పాలనా వ్యవస్థలో ‘జీరో కరప్షన్’ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతి జరుగుతుందనే సమాచారం ఉన్న చోట దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది పాలనలో వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.