Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరం సర్పంచికి రూ.5,00,000 అందజేత
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
25 Apr 2025 11:57 AM
0
6
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
జన రంజక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ మండలం, దొండపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకొని ఆమె మాట్లాడారు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలతో జన రంజక ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు.
View More
Latest News
25 Apr 2025 11:34 AM
0
4
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
కురిచేడు: జెడ్పీ హైస్కూల్ లో సదుపాయాల కోసం ఎమ్మెల్యే ను కోరిన యువకులు
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు క్రీడా మైదానం ను క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలి అని బాలికల హాస్టల్ వేరే ప్లేస్ లో నిర్మించాలని యువకులు కోరగా అధికారులతో మాట్లాడతానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినది.
View More
Latest News
25 Apr 2025 11:03 AM
0
4
Newsread Image

No.1 Short News

Newsread
టీడీపీ కుటుంబానికి భరోసా - మృతి చెందిన కార్యకర్త కి నగదు సాయం
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చాట్ల సుధాకర్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయి మృతి చెందాగా... గతం లో సుధాకర్ టిడిపి సభ్యత్వం తీసుకున్నారు.... టిడిపి సభ్యత్వం ఉండుటచే... వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి... శుక్రవారం దర్శి లోని డా || లక్ష్మీ నివాసం వద్ద చాట్ల సుధాకర్ సతీమణి నాగమణి గారికి 5,00,000 రూపాయల చెక్కుని అందజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు. వారితో పాటు తూర్పు గంగవరం గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
25 Apr 2025 10:20 AM
0
5
Newsread Image

No.1 Short News

Newsread
రేపు కురిచేడు లో ప్రజా దర్బార్
తేదీ : 25-04-2025, అనగా రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గం||ల వరకు కురిచేడు టౌన్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగును.కావున కురిచేడు మండలం లోని ప్రజలు సమస్యలు ఉన్నవారు అర్జీతో పాటు హక్కు పత్రాలను తీసుకొని స్వయం గా డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం కి అందజేసి తమ సమస్యలను పరిష్కరించుకోగలరు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారు.
View More
Latest News
24 Apr 2025 20:02 PM
0
10
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు : దర్శి లో జరిగిన ముస్లింల శాంతి ర్యాలీలో పాల్గొన్న యువత
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత నిరసన ర్యాలీకి ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామం నుంచి ముస్లిం యువత కీలక పాత్ర పోషించడం జరిగింది. మండలం మొత్తం ర్యాలీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విస్తృతస్థాయిలో ముస్లిం శ్రేణులు తరలివచ్చేందుకు కృషి చేశారు.
View More
Latest News
23 Apr 2025 23:22 PM
2
37
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరంలో ముస్లింల ప్రచారం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:21 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బంద్
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బుధవారం బంద్ నిర్వహించినట్లు వైన్స్ సిండికేట్ సభ్యులు తెలిపారు. సిండికేట్ సభ్యుల కథనం మేరకు.. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు నిరసనగా మద్యం షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. అలానే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బొద్దికూరపాడు విద్యార్థికి 570 మార్కులు
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. 600కు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల మండల టాపర్గా నిలిచాడు. టీచర్లు అతడిని అభినందించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
7
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM
వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. 'నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా' అని సీఎం హెచ్చరించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
8
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'నీటితొట్టెలను వేగంగా పూర్తి చేయాలి'
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు. 16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
7
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం మహిళల్లో ఉప్పొంగిన సామాజిక చైతన్యం
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత ర్యాలీలో తండోపతండాలుగా తరలివచ్చిన ముస్లిమ్ నారీమణులు. సహజంగా ఇళ్లలోనే పరిమితమై ఉండే ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసనల్లో పాల్గొనడం, ముస్లిం మహిళల్లో సామాజిక చైతన్యం ఇప్పుడిప్పుడే మొదలైంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
View More
Latest News
23 Apr 2025 23:09 PM
2
12
Newsread Image

