మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ వేదిక
ఈరోజు మచిలీపట్నం లోని MR ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది కి పైగా వధూవరులు విచ్చేసి వారి ప్రొఫైల్ పరిచయకార్యక్రమంలో పాల్గొన్నారు. MR ఫంక్షన్ హాల్ అధినేత దాదా గారి ఆద్వర్యం లో LED స్క్రీన్స్ మీద వధూవరుల ప్రొఫైల్ ను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే ఆలోచన చేస్తున్నట్లు నిర్వాహకులు దాదా కుమార్తె, అల్లుడు మతీన్ తెలిపారు.