డా తాడివలస దేవరాజుకు కృతి ఫౌండేషన్ వారు అవార్డు అందజేశారు
కృతి ఫౌండేషన్ అధినేత శ్రీమతి అశ్విని ఆధ్వర్యంలో కృతి పౌండేషన్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ నందు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు . ముఖ్య అతిధులుగా టీడీపీ యువ నాయకులు మద్దలూరి అమర్నాథ్, జమ్మలమడక నాగ మణి,జేడీ డాక్టర్ బాబీ రాణి, చిన్న గంజాం యం.ర్ .ఓ జె.ప్రభాకర రావు, సి ఐ సూరేపల్లి సుబ్బా రావు , మెరైన్ సి ఐ సింగిరీసు సాంబ శివ రావు. డాక్టర్ అమృతపాణి ,గౌరవ అధ్యక్షులు ఆకురాతి వెంకట వరప్రసాద్ రావు పాల్గొన్నారు . వైద్య , సామాజిక , ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తాడివలస దేవరాజు కు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం జాతీయ సేవ రత్నా అవార్డు తో సత్కరించారు.
ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ ఐదు సంవత్సరాలుగా చేస్తున్న సేవలను కొనియాడి, చీరాలలో జరుగు సేవా కార్యక్రమాలకి కృతి ఫౌండేషన్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చీరాల లో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ సభ్యులు , ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల లోనే వివిధ సేవా రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకు అవార్డు అందచే,సి వారి సేవలను తెలియజేశారు
బీర్కూర్ మండల బీజేపీ యువ నాయకుడు వడ్ల బస్వరాజ్ గారితో న్యూస్ రీడ్ ముఖాముఖి
బీర్కూర్ మండల యువనాయకుడు వడ్ల బస్వరాజ్ గారితో న్యూస్ రీడ్ ఇంటర్వ్యూ నిర్వహించింది ,రాజకీయ భవిష్యత్ గురించి , రాజకీయ సమీకరణాలు కార్యాచరణ పద్ధతి గురించి న్యూస్ రీడ్ రిపోర్టర్ తో షేర్ చేసుకున్నారు పైన ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి .
న్యూస్ రీడ్ ఆప్ లో మీ వ్యాపార రాజకీయ ఇంటర్వ్యూలకోసం వెంటనే కాల్ చేయండి , ఫోన్ : 8125023601 .
న్యూస్ రీడ్ ఆప్ ని ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
అనారోగ్యంతో బాధపడుతున్న BRS నాయకుడికి 10 లక్షలు ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం చేసిన కేసీఆర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు విషయం తెలుసుకొని తన నివాసానికి పిలుచుకొని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును స్వయంగా అందజేసిన కేసీఆర్
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డు గ్రహిత బి ఆర్ అంబేద్కర్
*ఉత్తమ జిల్లా ఎన్నికల అధిక
విజయనగరం, జనవరి 25:
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విజయవాడలో శనివారం అవార్డు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, 5వ బెటాలియన్ కమాండెంట్ మలికా గార్గ్ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అవార్డులు స్వీకరించారు.