దర్శి: పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సమావేశం.
ఎన్నికల సంబంధించి దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి అధ్యక్షతన 9-6-2025 న ఉదయం 11 గంటలకు దర్శి తహశిల్దార్ వారి కార్యాలయం నందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు దర్శి తాసిల్దార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మరణించిన వారిని ఫారం-7 ద్వారా తొలగించాలని,చిరునామా మార్పు అయినవారు వారు ఫారం-8 ద్వారా అప్లై చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు టి. దేవ ప్రసాద్, అఫ్రోజ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,పుల్లలచెరువు సత్యనారాయణ,మారెళ్ళ వెంకటేశ్వర్లు,టి బాబూరావు, మాడపాకుల శ్రీనివాసరావు, యస్ పౌలేసు, పి చిరంజీవి పాల్గొన్నారు.