IND vs ENG: రెండో టెస్టుకు భారత జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్.. హైదరాబాద్ కుర్రాడు కూడా..!
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జులై 2 నుంచి ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకోసం భారత్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ బృందం కసరత్తు మొదలు పెట్టింది.
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటిన చీమకుర్తి క్రీడాకారులు
చీమకుర్తికి చెందిన కె. వంశీకృష్ణ, ఎం. త్రివిక్రమ్ ఆదివారం రాష్ట్రస్థాయి అండర్ 15 రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. రాజమండ్రిలో రెజ్లింగ్ శాంపియన్షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రెజ్లింగ్ కోచ్ ఉమామహేశ్వర రావు, తదితరులు అభినందించారు
ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్ (C), లివింగ్టన్, జితేశ్ శర్మ, బెథెల్/ టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్ వుడ్, సుయాశ్.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్కు దూరమయ్యారు. ఆయన స్థానంలో చేతన్ సకారియాను భర్తీ చేయనున్నారు. చేతను KKR రూ.75 లక్షలు చెల్లించనుంది. ఇప్పటివరకు 19 మ్యాచులు ఆడిన సకరియా 20 వికెట్లు తీశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025... ఈరోజు బంగ్లాతో తలపడే టీమిండియా జట్టు ఇదేనా?
బంగ్లాదేశ్ తో జరిగే భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.
అతడిని ఎక్కువ రోజులు సైలెంట్గా ఉంచలేరు.. రోహిత్పై సూర్య, పాండ్యా, యువీ ప్రశంసలు!
కటక్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 76 బంతుల్లో సెంచరీ బాదిన అతడు.. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
ఈ క్రమంలోనే అతనిపై తోటి ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు.
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వహణకు దాయాది దేశం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అదే స్టేడియంలో శుక్రవారం నాడు తమ జట్టు కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్ను కూడా నిర్వహించింది.
వరల్డ్ రికార్డు ముంగిట మహమ్మద్ షమీ.. మరో 5 వికెట్లు తీస్తే చాలు..!
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకున్న ఆతిథ్య భారత్ ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. రేపటి నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఇక ఈ సిరీస్లో టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.
అయితే, ఈ మ్యాచ్ కు ముందు షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ... నాగ్పూర్లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టగలిగితే, అతను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డును సమం చేస్తాడు.
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. ఈ ఐదు మ్యాచుల సిరీస్లో 14 వికెట్లు తీసిన అతడు.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డుకెక్కాడు. 33 ఏళ్ల భారత స్పిన్నర్ ఈ సిరీస్ చివరి గేమ్లో 25 పరుగులిచ్చి, 2 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు మ్యాచుల సిరీస్లో 14 వికెట్ల మార్క్ను అందుకున్నాడు.
రంజీల్లో కోహ్లీ... రోజుకు పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు!
అసలు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అతనికి రోజుకు రూ. 60 వేల పారితోషికం ఉంటుంది. అంటే... మ్యాచ్ జరిగే నాలుగు రోజులకు కలిపి రూ. 2.40 లక్షలు పారితోషికంగా లభిస్తుంది. కాగా, ఎవరైనా ప్లేయర్ రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60 వేలు జీతంగా అందుకుంటాడు.
నాగాయలంక: విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి
విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం నాగాయలంక మండలం తలగడదీవిలో కృష్ణాజిల్లా సెకండరీ స్కూల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 84వ గ్రీగ్ మెమోరియల్ అవనిగడ్డ సబ్జోన్ బాలుర ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరిగింది. ఉత్తమ ప్రతిభావంతులు కావడంతో పాటు క్రీడల్లోనూ జాతీయస్థాయికి ఎదగాలని కోరారు.