Select Location
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తో చర్చించిన గొట్టిపాటి లక్ష్మీ, సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు
ఈరోజు బాపట్ల జిల్లా, చినగంజాం మండలం, గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర విధ్యుత్ శాఖా మాత్యులు గొట్టిపాటి రవికుమార్ తో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఈసందర్బంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్న కాంటీన్ ఏర్పాటు, రోడ్లు విస్తరణ పనులు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడం తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా దొనకొండలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
View More
Latest News
01 Apr 2025 18:55 PM
7
34
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
విఠలాపురంలో సమాధిలోకి బతికున్న వ్యక్తి
తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
View More
Latest News
01 Apr 2025 18:54 PM
2
17
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: పింఛన్ల పంపిణీ లో పాల్గొన్న తెదేపా నాయకులు
దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకుల డాక్టర్ లలిత్ సాగర్ ఆదేశాల మేరకు ఒకటవ తేదీ ఉదయానే పింఛన్ల ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పఠాన్ సుభాని మహిళా నాయకురాలు శోభారాణి పింఛన్ అధికారి శంకర్ పాల్గొన్నారు.
View More
Latest News
01 Apr 2025 08:30 AM
2
20
Newsread Image

No.1 Short News

Newsread
అనుకోని అతిథిలా షెహన్ షా ఇంటికి మంత్రి లోకేష్
షెహన్ షా మంగళగిరి పట్టణంలో ఒక సాధారణ మైనారిటీ కార్యకర్త. పసుపు జెండానే ఆయనకు సర్వస్వం. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి లోకేష్ కార్యక్రమం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి, ఉడత భక్తిగా తాను చేయదగిన సేవ చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన పని తాను చేసుకు పోతుంటాడు. రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేష్ తన ఇంటికి వస్తారని ఆయన ఊహించలేదు. అనుకోని అతిధిలా లోకేష్ వారి ఇంటికి వెల్లే సరికి షెహన్ షాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. వాస్తవానికి షహేన్షా ఇంటిలో ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. అప్పటికప్పుడు తమ ఇంటిలో ఉన్న దుప్పట్లతో కవర్ చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం షెహన్ షా కుటుంబ సభ్యులు ప్రేమతో పెట్టిన పండ్లు పలహారాన్ని స్వీకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రేమ, ఆప్యాయత తప్ప ఎటువంటి హంగు ఆర్భాటాలు లేవు. మీడియాకు సైతం లోకేష్ వారి ఇంటికి వెళ్తున్న సమాచారం లేదు. షెహన్ షా కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇంటికి వెళ్లిన చందంగా ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వెళ్లి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. కార్యకర్తకు లోకేష్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలదా?
View More
Latest News
01 Apr 2025 06:16 AM
2
19
Newsread Image

No.1 Short News

Newsread
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బలోపేతానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీ సీఎండీ, అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్చార్జ్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ, ఎస్కే వర్మ, ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు.
View More
Latest News
31 Mar 2025 21:43 PM
2
17
Newsread Image

