గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకులను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.