Select Location
Newsread Image

No.1 Short News

Newsread
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుల జాబితా సిద్ధం, ఇలా చెక్ చేసుకోండి!
సిద్ధమైన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం అర్హుల జాబితా - రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అర్హులైన రైతుల పేర్ల జాబితాలు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్​లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్‌ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని డిల్లీరావు స్పష్టం చేశారు. వివరాలు రైతులకు మరింత చేరేలా వ్యవసాయ శాఖ సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలని డిల్లీరావు ఆదేశించారు. అర్హులుగా 47.77 లక్షల రైతులు: 'అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని ఢిల్లీరావు వివరించారు. సొంతభూమి కలిగిన డీ.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు, నోషనల్‌ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతోపాటు ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలని ఢిల్లీరావు సూచించారు. అర్హత ప్రకారం అందరికి లబ్ధి చేకూరుస్తామని అక్టోబరు, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీరావు అన్నారు. వెబ్‌ల్యాండ్‌ డేటాను వారి లాగిన్లకు: రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను వీఏఏలు, వీఎస్‌ఏలు, వీహెచ్‌ఏలతో పాటు ఏవోల లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం కచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది రైతు సేవా కేంద్రాల సహాయకులు పరిశీలించి కచ్చిత వివరాలను మండల వ్యవసాయాధికారులకు వారు జిల్లా వ్యవసాయాధికారికి నివేదించాలి.
View More
Latest News
09 Jul 2025 12:27 PM
0
63
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు లో పాముతో వ్యక్తి హల్ చల్
ముండ్లమూరు సెంటరలో దర్శి -అద్దంకి రహదారి లో మద్యం మత్తులో ఓ వ్యక్తి మంగళవారం పాముతో జనాలను భయాందోళనకు గురిచేశాడు. నడి రోడ్డు పై కూర్చొని పామును చేతపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. దీం తో దారి వెంట వెళ్లే ప్రజలు, కళాశాల విద్యార్థులు చొరవ తీసుకొని అతనికి సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
View More
Latest News
09 Jul 2025 11:34 AM
0
56
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన దర్శి ఎస్సై మురళి
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి పుట్ట బజార్ లో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, నాగేశ్వరరావు అద్యక్షతన దర్శి ఎస్సై ఎం మురళి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ మానివాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని, వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అంటే మొక్కలు పెంచాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల సురేష్, అస్సాం,షడ్రక్ , వెంకట సుబ్బయ్యా గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
09 Jul 2025 10:59 AM
0
62
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రేపు గురుపూజ మహోత్సవ కార్యక్రమం
కడప జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు అనగా10.07.2025 గురువారం గురుపూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఎనిమిదో తరం మనవడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఈ గురుపూజ మహోత్సవాలకు స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ , మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు
View More
Latest News
09 Jul 2025 10:56 AM
0
70
Newsread Image

No.1 Short News

Newsread
ముండ్లమూరు: పోలవరం లో పోలీసుల దాడి 10 మంది అరెస్ట్.
ప్రకాశం జిల్లా: ముదురుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో, జిల్లా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, మార్గదర్శకత్వంలో, ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో వారి వద్ద నుంచి రూ.10,190/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిపై సంబంధిత నేర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మరింత విచారణ కొనసాగుతోంది. పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, ఇటువంటి చర్యలు ఇంకా కఠినంగా కొనసాగిస్తామని తెలిపారు.జనసామాన్యులు తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
View More
Breaking News
09 Jul 2025 07:27 AM
1
50
Newsread Image

No.1 Short News

Newsread
పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ కి నోబెల్ బహుమతి
ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి ఒక సంవత్సరం ఐదు నెలల (17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న అంబటి ఖశ్వి (17 నెలలు) ను ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ A.R. దామోదర్, అంబటి ఖశ్వి ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి కాశ్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని, చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారిలో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు చిమ్మాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, కుటుంబ సభ్యులు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
View More
Local Updates
08 Jul 2025 22:19 PM
1
76
Newsread Image

No.1 Short News

Newsread
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్..
ఫిర్యాదిధారునికి చెందిన ఒక కంపెనీకి జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ చేసి నెంబరును పొందడానికి గల ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌లోని మాధాపూర్‌ ప్రాంతపు ఉప రాష్ట్ర పన్నుల అధికారి - ఎం. సుధ..
View More
Crime News
08 Jul 2025 21:24 PM
0
68
Newsread Image

