దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.