వృద్ద మహిళలకు మత్తుమందు ఇచ్చి వరుస దొంగతనాలు చేసున్న కిలాడీ లేడిని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు
మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న మరియు ఆభరణాల షాప్ ల్లో బంగారం కొనడానికి అని వెళ్ళి దొంగతనాలు చేస్తున్న మహిళ ను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి సుమారు Rs 35,00,000/- విలువ గల 460 గ్రాముల బంగారు ఆభరణాలు. మత్తు టాబ్లెట్లు స్వాదీనం చేసుకోవడం జరిగినది. ముద్దాయి గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చినట్టు, ఆమె టీవి లో వస్తున్న ఒక టీవీ సీరియల్ చూసి ఒంటరి వృద్ధ మహిళలని టార్గెట్ చేసి, వారికి మాయమాటలు చెప్పి, వారితో తెలిసినా మహిళగా మెలిగి, కూల్ డ్రింక్స్ లో కలిపి వారికి ఇచ్చి వారు నిద్రపోయ్యాక వారి వంటి మీద ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేసుకొని పోతుంది. ఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచినఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.