Select Location
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, సేకరించిన సంతకాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు.
View More
Latest News
15 Dec 2025 19:50 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
కోటి సంతకాల పత్రాల తరలింపులో భాగంగా ఒంగోలులో వైసీసీపీ ర్యాలీ
కోటి సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మణంద రెడ్డి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు , కె. నాగార్జున రెడ్డి ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి , కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
View More
Latest News
15 Dec 2025 18:42 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
డా. గొట్టిపాటి లక్ష్మీని కలిసిన గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి
నరసరావుపేట: నేడు నరసరావుపేటలోని డా. గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్ర ని శాలువాతో సత్కరించి, గ్రంథాలయం చైర్మన్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
View More
Latest News
15 Dec 2025 13:41 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
5 తరాలకు సలహాలు ఇస్తున్న శతాధిక వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ
దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గొంగటి వెంకట సుబ్బమ్మను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కొంతసేపు ముచ్చటించి, వారి దీర్ఘాయుష్షుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, సహజ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కూడా తనపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పట్టణ జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది రక్తసంబంధీకులతో, ఐదు తరాల మనవళ్లు–మునిమనవరాళ్లతో కలిసి జీవించడం దేవుడిచ్చిన వరమని, ఈ వయసులోనూ సరదాగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వెంకట సుబ్బమ్మ జీవన విధానం నేటి తరాలకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. పల్లె జీవన విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.
View More
Latest News
15 Dec 2025 11:26 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి టౌన్ లో రోడ్ సేఫ్టీ అవగాహన
దర్శి టౌన్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిఐ వై. రామారావు, ఎస్ఐ మురళి మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని షాపుల వద్ద, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశం ఇచ్చారు. షాపుల్లో హెల్మెట్ అవగాహన స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి సిఐ రామారావు స్వయంగా అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువ. అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రోడ్డు భద్రత పాటించాలి అన్నారు.
View More
Latest News
12 Dec 2025 19:38 PM
3
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజల కోసం పోరాడే నాయకత్వం. డా||లక్ష్మీ పట్టుదలకి ప్రభుత్వ స్పందన
దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి అనేది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లక్ష్యం. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పని చేసే అసలైన నాయకత్వం మళ్లీ నిరూపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు చివరకు శాశ్వత పరిష్కారం వచ్చింది. గ్రామాల మధ్య రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన డాక్టర్ లక్ష్మీ —ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు. పల్లె పండుగ 2.0 లో భాగంగా ప్రభుత్వం వెంటనే స్పందించి 10.17 కోట్ల రూపాయలతో 20.92 KM రోడ్లు దర్శికి మంజూరు చేసింది. ఆమోదం పొందిన ప్రధాన రహదారులు: 1️⃣ మారెళ్ల – నూజళ్లపల్లి – బట్లపల్లి : ₹4.14 కోట్లు 2️⃣ పెద్ద ఉల్లగల్లు – సింగన్నపాలెం : ₹4.05 కోట్లు 3️⃣ దొనకొండ – గజ్జలకొండ వయా ఇండ్లచెరువు : ₹1.98 కోట్లు ఈ రోడ్లు పూర్తయితే దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులు–విద్యార్థులు–రోగులు ఇక మట్టిబాటల ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. దర్శి అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ముందడుగు.
View More
Latest News
10 Dec 2025 09:11 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై అరెస్ట్‌లను ఖండించిన గులాం రసూల్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన రాష్ట్ర విద్యాధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి-పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
View More
Latest News
09 Dec 2025 18:35 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఫారూక్ షుబ్లీ కి వినతి పత్రం అందచేసిన మహమూద్ పీర్
కర్నూలు: కర్నూలుకు చెందిన మహమూద్ పీర్ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయం కి విచ్చేసి, ఫరూక్ షుబ్లీ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెండు వ్యక్తులు విభిన్న విషయాలను చర్చించగా, ఫరూక్ షుబ్లీ ఈ వినతి పత్రం విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారనే తెలిపారు.
