రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలను అందించాలని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలను సకాలంలో వేయాలని సూచించారు. వేసవిలో వడదెబ్బ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.