No.1 Short News

Newsread
తురకపాలెం: విద్యుత్ షాక్ తో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామములో ఇటీవల విద్యుత్ షాక్ తో గాయపడ్డ పార్టీ కార్యకర్త యాతం సుబ్బారెడ్డి ని పరామర్శించి మనోధైర్యం కల్పించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
23 Apr 2025 22:54 PM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు: కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
ఒంగోలు లో కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
23 Apr 2025 22:44 PM
2
10
Newsread Image

No.1 Short News

Newsread
ఒక్క గంట లో తప్పిపోయిన ముగ్గురు పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం పోలీసులు
ఒంగోలు అన్నవరప్పాడు శ్రీ సూర్య విద్యానికేతన్ నందు 3వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ గేట్ నుండి వెళ్లిపోయి కనిపించలేదు. 1. షేక్ ఇస్మాయిల్ S/o అలీ ముర్తుజా, 09 సంవత్సరములు సంతపేట సాయిబాబా గుడి వద్ద, ఒంగోలు. 3rd Class. 2. కొంపల్లి సాల బిల్వనాధ్ S/o బుచ్చే శ్వరరావు, 10 సంవత్సరములు, 3rd Class, R/o ధారా వారి తోట ఒంగోలు. 3. అప్పాడిపాడు S/o నరసింహం, 09 సం, పల్లెపాలెం కొత్తపట్నం మండలం. 3rd Class. పోలీస్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆదేశములతో ఒంగోలు టు టౌన్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, గంట వ్యవధిలోపలే తప్పిపోయి పిల్లలు అగ్రహారం రైల్వే గేటు వద్ద వారిని కనుగొని, సూర్య స్కూల్ వద్దకు తీసుకుని వచ్చి టూ టౌన్ ఇన్స్పెక్టర్ స్కూలు ప్రిన్సిపాల్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడమైనది. తప్పిపోయిన తమ పిల్లలను తిరిగి క్షేమంగా వారి వద్దకు చేర్చినందుకు పిల్లలు తల్లిదండ్రులు మరియు స్కూలు యాజమాన్యం ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తప్పిపోయిన పిల్లలను కేవలం గంట వ్యవధిలోనే తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
View More
Latest News
23 Apr 2025 22:37 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లింల శాంతియుత ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న బాలలు
ఈరోజు దర్శి లో జరిగిన ముస్లింల శాంతియుత ర్యాలీలో ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో ముస్లిం లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి ఉత్సాహంగా బాలలు యువకులు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్స్ సవరణ చట్టం పట్ల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాలల చిత్రమిది.
View More
Latest News
23 Apr 2025 22:28 PM
0
10
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన దర్శి.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
View More
Local Updates
23 Apr 2025 21:18 PM
1
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నివాళులు అర్పించిన బీర్కూర్ బీజేపీ సీనియర్ నాయకుడు బీరుగొండ
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన భారీ ఉగ్రదాడి.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా.. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లో బరితెగించి.. ఏకంగా పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. జమ్ము కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి బాధాకరం కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మలకు శాంతిని చేకూరాలని ప్రార్థిద్దాం అని బీర్కూర్ బిజెపి నాయకుడు బీరుగొండ ఒక ప్రకటనద్వారా తెలిపారు
View More
Latest News
23 Apr 2025 17:57 PM
0
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి
వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఈరోజు దర్శి లో భారీ ర్యాలీ జరగగా ముస్లిం సోదరులు ,సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సందర్భంగా తాళ్లూరు మండల ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఇది ఒక ముస్లిం శాంతి ర్యాలీ మేము మా హక్కుల కోసం మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని దిగి వచ్చేంతవరకు ఇలాగే పోరాడుతూ ఉంటామని అన్నారు.
View More
Latest News
23 Apr 2025 16:41 PM
3
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ముస్లింల ర్యాలీతో దద్దరిల్లిన దర్శి
కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలని ఈరోజు దర్శి పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ దర్శి లోని మర్కజ్ మసీదు నుండి అక్సా మస్జిద్ వరకు జరగగా, ముస్లిం సోదరులు,సోదరీమణులు,అందరూ కలిసి తహసిల్దార్ కార్యాలయమునకు చేరుకొని డిప్యూటీ తహసిల్దారు దేవదానం కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజం యొక్క హక్కులను స్వేచ్ఛలను హరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేంతవరకు ఇలానే పోరాడుతూ ఉంటామని తెలియజేశారు.
View More
Latest News
23 Apr 2025 15:51 PM
0
12
Newsread Image