View More
Latest News
08 Dec 2025 14:21 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ యాక్ట్ అమలు ఎక్కడ ? అబ్దుల్ సత్తార్
వారసత్వ మసీదులను కాపాడడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌డిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6ను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో గోరంట్ల సర్కిల్‌ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 6 భారత చరిత్రలో రెండు విషాద సంఘటనల రోజు అని చెప్పారు. అదే రోజు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరివాణం బాబ్రీ మసీదు ధ్వంసం… భారత వారసత్వానికి మిగిల్చిన నెగెటివ్ ముద్ర భారతీయులమనుకుంటూ మైనార్టీలపై గుంపు దాడులు, ప్రార్ధనా స్థలాలపై దాడులు, మహిళలను అవమానించటం… ఇలా ప్రజాస్వామ్యాన్ని ఛేదించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు. ప్రజలు ఆకలి, నిరుద్యోగంతో ఆందోళన చెందుతుంటే… కోట్ల రూపాయలు విగ్రహాలు, ఆలయాలకు ఖర్చు చేస్తూ మత పేరుతో మూఢనమ్మకాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వక్ఫ్ సవరణలపైనా ఆయన మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా ఉమ్మీద్ యాప్‌కు గడువు పెట్టడం అన్యాయమని… ముస్లింలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. వక్ఫ్ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అబ్దుల్ సత్తార్ చేసిన ప్రధాన డిమాండ్లు: ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ముస్లింల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. వక్ఫ్ ఉమ్మీద్ యాప్ గడువు పొడగించాలి. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా కార్మిక నాయకులు పఠాన్ సాజిద్ ఖాన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖాజా వలి, బ్రాంచ్ అధ్యక్షులు షఫీగని, అబ్దుల్ రజాక్, ఖాదర్ భాషా, మహమ్మద్ సాధ్ తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
06 Dec 2025 14:35 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండను మార్కాపురం జిల్లా లో కలపాలని డిమాండ్
దర్శి నియోజకవర్గంలోని దొనకొండను కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని డి‌బిహెచ్‌పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏ పనికైనా ఒంగోలుకు 90 కిమీ ప్రయాణం చేయాల్సి వస్తోందని, మార్కాపురం 30 కిమీ దూరంలో ఉండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దొనకొండ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని సుజాత హెచ్చరించారు.
View More
Latest News
02 Dec 2025 16:32 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
మైలవరం పాఠశాలకు 162 సైకిళ్లు ఉచితంగా పంపిణీ
అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల కోసం సైకిళ్ల అందజేయడంలో సహకరించిన NREDCAP మరియు ASSIST సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దూరప్రాంతాల్లోని విద్యార్థులు ప్రయాణ సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో, ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో 5,300 మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశాము.
View More
Latest News
01 Dec 2025 22:57 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తేజస్వి పొడపాటి ఆహ్వానంతో ద్వి కుటుంబ తేనిటీ విందు
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి ప్రత్యేక ఆహ్వానంతో, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు లలిత్ సాగర్ దంపతులు సోమవారం సాయంత్రం ఒంగోలు నివాసంలో తేనిటీ విందులో పాల్గొన్నారు. రెండు కుటుంబాలు స్నేహపూర్వక వాతావరణంలో ఆనందంగా గడిపారు.
View More
Latest News
01 Dec 2025 22:50 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
కురిచేడు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో, త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ జరిగింది. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, ఆయుధాల నిర్వహణ, శుభ్రత, స్టాఫ్ పనితీరును పరిశీలించిన అధికారులు — పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని, ప్రజలతో మరింత సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఆదేశాలు.
View More
Latest News
01 Dec 2025 21:44 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఉర్దూ భాషాభివృద్ధికి బీజేపీ సహకారానికి హామీ
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉర్దూ భాషాభివృద్ధికి సహకారం అందించాలని కోరగా, భాషకు మతాలతో సంబంధం లేదు… ఉర్దూ అభివృద్ధికి తప్పకుండా తోడ్పాటునిస్తాం అని మాధవ్ హామీ ఇచ్చారు.
