తాళ్లూరు మండల కేంద్రంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరులో ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు అంతరాయం ఉంటుందని చెప్పారు. కావున వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ సహకరించాలని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు కోరారు.