No.1 Short News

Reporter Suhel
కడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
View More
Local Updates
31 Mar 2025 21:09 PM
3
27
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి
రంజాన్ సందర్భంగా దర్శి పట్టణం కురిచేడు రోడ్ లోని ఈద్గా వద్ద నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
View More
Latest News
31 Mar 2025 13:00 PM
0
22
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
తూర్పు గంగవరం: ముస్లిం సోదరులతో ఈద్గా మైదానం లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామములో రంజాన్ సందర్భంగా ఈద్గా లో నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు.
View More
Local Updates
31 Mar 2025 12:59 PM
1
24
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కడియాల లలిత్ సాగర్
రంజాన్ సందర్భంగా కురిచేడు రోడ్డులోని ఈద్గా మైదానం వద్ద శనివారం జరిగిన నవాజ్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొని మాట్లాడారు. మైనార్టీల అభివృద్దే ద్వేయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారని మైనార్టీల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ కడియాల లలిత్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వపరంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈద్గా అభివృద్ధికి అవసరమైన ప్లాట్ ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా 2 లక్షల విరాళంగా ప్రకటించారు గతంలో కూడా మసీదు అభివృద్ధికి ముస్లిం సోదరులు కోరిక మేరకు 7,86,000 ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా షాదీ ఖానా ఏర్పాటు మసీదును పూర్తి చేయడం ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా నగర పాలక పంచాయతి నుండి నిధులు మంజూరు చేపిస్తానని డాక్టర్ లలిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మైనార్టీలకు తగిన గుర్తింపుని ఇచ్చి ఆదరిస్తామని నామినేట్ పోస్టులు భర్తీలో కూడా వారికి ప్రాధాన్యతనిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హామీ ఇచ్చారు. ప్రకటించిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని అక్కడికక్కడే ముస్లిం పెద్దలకు అందజేసారు. రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం నమాజ్ కార్యక్రమం లో పాల్గొన్న శుభ సందర్బంగా ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అందరు డాక్టర్ కడియాల లలిత సాగర్ ని సత్కరించారు. డా|| లలిత్ రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం లో ముస్లిం పెద్దలను సత్కారించి నూతన వస్త్రాలు అందజేశారు.
View More
Latest News
31 Mar 2025 12:37 PM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎస్సై మురళి
ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దర్శి లోని కురిచేడు రోడ్డు లో గల ఈద్గా మైదానం లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ఎస్సై మురళి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు.
View More
Latest News
31 Mar 2025 11:25 AM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
వేముల: భక్తి శ్రద్ధలతో ముగిసిన రంజాన్
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామం లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు, ఈ కార్యక్రమంలో వేముల గ్రామం లోని పిల్లలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
View More
Local Updates
31 Mar 2025 11:12 AM
3
97
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు: ఈద్గా లో ప్రార్థనల అనంతరం యువకుల ఆనందం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు లోని ఈద్గా మైదానం లో ఉల్లగల్లు లోని ముస్లిం యువకులు రంజాన్ సందర్భంగా మదీనా మస్జిద్ నుంచి ఈద్గా వరకు తక్బీర్ చదువుకుంటూ ఈద్గా కు చేరి అక్కడ సామూహిక ప్రార్థనలు జరిపారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉంటూ రంజాన్ సందర్భంగా సొంత ఊరికి రావడం, అందరినీ కలవడం, గుర్తుగా ఫోటోలు తీసుకుని ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు .
View More
Latest News
31 Mar 2025 11:00 AM
2
20
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు: ఈద్గాహ్ లో ఘనంగా ఈద్ - ఉల్ - ఫితర్ ప్రార్థనలు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు లోని ఈద్గా మైదానం లో ఉల్లగల్లు లోని ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా మదీనా మస్జిద్ నుంచి ఈద్గా వరకు తక్బీర్ చదువుకుంటూ ఈద్గా కు చేరి అక్కడ సామూహిక ప్రార్థనలు జరిపారు. అనంతరం మౌలానా సర్వ మానవాళి సుఖ శాంతుల కోసం ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం లోని ముస్లింలు పిల్లా పెద్దలతో సహా అందరూ హాజరయ్యారు.
View More
Latest News
31 Mar 2025 10:49 AM
2
22
Newsread image

No.1 Short News

Hanumantharayappa
మీడియా సమావేశ కార్యక్రమం
Politics
31 Mar 2025 10:24 AM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఒంగోలులో ఘనంగా ఉగాది వేడుకలు
ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, MLA విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
View More
Politics
31 Mar 2025 10:24 AM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేటి ముఖ్యాంశాలు
* సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ * సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదే : ఉత్తమ్ * దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర: బండి * AP: పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు * రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నేను CBNకు మద్దతిచ్చా: పవన్ * SRHకు వరుసగా రెండో ఓటమి
View More
Local Updates
31 Mar 2025 10:24 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
న్యూస్ రీడ్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ ప్రేక్షకులకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు , ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు , మంచి కార్యాలు , జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని న్యూస్ రీడ్ కోరుకుంటుంది న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
View More
Latest News
30 Mar 2025 12:55 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
శ్రీనిత్య చెరుకు రసం బీర్కూర్ తరుపున ...
బీర్కూర్ మండల ప్రజలకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు , తెలియజేసిన వారు , శ్రీ నిత్య చెరుకు రసం సెంటర్ , పాత ఇండియా నెం,1 ఏటీఎం దెగ్గర , బీర్కూర్ . ఫోన్ : 9491468100
View More
Latest News
30 Mar 2025 12:54 PM
0
15

