హార్ముజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణయం తీసుకున్న ఇరాన్ పార్లమెంట్.
అమెరికా దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన సరఫరా పాయింట్లలో ఒకటి. ప్రపంచ చమురు మరియు గ్యాస్ సరఫరాలో దాదాపు 25% శాతం ఈ ఇరుకైన జలసంధి ద్వారా ప్రతి రోజు రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఎఇ, ఖతార్ ఇరాన్ నుండి వచ్చే ఇంధనం,సరుకులు ఈ ఇరుకైన ఛానెల్ ద్వారా రవాణా అవుతాయి. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతోప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర పెరిగే అవకాశం ఉంది.