No.1 Short News

Newsread
నిషేధిత పొగాకు విక్రయం, నిల్వ, రవాణాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
విద్యా సంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ A.R. దామోదర్. మాదకద్రవ్యాల నిర్మూలనకై.. ప్రకాశం పోలీస్ అడుగులు. మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి పాఠశాలలు, కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు) పరిసరాలలో గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, రవాణాపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా అనుమానిత కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో పాటు విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి పై COTPA చట్టం ప్రకారం, అలాగే గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా చేసిన వారిపై NDPS చట్టం కింద కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యార్థులలో అవగాహన పెంపొందించడంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు మరియు గంజాయి ఉచ్చు నుండి యువతను రక్షించడం మనందరి సామాజిక బాధ్యత. పాఠశాలలు, కళాశాలల పరిసరాలను ఈ చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం మనందరి బాధ్యతన్నారు. యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికీ కృషి చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని, మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, జిల్లాను మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
View More
Latest News
08 Jul 2025 21:06 PM
1
55
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం
విజయవాడ, జూలై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష ని విజయవాడలోని హజ్ హౌస్‌ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ, రాష్ట్రంలోని హాజీబంధువుల కోసం హసన్ భాష చేస్తున్న అద్భుత సేవలు, సమన్వయం, మరియు సమగ్ర దృక్పథం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన వసతి, భద్రత, రవాణా, వైద్య సదుపాయాల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంపై కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కడపలోని హజ్ హౌస్ ను వినియోగంలోకి తీసుకురావాలని మరియు హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు విజయవాడ పాయింట్ గా సూచించాలని ఆమె కోరారు, హసన్ భాషా సానుకూలంగా స్పందించి ఈ విషయాలను నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కడప హజ్ హౌస్ వినియోగంలోకి తీసుకుని వచ్చేదానికి అదేవిధంగా విజయవాడను ఎమ్బర్కేషన్ పాయింట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు... అదేవిధంగా, హజ్ కమిటీ చైర్మన్‌గా హసన్ భాష చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఆయనకు సత్కారం జరిపి, శాలువాతో సన్మానించడం జరిగింది. భవిష్యత్తులోనూ హజ్ యాత్రికుల కోసం మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.
View More
Latest News
08 Jul 2025 20:52 PM
2
63
Newsread Image

No.1 Short News

Newsread
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ప్రారంభం
ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ప్రారంభం.విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం పోలీస్ చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మార్గనిర్దేశనలో,గుంటూరు జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ అనే ప్రత్యేక డ్రైవ్‌ను 08.07.2025 తేదీ నుండి 12.07.2025 తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ది.08.07.2025) జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, బడ్డీ కొట్టులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై దృష్టి సారించారు. అనుమానిత విక్రయదారులపై తగిన విధంగా చర్యలు తీసుకొని, ఇకపై మత్తు పదార్థాలు అమ్మకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. పాఠశాలలు, కాలేజీల సమీపంలో ఈ తరహా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగుతాయి.ఎవరైనా మత్తు పదార్థాలు నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. విద్యాసంస్థల పరిసరాలలోని షాపుల యజమానులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ షాపులో సిగరెట్లు మరియు మత్తు పదార్థాలు అమ్ముబడవు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, కాలేజీల యాజమాన్యం వారు తమ పిల్లల ప్రవర్తన మరియు నడవడికపై పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు. ఎవరి పిల్లలైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్టు తెలిసినట్లయితే, వెంటనే మీ దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని, వీరిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి అవసరమైన మార్గదర్శనం అందిస్తామని తెలిపారు. పోలీసు శాఖ మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పని చేస్తోందని, ప్రజలు ఈ లక్ష్య సాధనలో పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు.
View More
Latest News
08 Jul 2025 20:46 PM
0
79
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి సిపిఐ