No.1 Short News

Newsread
రేపు దర్శి లో ముస్లింల శాంతియుత ర్యాలీ
కొత్తగా చట్టం చేయబడిన వక్ఫ్ చట్టం ముస్లిం ల ధార్మిక ఆస్తులకు నష్టం కలిగించేలా ఉందనీ, ఎన్నో ఏళ్లుగా దైవ కార్యక్రమాలకు వక్ష చేయబడినటువంటి ఆస్తులు ఈ చట్టం మూలంగా ముస్లింలు కోల్పోయే అవకాశం ఉందని ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకునే ప్రయత్నం చేయాలని దర్శి లోని ముస్లిం సోదరులు రేపు ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఇరాలి అద్దంకి రోడ్డుకి మర్కస్మాజిక నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్డునని వరకు జరగబోతోంది. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముస్లిం సోదరులు పాల్గొనబోతున్నారు.
View More
Latest News
22 Apr 2025 20:47 PM
1
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు..
హయి ఫ్రెండ్స్... నా పేరు ఉదయ్ కుమార్... వీడియోగ్రాఫర్ 2... 16 ໖໖ 2025 ໖ 09:45 10:45 సమయం లో ఒంగోలు లోని కర్నూల్ రోడ్డు నందు గల కూరపాటి కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన నా బైక్ AP 39SC 4664 నెంబర్ గల పాల్సార్ 125cc రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు... రెడ్ అండ్ బ్లాక్ కలర్ సిట్... హెడ్ లైట్ మీద UKCaptures అని మరియు లోగో.... బ్యాక్ సిట్ సైడ్ డోము ల మీద UKCaptures అని స్టిక్కర్లు వుంటాయి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఎవరైనా చూస్తే దయచేసి నాకూ తెలియ చేయమని కోరుతున్నారు మీ ఉదయ్ కుమార్ 9652020050 ఒంగోలు
View More
Local Updates
22 Apr 2025 20:29 PM
0
13
Newsread Image