View More
Latest News
29 Nov 2025 14:52 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి అభివృద్ధి కి డా|| లక్ష్మీ నిబద్దత,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి వినతి
గత 18 నెలలుగా దర్శి అభివృద్ధి కోసం నిరంతరం పరిగెడుతున్న దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, నియోజకవర్గ ప్రజల ప్రధాన డిమాండ్ అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం కోసం సుమారు ₹2 కోట్లు నిధులు మంజూరు చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో దర్శి కొనసాగింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి లో రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని గ్రామాగ్రామం పర్యటిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ, యువత కోసం ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే దిశగా కృషి చేస్తూనే ఉన్నట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
View More
Latest News
27 Nov 2025 16:22 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
సీఎం చంద్రబాబు తో ఫారూఖ్ షుబ్లీ ప్రత్యేక భేటీ
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కొత్త జీవం పోసే నాయకునిగా ఎదుగుతున్న చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. నా మీద ఉంచిన నమ్మకాన్ని… పనితో నిరూపిస్తాను!— చైర్మన్ శపథం! ఉర్దూ అకాడమీ అభివృద్ధి, కొత్త కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముందుంచిన ప్రతిపాదనలకు సీఎం సానుకూల స్పందన. యువశక్తికి ప్రేరణగా నిలుస్తూ… ఉర్దూ భాష కోసం కొత్త దిశలో అడుగులు — త్వరలోనే అమలులు! అమరావతి రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాక్!
View More
Latest News
27 Nov 2025 00:09 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
2.5 లక్షల LOC చెక్కును అందచేసి డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం గాంధీనగర్ నివాసి బట్టువరపు అడుగుల శ్రీనివాసులకు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,50,000/- LOC చెక్కును దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
26 Nov 2025 20:22 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావు.. ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణ రాజు.. ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఛైర్మన్‌గా విక్రమ్..ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మౌలానా షిబిలీ..ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రామ్ ప్రసాద్.. పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మధుబాబు.. స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా శంకర్‌రెడ్డి.. కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిన్నప్ప..షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ముక్తియార్.. భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా వీరభద్రరావు.. #AndhraPradesh
View More
Latest News
22 Nov 2025 18:15 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. పదవ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు శుక్రవారం రోజున విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష ఉంటుంది, మార్చి 18న సెకెండ్‌ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు, మార్చి 20న ఆంగ్లం, 23న గణితం, మార్చి 25న భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్), మార్చి28న జీవశాస్త్రం ( బయలాజికల్ సైన్స్), మార్చి 30న సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు మార్చి 31న కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2) పరీక్ష ఉంటుంది. అలాగే ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీన థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వంద మార్కులకు నిర్వహించే పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే పరీక్షలు (సైన్స్, సోషల్) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి11 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
View More
Latest News
21 Nov 2025 19:18 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు
AP: ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
View More
Latest News
21 Nov 2025 18:59 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు: గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ—ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్న తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అధికారులు అప్రమత్తంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిరగనీయవద్దని, ముఖ్యంగా రెవిన్యూ, భూముల ఆన్లైన్ ఎంట్రీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూ వివాదాలు వంటి అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక విద్యుత్, పెన్షన్లు, రోడ్లు, డ్రైన్లు, పోలీస్ కేసులు వంటి సమస్యలకు కూడా త్వరితగతిన స్పందించాలని అన్నారు. వచ్చే ప్రజా వేదిక నాటికి అందిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా సాధ్యం కాని సమస్యలు తన ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరవేస్తానని హామీ ఇచ్చారు. దొనకొండలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సోలార్ పార్క్, ఆయుధ తయారీ కేంద్రం వంటి పరిశ్రమలతో ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, టిడిపి సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–యూనిట్–బూత్ ఇంచార్జిలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
21 Nov 2025 14:48 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ఈరోజు ప్రతి రైతు ఇంట్లో పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, పొట్లపాడు గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. వారితో పాటూ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, అగ్రికల్చర్ రెవిన్యూ, ఎంపీడీఓ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొని రైతును నిలబెట్టే ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడత క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000, పీఎం కిసాన్ కింద గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చే రూ. 2,000 కలిపి 7,000 రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ వ్యవసాయ శాఖ మాత్యులు కే అచ్చం నాయుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో నేడు ఈ పథకాన్ని రైతులకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. ఆనాడు తొలివిడత నిధులు మన దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆనాడు కొందరు వైసీపీ నేతలు హేళన చేశారు ఇప్పుడు ఏం మాట్లాడతారు మాట నిలుపుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి ద్వేయంగా మన ప్రభుత్వం 18 నెలల కూటమి పాలన సాగుతుందన్నారు. ఇటీవల కురిచిన తుఫాను తాకిడి పంట నష్టాలు అంచనా వేయడం జరిగిందని రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అన్నారు.
