Newsread Image

No.1 Short News

Shaida Reporter
సాదిక్ సాప్ట్ స్కిల్స్ లో జర్నలిజం పూర్తి చేసిన వారికి మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేత
ఈ రోజు సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ ఒంగోలు వారిచే, ఆంధ్రరాష్ట్ర (JAY) జర్నలిస్ట్ అసోషియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ పర్యవేక్షణలో,రాష్ట్ర పరిధిలో జర్నలిజంలో డిప్లమో కోర్స్ చేసినవారికి రాష్ట్ర మైనార్టీ మరియూ న్యాయశాఖా మంత్రి NMD ఫరూక్ గారిచే ధృవపత్రాలు విజయవాడలోని మంత్రి నివాసంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల యూట్యూబ్ ఛానెల్ ఓనర్స్, MHPS విజయవాడ సభ్యులు,కపురం శ్రీనివాసరెడ్డి, బాదం శ్రీనివాసరెడ్డి, సాదిక్ సాఫ్టు స్కిల్స్ ట్రైనర్ అస్మా, శైదా, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
21 Feb 2025 17:12 PM
0
3
Newsread Image

No.1 Short News

Shaida Reporter
భద్రాదిలో అవినీతి తిమింగలాలు..?
నిన్న మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు.. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారి.. భద్రాద్రి జిల్లా ఆశ్వాపురంలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్‌కుమార్.
View More
Latest News
20 Feb 2025 21:29 PM
1
8
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
ఆర్థిక సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ డ్యూటీ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ యువకుని పట్ల దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. చందలూరు గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జగన్ గార్డెన్ అనే వ్యక్తి నిన్న దర్శి నుంచి చందలూరు వెళ్తున్నాను అని చెప్పి చందలూరు కి వెళ్ళకుండా ఎటో వెళ్లిపోయాడు. ఈ విషయం పట్ల అతని పెదనాన్న దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
View More
Latest News
20 Feb 2025 19:51 PM
0
9
Newsread Image

No.1 Short News

Newsread
300 కేజీలు.. రూ.కోటి 5 లక్షలు విలువ చేసే గంజాయి సీజ్..
అంతరాష్ట్ర డ్రగ్ పెడలర్ ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.అరకు నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తుండగా పట్టుకున్న SOT పోలీసులు ట్రక్ డ్రైవర్ అహ్మద్ షేక్ ను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడి
View More
Latest News
20 Feb 2025 16:47 PM
0
10
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఛాంపియన్స్ ట్రోఫీ 2025... ఈరోజు బంగ్లాతో తలపడే టీమిండియా జట్టు ఇదేనా?
బంగ్లాదేశ్ తో జరిగే భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
View More
Sports News
20 Feb 2025 15:44 PM
0
9
Newsread Image

No.1 Short News

Shaida Reporter
నేడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. జిల్లాలోని పాలకొండలో ఇటీవల వైసీపీ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండ వెళ్లనున్నారు. ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు జగన్ వెళ్లనున్నారు.
View More
Latest News
20 Feb 2025 10:53 AM
0
11

No.1 Short News

Newsread
విజయవాడ సెంట్రల్ లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తూ ఇమామ్, మౌజమ్ల గౌరవవేతనాల కోసం రూ.45 కోట్లు విడుదల చేసి, మసీదుల్లో పనిచేస్తున్న 5 వేల మందికి 6 నెలల గౌరవ వేతనం అందించునున్న సందర్బంగా.. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాలాభిషేకం చేశారు.రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, 59వ డివిజన్ ఇంచార్జ్ షేక్ జాన్వలి, 59 డివిజన్ అభ్యర్థి షేక్ పర్వీన్.
View More
Latest News
19 Feb 2025 23:18 PM
9
20
Newsread Image

No.1 Short News

Newsread
హైబ్రీడ్ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడికి హర్యానా గవర్నర్ ఫోన్
తెలంగాణ: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన 14 ఏళ్ల గగన్ చంద్రను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సౌరశక్తి,బ్యాటరీ,పెట్రోల్‌తో నడపగల హైబ్రిడ్ త్రీ-ఇన్-వన్ సైకిల్‌ను రూపొందించి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు పొందడంపై ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
View More
Latest News
19 Feb 2025 22:38 PM
1
34