No.1 Short News

Rasul.Sk
తప్పిన పెను ప్రమాదం
ముండ్లమూరు మండల పరిషత్ భవన కార్యాలయ సముదాయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. 108 సిబ్బంది ఉండే భవనంలో విత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెల రేగాయి. వెంటనే మంటలను ఆర్పారు. స్టాటర్ బాక్స్ పూర్తిగా కాలిపోయింది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రజలు పేర్కొన్నారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
17
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ప్రమాదకరంగా విద్యుత్ లైన్
మండల కేంద్రమైన ముండ్లమూరు విద్యుత్తులైన్ ప్రమాదకరంగా ఉంది. రెడ్డి బజారున రాగి పిండి నాగేశ్వర్రెడ్డి ఇంటి సమీపంలో విద్యుత్ తీగలు వేలబడి ఉన్నాయి. చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్ లు వేలబడి ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ప్రజలు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
13
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు ఏపీఓగా వెంకట్రావు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ఏపీవోగా వెంకట్రావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. వెంకట్రావు పొదిలి నుండి ముండ్లమూరు బదిలి అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న నాగరాజు మార్కాపురం కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీఓను ఫీల్డ్ అసిస్టెంట్ కార్యాలయం సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ముస్లిం సమాజం మేలుకోవాలి
23 -4 -2025 -అనగా రేపు బుధవారం దర్శి లో ఉదయం 10 గంటలకు వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయడం కోసం మర్కజ్ మసీదు నుండి అక్సా మసీదు వరకు దర్శి నియోజకవర్గ ముస్లింల శాంతి ర్యాలీ జరుగును. ముస్లిం అనే ప్రతి వ్యక్తి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. వక్ఫ్ చట్టం రద్దు కావడం అనేది మన అందరి సమస్య,ఇది మన కుటుంబ సమస్య, కావున మనమందరం కలిసి ఐక్యతతో మన యొక్క మనుగడను మనమే చాటి చెప్పుదాం. ఇది న్యాయం కోసం పోరాటం కాదు మన హక్కుల కోసం పోరాటం. కావున ముస్లిం సమాజం మేలుకోవాలని తప్పనిసరిగా రేపు ముస్లింలు అందరూ ర్యాలీకి రావాలని పెద్దలు కోరడం జరిగింది.
View More
Latest News
22 Apr 2025 12:42 PM
0
11
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గడియార స్తంభం తొలగించవద్దని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బూచేపల్లి
దర్శి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2001 వ సంవత్సరం లో గడియార స్తంభం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ గడియార స్తంభం అప్పటి పంచాయతీ పర్మిషన్ మరియు R&B అధికారుల పర్మిషన్ తో నిర్మించి దర్శి కి ఒక గుర్తింపు చిహ్నం గా నిలిచినది.ఈ గడియార స్తంభం ను తొలగించాలి అని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలుసుకొని ఈరోజు ఒంగోలు లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ గారిని కలిసి దర్శి పట్టణానికి 23 సంవత్సరాల నుండి చిహ్నం గా ఉన్న గడియార స్తంభం ను తొలగించవద్దని దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగినది.
View More
Latest News
21 Apr 2025 21:56 PM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాశ్ అమెరికాలో మృతి చెందాడు. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్కు నెల క్రితమే వివాహమైంది.
View More
Local Updates
21 Apr 2025 17:02 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: చెన్నకేశవ స్వామి తిరునాళ్ల లో బూచేపల్లి
మార్కాపురం లో చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ సందర్భముగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభ పై ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,మాజీ శాసనసభ్యులు మార్కాపురం ఇంచార్జ్ అన్నా రాంబాబు.
View More
Latest News
21 Apr 2025 00:43 AM
0
15
Newsread image

No.1 Short News

గంగాధర్,అదిలాబాద్ జిల్లా
ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా :ఇంద్రవెళ్లి అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేసిన మంత్రులు ఎమ్ ఎల్ ఎలు,మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇక్కడి మట్టికి గొప్పదనం ఉంది, ఇక్కడి గాలిలో పౌరుషం ఉంది. తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు,ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,ఎమ్మెల్సీ దండే విఠల్,ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ఎంపీ నగేశ్, గిరిజన శాఖ చైర్మెన్ కోట్నాక్ తిరుపతి, మాజీ ఎంపీ సోయం బాపు ,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ,2021 ఆగస్టు 8న ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ‘దళిత గిరిజన దండోరా’ సభతో కేసీఆర్ గారి మీద నాటి పీసీసీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు బయలుదేరారు,ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల ముందు సమరశంఖం పూరించిన రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో అట్టడుగునున్న ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలుపడానికి ఇక్కడి నుంచే అభివృద్ధి శంఖారావం పూరించడం మనకు ఎంతో గర్వకారణం. జిల్లాలోని ఆదివాసీ గూడేల్లోని పేదలకు కూడు, గూడు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలుస్తుంది,అమరవీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు.నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోంది,అమరవీరుల స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమం,అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ. 97.లక్షలు కేటాయించిన గౌరవ ముఖ్య మంత్రి గారికి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
View More
Politics
21 Apr 2025 00:36 AM
0
14
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
మే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు. చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Apr 2025 17:14 PM
2
19
Newsread Image