ఏళ్ల తరబడి తిరిగిన సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ మండలంలోని సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని నరసన్న పల్లె, చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండపురం గ్రామాల ఎస్సీ మాదిగలకు భూములు చూపడం లో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కు బాధితులతో కలిసి అర్జీ లు ఇవ్వడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 18:02 PM
2
52
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
కడప జిల్లా సమీక్ష కమిటీ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా
కడప కలెక్టరేట్ నందు జిల్లా ఇంచార్జి మినిస్టర్ సవిత మరియు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సహచర జిల్లా ఎమ్మెల్యే లు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
View More
Latest News
08 Jul 2025 17:04 PM
1
52
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
థాంక్యూ ఎమ్మెల్యే సార్
మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డు ఇంచార్జీ అక్బర్ ఆధ్వర్యంలో 12వ వార్డు గానుగ వీధి నందు గత అయిదు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వీధి స్తంభాలకు మెయిన్ లైన్ లేకపోవడం వల్ల హై ఓల్టేజ్ వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఉండేది.. ప్రస్తుతం ఆ సమస్యకు పరిష్కారదిశగా ఈ రోజు విద్యుత్ అధికారులు మెయిన్ లైన్ లాగడం జరిగింది. ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపించినందుకు వీధి ప్రజలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు వార్డు ఇంచార్జీ అక్బర్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 16:10 PM
2
41
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ఖాజీపేట మండలం పత్తూరు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మంజూరైన పండ్లతోటల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి అందరూ పర్యావరణాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివిజా సంపతి, ఏపీడీ సుబ్బా రెడ్డి, ఖాజీపేట మండల ప్రజాప్రతినిధులు, ఏపీఓ చంద్రశేఖర్, ఉపాధి హామీ సిబ్బంది, పత్తూరు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు._
View More
Latest News
08 Jul 2025 12:43 PM
1
83
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
జననేతకు నివాళులు కరువు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా మండలంలో నివాళులర్పించే నాయకుడే లేడని వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమంటే మేమని ఎగబడి నాయకులు కేకులు కట్ చేయడం, పూలదండలు వేయడం పోటీపడి చేసేవారు. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పట్టించుకోవడం కూడా కరువైపోయిందని అధికారం ఉంటేనే అభిమానం ఉంటుందా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోవడమే తప్ప మహానేతకు కనీసం నివాళులు అర్పించే నాయకులు లేరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
View More
Politics
08 Jul 2025 12:17 PM
1
80
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఈ రోజు వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్ మెంట్ చైర్మన్ అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ కాని 108 మరియు 104 కిలో 2 బియ్యం పధకం, మరియు ఫీజు రియంబర్స్ మెంట్, అలాగే ముస్లిమ్స్ కు 4% రిజర్వేషన్ పేద వాళ్లకు ఇందిరమ్మ గృహాలు ఇలాంటి ఎన్నో పధకాలు ప్రెవశపెట్టిన మహానుభావుడని ఆయనను స్మరించటం మన బాధ్యత అని అన్నారు . మళ్ళీ ఆరోజు లు రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని అలాగే రాష్టం లో షర్మిల రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారు . ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాని, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ వలి, మార్కాపూర్ టౌన్ అధ్యక్షుకు ఇమ్రాన్, తర్లు పాడు పట్టణ అధ్యక్షులు హుస్సన్, యూసుఫ్ తదితర అభిమానులు పాలొన్నారు .
View More
Latest News
08 Jul 2025 12:06 PM
2
67
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట పంచాయతీ వాంపల్లి చెరువు గ్రామంలోని నాగిపోగు సుధాకర్, నాగిపోగు చంద్రశేఖర్ రైతుల పొలంలో పండ్ల మొక్కలు నాటిన టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి EXMPP మాలేపాటి సుబ్బారావు మరియు ఉపాధిహామీ ఏపీఓ హరికృష్ణ ,టెక్నికల్ అసిస్టెంట్ రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
View More
Latest News
08 Jul 2025 11:57 AM
4
72
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మా పోల్లాల్లోకి దారి ఇవ్వండి రైతుల ఆవేదన
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిరశవంచపొలం నాగి శెట్టి పల్లె పొలం మధ్యలో కొంతమేర ప్రభుత్వ బంజరు భూమి ఉండేదని దాని గుండానే మా పొలాల్లోకి వెళ్లే వారమని కొంతమంది నాయకులు ఆ భూమిని ఆక్రమించుకొని తమ పొలాల్లోకి దారి లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గాని ప్రభుత్వాధికారులు గాని స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు
View More
Latest News
08 Jul 2025 10:13 AM
1
89
Newsread Image

