,150mAhతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చు.
వన్ప్లస్ నార్డ్ 5 :
ఈ వన్ప్లస్ నార్డ్ 5 సిరీస్ ఫోన్ జూలై 8, 2025న లాంచ్ కానుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 80W సూపర్వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, ఈ హ్యాండ్సెట్ 6.83-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.
ఈ ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ కోసం 50MP + 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP కెమెరాతో రానుంది. బ్యాటరీ బ్యాకప్ కోసం 5,200mAh సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8s జెన్ 3తో వస్తుంది.
వన్ప్లస్ నార్డ్ CE :
వన్ప్లస్ నార్డ్ 5తో పాటు కంపెనీ ఇప్పుడు వన్ప్లస్ నార్డ్ CE5 కూడా లాంచ్ చేయబోతోంది. జూలై 8న వన్ప్లస్ నార్డ్ CE లాంచ్ కానుంది. కొన్ని లీక్లతో అనేక స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉండొచ్చు.ఈ ఫోన్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP + 8MP కెమెరా ఇవ్వవచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాతో రావచ్చు. పవర్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350తో కూడా రావచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z సిరీస్ :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 స్మార్ట్ఫోన్లను కూడా జూలై 9న లాంచ్ చేయనుంది. ఈ 2 ఫోన్లను అన్ప్యాక్డ్ ఈవెంట్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 8-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 6.5-అంగుళాల కవర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది.
200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండొచ్చు. 4,400mAh బ్యాటరీతో వస్తుంది. అదే సమయంలో, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అందుబాటులో ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్తో 3 స్టోరేజ్ వేరియంట్లలో 256GB, 512GB, 1TBతో రావచ్చు. మొత్తం 3 కెమెరాలలో 200MP ప్రైమరీ కెమెరా కూడా ఉండొచ్చు.
ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి బ్రదర్ హుడ్ సభ్యులు విచ్చేసి జూలై 20వ తేదీన నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ ని ఆహ్వానిస్తూ తన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన షేర్వానీని ప్రేమగా కానుకను అందించారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది డాక్టర్:గొట్టిపాటి లక్ష్మీ
దర్శి మండలం, తూర్పు వీరయపాలెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మొక్కలు నాటారు. చంద్రన్న - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్ష్మి మొక్కలను నాటి మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో మొక్క నాటుకొని భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన సమాజం అందించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం ద్వారా పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ద్వారా మన ఆరోగ్యం మనమే పరిరక్షించుకోవచ్చని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, పరిటాల సురేష్, గుర్రం బాలకృష్ణ, తూర్పు వీరయపాలెం గ్రామ ప్రజలు ఉన్నారు.
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్(D) తిమ్మాపూర్(M) ఇందిరా నగర్కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా?
బ్రేకింగ్ న్యూస్
సుప్రీంకోర్టు సూటి ప్రశ్న....
అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.... అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యే వరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది...
ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బ తింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది...
లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది..!
శివరామపురం లో మాజీ ఎంపీటీసీ తండ్రిని పరామర్శించిన గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్.
తాళ్లూరు మండలం, శివరాంపురం గ్రామంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ గాడిపత్రి లక్ష్మీనారాయణ తండ్రిగారిని పరామర్శించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టపాటి లక్ష్మీ & టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి మండలంలోని హోదాలో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.
HYDలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ జంట తమ నగ్న వీడియోలను ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రికార్డెడ్ వీడియోకు రూ.500, లైవ్ స్ట్రీమింగ్ కోసం రూ.2000 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓ కానిస్టేబులు విషయం తెలియగా, ఆయన ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో వారింటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు.
*సైదాపురం మండలం కలిచేడు వద్ద కూలీల తో వెళుతున్న ఆటో బోల్తా*
నెల్లూరు జిల్లా
సైదాపురం మండలం కలిచేడు వద్ద కూలీల తో వెళుతున్న ఆటో బోల్తా, 15 మంది మైనింగ్ కార్మికులకు గాయాలు.
సైదాపురం మండలం అనంతమడుగు నుండి పొదలకూరు మండలం కొనగలూరుకు వెళుతున్న కూలీలు.
15 మంది కూలీల తో వెళుతున్న ఆటో కలిచేడు మసీదు వద్ద అదుపుతప్పి తూము లోకి వెళ్ళి బోల్తా
క్షతగాత్రుల్లో ఇద్దరు మగవారికి ఓ మహిళ కు తీవ్ర గాయాలు.