No.1 Short News

Newsread
CMRF చెక్కులు పంపిణీ చేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దర్శి లోని డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయినా మొత్తం : 26,06,803 రూపాయల చెక్కులు /LOC లను లబ్దిదారులకు అందజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, తెలుగు మహిళ శోభారాణి, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి- సుబ్బారావు మరియు నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.
View More
Latest News
20 Apr 2025 15:21 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల లోని వైద్యులకు పండ్లు పంపిణీ
నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన 75వ పుట్టినరోజు సందర్బంగా దర్శి ప్రభుత్వ వైద్యశాల లో డాక్టర్స్ తో కలిసి పేషంట్ లకు పళ్లు, బ్రేడ్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వారితో పాటు మాజి శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, మోడీ వెంకటేశ్వర్లు, చిన్న, వాసు, జూపల్లి కోటేశ్వరరావు, క్లస్టర్స్ మధు, అంకయ్య, మరియు నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
View More
Latest News
20 Apr 2025 14:43 PM
1
14
Newsread Image

No.1 Short News

Newsread
మాగుంట ను మర్యాదపూర్వకంగా కలిసిన గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సందర్భంగా ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ లలిత్ కుమార్, AMC చైర్మన్ దానం సుబ్బారావు, మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు.
View More
Latest News
20 Apr 2025 14:33 PM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
ముండ్లమూరు టౌన్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు - 75వ పుట్టినరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితో పాటు ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను మరియు ముండ్లమూరు మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
20 Apr 2025 11:37 AM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు: కోట హనుమంతరావు
నిరంతర శ్రామికుడు, ముందుచూపు, దార్శనికత కల గొప్ప రాజనీతిజ్ఞుడు, నవయువ వైతాళికుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కోటా హనుమంతరావు.
View More
Latest News
20 Apr 2025 09:09 AM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
మరి కాసేపట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీ - 2025 షెడ్యూల్ ఇదే
అమరావతి, ఏప్రిల్ 20: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ డీఎస్సీ షెడ్యూల్‌ను శనివారం (ఏప్రిల్‌ 19) ఎక్స్‌ ఖాతాలో విడుదల చేశారు. కూటమి సర్కార్ మ్యానిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్‌ తన ట్వీట్‌లో వెల్లడించారు. ఇన్నాళ్లు ఓర్పు, పట్టుదలతో ఎదురుచూసిన ఔత్సాహికులందరికీ ఆల్‌ది బెస్ట్‌ అంటూ లోకేశ్‌ పోస్టులో పేర్కొన్నారు. చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం అంటే.. ఇందుకు సంబంధిత జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్‌, సిలబస్ వంటి ఇతర వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీ నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్‌ ఇదే.. ఆన్‌లైన్‌ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు మాక్‌ టెస్ట్‌లు: మే 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: మే 30 నుంచి డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జులై 6 వరకు ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక ‘కీ’ విడుదల అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల మెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు మెగా డీఎస్సీలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి 14,088 పోస్టులున్నాయి. ఇక రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్‌ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. ఇతర పూర్తి వివరాలకు https://cse.ap.gov.in లేదా https//apdsc.apcfss.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
View More
Latest News
20 Apr 2025 06:33 AM
3
34
Newsread Image

No.1 Short News

Newsread
పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి...కీలక కేసులో విచారణ
పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి.. కీలక కేసులో విచారణ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కింతాడ కళావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్ 13న శ్రీ రెడ్డిపై కేసు సమోదు చేశారు. సోషల్ మీడియా X, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి శ్రీ రెడ్డి ఖాతాల్లో పోస్టుల ఆధారాలు సేకరించి పోలీసులకు ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు శ్రీ రెడ్డిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ శ్రీ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు శ్రీ రెడ్డి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించవద్దని, విచారణ జరిపి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి 41ఏ నోటీసులు ఇవ్వాలని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఆదేశించింది హైకోర్టు. అంతే కాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి కూడా సూచించింది. అలా హైకోర్టు ఆదేశాలతో శ్రీరెడ్డి పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. పలు కీలక అంశాలపై సిఐ రామకృష్ణ శ్రీ రెడ్డిని విచారించారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి పెట్టిన పోస్టులు చూపించి ఇవి మీరు పెట్టినవేనా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనే అనేక రకాల ప్రశ్నలతో విచారణ జరిపారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే విచారణకు అవసరమైనప్పుడు మళ్లీ రావాలని, అందుబాటులో ఉండాలని చెప్పారు.
View More
Latest News
19 Apr 2025 23:15 PM
1
21
Newsread Image