No.1 Short News

Newsread
నవోదయ 2.0 నాటు సారా నిర్మూలన అవగాహన సదస్సులో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
ఈ కార్య్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ నాటు సారా తయారీకి స్వస్తి పలికి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు నాటు సారా తయారీదారుల్లో పరివర్తన వస్తే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని గౌరవంగా బతకాలని సూచించారు. నాటు సారా తయారీ మానుకొని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. కల్తీ నాటు సారా తయారు చేయడం వల్ల పేద ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
View More
Latest News
19 Feb 2025 21:07 PM
3
23
Newsread Image

No.1 Short News

Newsread
Anger | విప‌రీత‌మైన కోపం వ‌స్తుందా..? ఈ చిట్కాల‌ను పాటిస్తే శాంత‌మూర్తులు అవుతారు..!
కోపం అనేది మ‌న‌కు క‌లిగే భావోద్వేగాల్లో ఒక‌టి. కోపం వ‌స్తే ఒక్కొక్క‌రు ఒక్కోలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కొంద‌రికి క్ష‌ణంలోనే ప‌ట్ట‌రానంత కోపం వ‌స్తుంది. దీంతో త‌మ ఎదురుగా ఏ వ‌స్తువు ఉంటే దాన్ని విసిరేస్తారు. ఇంకొంద‌రు కోపం వ‌స్తే త‌ల‌ను దేనికైనా బాదుకుంటారు. కొంద‌రు పెద్ద పెద్ద‌గా అరుస్తారు. ఇంకా కొంద‌రు ప‌చ్చి బూతులు మాట్లాడుతారు. ఇవ‌న్నీ చాలా మంది కోపాన్ని వ్య‌క్త ప‌రిచేందుకు చేసే ప‌నులు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల కోపం మ‌రింత పెరుగుతుందే కానీ త‌గ్గ‌దు. ప‌ట్ట‌రానంత కోపం వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాఢంగా శ్వాస తీసుకోండి. గాలిని బాగా లోప‌లికి పీల్చి బ‌య‌ట‌కు వ‌ద‌లండి. నెమ్మ‌దిగా ఇలా చేయండి. దీంతో నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌భావం చూపిస్తుంది. కోపాన్ని త‌గ్గిస్తుంది.
View More
Latest News
19 Feb 2025 18:59 PM
2
23
Newsread Image

No.1 Short News

Newsread
అందాన్ని కాపాడుకుందాం
వేసవి మొదలైంది. మండే ఎండ.. ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. చర్మానికి, జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే, అందాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనీ, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలని అంటున్నారు బ్యుటీషియన్లు.వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా.. చర్మం, జుట్టు నిర్జీవంగా మారుతాయి. పొడి చర్మం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపుతుంది. జుట్టుకూ మేలుచేస్తుంది.
View More
Latest News
19 Feb 2025 18:55 PM
1
16

No.1 Short News

Newsread
ఉన్నత విద్య పట్ల సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని రాష్ట్ర విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
View More
Latest News
19 Feb 2025 17:06 PM
2
24
Newsread Image

