మీ ప్రేమ, ఆశీర్వాదంతో అంతరిక్ష కేంద్రం చేరుకున్నా.. శుభాంశు..
భూమి నుంచి 28 గంటల ప్రయాణం అనంతరం అంతరిక్ష కేంద్రానికి చేరిన శుభాంశు శుక్లా, అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన వెంటనే అక్కడున్న ఇతర వ్యోమగాములతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శుభాంశు మాట్లాడుతూ, 'మీ ప్రేమ, ఆశీర్వాదంతో నేను అంతరిక్ష కేంద్రం చేరుకున్నాను. ఇక్కడ నిలబడటం చూడటానికి తేలికగానే ఉన్నప్పటికీ, నా తల కొంచెం భారంగా, కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది' అని తెలిపారు.