No.1 Short News

Newsread
Job Oriented Courses For Women's
Education
07 Jul 2025 21:35 PM
0
94
Newsread Image

No.1 Short News

Newsread
బారా షహీద్ లో నారా లోకేష్, ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన లోకేష్
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దర్గాను సందర్శించిన మంత్రికి ముస్లిం మత పెద్దలు గలఫ్ అలంకరించారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు.
View More
Latest News
07 Jul 2025 21:23 PM
1
106
Newsread Image

No.1 Short News

Newsread
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
అక్కడికక్కడే మృతి చెందిన రమ్య అనే యువతి అదే కత్తితో పొడుచుకొని ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన ప్రవీణ్. సంగారెడ్డి జిల్లా బండ్ల‌గూడ‌లో ఘ‌ట‌న‌. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్న పోలీసులు....
View More
Latest News
07 Jul 2025 20:50 PM
1
75
Newsread Image

No.1 Short News

Newsread
మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి లో మంద కృష్ణ మాదిగ 60 వ జన్మదిన వేడుకలు - కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. మందకృష్ణ మాదిగ లాంటి పోరాట యోధుడు పేదలు బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. గత ఐదేళ్ల వైసిపి విధ్వంసం పాలనను తరిమికొట్టాలని మన కూటమి కి అండగా నిలిచిన ప్రజల మనిషి మందకృష్ణ మాదిగ అని లక్ష్మి కొనియాడారు. ఎన్నికల సమయంలో దొనకొండలో మాదిగల ను ఏకం చేసేందుకు నాకు అండగా ప్రచారాన్ని కూడా వచ్చిన మందకృష్ణ మాదిగ ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె అభిప్రాయపడ్డారు. అదే స్ఫూర్తితో మన కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతుందని ఆమె వివరించారు. గౌరవ నరేంద్ర మోడీ ఆయన కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును కూడా మందకృష్ణ మాది కి ఇచ్చి గౌరవించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ MRPS కన్వినర్ గూడూరి యోగేశ్వరరావు మరియు ముండ్లమూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరగాని పౌలు తెల్లయ్య గారు దొనకొండ మండల MRPS కన్వినర్ యగ్గోని చిన్నయ్య గారు దొనకొండ మండల లైవ్ స్టాక్ అధ్యక్షులు పల్లే మణీందర్ దేవ్ గారు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు నూనే డేవిడ్ సన్ గారు దర్శి టౌన్ 15వ వార్డు అధ్యక్షులు పుప్పాల సురేష్ తెలుగుదేశం పార్టీ మరియు MRPS కార్యకర్తలు పాల్గోన్నారు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 20:39 PM
0
84
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రన్న పచ్చదనం–భాష్యం స్కూల్లో మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, గురువు అచ్చెన్నాయుడు ఆసీస్సులతో, దర్శి భాష్యం స్కూల్, నందు టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఏర్పాటు చేసిన మొక్కలను దర్శి అగ్రికల్చర్ AO k.రాధ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో K .రాధ మాట్లాడుతూ పిల్లలందరూ గ్రీన్స్ లీడర్ గా ఎదగాలి అని , ప్రకృతి, చెట్లు పర్యావరణ కు తొలి మెట్లు అని పిల్లల తో అన్నారు. కరోనా సమయంలో ఆక్సీజన్ అందక చాలా మంది చనిపోయినారు అని, అదే మన ఇంటి ఆవరణ లో చెట్లు ఉంటే ఆక్సిజన్ అందేది అని వివరించారు. చెట్లు పెంచడం వల్ల కాయలు పండ్లు, నీడ అన్ని దొరుకుతాయి అని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీష్,స్మైలీ, సుజాత, సుకన్య, సరస్వతి, అశోక్,రావులపల్లి ఉపాధ్యాయులు, స్టాఫ్ పాల్గొన్నారు..
View More
Local Updates
07 Jul 2025 20:18 PM
1
69
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజలకు అండ తెలుగుదేశం జెండా: డా|| గొట్టిపాటి లక్ష్మి
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణం లోని కురిచేడు రోడ్డులో గల ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం లో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని 12వ వార్డులో ఇంటింటికి ఏడాది పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. డా|| లక్ష్మీ గారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర నాయకులు ఉన్నారు.
View More
Latest News
07 Jul 2025 19:10 PM
0
74
Newsread Image

No.1 Short News

Newsread
ఆదర్శప్రాయుడు హెడ్మాస్టర్ బసవయ్య | కపురం శ్రీనివాసరెడ్డి.
దరిశి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని మండల పరషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య గత నెల(జూన్)30 వ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా...., ఆదివారం దరశిలోని స్థానిక ఆర్యవైశ్య వాసవీ కళ్యాణ మండపంలో ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవానికి ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., ఉపాధ్యాయ వృత్తిలో 39 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరము పాటుబడి,వృత్తిలో అంకితభావం,క్రమశిక్షణ, నిభద్ధతతో పనిచేసి,ప్రజలందరి మన్ననలు పొంది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా ఉపాధ్యాయులకు సేవలందించడమేగాక అనేక సామాజిక సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న అందరివాడు, నిగర్వి,నిత్య కృషీవలుడు,మృధుస్వభావిగా,ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి అందరి మన్ననలు పొంది,ఈ మధ్యన పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య అందరికి ఆదర్శప్రాయుడని కపురం శ్రీనివాసరెడ్డి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని,తన వ్యక్తిగత ప్రయోజనాలకోసంగాకుండా,దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల ధృష్ట్యా,నిరంతరం బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుబడే వ్యక్తే నిజమైన ఉపాధ్యాయుని,ఈలాంటి వ్యక్తే బసవయ్యని,తన శేషజీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని,పురుషులు ఏ రంగంలో రాణించాలన్నా, తప్పకుండా సహధర్మచారిణి(సతీమణి) అంగీకారం,సహకారం ఉండాలని, యావన్మంది మేధావులు,విద్యావంతులందరి సమక్షంలో కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.మహోన్నతమైన విలువలతో స్థాపించబడ్డ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కు బసవయ్య లాంటివారి సహయ సహకారాలు అవసరము కాబట్టి, మానవత సంస్థలో ఆయన స్థాయికి తగిన సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తామని,బసవయ్య లాంటి వ్యక్తులు ప్రస్తుతం ఈ సమాజానికి చాలా అవసరమని కపురం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,సిద్ధా సుధీర్, ఎంఈవోలు రఘురామయ్య,రమాదేవి, పీ.సంజీవయ్య,సూరె. సుబ్బారావు,వాకా.జనార్ధన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,పురప్రముఖులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 15:48 PM
3
75
Newsread Image

No.1 Short News

Newsread
వైజాగ్‌ కొకైన్‌ డ్రగ్స్ కేసులో వెలుగులోకి డాక్టర్‌.
విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన కొకైన్ కేసులో వెలుగులోకి వచ్చిన డాక్టర్‌ను కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మగా గుర్తించారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మను విశాఖ పోలీసులు అరెస్టు చేసారు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్‌కు లింకులున్నట్టు తేల్చారు.
View More
Latest News
07 Jul 2025 10:46 AM
0
46
Newsread Image

No.1 Short News

Newsread
చందలూరు లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం: పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి మండలం చందలూరు గ్రామంలో గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, తన గురువు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, లక్ష్మయ్య అద్యక్షతన పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అని సురేష్ అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని అన్నారు. వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అన్న మొక్కలు పెంచాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో షడ్రక్ , శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 10:29 AM
1
65
Newsread Image

