

No.1 Short News
Umar Fharooqబొద్దికూరపాడు లో స్వయం ఉపాధి శిక్షణ
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో పాత బ్యాంకు ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్ సెట్ ) ఒంగోలు వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న 35 మంది మహిళల టైలరింగ్ శిక్షణ కార్యక్రమం టైలరింగ్ ఫ్యాకల్టీ కె అరుణ, బాపూజీ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు థియరీ , ప్రాక్టికల్స్ విధానంలో టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.ఈ శిక్షణ కార్యక్రమం రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, లీలా కృష్ణ, సుధీర్ పర్యవేక్షణలో జరుగుతుంది.
View More
Latest News
18 May 2025 15:44 PM


No.1 Short News
Umar Fharooqజూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో శనివారం జూనియర్ ఎన్టీఆర్ 42 వ జన్మదినోత్సవం సందర్భంగా బీసీ కాలనీ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఒంగోలు వారి ద్వారా గ్రామానికి చెందిన 37 మంది యువతీ యువకుల నుండి రక్తం సేకరించి ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను రక్తదాతలకు అందించారు. ప్రమాద సమయంలో, ఆపద సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడేటటువంటి రక్తదానం గ్రామంలోని హిందూ, ముస్లిం యువతీ యువకులు పార్టీలకు, వర్గాలకు,మతాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల గ్రామానికి చెందిన పలువురు నిర్వాహకులను అభినందించారు.రక్తదాతలకు, అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూల్ డ్రింక్స్ , పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.
View More
Latest News
17 May 2025 16:13 PM


No.1 Short News
Umar Fharooqజాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం
శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య అధికారి మౌనిక తమ సిబ్బందితో కలిసి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వైద్య అధికారి మౌనిక మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసర ప్రాంతాల్లో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, నీటి తొట్టెల్లో వర్షపు నీటిని నిలువ చేయరాదని ఈ డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు పగలు మాత్రమే దాడి చేస్తాయని తెలియజేస్తూ, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు నిర్మూలనకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
View More
Latest News
17 May 2025 15:11 PM


No.1 Short News
Umar Fharooqవైద్య అధికారులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి నాగులుప్పలపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ట్రాకింగ్, ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, రోగుల రిజిస్ట్రేషన్ రూము రికార్డ్స్ ను, క్యాజువాలిటి రూములను, అత్యవసర సేవా విభాగంను, ల్యాబ్ లను పరిశీలించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులతో మాట్లాడడం జరిగింది.
View More
Latest News
16 May 2025 12:29 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044బీజేపీ పార్టీ లో చేరిన జకియా ఖానం కి ఘన స్వాగతం
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్ గారు Bharatiya Janata Party (BJP) లో చేరారు. పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారితో కలిసి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీమతి జకియా ఖానమ్ గారు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరారు. ముస్లిం సమాజం అభ్యన్నతికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు.
వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం వక్ఫ్ (సవరణ) చట్టం తేవడం, ముస్లిం మహిళలకు గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్ నిషేధించడమే కాక పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ని నాదంతో సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందిస్తున్నారు.
View More
Latest News
15 May 2025 17:10 PM


No.1 Short News
Umar Fharooqప్రమాదానికి గురి అయిన తాళ్లూరు టు ఒంగోలు ఆర్టీసీ బస్సు
మే 14 2025 ఒంగోలు నుండి తాళ్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివరామపురం, గాడి పత్తి వారి పాలెం మధ్యలో గల టర్నింగ్ వద్ద తాళ్లూరు నుండి వెల్లంపల్లి వైపు లోడుతో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు ఒక వైపున నాలుగు కిటికీలు, రైలింగ్, బాడీ ధ్వంసం కాగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కిటికీ వైపు ప్రయాణికులు ఎవరు కూర్చోకపోవడం వలన బస్సు డ్రైవరు కండక్టర్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
View More
Latest News
15 May 2025 14:22 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044ఏపీ లో మెట్రో ప్రాజెక్టులపై కీలక ముందడుగు
అమరావతి : ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడింది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోవిదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చించనున్నారు.
View More
Latest News
14 May 2025 20:08 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి నోటిదూల
మన సైనిక ఆది కారిణి కర్నల్ సోఫియా ఖురేషి పై తప్పుడు కూతలు ( ఉగ్రవాదుల మతానికి చెందిన ) అని వాగిన మంత్రి విజయ్ షా కు బిజెపి అధిష్టానం పిలిచి చివాట్లు పెట్టింది, బిజెపి సానుభూతిపరులు తరచూ ఇతర మతాల పై నోరు జారడం పరిపాటి అయ్యింది,కానీ యుద్ధ సమయం లో ఇలాటి దిగజారుడు మాటల వల్ల మన దేశ ప్రతిష్ట ప్రపంచం లో మంట గలిసిపోతుంది,ఇకనైనా బీజేపీ వారు నోటికి తాళం వేసుకొని ఉంటే మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు లేదా అంతర్జాతీయం గా భారత్ చెడ్డ పేరు మూటగట్టుకోవడం ఎంతో దూరం లో లేదు.
View More
Latest News
14 May 2025 08:12 AM


