నకరికల్లు-అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.