No.1 Short News

Newsread
కడప MHPS ఆధ్వర్యంలో థాంక్యు సీఎం కార్యక్రమం నిర్వహణ
ఇమాములకు మౌజన్లకు గౌరవ వేతనాలు ఆరు నెలలకు చెల్లించాలని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమానికి పెట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా మైనార్టీల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ కడపలో థాంక్యూ సీఎం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
View More
Latest News
19 Feb 2025 16:34 PM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ఉన్నత విద్యలో నేడు కొత్త అధ్యాయం.
ప్రతిభ ఆధారంగా వర్సిటీలకు వీసీలను నియమించాం- చంద్రబాబు.గత ఐదేళ్లు వీసీల నియామక ప్రక్రియను రాజకీయాలు, లాబీయింగ్‌తో భ్రష్టుపట్టించారు.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం : 'ఎక్స్‌'లో :సీఎం చంద్రబాబు.
View More
Latest News
19 Feb 2025 16:01 PM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.
View More
Latest News
19 Feb 2025 15:25 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
తానంచింతల టీడీపీ నాయకులు హాస్పిటల్ లో ఉండగా పరామర్శించిన కడియాల లలిత్ సాగర్
నరసరావుపేటలో దర్శి మండలం, తానంచింతల గ్రామానికి చెందిన టీడీపి నాయకులు సత్యం సోదరుడు కొమిరిశెట్టి కోటేశ్వరరావు యాక్సిడెంట్ గురై నరసరావుపేటలోని నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉండగా వారిని పరామర్శించిన టీడీపి యువనాయకులు డా//కడియాల లలిత్ సాగర్ గారు. వారితో పాటు క్లస్టర యన్.అంకయ్య, మండల టిడిపి నాయకులు సానే సుబ్బయ్య,సానే గణపతి, కొమిరిసెట్టి సుబ్బు తదితరులు ఉన్నారు.
View More
Latest News
19 Feb 2025 15:02 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
భరతమాతను మొగల్ సంకెళ్ళ నుంచి విడిపించిన యోధుడు శివాజీ - తిండి నారాయణ రెడ్డి
ఈరోజు దర్శి లో పొదిలి రోడ్ లోని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ భరతమాతను మొగలుల సంకెళ్ల నుండి విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మేరునగ ధీరుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అమరేశ్వర రావు చెరుకూరి అనిల్ కుమార్ అడుసుమల్లి సాంబయ్య తిండి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
View More
Breaking News
19 Feb 2025 14:31 PM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ బిల్లుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు నిరాశను మిగిల్చిన రేవంత్ సర్కార్ ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు రూ.1000 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని, మిగతావి సంక్షేమ పథకాలకు వాడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు దీంతో ఇప్పట్లో బిల్లులు రావని తెలిసి తీవ్ర ఆవేదనలో ప్రభుత్వ ఉద్యోగులు
View More
Local Updates
19 Feb 2025 11:39 AM
0
19
Newsread Image

No.1 Short News

Ai With SAi
నేడు తెలంగాణ భవన్ కు బిఅరెస్ అధినేత కేసీఆర్
నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 2:00 కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం అన్ని జిల్లాల నుండి ఈ సమావేశానికి 400 మంది పార్టీ కీలక నేతలకు ఆహ్వానం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్ లను ఆహ్వానం ఈ భేటీలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ చర్చ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపై పోరాటం పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్ గా ప్రభుత్వం పెడుతున్న కేసులపై పోరాటం వివిధ కీలక అంశాలపై భవిష్యత్తు పార్టీ నిర్ణయంపై కేసీఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు
View More
Local Updates
19 Feb 2025 11:39 AM
0
20
Newsread Image

No.1 Short News

Ai With SAi
సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఓవరాక్షన్
బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ ఓవర్ యాక్షన్! టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ ముసేయించిన సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల - బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ వ్యక్తిద KTR టీ స్టాల్ అని పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్నాడు ఇవ్వాళ్ళ ఉదయం బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టీ స్టాల్ వద్ద మీ ఫోటో చూసి ఆగ్రహించిన కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా, హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయం అని ప్రశ్నించగా మాకు అవన్నీ తెల్వదు కలెక్టర్ హోటల్ బంద్ చేయించమని చెప్పాడని మున్సిపల్ అధికారులు చెప్పారు
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
20
Newsread Image

No.1 Short News

Ai With SAi
సచివాలయంలో కూడా నాసిరకం బోజనమే
గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు. అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
19
Newsread Image