View More
Latest News
19 Nov 2025 21:18 PM
1
1
Newsread image

No.1 Short News

Newsread
బిడ్డను కాపాడిన దర్శి ఎస్సై మురళి
దర్శి లో రెండేళ్ల బిడ్డతో ఒక మహిళ కురిచేడు రోడ్డులోని సాగర్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.అయితే అటుగా వెళ్తున్న ఎస్సై మురళి గమనించి స్థానికుల సహాయంతో సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న తల్లి బిడ్డను బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిడ్డ పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సకాలం లో స్పందించి ఎసై తల్లిబిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన మహిళను పోలీసులు విచారిస్తున్నారు..
View More
Latest News
19 Nov 2025 20:05 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
వీరి ఉగ్రవాదం వెనుక ఏ గ్రంథం పనిచేస్తుంది?
ఒక అబద్ధాన్ని నలుగురూ కలిసి ఎంత బలంగా ప్రచారం చేస్తే అది అంత నిజంగా మారిపోతుందన్నది వాట్సాప్ యూనివర్సిటీ సభ్యులు నమ్మే బలమైన ఫిలాసఫీ! వాట్సాప్ యూనివర్సిటీ నడిపే ఫేక్ ప్రోపగాండాకు చదువుసంధ్యలు లేని కొందరు వ్యక్తులు ప్రభావితమవుతుంటారనుకుంటే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ సమాజంలో కొందరు ఉన్నత విద్యావంతులు, మీడియా రంగంలో సైతం పనిచేసే వ్యక్తులు, చివరకు కొందరు నాస్తికులు సైతం ఈ ఫేక్ ప్రోపగాండాకు ప్రభావితమైపోయి కొన్నిసార్లు... ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్లు ఇస్తూ తమ మనసుల్లో ఏ మూలనో దాగున్న మత విద్వేషాన్ని వెళ్లగక్కుతూ సంతృప్తి పడుతుంటారు. చివరకు ఈ మధ్య నా అన్వేషణ పేరుతో ఛానల్ నడిపే యూట్యూబర్ సైతం ముస్లిములందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్ ఇచ్చే స్థితికి దిగజారిపోయాడంటే వాట్సాప్ ఫేక్ ప్రోపగాండా సొసైటీలో ఎంత బలంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్ ఫేక్ ప్రోపగాండాకు ఇతని మానసిక పరిస్థితి ఎంతగా ప్రభావితమైం దంటే... ముస్లిములను ఉగ్రవాదం చెయ్యటానికి ఖురాన్ గ్రంథమే ప్రభావితం చేస్తుందని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది కేవలం ఇతనొక్కడి మానసిక పరిస్థితి మాత్రమే కాదు, ముస్లిం వ్యతిరేకత మెదళ్లలో నింపుకున్న చాలామంది మానసిక పరిస్థితి నేడు ఎలా ఉందంటే... మొత్తం చెడ్డోళ్లంతా పనికట్టుకుని ముస్లిం సమాజంలో మాత్రమే పుట్టారు, అమాయకులు మంచోళ్లంతా హిందూ సమాజంలో పుట్టారని ఊహించుకునేంత స్థితిలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు! ఏ మతానికి చెందిన వాడైనా ఉగ్రవాదానికి పాల్పడితే కచ్చితంగా అందరూ కలిసి అతన్నో నేరస్తుడుగా పరిగణించి ఖండించాల్సిందే కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని స్టేట్మెంట్ ఇవ్వటానికి మించిన అజ్ఞానం, మూర్ఖత్వం మరొకటి ఉండదు. సరే ఉగ్రవాదులంతా ముస్లిములే అన్న బోగస్ థియరీని బలంగా నమ్మే వారు... ఎప్పటివో సంఘటనలు కాదు, ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకు దేశ రహస్యాలు చేరవేస్తూ, ఉగ్రవాదం చేస్తూ పట్టుబడ్డ కొన్ని సంఘటనలకు చెందిన న్యూస్ ఆర్టికల్స్ చదవాలి. నిజంగా ఉగ్రవాదాన్ని ఖురాన్ గ్రంథమే ప్రేరేపిస్తుంది అనుకుంటే మరి వీళ్ల ఉగ్రవాదం వెనుక ఏ గ్రంథం పని చేస్తుందో చెప్పాల్సి ఉంటుంది. నేనైతే ఎప్పుడూ చెప్పేమాట ఒక్కటే... ఉగ్రవాదానికి మతం ఉండదు, మతాన్ని అనుసరించేవాడు ఉగ్రవాదానికి పాల్పడడు. మరి ఉగ్రవాదానికి ఎవడు పాల్పడతారు? అంటే... మత ఉన్మాదాన్ని మతి నిండా నింపుకునే పిచ్చోళ్లే ఉగ్రవాదానికి పాల్పడతారు... ఆ ఉన్మాదులకు హిందూ పేర్లైనా ఉండొచ్చు లేదా ముస్లిం పేర్లైనా ఉండొచ్చు... లేదా వేరే ఏ మతానికి చెందిన పేర్లైనా ఉండొచ్చు...
