జగన్ను చంపేందుకు కుట్ర చేశారు: మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. రెడ్ బుక్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడితప్పిందని మంత్రి లోకేశైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తమ చేతులను కట్టేశారని, లేదంటే చుక్కలు చూపించే వాళ్లమని హెచ్చరించారు.