ముండ్లమూరు - తాళ్లూరు రహదారిలోని శ్రీరామ్ మిల్క్ డైరీ వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని సైడ్ కాలవలో స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.