No.1 Short News
Umar Fharooqజిమ్స్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు
జనతా మెడికల్ ఇన్స్టిట్యూట్ (జిమ్స్ ) ఆధ్వర్యంలో ఎబీసీ
హైస్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ వైద్య శిబిరం ను ప్రారంభించగా. కంటి వైద్య నిపుణులు పూజిత మాదాల ఆధ్వర్యంలో డీఓలు నరసింహారావు, 109 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 35 మందికి శుక్లం ఆపరేషన్ కొరకు సిఫార్స్ చేసారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హెచ్ ఎస్ లలో కంటి శక్లాల ఆపరేషన్ నిర్వహించబడునని చెప్పారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబు, పీఆర్.ఓ వందనం, సిబ్బంది గౌస్, గౌస్య లు పాల్గొన్నారు.
View More
Latest News
12 May 2025 08:33 AM


No.1 Short News
Umar Fharooqరమణాలవారిపాలెం లో ఘనంగా గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుక
తాళ్లూరు మండలంలోని రమణాలవారిపాలెం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుక ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం వారికి ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, కరీంభాష, నజీర్, మహాబువలి, తాతయ్య, బాబు, రాము, కొండ, శ్రీను, రామిరెడ్డి, బడా, సైదా, రియాజ్ పాల్గొన్నారు.
View More
Latest News
12 May 2025 08:33 AM


No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలంలోని పలు గ్రామాలకు ఉదయం 4 గంటల నుండి 9గంటల వరకు త్రీ ఫేస్ కరెంట్
రేపు అనగా 12/5/2025 తేదీన ఉప్పలపాడు 132/33కేవీ సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ నిర్వహించినందున తాళ్లూరు మండలంలోని
నాగంబొట్లపాలెం, దోసకాయలపాడు, బొద్దికూరపాడు, లక్కవరం సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 4గంటల నుంచి 9గంటల వరకు త్రీ ఫేస్ సప్లై ఇస్తున్నారు. కావున రైతుల గమనించి సహకరించాలని కోరుతున్నాము.
ఇట్లు
దర్శి ఏడీఈ
కృష్ణారెడ్డి
View More
Latest News
11 May 2025 16:19 PM


