నాగాయలంక: విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి
విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం నాగాయలంక మండలం తలగడదీవిలో కృష్ణాజిల్లా సెకండరీ స్కూల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 84వ గ్రీగ్ మెమోరియల్ అవనిగడ్డ సబ్జోన్ బాలుర ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరిగింది. ఉత్తమ ప్రతిభావంతులు కావడంతో పాటు క్రీడల్లోనూ జాతీయస్థాయికి ఎదగాలని కోరారు.