No.1 Short News

Newsread
డ్యూటీ చేయకుండానే.. 12 ఏళ్లుగా రూ.28 లక్షల జీతం తీసుకున్న పోలీస్‌! కళ్లుమూసుకున్న సర్కార్..
ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ 12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లడం లేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం మాత్రం అందుకున్నాడు. అలా ఏకంగా రూ.28 లక్షలకుపైగా నెల జీతం తీసుకున్నాడు. తాజాగా పోలీస్‌ శాఖ నిర్వహించిన ఇంటర్నల్ తనిఖీల్లో 12 ఏళ్ల తర్వాత ఈ వ్యవహారాన్ని గుర్తించింది. ఈ విచిత్ర మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.
View More
Latest News
07 Jul 2025 09:55 AM
0
51
Newsread Image

No.1 Short News

Newsread
రాహుల్ గాంధీ ప్రధాని, షర్మిల ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు: కాంగ్రెస్ నేత సైదా
తుమ్మల చెరువులో మొహరం వేడుకల్లో కాసిం స్వామి దర్గాని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు, ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి రానున్న రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు
View More
Latest News
07 Jul 2025 08:07 AM
0
49
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారం చిక్కీలు సరఫరా చేయాలి: APTF తాళ్లూరు.
శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలు ప్రకాశం జిల్లాలో ఏజెన్సీల నుండి సరఫరా లేనందువలన జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు అందించడం లేదు. జూన్ నెలలో కూడా అందరి విద్యార్థులకు అన్ని రోజులకు సరిపడే విధంగా చిక్కీలు సరఫరా చేసి ఉండలేదు. చిక్కీలు సరఫరా చేసే ఏజెన్సీ వారిని సంప్రదించగా పైనుంచి మాకు సరఫరా లేదంటున్నారు. పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారము మెగా PTM రోజుకైనా చిక్కీలు పాఠశాలల్లో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను, కూటమి ప్రభుత్వమును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ తరఫున కోరుచున్నాము.
View More
Latest News
07 Jul 2025 07:24 AM
0
80
Newsread Image

No.1 Short News

Newsread
విడాకులు తీసుకుంటున్న నయనతార.. అసలేం జరిగింది..?
కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆ తర్వాత మనస్పర్థలతో అనూహ్యంగా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నయనతార తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది. తన భర్తతో, పిల్లలతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాంటి నయనతార.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇప్పటికే మీ వల్ల చాలా ఫేస్ చేశాను. అంటూ నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దీంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అసలు ఈ పోస్ట్ వెనుక ఆంతర్యమేంటి? నయనతార నిజంగానే విడాకులు తీసుకోబోతుందా? లేక ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయిందా? లేదా ఇంకేమైనా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. నయనతార, విఘ్నేష్ శివన్ లో ఎవరైనా స్పందిస్తే గానీ.. దీనిపై ఓ క్లారిటీ రాదు. కాగా, గతేడాది కూడా వీరి విడాకుల వార్తలు రావడం గమనార్హం.
View More
Entertainment
07 Jul 2025 06:59 AM
0
52
Newsread Image

No.1 Short News

Newsread
సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌, జులై 7: వానల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాగల ఐదు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
View More
Latest News
07 Jul 2025 06:37 AM
0
60
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గోవిందప్రసాద్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.
ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కవలకు కుంట్ల గోవిందప్రసాద్ మాదిగ అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిసభ జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగాAITUC జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు గురుకుల పాఠశాల అధ్యాపకులు డొక్కా వినయ్ మాస్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు ఆకర్షించి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసే కార్మిక పని గంటలు 24 గంటల నుండి 18 గంటలు కుదించి అలా హక్కులను కాపాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం, గర్నెపూడి యాకోబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
View More
Latest News
06 Jul 2025 19:27 PM
1
85
Newsread Image

No.1 Short News

Newsread
దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి వేడుకలు
ఈరోజు దర్శి ఎంపీడీవో ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహర్షి ఏకలవ్యుడు జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు జీవీ రత్నం మాట్లాడుతూ మహాభారతంలో విలువిద్యలో గురువు లేకుండా విలువిద్య నేర్చుకున్న మహర్షి ఏకలవ్యుడు పాత్ర అమోఘమని గురువు అడిగిన ఎమ్మటేనే తన బొటనవేలును దానం చేసిన త్యాగజీవి మహర్షి ఏకలవ్యుడు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బహుజనుల రచయితల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అట్లూరి రామారావు, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, జూపల్లి కోటేశ్వరరావు, ఎక్స్ ఎంపిటిసి రాజ్పూడి ఇర్మియ, వెంకటేశ్వర్లు, దళిత మహిళలు తదితరులు పాల్గొన్నారు
View More
Latest News
06 Jul 2025 19:18 PM
1
53
Newsread Image

No.1 Short News

Newsread
నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ వేడుకలు.
తెల్లవారుజామునంచే పోటెత్తిన భక్తులు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా రొట్టెలు పంచుకుంటున్న వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు. రొట్టెల పండగ నిర్వహణకు ఘనంగా ఏర్పాటుచేసిన జిల్లా యంత్రాంగం.... మతసామరస్యంతో పరిడవిల్లుతున్న దర్గా ప్రాంగణం..... రేపు పండుగ లో పాల్గొన నున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్....
View More
06 Jul 2025 13:18 PM
2
58
Newsread Image