No.1 Short News

Ai With SAi
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి, రూ.2.82 లక్షలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ 3 సార్లు వచ్చి వెళ్ళిన దుండగుడు నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు. అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.
View More
Local Updates
19 Feb 2025 10:28 AM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
చంటిబిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు జనం తోసుకుంటూ పరుగులు తీస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను పెంచారు.ఈ సందర్భంలో,సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది,ఇందులో RPF మహిళా కానిస్టేబుల్ ఒకరు చంటిబిడ్డను ఎత్తుకొని,మరో చేత్తో లాఠీని పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
1
23
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డి
ఈరోజు తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
0
20
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ
ఇమామ్ & మౌజ్జన్ల గౌరవ వేతనాలు 6నెలలకు చెల్లించాలని ఆదేశించి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, NMD ఫరూక్ కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇమామ్ & మౌజ్జన్లకు వారి కష్టాలను గమనించి మొట్టమొదటి సారి గౌరవ వేతనం తీసుకువచ్చి ఆదుకున్న నాయకులు చరిత్ర పుటలలో చిరస్థాయిగా ఉండే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
View More
Latest News
18 Feb 2025 19:40 PM
2
33
Newsread Image

No.1 Short News

Ai With SAi
తెలంగాణ సీఎం రేవంత్ హాట్ వ్యాఖ్యలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన సీఎం వ్యాఖ్యలు కొందరు IAS, IPSలతో చెడ్డపేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నారని ఫీల్డ్ విజిట్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలుజరిచేశారని కొందరు అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తుండటం తో ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్లపై చర్యలకు అవకాశం ఉందని ఎన్నికల కోడ్ ముగిశాక భారీగా ప్రక్షాళన ఉండే ఛాన్స్ CM వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో పెద్దఎత్తున చర్చమొదలైంది
View More
Politics
18 Feb 2025 19:39 PM
0
17
Newsread Image

No.1 Short News

Ai With SAi
మధు యాష్కీ తో చిట్ చాట్
హైదరాబాద్‌: మీడియాతో మధుయాష్కీ చిట్‌చాట్‌ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది కులమేంటని అడగడమే రాజ్యాంగానికి వ్యతిరేకం పాతబస్తీలో మతకలహాలకు బీజేపీనే కారణం బీసీ కులగణనపై బీజేపీ నోరు మెదపడం లేదు డైవర్ట్ చేయడానికే కుల ప్రస్తావన తెచ్చారు-మధుయాష్కీ
View More
Politics
18 Feb 2025 19:38 PM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో జీబీస్ కలకలం.. 59 కేసులు నమోదు???
విశాఖపట్నం కేజీహెచ్లో ఒక మహిళ మృతి ఏపీలో జీబీస్ వైరస్ కారణంగా విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళలు మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
View More
Breaking News
17 Feb 2025 19:52 PM
0
31
Newsread Image

No.1 Short News

Shaida Reporter
పెరుగుతున్న జీబీఎస్ కేసులు... కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళను పెంచుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా... ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని... ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 19:50 PM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటనలు
మత్స్యకారులకు ఏప్రిల్ నుంచి రూ.20 వేల ఆర్థిక సాయం. మే నెలలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం. జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు తల్లికి వందనం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్
View More
Latest News
17 Feb 2025 17:30 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ ఆస్తుల రక్షణకై ముస్లింల ర్యాలీ
రాష్ట్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ సమి హుస్సేని, ముస్లిం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్కు, మంత్రి నారాయణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వక్స్ ఆస్తులను దోచుకోవాలని కుట్ర చేస్తోందని, ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీయడానికే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ వక్స్ ఆస్తుల రక్షణకై ముస్లిం మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రియులు రోడ్డుపై వస్తారని హెచ్చరించారు.
View More
Breaking News
17 Feb 2025 17:20 PM
0
28
Newsread Image

No.1 Short News

Siva Reporter
శ్రీరామ్ చిట్స్
మీ వ్యాపార అభివృద్ధికై బిజినెస్ లోన్ , హోమ్ లోన్స్ , పర్సనల్ లోన్స్ , ఇవ్వబడును. శ్రీరామ్ డిపాజిట్ : బ్యాంక్స్ , పోస్ట్ ఆఫీస్ కన్నా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు. call: 9989157566
View More
Local Ads
17 Feb 2025 17:07 PM
0
24
Newsread Image