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో మహాజన సభ అసంపూర్ణం
బీర్కూర్ మండల కేంద్రం లో సహకార పరపతి సంఘమ్ భారంగ్ ఎడిగి గ్రామంలో సుమారు 55 లక్షల వ్యాయామం ఒక ఎకరా రేటు మార్కెట్లో లేని విలువను భరింగేడికి గ్రామంలో ఎకరానికి 55 లక్షలు బీర్కూర్ మండల కేంద్రంలో కూడా ఇ రేటు లేదు అసలు కమిషన్ దారులు ఇందులో ఏవరు అన్నాది రైతులు గమనించగలరు మేము అడుగుతే మీకు సంబంధం లేదు అని వివరణ ఇస్తున్నా కార్యదర్శి విఠల్ గారు
View More
Latest News
29 Mar 2025 11:46 AM
3
31
Newsread Image

No.1 Short News

Newsread
నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది..
View More
Latest News
27 Mar 2025 07:38 AM
0
25
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్‌”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
View More
Local Updates
26 Mar 2025 08:11 AM
0
27
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరులో పేకాట శిబిరంపై దాడులు
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రావడంతో, ముండ్లమూరు ఎస్సై నాగరాజు తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
View More
Local Updates
25 Mar 2025 04:01 AM
3
36
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ALERT: ప్రకాశం జిల్లాకు వర్ష సూచన
ప్రకాశం జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాతో పాటు అల్లూరి, మన్యం YSR, నంద్యాల, పల్నాడు (D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
View More
Latest News
21 Mar 2025 08:22 AM
0
53
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'
తూర్పు గంగవరంలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మల్లికార్జునరావు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. సెల్ఫోన్, అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
42
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్
బెట్టింగ్ యాప్స్ వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయటం తప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా MAA అసోసియేషన్కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకుడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
View More
Crime News
21 Mar 2025 08:21 AM
0
40
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ
AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్షి జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.
View More
Politics
21 Mar 2025 08:21 AM
0
34
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన EE
తాళ్లూరు మండలం కొరపాటివారిపాలెంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పంచాయతీరాజ్ EE కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 58 పనులకు 3 కోట్లు మంజూరు కాగా 53 పనులు లు పూర్తయ్యాన్నారు. అలానే నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల AE వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
32
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో అగ్ని ప్రమాదం.. రైతుకు రూ.8 లక్షలు నష్టం
తాళ్లూరు గ్రామంలో ఎడమ కంటి నాగిరెడ్డికి చెందిన పొగాకు బ్యార్ని ప్రమాదవశాత్తు బుధవారం తెల్లవారు జామున దగ్ధం అయింది. పొగగొట్టంపై పొగాకు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రైతు తెలిపారు. దాదాపు 1200 పొగాకు కర్రలు రూ.8 లక్షల నష్టం వచ్చినట్లు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.
View More
Local Updates
21 Mar 2025 08:20 AM
0
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!
ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
View More
Sports News
21 Mar 2025 08:20 AM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం
తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఏప్రిల్ 2020 సమయంలో దేశం ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజల కు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజల కు 5 ఏళ్ల నుంచి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిరు దేశం లో 80 కోట్ల మంది కి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ షాపుల్లో పెట్టక పోవడం దూరదృష్ట కారణమైన చర్య బీర్కుర్ మండలo లో ఉన్న ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంచాలి అని స్థానిక తహసీల్దార్ లత కుమారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ మండల ప్రధాన కార్యదర్శి లు మల్లె యోగేష్, బొంత లా శ్రీనివాస్ BJYM మండల ప్రెసిడెంట్ కొట్టే వినేష్, SC మోర్చా మండల ప్రెసిడెంట్ మేత్రీ సాయిలు బిజెపి సీనియర్ నాయకులు హాన్మాన్డ్లు, సాయి బాబా, కార్యకర్తలు వడ్ల బస్వరాజు, పండారి, ఆవారి శంకర్ పాల్గొన్నారు
View More
Latest News
20 Mar 2025 19:09 PM
0
37
Newsread image

No.1 Short News

Newsread
బోలికొండ్రాయ స్వామి తిరుణాల మహోత్సవ వేడుకలు
కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం శ్రీ ప్రసన్నఆంజనేయ తిరుణాల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ తిరుణాల పడమర నాయుడుపాలెం, ఆవులమంద, కల్లూరు కు చెందిన మూడు గ్రామాల ప్రజలు ఈ తిరుణాల వైభావంగా జరుపుకుంటారు ఈ నెల 19 వ తారీకు నాడు తిరుణాల అంకురార్పణ కార్యక్రమం ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలాగే సాయంత్రానికి 7 ఎలక్ట్రికల్ ప్రభలు 2 కోలాటం ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ వారు తెలిపినారు
View More
Latest News
20 Mar 2025 10:48 AM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
జిల్లా ఎస్పీ కి అత్యాధునిక డ్రోన్ కెమెరా అందచేసిన ఆవులమంద వాసి
ప్రకాశం జిల్లా, కురిచేడు మండలం ఆవుల మంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ గారికి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను అందజేసినారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సామాజిక బాధ్యత, సేవ స్ఫూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించటం అభినందనీయమని కొనియాడారు ఆ డ్రోన్ ను త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. అస్సన్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం సీనియర్ నాయకులు పడమర గంగారంమాజీ సర్పంచ్ దాసరి.ఏడుకొండలు, బోనపల్లి మాజీ సర్పంచ్ వి. వెంకటేశ్వర్లు, మాజీ డీలర్ గొట్టిపాటి. రామయ్య, కొలిశెట్టి కాశి పాల్గొన్నారు
View More
Latest News
19 Mar 2025 09:48 AM
0
35
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నీటి సమస్య లేకుండా చూడాలి: గొట్టిపాటి లక్ష్మి
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శిలో డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించాలని, వేసవి కాలంలో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న దొనకొండ, కురిచేడు మండలాల సమస్యలను సీఎం ద్రుష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. దర్శి- దొనకొండ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.
View More
Politics
19 Mar 2025 09:47 AM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చీమకుర్తిలో అక్రమ గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ప్రజలు
చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామ కొండ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. బెంగళూరు-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్ తీసుకోవాలని వెళ్తున్న లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కొండను త్రవ్వటం వల్ల వర్షాకాలంలో కొండపై నుంచి వర్షపు నీళ్లు గ్రామ చెరువుకు అందుతుందని గ్రావెల్ తవ్వకాలును ఆపాలన్నారు.
View More
Local Updates
19 Mar 2025 09:47 AM
0
24
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేడు ప్రధానితో సీఎం భేటీ
AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM
0
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి ఉదయం 3.27 నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 14:55 PM
0
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
View More
Breaking News
18 Mar 2025 14:54 PM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తప్పు మీది కాదు.. EVMలది: ఆర్కే రోజా
AP: మెడికల్ కాలేజీలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసిందని, ఇప్పుడు బడుల వంతు అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. 'అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు లేండి. తప్పు మీది కాదు.. తప్పంతా EVMలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ, బెల్ట్ షాపులైనా ఉండొచ్చా?' అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
View More
Politics
18 Mar 2025 14:54 PM
0
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం
AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
View More
Latest News
18 Mar 2025 14:54 PM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
YV సుబ్బారెడ్డి తల్లికి YS విజయమ్మ నివాళి
రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబంధాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.
View More
Politics
18 Mar 2025 13:20 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
మేదరమెట్లకు బయలదేరిన వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM
2
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. 'లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు'ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
View More
Breaking News
18 Mar 2025 13:18 PM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల
శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 13:18 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
YV సుబ్బారెడ్డి తల్లికి బాలినేని నివాళులు
YV సుబ్బారెడ్డి తల్లికి బాలినేని నివాళులు YV సుబ్బారెడ్డి తల్లి సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి, వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి మాతృమూర్తికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలు పిచ్చమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డికి వరుసకు అత్త అవుతారు.
View More
Politics
18 Mar 2025 13:17 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
సీఐడీ కస్టడీకి పోసాని
AP: సినీ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయనను GGHకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయంలో సాయంత్రం 5 గం. వరకు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్లను దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
View More
Politics
18 Mar 2025 13:16 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ • టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం • అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ✓YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా
View More
Politics
18 Mar 2025 10:36 AM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఒంటి పూట బడుల సమయం మార్పు
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
View More
Education
18 Mar 2025 10:35 AM
0
16
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel