పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, తన గురువు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో,దర్శి మండలము, చౌటపాలెం లో, టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు..మానవ మనుగడ కోసం మనం అందరం పాటు పడదామని సురేష్ అన్నారు. ప్రకృతి లో జీవ వైవిధ్యం కాపాడుకోవడం కోసం మొక్కలు నాటి సంరక్షించాలి, భవిష్యత్ తరాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి మంచి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, చెన్న రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుబ్బారావు గ్రామస్తులు పాల్గొన్నారు.