No.1 Short News

Shaida Reporter
నేటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్
కొత్త ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. తక్కువ బ్యాలెన్స్, పేమెంట్ ఆలస్యం లేదా ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లోని సమస్యల కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల లాంగ్ క్యూలను తగ్గించడమే దీనిఉద్దేశ్యం. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వాహనం టోల్ దాటడానికి ముందు 60 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేదా టోల్ దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే.. ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి చెల్లింపులు 176 ఎర్రర్ కోడ్‌తో రిజెక్ట్ అవుతాయని గమనించాలి.
View More
Latest News
17 Feb 2025 13:12 PM
1
23
Newsread Image

No.1 Short News

Siva Reporter
ఎర్ర ఓబునపల్లిలో చిన్నారులను ఆశీర్వదించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పొట్లపాడు యోగయ్య స్వామి వద్ద దర్శి మండలం ఎర్రఓబనపల్లి గ్రామానికి చెందిన బాదం నాగార్జున రెడ్డి కుమార్తె కుమారుల పుటెంట్రుకల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించటం జరిగింది
View More
Latest News
17 Feb 2025 13:04 PM
1
22
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా కడియాల లలిత్ సాగర్
గత రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు విశాఖపట్నం లో నిర్వహించిన టైమ్స్ లీడర్స్ ఆఫ్ హెల్త్ కేర్ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య రంగం లో గణనీయమైన కృషి చేసిన 50 మంది వైద్యులను గుర్తించి సత్కారంచడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర విమానాయ శాఖా మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 5 న్యూరాలజిస్ట్ గా అవార్డు అందుకున్న యువనాయకులు కడియాల లలిత్ సాగర్ . లలిత్ తో పాటుగా వారి సతీమణి దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ మరియు కుమారులు, కడియాల అక్షయ్ నంద, కడియాల అభయ్ వర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 12:16 PM
1
25
Newsread Image

No.1 Short News

Shaida Reporter
సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు 20 కుర్చీలు దానం చేసిన చింతా తిరుపతిరెడ్డి
దర్శి లోని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చిన అనంతరం దాత చింతా తిరుపతిరెడ్డి 20 కుర్చీలను విద్యాసంస్థలకు బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
View More
Latest News
16 Feb 2025 17:56 PM
0
32
Newsread Image

No.1 Short News

Shaida Reporter
గురుకుల పాఠశాల లో పరీక్షలు మెలకువలు అనే అంశం పై చైతన్య సదస్సు
పరీక్షలు సమీపిస్తుండటంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు మెలకువలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు హెచ్ఎం బసవయ్య చింత తిరుపతిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులందరూ మానసిక శారీరకద్రత్వాన్ని కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతులుగా ఉండి ఏకాగ్రతతో కూడిన విగ్రహ శక్తి ఉంటేనే పరీక్షలలో రాణించగలరని ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
View More
Latest News
16 Feb 2025 17:48 PM
0
31
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కడపలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు
శాంతి రామ్ ఐ హాస్పిటల్ కర్నూల్ వారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప లో షాహీ పేట్ గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 వరకు ఐ క్యాంపు ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సలహాదారులు Nazar Basha Shaik Abdul కి, కార్యదర్శి Iftekhar Jamal Syed కి, మహిళా విభాగానికి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ అభినందనలు తెలియచేశారు.
View More
Latest News
16 Feb 2025 14:36 PM
1
34
Newsread Image

No.1 Short News

Shaida Reporter
హృదయ విదారక ఘటన
ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు,అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు, అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించిన సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ.. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష తల్లిని వడిలో పడుకోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళ.
View More
Latest News
16 Feb 2025 14:32 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్ లేటైతే డబుల్ ఛార్జ్
FEB 17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాగ్లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60నిముషాలు కంటే ఎక్కువ టైం FASTag ఇనాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ఫ్ర్యాక్టివ్లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
View More
Latest News
15 Feb 2025 21:23 PM
0
36
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దర్శి లో ఒక్క ఫోన్ కాల్ తో మీ బైక్ రిపేర్..
దర్శి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా మీ బైక్ ఏదైనా రిపేర్ చేత ఆగిపోతే తనకి కాల్ చేస్తే వెంటనే తాను వచ్చి రిపేర్ చేసి బండిని యధాస్థితికి తీసుకొస్తానని ఈ సర్వీస్ దర్శి నుంచి నలువైపులా 10 కిలోమీటర్ల వరకు మాత్రమే అందిస్తానని ఒక యువ మెకానిక్ పండు తెలియజేశారు. ఈ సర్వీస్ కోసం సంప్రదించవలసిన నెంబరు: 8142447010.
View More
Local Ads
15 Feb 2025 16:26 PM
4
38
Newsread Image