No.1 Short News

Newsread
రాయచోటి: యాక్సిడెంట్ లో ఒకరి మృతి, మరొకరికి గాయాలు
మదనపల్లె నుండి రాయచోటికి ఓమిని వ్యాన్ లో వస్తున్న లక్కిరెడ్డిపల్లి మండలం అప్పకొండయ్యగారి పల్లెకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆరిఫ్ తన వాహనము చెట్టు కు ఢీకొనడంతో ఆరిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా వ్యాన్లో ఉన్న ముజాహిద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుండి బెంగళూరుకు తరలించినట్లు అక్కడ వైద్యులు తెలిపినట్లు స్థానికులు తెలియజేశారు.
View More
Latest News
19 Apr 2025 23:05 PM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
రోడ్ మద్యలో రీల్,పోలీస్ కాళ్ళ మధ్యలో ఫోటో
బెంగళూరు మగడ రోడ్ లో ఓ యువకుడు రోడ్ మద్యలో కుర్చీ వేసుకొని టీ త్రాగుతూ రీల్ చేసేడు ఆది సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయ్యింది, పోలీసులకు మండింది ,ట్రాక్ చేసి తీసుకొని పోయి కేసు పెట్టీ బొక్కలోకి తోసేరు,చేతిలో మొబైల్ లాక్కొన్నారు మళ్ళీ ఎక్కడ రీల్ చేస్తాడో అని. హాట్స్ ఆఫ్ టు పోలీస్ .
View More
Latest News
19 Apr 2025 18:46 PM
0
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బాపట్లలో బాప్టిజం స్వీకరిస్తూ నదిలో మునిగి ఇద్దరి మృతి
బాపట్ల జిల్లా పెనుమూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలోని కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటున్న సమయంలో పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్‌, పెనుమాల సుధీర్‌బాబు, పెనుమాల హర్షవర్థన్‌, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నదిలో దూకి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు (19), తలకాయల గౌతమ్‌(18) గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చేపట్టగా కాసేపటి తర్వాత వారి మృతదేహాలు లభించాయి.
View More
Latest News
19 Apr 2025 18:45 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్ధిక సంఘ బృందం ఈరోజు తిరుపతి లో పర్యటించారు ఈ సందర్బంగా తిరుపతి లో నిర్వహించిన అర్బన్ లోకల్ బాడీస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ షేక్ సజీల గుంటూరు నగర అభివృద్ధి గురించి,అభివృద్ధి కి అవసరమైన ఫండ్స్ గురించి సమావేశంలో ప్రసంగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా,సెక్రటరీ రిత్విక్ రాజానమ్ పాండేIAS ,ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ IAS , అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధ , జాయిన్ డైరెక్టర్ గోపాలకృష్ణరెడ్డి, EE సుందర్ రామి రెడ్డి, వివిధ కార్పొరేషన్లు మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.
View More
Latest News
19 Apr 2025 12:37 PM
1
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఇంటింటికి తిరుగుతున్న ప్రధాన ఉపాధ్యాయులు
తాళ్లూరు మండలం వెలుగువారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మోడల్ ప్రాథమిక పాఠశాల, ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల లో 2025 - 26 విద్యా సంవత్సరంలో విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొనుటకు ఎస్సీ కాలనీలో, గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు , విద్యార్థులు.
View More
Latest News
19 Apr 2025 11:54 AM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు
ఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కువ అవ్వడంతో తాళ్లూరు పోలీసులు ఇద్దరు వ్యక్తుల ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ గ్రామాలలో నివాసాల వద్దకు వచ్చి తాము అనాధ ఆశ్రమం నుండి వచ్చామని తగిన సహాయం చేయాలని ఒక మహిళ అడుగుతు పూర్తిగా తాళాలు వేసి ఉన్న నివాసాలను గమనించి మరోక వ్యక్తికి నమాచారం ఇస్తుందని ఆ వ్యక్తి వచ్చి పూర్తిగా ఆ పరినరాలు గమనించి తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇటువంటి వారి నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండడం కోసం తాము ఈ ఫోటోలను విడుదల చేశామని అన్నారు.
View More
Latest News
19 Apr 2025 11:54 AM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
హజ్ కమిటీ చైర్మెన్ హాసన్ బాషా గారికి సన్మానం.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హజ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన హాజీ షేక్ హసన్ బాషా గారు ఈరోజు సాయంత్రం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షిబ్లి స్వాగతాన్ని పలుకుతూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయల హజ్ సబ్సిడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్క హాజీకి అందించే విధంగా ప్రభుత్వం చేరువ తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే హజ్ యాత్ర అనేది పూర్తి ముస్లిం సాంప్రదాయానికి మరియు ఇస్లాం విధానం నందు ఒక భాగం ఇటువంటి కమిటీలో ఒక్క ముస్లిం మత పెద్ద కూడా లేకపోవడం బాధాకరం, కాబట్టి మిగిలిన ముగ్గురు సభ్యులను ముస్లిం మత పెద్దలను ఇందులో నియమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు & MHPS ఉలేమా వింగ్ మౌలానా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రెహమాన్, ముఫ్తీ యూనస్, మౌలానా అబుల్ సత్తార్ ఖాన్ అలాగే MHPS విజయవాడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
19 Apr 2025 10:17 AM
1
39
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పచ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు . ఈ దాడులను బీర్కూర్ మండల సీనియర్ బీజేపీ నాయకులు బిరుగొండ ఖండిస్తున్నట్లు పత్రిక ప్రకటన లో తెలిపారు , హిందువులపై జరుపుతున్న దాడులు అమానవీయమని ఆయన తెలిపారు
View More
Latest News
18 Apr 2025 20:19 PM
0
20
Newsread Image