No.1 Short News

Newsread
డబ్బులేక టీవీ9 జర్నలిస్టు కుటుంబ కనీటిగాధ
జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా.. భద్రతలేని ఉద్యోగాలు. భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు. అద్దె ఇల్లు.. చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ ప్రసాద్‌ శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒక బాబు. వీరి భవిష్యత్‌ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది. సొంత ఇల్లులేదు. సొంత ఊళ్లో జాగలేదు. సిరిసిల్లలో అద్దె ఇంట్లో జీవనం సాగించిన ఆయన శవం బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి. కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తూ ‘కొడుకా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. పూల దండలు సంపాదించుకుంటున్నవారా? కొడుకా.. నీ పిల్లల బతుకు ఏం కావాలిరా.. మాకు అగ్గి పెడుతావనుకుంటే.. మేం నీకు అగ్గిపెట్టాల్సి వస్తుంది కొడుకా..’ అంటూ ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. జర్నలిస్టు మిత్రులు వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. నెలవారీ జీతంలేని జర్నలిస్టులు ఆలోచించాలి. ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లోకి మారిపోవాలి . భార్యాపిల్లల్ని కాపాడుకోవాలి.
View More
Latest News
06 Jul 2025 12:52 PM
0
64
Newsread Image

No.1 Short News

Newsread
నీరసానికి రూ.50 వేలు, జ్వరానికి రూ.70 వేలు, దోచుకుంటున్న ఆస్పత్రులు
రోగుల వ్యాధి నిర్ధారణ కాకుండానే పరీక్షల పేరుతో వైద్యుల అధిక రుసుము - ప్లేట్లెట్ల సంఖ్య తగ్గాయంటూ అనవసర వైద్య పరీక్షలు చేయిస్తున్న వైద్యులు. వాతావరణంలో మార్పులొచ్చాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపాటి జ్వరమొచ్చినా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు ప్రైవేటు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. ప్రజల అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని మరీ దోపిడీకి తెరదీస్తున్నారు. అంతేకాకుండా సాధారణ జ్వరానికే రూ.వేలల్లో ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారు. అస్వస్థతకు రూ.50 వేలు: తరచూ కళ్లు తిరుగుతున్నాయని ఓ వ్యక్తి తణుకు రాష్ట్రపతి రోడ్డులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎటువంటి పరీక్షలు చేయకుండానే ఏకంగా అత్వసర విభాగానికి (ఐసీయూ)కి తరలించారు. అంతేకాకుండా తర్వాత పరీక్షలు, ఇతర చికిత్సల పేరుతో రూ.50 వేలు బిల్లు వేశారు
View More
Latest News
06 Jul 2025 07:20 AM
0
74
Newsread Image

No.1 Short News

Newsread
తొలి ఏకాదశి శుభాకాంక్షలు పోస్టర్ మీకోసం
Local Updates
06 Jul 2025 06:58 AM
2
50
Newsread Image

No.1 Short News

Newsread
మత్తుకు బానిసలు అవుతున్న యువకులు....
నెల్లూరు నగరం 54 వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని అబ్దుల్ కలం పార్క్ లో మత్తుకు బానిసలు అయినా యువకులు కొంతమంది టిన్నర్ అనే పెయింటింగ్ లో కలిపేది తీసుకొచ్చి సేవించి పార్క్ కి వచ్చిన బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సమాచారం అందుకున్న 2 పట్టణ పోలీసులు వచ్చి ఆకతాయిని అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తరలించారు.
View More
04 Jul 2025 21:47 PM
0
77
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి..
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)-ప్రకాశం జిల్లా ముండ్లమూరు తేది :04-07-25 భూ యజమానులు, కౌలు భూములు సాగు చేస్తున్న రైతులకు సహకరించాలి- ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ ----------------@---------------- రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగు దారుల చట్టం -2019 చట్టం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే లాగున సహకరించలని ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. శుక్రవారం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వంట సాగు సాగుదారుల ధ్రువీకరణ చట్టం ప్రచారోద్యమం వాహనం ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మాట్లాడినారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్లకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగు దారుల గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది, భూమిపై కాదని ఈ విషయాన్ని భూ యజమానులు గుర్తుతెరిగి కౌలు రైతులకు సహకరించాలని తెలిపారు. తదుపరి ప్రచార వాహనం ద్వారా ముండ్లమూరు, పసుపుగల్లు, వేముల బండ, రమణారెడ్డి పాలెం, ఈదర, భీమవరం, ఉమామహేశ్వరపురం, పోలవరం గ్రామాలలో కౌలు రైతుల ప్రచారోద్యమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలలో ఆయా గ్రామ సచివాలయ, గ్రామరెవిన్యూ అధికారులు,వ్యవసాయ సహాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Jul 2025 18:01 PM
3
63
Newsread Image

No.1 Short News

Kumar Darla
దర్శి లో ఆడపిల్లలను వేధించే వారిపై నిఘా పెట్టడం జరిగింది.
దర్శి : సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు దర్శి లో సాయంత్రం వేళలో స్కూల్లో కాలేజీలో నుంచి వస్తున్న ఆడపిల్లలను కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించడం జరుగుతుందని వారిపై దరిశి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు నిఘా పెట్టామని తెలియజేశారు. నిన్న సాయంత్రం ఇద్దరిని ఆకతాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. దర్శి లో రెండు డ్రోన్లు సహాయంతో ఎల్లప్పుడూ మా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అని ఆయన తెలియజేశారు.
View More
Local Updates
04 Jul 2025 17:58 PM
0
74
Newsread Image

No.1 Short News

Newsread
Local Ads - Website Developer
Local Ads
04 Jul 2025 07:43 AM
5
84
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ సచివాలయాల్లో బదిలీలపై విచారణ, రీకౌన్సిలింగ్.. ? కొత్త డిమాండ్లు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే జరుగుతున్న బదిలీలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సచివాలయాల ఉద్యోగులు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఇప్పటికే ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇవాళ మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. బదిలీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, రీ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇవాళ విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోనే అనేకచోట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జీవో 5ని పాటించకుండా అపారదర్శకంగా జరిగిందని ఆరోపించింది. కొన్నిచోట్ల అత్యంత పారదర్శకంగా జరిగిందని, మరికొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియార్టీలో ఉన్న ఉద్యోగులకు అన్యాయం చేశారని తెలిపింది. అనేక జిల్లాలలో బదిలీలు జరిగే కౌన్సిలింగ్ కేంద్రాలలో సచివాలయ ఉద్యోగుల సీనియార్టీ జాబితా ప్రదర్శించకుండానే, కేవలం ఆప్షన్స్ మాత్రమే ఫామ్ ద్వారా స్వీకరించి, ఉద్యోగులను వెళ్ళమనడంతో ఉద్యోగులకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం కాలేదని తెలిపింది. అలాగే జీవో 5లో పేర్కొన్న విధంగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు, కొన్ని కౌన్సిలింగ్ కేంద్రాల్లో ప్రాధాన్యత కల్పించి బదిలీలు చేపట్టలేదని తెలిపింది.
View More
Latest News
03 Jul 2025 20:39 PM
1
72
Newsread Image