No.1 Short News

Newsread
యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భ‌క్తుల‌తో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది భ‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మేజా స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
View More
Latest News
15 Feb 2025 12:17 PM
0
31
Newsread Image

No.1 Short News

Newsread
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాలో స్త్రీ, పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేయబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల ఎంట్రీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
View More
Latest News
15 Feb 2025 12:14 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ ట్వీట్ ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది: నిమ్మల రామానాయుడు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు. మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని... వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు.
View More
Latest News
15 Feb 2025 12:03 PM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోలలో ఫొటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత విద్యార్థులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీ, కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీకి చెందినవారు. వీరు 2024లో ఇంటర్ పాస్ అయ్యారు.
View More
Latest News
15 Feb 2025 12:01 PM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
తదుపరి సీఈసీ ఎంపికకు పీఎం మోదీ నేతృత్వంలో 17న ఉన్నత స్థాయి కమిటీ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.
View More
Latest News
15 Feb 2025 11:59 AM
0
27
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దర్శి లో దామోదర సంజీవయ్య జయంతి ఘనంగా నిర్వహణ
ఈరోజు దామోదర సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా స్థానిక తహశీల్దారు కార్యాలయంలో DT V వెంకటేశ్వర్లు,కపురం శ్రీనివాసరెడ్డి ఇరువురు కలసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా,రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా 2సార్లు AICC అధ్యక్షునిగా,సంయుక్త మద్రాసు,ఆంధ్ర రాష్ట్రాల లో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,కేంద్రంలొ అనేక సార్లు మంత్రిగాజేశారు.AICC తొలి దళిత అధ్యక్షుడిగా చేశారు.38 సంవత్సరాల చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కుతుందని IRCS ఎగ్జకూటివ్ మెంబరు,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
14 Feb 2025 15:37 PM
1
46
Newsread Image

No.1 Short News

మహతి న్యూస్
దర్శి ఎస్సై మురళిని సన్మానించిన శివరాజ్ నగర్ యువత
చీమకుర్తి ఫైరింగ్ రేంజ్ లో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో గురువారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో దర్శి ఎస్సై మురళి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ యువత తరపున శాలువాతో సన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీనాథ్, పుప్పాల సురేష్, ఇర్ల బాలకాశి, ఇట్ల ఆనంద్, కోల రమేష్, రామకృష్ణ, గంగాధర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
View More
స్థానిక నవీకరణలు
14 Feb 2025 15:19 PM
1
39
Newsread Image

No.1 Short News

Shaida Reporter
డిగ్రీ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రతిభ
నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల, దొనకొండ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. బీకాం కంప్యూటర్ విభాగంలో 700 మార్కులకు కళాశాల ప్రథమ స్థానంలో P. సుబ్బయ్య 567, రెండో స్థానంలో CH. సీమోను 546, మూడో స్థానంలో S. కాంతకుమారి 543 మార్కులు సాధించారు. బిఎ విభాగంలో 600 మార్కులకు Sk. నాజ్ 509, M. సానియా మీర్జా 464, N. సువర్ణ 432 మార్కులు సాధించారు. వీరిని గౌతమీ విద్యాసంస్థల చైర్మన్ కే.గుండారెడ్డి, సీఈవో నాగేంద్రబాబు,ప్రిన్సిపాల్ రామయోగి, అధ్యాపకులు అభినందించారు.
View More
Latest News
14 Feb 2025 14:44 PM
0
38
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఏపీలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఏపీ రాష్ట్రంలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. ఉ.10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మ.3 నుంచి సా.5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
View More
Latest News
14 Feb 2025 12:40 PM
0
32
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel