DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దేశానికి సేవ చేయాలని, సాంకేతికత ద్వారా ప్రపంచానికి తోడ్పడాలని కలలు కనే యువతకు గుడ్ న్యూస్. గ్వాలియర్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDE) కింద పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
అర్హత:
ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ M.Sc డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి CSIR-UGC NET JRF లేదా NET పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
గరిష్ఠంగా 28 సంవత్సరాలు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
స్టైఫండ్: నెలకు రూ. 37,000
ఆన్లైన్లో దరఖాస్తుకు
అధికారిక వెబ్సైట్ drdo.gov.in ని సందర్శించండి.
• Tallur (M) తాళ్లూరులో ప్రశాంతంగా ముగిసిన 10th క్లాస్ పరీక్షలు
తాళ్లూరు మండలంలో 10th పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు MEO సుబ్బయ్య తెలిపారు. 820 మంది విద్యార్థులకు గాను.. 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో మండలంలోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశామన్నారు.
జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్ తరగతులు ఈ ఏడాది 2 నెలల ముందే ప్రారంభమయ్యాయి.
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప
మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
పాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు
ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే హాల్ టికెట్లను పంపింది. దీంతో వారు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇలాంటి విధానం అమల్లోకి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇటీవల ఇంటర్ విద్యార్థులు కూడా ఇలాగే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. ఈ విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సాయంతో ఎవరికి వారు నేరుగా తమ హాల్ టికెట్లను తీసుకుంటున్నారు.
చీరాల : ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోనే విదంగా కృషి చేస్తామని చీరాల ఆర్కే ఓరియన్టల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అనీల్ కుమార్ అన్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల చేత ప్రాజెక్టులను తయారు చేయించటం అభినందనీయ మన్నారు. అనంతరం కదలికలు దాని పనితీరు అనే అంశంపై ఆరవతగతి విద్యార్థిని పట్టెం షారోన్ గ్లోరియ చక్కగా వివరించారు. రామన్ ఎఫెక్టును కనుగొన్న సర్ సివి రమన్ పుట్టినరోజు ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొనడం జరుగుతున్నదని షారోన్ గ్లోరియస్ తెలిపారు. అనంతరం ప్రాజెక్టులను తయారు చేయడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సైన్స్ ఉపాధ్యాయని టి జీవన జ్యోతి, ప్రియాంకా, రజనీ, రాణీ, బషీర్ పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కు మరో 216 కోట్లు.. మూడు రోజుల్లో విడుదల: లోకేష్
ఫీజు రీయింబర్స్మెంట్ తొలి విడతలో 788 కోట్లకు గాను 571 కోట్లు నిధులు విడుదల.
రెండు, మూడు రోజుల్లోనే 216 కోట్లు విడుదల.
డిగ్రీ కాలేజీలకు 5 ఏళ్లకు ఓసారి అఫిలియేషన్ జారీ.
ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు గడువు 10 ఏళ్లకు పెంపు.
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తున్నది.