IND vs ENG: రెండో టెస్టుకు భారత జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్.. హైదరాబాద్ కుర్రాడు కూడా..!
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జులై 2 నుంచి ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకోసం భారత్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ బృందం కసరత్తు మొదలు పెట్టింది.