కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్(D) తిమ్మాపూర్(M) ఇందిరా నగర్కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు.