ఎమ్మెల్యేతో పెళ్లి వార్తలు.. యాంకర్ ప్రదీప్ ఏమన్నారంటే?
ఓ ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు స్పందించారు. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అన్నారని, త్వరలో క్రికెటర్తో మ్యారేజ్ అంటారేమోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ప్లాన్ లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' మూవీ ఈ నెల 11న విడుదల కానుంది.
ఢీ డ్యాన్సర్ నన్ను వాడుకొని మోసం చేసాడు అని యువతి ఆత్మహత్య యత్నం
ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ
తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య కళ్యాణి
పోలీసుల అదుపులో నిందితుడు
తమిళ దర్శకులలో 'బాల' స్థానం ప్రత్యేకం. మొదటి నుంచి కూడా ఆయన ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయి. ఆయన కథల్లోని నాయకులు కూడా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందనగానే ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి ఆయన నుంచి వచ్చిన సినిమానే 'వనంగాన్'. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా, జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రిధా .. రోషిణి ప్రకాశ్ .. సముద్రఖని కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. బీ స్టూడియోస్ - వీ హౌస్ బ్యానర్లలో ఈ సినిమాను నిర్మించారు. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, కేవలం 13 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి అడుగుపెట్టింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా... అందరు అగ్ర హీరోల సరసన నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోల ద్వారా సందడి చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ షోలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఆమె బుల్లి తెరకు దూరమయ్యారు. మంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా కొన్ని రోజుల పాటు కనిపించలేదు. తాజాగా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె రెడీ అయ్యారు. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్-4లో హోస్ట్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో డ్యాన్స్ తో రోజా అలరించారు. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఈ షోలో జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. మార్చి 2న సాయంత్రం 6 గంటలకు ఈ షో మొదలుకానుంది.
రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు.
ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన
రాజ్ తరుణ్ భార్య అని చెప్పుకుంటున్న లావణ్య... మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందించిన సంగతి తెలిసిందే. ఆ హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఆమె మాట్లాడుతూ... హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు కూడా అందులో ఉన్నాయని తెలిపింది. ఈ విషయం సంచలనంగా మారింది.
ఈ అంశంపై నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవి 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అని తెలిపారు. వీడియోలో ఉన్నది తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. వాస్తవం ఏమిటనేది పోలీసులకు కూడా తెలుసని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాకు మరిన్ని చిక్కులు.. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని శేఖర్ బాషా ఆరోపించాడు. ఈ క్రమంలో శేఖర్ బాషాపై లావణ్య కేసు పెట్టింది. ఓవైపు ఇది జరుగుతుండగానే... బాషాపై మరో కేసు నమోదయింది.శేఖర్ బాషాపై మహిళా అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కూడా శ్రేష్టి వర్మ కావడం గమనార్హం.
మలయాళ కథలకు సినిమాల వైపు నుంచి ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీవైపు నుంచి మలయాళ సిరీస్ లకు అంతే డిమాండ్ ఉంది. అందువలన మలయాళ కంటెంట్ వివిధ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న వెబ్ సిరీస్ గా 'లవ్ అండర్ కన్ స్ట్రక్షన్' కనిపిస్తోంది.
పిఠాపురంలో మోడల్ అంగన్వాడీలను ప్రారంభించిన అపోలో ఫౌండేషన్
అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అపోలో ఫౌండేషన్ తాజాగా ఏపీలోని పిఠాపురంలో మోడల్ అంగన్వాడీలను ప్రారంభించింది. తద్వారా అపోలో ఫౌండేషన్ సమాజ సంక్షేమంలో ఒక గొప్ప అడుగు వేసింది.
ఇక అపోలో ఫౌండేషన్ ఈ మోడల్ అంగన్వాడీల ద్వారా తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, చిన్ననాటి సంరక్షణలో మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో హాస్పిటల్స్ చొరవ పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పిఠాపురం అభివృద్ధిలో ముందుకెళ్తోందని వారు చెబుతున్నారు.
6 కోట్ల బడ్జెట్ .. 75 కోట్ల వసూళ్లు: మలయాళ మూవీ రికార్డ్!
థియేటర్లలోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 25 రోజులలో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సిద్ధిఖీ .. జగదీశ్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో, మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం.
తండెల్ సినిమా టికెట్ పెంపు పై ఆంద్రప్రదేశ్ లో క్లారిటీ
తండేల్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ
సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం
కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్... అదిరిపోయిందిగా!
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. 'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఫుట్బాల్ తో స్టెండ్స్ చేసే కేరళకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఓ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి పర్ఫెక్ట్ గా రాళ్ల మధ్యలోకి వెళ్లేలాగా తన్నాడు. ఈరియల్ను ఆయన ఇన్స్టాల్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది ఈ రీల్ కు ఏకంగా 554 మిలియన్ల 55.4 కోట్ల వ్యూస్ రాగా 84 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.