View More
Latest News
16 Nov 2025 20:46 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
వైయస్ఆర్సీపీ దర్శి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగూర్
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి దర్శి నియోజకవర్గ మైనారిటీ సెల్ అనుబంధ విభాగానికి అధ్యక్షులుగా షేక్ నాగూర్ ను నియమిస్తున్నట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది, తనపై నమ్మకంతో తనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారికి షేక్ నాగూర్ కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
14 Nov 2025 22:12 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
హల్దీ వేడుకలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం నాగంబోట్లపాలెం గ్రామంలో షేక్ రఫీ కుమారుడు కలాం పెళ్లికుమారుని చేయు కార్యక్రమం (హల్దీ)లో దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుడు కలాం ను ఆశీర్వదించారు.
View More
Latest News
14 Nov 2025 21:06 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
బీహార్ లో బిజెపి గెలుపుపై దర్శి లో సంబరాలు
ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శి పట్టణం స్థానిక బిజెపి నాయకులు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్లో సునామి సృష్టించారని రాబోవు స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గాని భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు తిండి నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కాకర్లనాగసాయి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత గురువర్ధన్ రావు, పట్టణ అధ్యక్షులు వల్లభ వరపు అమరేశ్వర రావు అచ్యుత్ శరత్ బచ్చు అనిల్ యువమోర్చా నాయకులు అనిల్, జనసేన నాయకులు పాపారావు, శివ కోటా చారి కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
14 Nov 2025 20:09 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో స్థానిక ఎన్నికలు.. కీలక అప్డేట్?
ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైంది. నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల SEC తెలిపారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సన్నాహాలు పూర్తి చేసి, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని SEC యోచన చేస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.
View More
Latest News
14 Nov 2025 20:03 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
చిల్డ్రన్స్ డే వేడుకల్లో విద్యార్థులతో దర్శి సీఐ, ఎస్సై.
చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా, ప్రకాశం దర్శి పోలీసులు దర్శి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. వారితో బాలల దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్లు, రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు మరియు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ శ్రీ వై. రామారావు, ఎస్సై శ్రీ ఎం. మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకుని, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శకత్వం అందించారు. సుమారు 60 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, స్వీట్లు పంచి వారికి ఆనందాన్ని పంచారు.
View More
Latest News
14 Nov 2025 19:52 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పేదల గృహప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం అనంతరం నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.
View More
Latest News
12 Nov 2025 19:25 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నెలల ఇమామ్ & మౌజ్జన్ గౌరవ వేతనాల కొరకు 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది
View More
Latest News
12 Nov 2025 18:30 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా వైకాపా ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శి లో స్థానిక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి రోడ్డులోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
12 Nov 2025 18:25 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పక్కా గృహాల భూమి పూజ కార్యక్రమంలో డా||గొట్టిపాటి లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ – ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 క్రింద 54 మంది లబ్ధిదారులకు పక్కా గృహమూల మంజూరు ఉత్తర్వుల పంపిణీ & భూమి పూజ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా|| లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్ళ వలె కలిసి నడుస్తున్నాయని, వైసిపి అవినీతి పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
12 Nov 2025 18:08 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు లో ఘనంగా నేషనల్ మైనారిటీ డే వేడుకలు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా BJMC రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా , BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజీద్ ఖాన్, BJMC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, కరాటే కోచ్ షేక్ కరీముల్లా మరియు ముస్లిం సోదరులు తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆనాడు త్యాగాలు చేసిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి అని, ఆయన జీవితాంతం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్మికులతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లి పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
11 Nov 2025 18:39 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
డిప్యూటీ స్పీకర్ RRR తో డాక్టర్ గొట్టిపాటి భేటీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరు jkc కాలేజీ ఆడిటోరియంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు అభినందన కార్యక్రమంలో అతిధిగా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ RRR తో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.
View More
Latest News
07 Nov 2025 19:56 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:29 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ.
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:27 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్!
జోహ్రాన్ మమ్దానీ 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 34 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా, అయన ఆండ్రూ క్యూమో (స్వతంత్ర అభ్యర్థి)ను ఓడించి, 50.3% ఓట్లతో గెలిచారు. మమ్దానీ న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి ముస్లిం మేయర్ మరియు ఆధునిక కాలంలో మొదటి ఇమ్మిగ్రెంట్ మేయర్.
View More
Latest News
06 Nov 2025 11:44 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు
పార్వతి మన్యం జిల్లాలో ప్రమాదానికి గురైన మరో బస్సు.మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన.ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్.తప్పిన ప్రాణపాయం, మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు.విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు అని సమాచారం.
View More
Latest News
06 Nov 2025 11:28 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
కార్తీక పౌర్ణమి మహిళల కోలాటం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామం లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన లో ముఖ్య అతిధులు గా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా కోలాటం ప్రదర్శించి న 40 మంది మహిళలకు డా|| లక్ష్మీ చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో తురకపాలెం గ్రామ టిడిపి నాయకులు, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
View More
Latest News
05 Nov 2025 22:33 PM
1
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
టీడీపీ ఓడిపోదు..! మళ్లీ మళ్లీ పవర్ లోకి వస్తాం..! చంద్రబాబులో అంత కాన్ఫిడెన్స్‌కి కారణమేంటి..
వస్తామ్. మళ్లీ మళ్లీ పవర్‌లోకి వస్తాం. అసలు టీడీపీ ఓడిపోదు. రాసి పెట్టుకోండి. గెలుపు మనదే. ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే. ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది. పవర్‌పై బాబు ధీమా వెనుక ప్లానేంటి? రాబోయే ఎన్నికలకు..ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి? అంత గట్టిగా ఓడిపోబోమని చెప్పడానికి కారణమేంటి? ఏపీలో పవర్ షిఫ్లింగ్‌ సిస్టమ్‌ నడుస్తోంది. విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైమ్‌ జగన్‌ పవర్‌లోకి వచ్చారు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ స్లైడ్‌ విక్టరీతో ఏపీని పాలిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి..అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారం తమదేనని ధీమాగా ఉంది. సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంతే అంటున్నారు.చంద్రబాబు మాటల్లో ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్.. చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆశామాషీ కాదు. ఎందుకంటే గ్రౌండ్‌ లెవల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడూ మాట్లాడరు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో నెగెటీవ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు..పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోదు..ఇక నుంచి వచ్చే జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని..ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని బాబు చెప్పుకొస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు ప్లానింగ్..అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మీద ఎక్కడా నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యలు..ఇచ్చి హామీలు ఇలా అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా మెయింటెన్ చేస్తున్నారు. కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు.. బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని.. సంక్షేమ పథకాలు, పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్‌ పెట్టి..సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం, వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో 15ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు, పవన్ చెబుతున్న మాట. మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది. పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. 2024లో కూటమి దాదాపుగా 60శాతం ఓటు షేర్‌ను రాబట్టింది. ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు.గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్‌ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు. సేమ్‌టైమ్‌ అక్రమాలు, అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా గప్‌ చుప్‌ అయిపోయి..మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట. ఇక రాజకీయంగా వైసీపీ 2019కు ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా? ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది? అందుకు విరుగుడు ఏంటి? అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి. ఇలా తనదైన మంత్రాంగంతో..ఏపీ పొలిటికల్‌ గేమ్‌లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బాబు ధీమానే నిజం కాబోతోందా? ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో చూడాలి.
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
1
Newsread image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..
ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాన్‌ నష్టాలపై కలెక్టర్‌కి నివేదిక సమర్పించిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి
తుఫాన్‌ బీభత్సంతో ధ్వంసమైన రహదారులు, కాలువల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్‌ రాజబాబును కోరారు.ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో యువనేత డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌తో కలిసి ఆమె తుఫాన్‌ కారణంగా జరిగిన ఆస్తి, పంటనష్టాలపై నివేదిక అందజేశారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దర్శి ప్రాంతంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికారుల కృషిని డాక్టర్‌ లక్ష్మి ప్రశంసించారు.
View More
Latest News
05 Nov 2025 19:53 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
అల్పపీడనం.. మళ్ళీ భారీ వర్షాలు
ఈరోజు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
View More
Latest News
03 Nov 2025 09:04 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
Kaanipaakam : సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసంలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
కాణిపాకం....చిత్తూరు జిల్లా సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం. చిన పాపమ్మ అనే మహిళ గాయాలు. కాణిపాకం లోని హరిజనవాడలో ఘటన. బుధవారం ఉదయం వంట రూమ్ లో స్టవ్ ముట్టించగా పేలిన సిలిండర్. సిలిండర్ పేలడంతో చిన్న పాపమ్మ బట్టలకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాద ఘటనపై విచారిస్తున్న కానిపాకం పోలీసులు.
View More
Latest News
29 Oct 2025 12:59 PM
0
1
Newsread image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు లో తుఫాన్ ఎఫెక్ట్: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఉల్లగల్లులోని ప్రధాన రహదారిలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేనందున వర్షపు నీరంతా నిలిచి ఇళ్లలోకి చేరింది. సాధారణ వర్షపాతానికి కూడా ఈ వీధిలో వర్షపు నీరు నిలువ ఉంటుంది అలాంటిది ఇలాంటి తీవ్రమైన తుఫానులలో ఇంకా ఎంత నీరు చేరబోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిలో గల డ్రైనేజీలో చెత్తను తొలగిస్తే ఈ సమస్య ఉండదని ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిలువ ఉండటం వల్ల నీరు ఎటు పోకుండా రోడ్లలో నిలిచిపోయి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
View More
Latest News
29 Oct 2025 07:50 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాను వేళ కురిచేడు మండలంలో పర్యటించిన డా||గొట్టిపాటి లక్ష్మి
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిచేడు మండలంలోని వీరయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ఎన్ఎస్పీ కాలనీలో పొలాల నుండి నీరు ఆర్ & బి రోడ్డుపైకి చేరిన నేపథ్యంలో, డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ & బి డీఈ గోపికృష్ణ, సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డా|| లక్ష్మీ గారు అధికారులకు సూచించారు.
View More
Latest News
28 Oct 2025 19:36 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
కందుకూరు: భారీ వర్షాల ప్రభావంతో రాళ్ల వాగు ఉధృతి
మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడ్లూరు మండలం పొట్లూరు–గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించవద్దని ఎస్ఐ వెంకట్రావు హెచ్చరిక జారీ చేశారు. దీంతో కందుకూరు–కావలి రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
View More
Latest News
28 Oct 2025 19:19 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ లోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై ముఖ్యమంత్రి సమీక్ష.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు- గుంతకల్, గుణదల ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్- తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతి సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
27 Oct 2025 20:03 PM
0
1
Newsread Image

No.1 Short News

BSR NEWS
కిడ్నాపైన బాలుడి జాడను గంటలో చేదించిన గుంటూరు పోలీసులు
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC కాలనీకి చెందిన షేక్.షాఫిఉల్లా నిన్న(ది.26.10.2025) మద్యాహ్నం సుమారు 01:00 గంట నుండి తన మూడు(03) సంవత్సరాల బాబు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వెంటనే సీఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో Cr.No. 319/2025 u/s 140(2) BNS of Old Guntur సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి, సదరు విషయాన్ని గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ కి తెలియపరచి, ఆయన ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టాలని ఆదేశించగా, కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబుని కిడ్నాప్ చేసినాహులను ఈ రోజు ఉదయం 08.00 గంటలకి గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి బాబుని సురక్షితంగా రక్షించి, అతని తల్లిదండ్రులకు అప్పగించడమైనది.నిందితురాలైన షకీలాని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి హాజరుపరచడమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత మరియు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో కేవలం గంటల వ్యవధిలోనే వారి బాబునీ తల్లి దండ్రులు రక్షించి,అప్పగించారని పాత గుంటూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పాత గుంటూరు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాబును రక్షించుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ని, పాత గుంటూరు సిఐ-కె.వెంకట ప్రసాద్ ని , యస్.ఐ-యన్.సి. ప్రసాద్ మరియు సిబ్బంది HC నూరుద్దీన్ ,PC రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.
View More
Latest News
27 Oct 2025 19:22 PM
0
1
Refresh Page
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (827)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.