పాలకొల్లు టూ NASA: అంతరిక్ష చరిత్రలో నిలిచిన తెలుగు తేజం జాహ్నవి! ఈమె విజయాలు తెలుసా?
కలలు కనడం అందరూ చేస్తారు, కానీ వాటిని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే మన తెలుగు అమ్మాయి, జాహ్నవి డాంగేటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న పట్టణం పాలకొల్లు నుండి బయలుదేరి, భారత అంతరిక్ష చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె ప్రయాణం కేవలం ఒక విజయం కాదు, లక్షలాది మంది యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక గొప్ప ప్రేరణ.
ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు పట్టణానికి చెందిన జాహ్నవి డాంగేటి, అమెరికాలోని నాసా (NASA) నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP)ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ అద్భుతమైన ఘనతతో, ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. ఆమె కేవలం ఒక విజేతగా నిలవడమే కాకుండా, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో మహిళలు రాణించడానికి ఒక రోల్ మోడల్గా మారారు.
చరిత్ర సృష్టించబోయే టైటాన్స్ మిషన్
జాహ్నవి ప్రతిభకు గుర్తింపుగా, ఆమెకు మరో అరుదైన అవకాశం లభించింది.
ప్రాజెక్ట్: టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్ (అమెరికాలో అభివృద్ధి చేస్తున్న వాణిజ్య అంతరిక్ష కేంద్రం).
మిషన్: 2029లో చేపట్టబోయే తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర.
ప్రత్యేకత: ఈ చారిత్రాత్మక మిషన్కు ఎంపికైన తొలి భారతీయుల్లో జాహ్నవి ఒకరు.
భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలకు, వాణిజ్య కార్యకలాపాలకు వేదిక కానున్న ఈ ప్రాజెక్ట్లో ఆమె భాగం కావడం, ఆమె అంతర్జాతీయ స్థాయి నైపుణ్యానికి నిదర్శనం.
విజయానికి పునాది: విద్యాభ్యాసం & కుటుంబ ప్రోత్సాహం
జాహ్నవి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. తన ఇంటర్మీడియట్ విద్యను పాలకొల్లులోనే పూర్తి చేశారు. ప్రస్తుతం కువైట్లో ఉద్యోగాలు చేస్తున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీలు తమ కుమార్తె కలలకు వెన్నుదన్నుగా నిలిచారు.
శిక్షణ, పరిశోధన: అంతరిక్షానికి భూమిపైనే రిహార్సల్స్:
అంతరిక్షయానం అంత సులభం కాదు. దానికి కఠినమైన శిక్షణ అవసరం. జాహ్నవి ఈ క్రింది శిక్షణలలో పాల్గొన్నారు:
అనలోగ్ మిషన్లు: భూమిపైనే అంతరిక్షం లాంటి పరిస్థితులను సృష్టించి శిక్షణ పొందడం.
డీప్ సీ డైవింగ్: సముద్ర గర్భంలో వ్యోమగాములకు ఎదురయ్యే ఒత్తిడిని అనుభవించడం.
స్పేస్ సిమ్యులేషన్: అంతరిక్ష ప్రయాణాన్ని కంప్యూటర్ల ద్వారా అనుభూతి చెందడం.
జియాలజీ శిక్షణ: వేరే గ్రహాలపై ఉండే భౌగోళిక నిర్మాణాలపై పరిశోధన. (ఈ శిక్షణ పొందిన తొలి భారతీయురాలు ఈమే!)
ఆమె పేరున ఒక గ్రహశకలం!
జాహ్నవి కేవలం శిక్షణకే పరిమితం కాలేదు. International Astronomical Search Collaboration తో కలిసి పనిచేస్తూ, Pan-STARRS టెలిస్కోప్ డేటాను విశ్లేషించి ఒక కొత్త అస్థిర గ్రహశకలాన్ని (asteroid) కనుగొన్నారు. ఇది ఆమె శాస్త్రీయ పరిశోధనా పటిమకు ఒక గొప్ప ఉదాహరణ.
అడ్డు తగిలితే, తల్లిదండ్రులని కూడా లేపేస్తున్నారు.
కొన్నాళ్లగా ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని రికార్డ్ అవుతున్నాయి!
ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్ లు ఇవే కనిపిస్తున్నాయి, అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలు, అడ్డు వచ్చిన భర్తలను లేపేస్తున్నారు, అడ్డు వస్తె తల్లి నీ కూడా చంపేస్తున్నారు, అది కూడా మానవత్వం లేకుండా అతి కిరాతకంగా చంపుతున్నారు, ఈ సందర్భంగా మగవారు భయపడే పరిస్తితి వచ్చిందని కొందరు వాపోతున్నారు.