No.1 Short News

Umar Fharooq
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
అసంఘటిత కార్మికుల,ఉద్యోగుల కాంగ్రెస్ దర్శి నియోజకవర్గ సమన్వయ కర్త,కైపు వెంకటకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి ద్వారానే విజయం సాధించగలం, హింసను అహింసతోనే జయించగలం, ద్వేషాన్ని ప్రేమతోనే సాధించగలం అని చెప్పిన క్రీస్తు బోధనలే ఆదర్శమని, ప్రపంచానికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు సిలువ ఎక్కిన రోజే గుడ్ ఫ్రైడే అని ఆయన అన్నారు.
View More
Latest News
18 Apr 2025 18:06 PM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు
జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు 2 ఉపాధ్యక్షులు, 1 ప్రధాన కార్యదర్శుల,1 కార్యదర్శి తో నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఆమోదించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి, లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉపాధ్యక్షులుగా గోరంట్ల కోటేశ్వరరావు దర్శి మండలం,మిట్ట సంజీవరెడ్డి దొనకొండ మండలం,ప్రధాన కార్యదర్శి కాటం వెంకటరమణారెడ్డి కుర్చేడు మండలం,కార్యదర్శి కొప్పుల సాయి తాళ్ళూరు మండలం,
View More
Latest News
18 Apr 2025 18:05 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
వేసవికాలం దృష్ట్యా పశువులకు దాహం తీర్చేనీటితొట్టెల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం ప్రకాశం భవనంలో డ్వామా అధికారులతోనూ, ఎంపీడీవోలతోనూ ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మంజూరు అయిన నీటితొట్టెల నిర్మాణాలను ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
View More
Latest News
18 Apr 2025 18:04 PM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాగునీటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోను
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,ఆర్.డబ్ల్యు.ఎస్.అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా అవసరం లేని చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు తన దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్య ఉందని ప్రజలు కాల్ సెంటరుకుగానీ, అధికారులకుకానీ ఫోన్ చేస్తే వారితో దురుసుగా ప్రవర్తించినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
View More
Latest News
18 Apr 2025 18:03 PM
0
10
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel