NIA దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. వీటిల్లో ఢిల్లీ, ముంబై, హరియాణా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, ఆఫీస్లు వీటిల్లో ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలను కూడా NIA స్వాధీనం చేసుకుంది.