దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శిలో డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించాలని, వేసవి కాలంలో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న దొనకొండ, కురిచేడు మండలాల సమస్యలను సీఎం ద్రుష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. దర్శి- దొనకొండ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.