ఆంధ్రప్రదేశ్ : కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడిపై ఓ మహిళా కండక్టరు దాడి చేసింది. తోట్లవల్లూరులో పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరు వెళ్లడానికి గురువారం బస్సు ఎక్కాడు. మహిళా కండక్టరు టికెట్ కొట్టడంతో రూ.200ల నోటు ఇచ్చాడు. పెద్ద నోటు ఇస్తే ఎట్లా అని కండక్టర్ అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. కండక్టరు వృద్ధుడ్ని బస్సులోంచి దింపి దుర్భాషలాడతావా అంటూ దాడి చేసింది.