జగన్ పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రెంటపాళ్ల ఎపిసోడ్ లో నెక్ట్స్ ఏం జరగబోతోంది..
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన టూర్ ముగిసి వారం అయింది. అయినా డైలీ అదే హాట్ టాపిక్గా ఉంటోంది. రోజుకో డెవలప్మెంట్..విమర్శకు, ప్రతి విమర్శ..అంతకు మించి కేసులు, నోటీసులు, కారు సీజ్తో..పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. వైసీపీ అధినేత ఏకంగా కోర్టు మెట్లెక్కారు. అటు జగన్ సెక్యూరిటీ, భద్రతకు ఢోకా లేదంటూ..పెద్ద షాకే ఇస్తుంది ప్రభుత్వం. రెంటపాళ్ల ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జగన్ను విచారణకు పిలుస్తారా? పోలీసులు వెహికల్ సీజ్ చేశారంటే..వాట్ నెక్స్ట్?
అధికారం మారిన వన్ ఇయర్లోనే ఏపీ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్లో..ఏదో ఒక టాపిక్ హెడ్లైన్గా ఉంటూనే ఉంది. లేటెస్ట్గా గుంటూరు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపింది. టూర్కు అనుమతి లేదంటూనే సెక్యూరిటీ విషయంలో సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయినా జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఈ ఇష్యూలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన డ్రైవర్, పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు పెట్టారు పోలీసులు. జగన్ డ్రైవర్ను అరెస్ట్ చేయగా..సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న జగన్కు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగమంటూ..పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..?
మరోవైపు రెంటపాళ్ల టూర్పై రచ్చ నడుస్తుండగానే జగన్పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు.!. ఇదే సమయంలో..మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారనేది కూడా అభ్యంతరం ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. అయితే ఈ కేసుపై జగన్తో సహా నిందితులుగా ఉన్నవారంతా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుంది..కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే జగన్ అలిగేషన్స్కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకున్నా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని..వైసీపీ క్యాడర్ రెచ్చిపోయినా పోలీసులు సంయమనంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది కూటమి సర్కార్.
ఏపీలో దారుణం.. ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే..!
గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ను అతని భార్య ప్రియుడితో కలిసి పెళ్లయిన నెలరోజుల్లోనే హత్య చేయించిన ఘటన మరవక ముందే ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను వేరే వ్యక్తితో పెట్టుకున్న సంబంధాన్ని మందలిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్ బాబు (43), అనిత దంపతులు. వారు పిల్లలతో కలిసి నగర శివారు సదాశివకాలనీలో ఉంటున్నారు. సురేశ్ హోటల్ నడుపుతున్నాడు. భార్య అనిత ఓ హోటల్ లో దినసరి కూలీగా పనిచేస్తుంది. అదే కాలనీలో ఉంటున్న బాబావలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించిన భర్త సురేశ్ బాబు పలుసార్లు ప్రశ్నించాడు. అనుమానంతో మద్యం తాగివచ్చి వేదిస్తుండేవాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని అనిత ప్లాన్ వేసింది. భర్తను హత్య చేయాలని పదిరోజుల నుంచే భార్య పథకం పన్నింది. పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రియుడు బాబావలీకి ఫోన్ చేసి.. తన భర్త మద్యం తాగి ఒంటరిగా ఇంటికి వస్తుంటాడని, దారికాచి ఈ రోజే హత్య చేయాలని చెప్పింది. దీంతో బాబావలీ దారిమధ్యలో కాపుకాసి బీరు బాటిల్ తో సురేశ్ బాబుపై దాడి చేశాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తనతో తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపేశాడు. ఆ తరువాత బండరాయితో అతని తలపై పలుసార్లు మోది చంపేశాడు. బుధవారం తెల్లవారు జామున కొందరు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఘటనస్థలిలో గుమ్మికూడారు. అక్కడికి వచ్చిన బాబావలీ.. మృతుడి వివరాలను పూసగుచ్చినట్లు చెప్పి వెళ్లిపోయాడు. అతనిపై పోలీసులకు అనుమానం రావడంతో జాగిలంతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు.జాగిలం నేరుగా వెళ్లి నిందితుడు బాబావలీ ఇంటి పరిసరాల్లో ఆగింది. ఈ విషయం తెలుసుకున్న బాబావలీ తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. ఆటోలో వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తాను సురేశ్ బాబును హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో మృతుడు భార్య అనితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
IND vs ENG: రెండో టెస్టుకు భారత జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్.. హైదరాబాద్ కుర్రాడు కూడా..!
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జులై 2 నుంచి ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకోసం భారత్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ బృందం కసరత్తు మొదలు పెట్టింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజులు ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
AP Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
MPPSC Recruitment 2025: Application Process Begins For Food Safety Officer Posts
The Madhya Pradesh Public Service Commission (MPPSC) has started the registration process for the recruitment of Food Safety Officers. Interested and eligible candidates can apply online through the official website - mppsc.mp.gov.in. The application window will remain open until August 10, 2025.
Candidates will have to appear for an OMR-based objective exam. Based on exam scores, three times the number of vacancies (plus ties) will be shortlisted for the interview. The final merit list will be prepared on the basis of combined marks of the written exam and interview
11 Missing After Bus Falls Into Alakananda River In Uttarakhand's Rudraprayag
At least one person has died and 10 others are missing after a bus with 18 passengers onboard fell into the Alakananda river in Uttarakhand's Rudraprayag district. Seven people have been rescued, as the police and the State Disaster Response Force are conducting relief work.
దర్శి అభివృద్ధికై జిల్లా కలెక్టర్ తో గొట్టిపాటి లక్ష్మీ భేటీ
దర్శి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డా గొట్టిపాటి లక్ష్మీ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తో భేటీ అయ్యారు.నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి గవర్నమెంట్ స్కూల్లో ఫ్లోరింగ్, ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరమ్మత్తులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మి కోరారు. తాళ్లూరు బాలికల హాస్టల్ వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు అనుసంధానంగా వెస్ట్ వీరాయపాలెం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై కలెక్టర్ గారితో డాక్టర్ లక్ష్మి చర్చించారు. వీటన్నింటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మి వివరించారు.
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో మాట్లాడిన మైనారిటీ లీడర్ షంషీర్.
ప్రకాశం జిల్లా ఒంగోలు లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షైక్ సైదా పార్టీ శ్రేణులతో పార్టీ బలోపేతానికి తగినసూచనలు సలహాలు, ప్రస్తుత రాజకీయ ల పై చర్చ జరిగినది.ఇందులో పాల్గొన్న ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ ముస్లింలు ఒక్కప్పుడు రాజ్యాలు పరిపాలించారని ఇప్పుడు అన్ని రంగాలలో వెనుక పడి ఉన్నారు అని విద్య వైద్య ఆర్థిక రాజకీయాలలో చాలా వెనక బడి ఉన్నారు అని, కొన్ని చోట్ల కుల వివక్ష కూడా ఎదురుకుంటున్నారు అని .కలిసి మెలిసి ఉండే భారత దేశంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ కుల వివక్ష ను మతోన్మాదాన్ని త్వరగా నియంత్రించ కుంటే భవిషత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సచివాలయంలోని తన చాంబర్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
అమరావతిః కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్.. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు.
ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ ఎరుకల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుడైన 8 ఏళ్ల బాలుడు అభిరామ్ విషపూరిత పాము కాటుతో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుండి వచ్చి ఇంట్లో భోజనం చేస్తుండగా ఏదో కాటేసినట్లు అనిపించడంతో తల్లికి తెలియజేశాడు. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అభిరామ్ను ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు.
వైద్యులు పరీక్షించి అభిరామ్ ఇప్పటికే మృతి చెంది ఉన్నట్లు నిర్ధారించారు. డ్యూటీ డాక్టర్ సమాచారం అందజేయడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బాలుడి పెద్దనాన్న మీడియాతో మాట్లాడుతూ,ఇంద్రనగర్ కాలనీలో కాలువలు, మురుగునీటి డ్రెయిన్లు అపరిశుభ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణం.ఎమ్మెల్యే అధికారులు, వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలి. మా కుటుంబానికి జరిగిన విషాదం మరెవరినీ తాకకూడదని కోరుకుంటున్నాం అని వివరించారు.
Jahnavi Selected as an Astronat Candidate For 2029 Orbital Mission
Jahnavi Dangeti, hailing from Palakollu, West Godavari district in Andhra Pradesh, has been officially selected as an Astronaut Candidate (ASCAN) for the prestigious Titans Space Astronaut Class of 2025. This significant announcement paves the way for Dangeti to participate in Titans Space's inaugural orbital mission, currently slated for March 2029.
As an astronaut candidate with Titans Space, Jahnavi will undergo a comprehensive three-year training program in the United States, meticulously preparing her for the 2029 orbital flight. This mission, which will see her spend five hours in space, will be led by seasoned American astronaut Bill MacArthur.
Jahnavi Dangeti's inclusion in their pioneering space launch team underscores her vital role in shaping the future of private space exploration and India's growing footprint in the cosmos.
DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దేశానికి సేవ చేయాలని, సాంకేతికత ద్వారా ప్రపంచానికి తోడ్పడాలని కలలు కనే యువతకు గుడ్ న్యూస్. గ్వాలియర్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDE) కింద పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
అర్హత:
ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ M.Sc డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి CSIR-UGC NET JRF లేదా NET పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
గరిష్ఠంగా 28 సంవత్సరాలు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
స్టైఫండ్: నెలకు రూ. 37,000
ఆన్లైన్లో దరఖాస్తుకు
అధికారిక వెబ్సైట్ drdo.gov.in ని సందర్శించండి.
The Market Police have arrested 18 members involved in a pre-planned dacoity executed under the guise of a gold sale. The complainant was lured with an offer of 1 kg gold at a 5% discount for liquid cash. Accused, posing as SOT Rachakonda officials, entered the premises, assaulted the complainant, and fled with cash and mobile phones.
A secondary group later intercepted the primary accused and unlawfully took possession of the stolen cash. Seized property includes ₹43.21 lakhs in cash, 57 grams of gold ornaments, 23 mobile phones, 2 cars, and 4 two-wheelers. The operation was planned on June 18 and executed in Bowenpally. 10 accused are currently absconding. Investigation involved extensive CCTV analysis and witness statements.
The case was solved under the supervision of DCP North Zone, Ms. Rashmi Perumal, IPS.
The public is advised to exercise caution and report suspicious high-value transactions to the police.
ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- (ఇతపూర్వమే రూ.5000/- తీసుకున్నది) లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్, అంబర్ పేట, గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2 లోగల GHMC కార్యాలయం లోని సహాయక ఇంజనీరు - శ్రీమతి టి. మనీషా.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ఒంగోలులోని పిఎన్జి కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా కాంగ్రెస్
పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వైఎస్ షర్మిలమ్మ రానున్నారు ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు .
ఆమెకు స్వాగతం పలికేందుకు జిల్లాను ఇలా ముస్తాబు చేశామని షేక్ సైధా చెప్పారు. జిల్లా సమస్యలపై షర్మిలమ్మ ఏం మాట్లాడుతారో తెలియాల్సి ఉంది.
ఎదుటివారు మౌనంగా ఉన్నంత సేపు ప్రతి వెధవ తోపు, తురుము అని విర్రవీగేవాడే..ఒక్కసారి
మౌనం వీడి ఎదురు తిరిగితే, ఎంతటి వాడైనా హిజడలా వలె వెన్ను చూపి పారి పోవాల్సిందే...ఎదుటివారు మౌనంగా ఉన్నంత సేపు ప్రతి వెధవ మగాడే
మౌనం వీడి ఎదురు తిరిగితే హిజడలా వలె వెన్ను చూపక తప్పదు ఎవడైనా. ఇజ్రాయెల్, అమెరికా తల బిరుసు తనానికి సరిగ్గా సమాధానం చెప్పిన ఇరాన్ మౌనం వెనక వున్న శక్తి కి నిదర్శనం.
విరిగిన పాలు.. పోలీసులకు ఫిర్యాదు!
కూకట్పల్లిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొన్న హెరిటేజ్ పాలు విరిగిపోవడంతో, వినియోగదారుడు ఈ. రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో, నాసిరకం వస్తువులు అమ్ముతున్నారంటూ సూపర్ మార్కెట్ యజమాని, మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా అబ్దుల్ షంషీర్ సౌదాగర్
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా.. జనాబ్ అబ్దుల్ షంషీర్ సౌదాగర్ (మార్కాపురం పట్టణవాసి) ను నియమిస్తూ అపాయింట్మెంట్ లెటర్ అందిస్తున్న. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా. అబ్దుల్ షంషీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు మల్లికార్జున్ ఖర్గే కి రాహుల్ గాంధీ కి ఇమ్రాన్ ప్రతాప్ కి మరియు AP అధ్యక్షురాలు షర్మిలమ్మ కి మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ దాదాగాంధీ కి ప్రకాశం జిల్లా డిసిసి షేక్ సైదా కి మరియు జాతీయ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా బేగం కి పార్టీ నాయకులకు కాంగ్రెస్ పెద్దల అందరికీ ధన్యవాదములు తెలుపుతూ నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు విధేయుడు నై ఉండి ఈ పార్టీ పూర్ణ వైభవం తెచ్చుకునేందుకు నా శాయశుక్తుల కృషి చేస్తా అని తెలిపారు.