మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంగోలు రానున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ (84) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివ దేహాన్ని ఒంగోలు తరలిస్తున్నారు. దీంతో నివాళులు అర్పించేందుకు నేడు లేక రేపు ఒంగోలు జగన్ రానున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారని సమాచారం.