No.1 Short News
Umar Fharooqగొట్టి పార్టీ లక్ష్మికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఈరోజు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ జన్మదిన సందర్భంగా భారీగా అభిమానులు, నాయకులు ,కార్యకర్తలు దర్శి చేరుకొని ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు కరీముల్లా మాట్లాడుతూ గొట్టిపాటి లక్ష్మీ ఒకవైపు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గా మరొకవైపు డాక్టర్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని, ఆమె ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి దర్శి చేరుకొని ఆమెకు దేవుని పటం అందించడం జరిగింది.
View More
Latest News
11 May 2025 15:55 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044వివాహ శుభకార్యక్రమం లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
09-05-2025 న దర్శి మండలం, శేషంవారిపాలెం గ్రామం లో శుక్రవారం వివాహా శుభకార్యక్రం లో పాల్గొని నూతన వధూవరులు చి|| నరేష్ - చి|| ల|| సౌ|| అనూష లను ఆశీర్వాదించి, వివాహా శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ.
ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చిన్నా, మండల టిడిపి నాయకులు సానె సుబ్బయ్య, క్లస్టర్ అంకయ్య, శేషంవారిపాలెం గ్రామ టిడిపి నాయకులు, టిడిపి, జనసేన, బీజేపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 23:00 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులను కలిసిన పలాస జనసేన నాయకులు
ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పలాస నియోజకవర్గ నాయకులు జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారిని కలిసి ఇటీవల నియోజకవర్గంలో జారిగిన కొన్నీ సంఘటనలు అధి నుంచి పార్టీకి కష్టకాలములో పార్టీలో పనిచేస్తున్న జనసేన నాయకులు అధ్వర్యంలో చెపడతున్న కార్యక్రమాలు గురించి చర్చించడo జరిగింది.జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోన కృష్ణారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దిలీప్ పాణిగ్రాహి,వజ్రపుకొత్తూరు క్లస్టర్ ఇంచార్జి దువ్వాడ వంశీకృష్ణ చౌదరి,జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గిరీష్, విద్యాసాగర్, శంకు శ్రీకాంత్, ప్రదీప్, ఉదయ్, ఆనంద్ ఉన్నారు.
View More
Latest News
09 May 2025 17:40 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మధుసూదన్ సతీమణి కామాక్షి, వారి ఇద్దరు పిల్లలను కలిసిన మంచు విష్ణు, దాడి జరిగిన తీరును గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. వారిని దత్తత తీసుకొని, వారి విద్యాభ్యాసం మరియు ఇతర అవసరాల కోసం నేను బాధ్యత వహిస్తాను అని విష్ణు హామీ ఇచ్చారు.
View More
Latest News
09 May 2025 09:14 AM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044దర్శి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా కపురంకు ఘన సన్మానం
ఈరోజు, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని దరిశిలోని స్థానిక తహశిల్దారు కార్యాలయ ప్రాంగణంలో, తహశిల్దార్ శ్రావణ్ కుమార్ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహశిల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లడుతూ దరిశి ఏరియాలో ఐఆర్సీయస్ తరుపున మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ తరుఫున అనేక కార్యక్రమాలు నిస్వార్ధంగా నిర్వహిస్తున్న కపురం శ్రీనివాసరెడ్డిని ఈరోజు ఘనంగా సన్మానించడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దరిశి మండల గౌరవాధ్యక్షుడనైన నేను చాలా గర్వించదగిన విషయమని కపురం శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో డీటీ వెంకట్,ఆరై శ్రీనివాసులు, వీ ఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 05:24 AM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే
బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
View More
Local Updates
08 May 2025 09:43 AM


No.1 Short News
Newsreadవలి బాష కుటుంబానికి న్యాయం, రక్షణ ఏర్పాటు చేయాలి - ఫారుక్ షుబ్లీ
ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నందు వలిబాష కుటుంబాన్ని MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ పరామర్శించి మేమున్నాము అన్న భరోసా కల్పించారు.
4-5-2025న తెల్లవారుజామున నమాజుకు బయలుదేరిన వలి భాష అని క్రూరాతి క్రూరంగా నరికి చంపి వేసిన ఘటన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది అన్న సంగతి అందరికి తెలిసిందే.
షేక్ రెహనా మృతుడు వలిబాష భార్యమణి, షేక్ రుక్సాన మృతుడి చిన్న కూతురు, షేక్ ఫర్జానా పెద్ద కుమార్తె, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 5 సం||ల క్రితమే అనిల్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడని అదే పని అతను చెప్పిన 5 సం||ల తరువాత చేసాడని భోరున వినిపించారు. ఇప్పుడు మమ్మల్ని సైతం చంపుతారని స్పష్టంగా బెదిరిస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పూర్తిగా అండగా ఉండాలని రక్షణ కల్పించాలని అలాగే ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కుటుంబానికి ఏది జరిగిన పూర్తిగా పోలీసులదే బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక సగటు తండ్రి ఆవేదన అర్థం చేసుకొని ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినాది కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని అదే విధంగా ఆ రోజు తెల్లవారి జామున వలి భాషా సందులో కరెంటు తీసివేయటంలో ఆంతర్యం ఏమిటి? ఈ హత్య వెనకాల అనిల్ ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే మృతుడి ఆత్మ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించటం జరిగింది.
అలాగే స్థానిక మంత్రి జనసేన నాయకులు కందుల దుర్గేష్ Kandula Durgesh గారు ఇప్పటి వరకు మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న గౌరవ రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు వారి కార్యాలయం నుండి మృతుడి కుటుంబానికి అందుబాటులోకి రావడం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేయడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
View More
Latest News
07 May 2025 16:51 PM


