మైనర్ విద్యార్థి పై కేసు నమోదు చేసిన పోలీసులు:
ఒంగోలు క్రైమ్: 8 నెలల గర్భం దాల్చిన దివ్యాంగ బాలిక దుర్ఘటన ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలానికి చెందిన మహిళకు పిల్లలు లేకపోవడంతో తన తమ్ముడు పిల్లల్లోని ఒక కుమార్తెను దత్తత తీసుకొని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బద్రుల ఆశ్రమంలో చేర్పించింది. అనంతరం ఇంటర్మీడియట్ కు బాపట్ల జిల్లాలో బద్రుల ఆశ్రమంలో చేర్పించింది . బాలిక కాలుల్లో నీరు చేరడం వల్ల ఒంగోలు జిల్లాలోని జిహెచ్కి తరలించి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఎనిమిది నెలల గర్భం ధరించిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని మేనత్తకు చేరవేశారు. బాలికను మేనత్త ప్రశ్నించగా ఒంగోలులో బదురుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కొన్ని నెలల క్రితం అర్ధరాత్రి తన వద్దకు వచ్చి నోరు మూసి అత్యాచారం చేశాడని .తన సైగలతో తెలియజేసింది. విషయం తెలుసుకున్న తన మేనత్త ఒంగోలులో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.