No.1 Short News

Newsread
మైండ్‌ బ్లోయింగ్.. డాక్టర్ల కంటే 4 రెట్లు బెటర్.. మైక్రోసాఫ్ట్ కొత్త మెడికల్ AI.. ఇక మానవ డాక్టర్ల అవసరం లేదా?
ఒకవైపు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వార్తల్లో నిలిచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, మరోవైపు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. మానవ వైద్యుల కంటే నాలుగు రెట్లు కచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది వైద్య రంగంలో “సూపర్ ఇంటెలిజెన్స్”కు తొలి అడుగు అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ AI అంత గొప్పదా? ఇది నిజంగానే అనుభవజ్ఞులైన డాక్టర్లను మించిపోయిందా? ప్రముఖ AI నిపుణుడు ముస్తఫా సులేమాన్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ AI యూనిట్ ఈ అద్భుతమైన టూల్‌ను రూపొందించింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. MAI-DxO ఒంటరిగా పనిచేయదు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ నిపుణులైన వైద్యుల బృందంలా పనిచేస్తుంది. వివిధ AI ఏజెంట్లు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ (“చైన్-ఆఫ్-డిబేట్” పద్ధతిలో), ఒక క్లిష్టమైన కేసును విశ్లేషించి, ఒక నిర్ధారణకు వస్తాయి. ఇది గుడ్డిగా సమాధానం చెప్పదు. ఒక రోగి వచ్చినప్పుడు డాక్టర్ ఎలా ప్రశ్నలు అడుగుతారో, ఏయే పరీక్షలు (బ్లడ్ టెస్ట్, ఎక్స్-రే) సూచిస్తారో, ఆ ప్రక్రియను స్టెప్-బై-స్టెప్ అనుకరిస్తుంది. “మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్” భవిష్యత్తు ఇదేనా? మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వైద్య రంగంలో ఒక విప్లవానికి నాంది. “వివిధ AI ఏజెంట్లు కలిసి చర్చించుకునే ఈ పద్ధతి, మనల్ని ‘మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్’ వైపు వేగంగా తీసుకెళ్తుంది” అని చెప్పారు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒకేసారి అనేక వైద్య విభాగాల (కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అరుదైన వ్యాధులను సైతం వేగంగా గుర్తించి, వైద్యులకు సాయం చేస్తుంది. రోగులు తమ ఆరోగ్యం గురించి మరింత తెలుసుకోవడానికి, వారి కేసులను మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. తొందరపడకండి.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. ఈ ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నా, మైక్రోసాఫ్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. “ఈ టూల్ ఇంకా క్లినికల్ వాడకాల కోసం రెడీగా లేదు” అని చెప్పింది. ఇది ప్రస్తుతం క్లిష్టమైన, అరుదైన కేసులపై మాత్రమే పరీక్షిస్తున్నాం. జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలపై దీని పనితీరును ఇంకా పరీక్షించాల్సి ఉంది. కాబట్టి, ఇది ఇప్పుడప్పుడే మీ స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ స్థానాన్ని భర్తీ చేయదు. మైక్రోసాఫ్ట్ MAI-DxO అనేది మానవ వైద్యులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదు. వైద్యులకు బాగా ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది వైద్యులపై పనిభారాన్ని తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీ మానవ మేధస్సు , కృత్రిమ మేధస్సు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ.
View More
Latest News
03 Jul 2025 19:40 PM
0
89
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
Movierulz , ibommma లో మూవీస్ పెట్టె వ్యక్తి అరెస్టు
మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు పైరసీ మూవీలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఒక్కో మూవీని రూ.40వేలు-రూ.80 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం పైరసీ కేసులో అరెస్టైన కిరణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల 2024లో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు రూ.3,700 కోట్లు నష్టం ఇప్పటివరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించిన పోలీసులు తన ఫోన్‌తోనే థియేటర్లో చిత్రం రికార్డ్ చేసి.. దానిని మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు అమ్ముతున్నట్లు గుర్తింపు ఈస్ట్ గోదావరికి చెందిన కిరణ్ వనస్థలిపురంలోని NGOs కాలనీలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తింపు
View More
Latest News
03 Jul 2025 16:17 PM
0
85
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి
దర్శి ;దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దర్శి ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన పంట సాగుదారుల చట్టంపై ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోదర్శి మండల కార్యాలయం నుండి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు మండలంలో జరగనున్న ఈ ప్రచారోద్యమ కార్యక్రమం కౌలు కార్డుల పైన ప్రతి కౌలు రైతుకు అవగాహన కల్పించి ఈ చట్టంపై భూ యజమానులకు ఉన్న అపోహలను తొలగించుటకు భూ యజమానులు నష్టపోకుండా పంట సాగుదారుల చట్టం- 2019 ప్రకారం యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే విధంగా సహకరించాలని రీసర్వ్ డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు తదుపరి పోతవరం పంచాయతీ శివారు ప్రాంతమైన తిమ్మాయిపాలెం గ్రామం మరియు తానం చింతల గ్రామాలలో అలాగే తూర్పు చవటపాలెం గ్రామంలో రైతు సేవ కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఏరియా కోఆర్డినేటర్ నాగమణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగుదారులు గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది భూమిపై కాదనే విషయాన్ని భూ యజమానులు తెలుసుకొని కౌలు రైతులకు సహకరించాలని కోరారు పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు రుణాలు పొందడానికి కౌలు కార్డు ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కవులు రైతులు ఉన్నారని రాధాకృష్ణన్ రిపోర్టు ఆధారంగా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుని వారు ఉన్నారని రాష్ట్రంలో 75% ఆత్మహత్యలు జరుగుతున్న వారిలో మూడు వంతులు కౌలు రైతులు ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వీఆర్వోలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు భాగస్వాములయ్యారు
View More
Local Updates
03 Jul 2025 11:09 AM
2
73
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ!
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.528 కోట్లు ఉంటే.. వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.178 కోట్ల నిధులను బుధవారం విడుదల చేస్తారు. పది రోజుల్లో మరో రూ.672 కోట్లు విడుదల చేయనున్నారు. కేంద్రం నిధులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లులు ఆగిపోయాయి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం రూ.900 కోట్లు విడుదలయ్యాయి. తక్కువ చూపించు
View More
Breaking News
03 Jul 2025 08:25 AM
1
86
Newsread Image

No.1 Short News

Newsread
జులై 3 వ తేదీ స్పెషల్ ఏంటో తెలుసా??
Education
03 Jul 2025 00:52 AM
1
60
Newsread Image

No.1 Short News

Newsread
local ads- SADIQ SOFT SKILLS
Local Ads
02 Jul 2025 21:42 PM
0
73
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి సీఐ ఎస్సై ఆధ్వర్యం లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Y. రామారావు , ఎస్సై M. మురళి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన విద్యార్థులతో చర్చిస్తూ, బాగా చదువుకోవాలని, సమాజంలో క్రమశిక్షణతో ప్రవర్తించాలని, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మీరు చదువులో మెరుగ్గా ప్రవర్తించి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. అలాగే, పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ల మధ్య తేడా ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో పెద్దల సహాయం తీసుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన కల్పించారు. పిల్లలు ఎటువంటి అనుమానాస్పద పరిస్థితిని ఎదుర్కొన్నా భయపడకుండా గురువులకు లేదా పోలీసులకు చెప్పాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, పిల్లల పట్ల ప్రేమతో, శాంతంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎలా మార్గనిర్దేశనం చేయాలో కొన్ని విలువైన సూచనలు చేశారు. చివరిగా, విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ తరఫున పెన్నులు అందజేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
View More
Latest News
02 Jul 2025 21:11 PM
1
72
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (696)
  • Motivation (10)
  • Crime News (20)
  • Local Ads (35)
  • Entertainment (15)
  • Local Updates (192)
  • Sports News (12)
  • Education (10)
  • Business Promotions (1)
  • Politics (64)
  • Breaking News (96)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.