No.1 Short News
Newsreadకదిరి కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లాబకష్.
ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, కదిరి నియోజకవర్గానికి సంబంధించిన పట్టణ మరియు మండల అధ్యక్షులు నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు షేక్ అల్లాబకష్ తనకి అవకాశం కల్పించి రాష్ట్ర అధ్యక్షురాలు ys షర్మిల రెడ్డి కి, CWC సభ్యులు రఘువీర రెడ్డి కి, కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ KS షానవాజ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలియజేశారు.
View More
Latest News
05 May 2025 15:31 PM


No.1 Short News
Newsreadన్యూస్ రీడ్: జన్మదిన శుభాకాంక్షలు
దర్శి ప్రజల ఆశా దీపం, ఎందరో యువతులకు ఆదర్శం, కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం కి మారుపేరు, దర్శి కి మార్గదర్శి, దర్శి నియోజకవక వర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి మాతృమూర్తి కి న్యూస్ రీడ్ యాప్ యాజమాన్యం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
View More
Local Updates
05 May 2025 12:04 PM


No.1 Short News
Sk.Asma Reporter 9948680044ముళ్ళ పొదల్లో దొరికిన అమ్మాయి, IAS కావడమే లక్ష్యం గా...
పూజా ఈమాన్:
2008లో తిరుపతి సమీపంలోని రేణిగుంటలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి ముళ్లపొదల్లో పడేయగా, స్థానికులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాపను, సమీపంలో ఉన్న తల్లిని మైలవరంలోని రాజా ఫౌండేషన్కు తీసుకెళ్లారు.. ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు రాజారెడ్డి, అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమాన్ అని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు రాజారెడ్డి ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ అదే స్కూల్లో పూజా చదువుకుంది. పదో తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ (హెచ్పీజీ)లో చేరింది.. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది, ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది.. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సర్ నన్ను పెంచారు. నేను కలెక్టర్ కావాలనేది ఆయన కల, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా. పేదలకు, ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయం అని పూజా ఈమాన్ తెలిపింది.
View More
Motivation
05 May 2025 06:55 AM


No.1 Short News
NewsreadRTC బస్సుల్లో phone pay ఫెయిల్, ఇబ్బంది పడ్డ మహిళలు.
విజయవాడ నుంచి మేదరమెట్ల వెళ్లేందుకు ముగ్గురు మహిళలు టికెట్ తీసుకుని, కండక్టర్ కి ఫోన్ పే చేయగా అమౌంట్ పే అయింది. టికెట్ రాలేదు, మళ్ళీ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పగా వారిలో ఒక అమ్మాయి వాగ్విదాం పెట్టుకోగా సదరు కండక్టర్ మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చేస్తా, ప్రస్తుతం మీ అమౌంట్ నేను ఇస్తాను అని మానవతా దృక్పథం చేయించటం . అయితే RTC తరపున ఏ తప్పిదం జరగలేదని కేవలం కండక్టర్, ఆ మహిళల మధ్య అవగాహన లోపం వల్లనే టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందినే ప్రయాణీకులు గుర్తించారు.
View More
Breaking News
04 May 2025 18:57 PM


No.1 Short News
Newsreadదర్శి: ఇంతమంది నాయకుల్లో మీడియా కు శుభాకాంక్షలు తెలిపిన రియల్ లీడర్
దర్శి లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, చరిత్ర కలిగిన వారుకూడా ఉన్నారు, ఆ రాజకీయ నాయకుల్లో ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినం అని గుర్తించి, మీడియా యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఈరోజు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఏకైక రియల్ లీడర్ కాంగ్రెస్ యువ నాయకుడు కైపు కృష్ణారెడ్డి. నాయకులలో మంచి మనసు ఉండాలి, అది కైపు కృష్ణారెడ్డి కి ఉంది అని చెప్పుకోవచ్చు.
View More
Local Ads
03 May 2025 21:37 PM


No.1 Short News
Newsreadఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉండ తీవ్రంగా ఉండగా... సాయంత్రానికి చల్లబడింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
View More
Latest News
03 May 2025 19:25 PM
You are offline
Please check your internet connection.
Close