తాళ్లూరులో ఎంపీడీవో దార హనుమంతరావు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు షుగర్, బీపీ వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ ఆయా వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.