Select Location
Newsread Image

No.1 Short News

Newsread
పొలాల్లో పడి ఉన్న రెండేళ్ల బాలుడు..! దగ్గరికెళ్లి చూడగా.. గుండెపగిలే దృశ్యం
ప్రకాశం జిల్లా కంభం మండలంలో రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత శవంగా దొరికాడు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. పోలీసులు గాలించినా ఫలితం లేకపోగా, చివరకు గ్రామ శివారులో మృతదేహం లభించింది. హత్యాయత్నమా, ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలాలి. ముక్కుపచ్చలారనేలేదు.. ఆ తల్లి అచ్చట, ముచ్చట తీరనేలేదు.. పొత్తిళ్ళల్లో ఒదిగిపోయిన ఆ ముద్దు నవ్వుల మోము వెచ్చని శ్వాస ఇంకా వీడనే లేదు.. ఇంతలో కాళ్ళ కింద భూమి కదిలిపోయి అమాంతం భూమిలో కూరుకుపోయినట్టు అయింది ఆ కన్నతల్లికి.. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ళ బాలుడ్ని వెతుకుతూ తల్లడిల్లుతున్న ఆ మాతృమూర్తికి గర్భశోకం అశనిపాతంలా తాకింది.. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్షరాలు నేర్చుకుంటానని బుడిబుడి అడుగులతో వెళ్ళిన బాలుడు ఊరి శివారులో శవమై కనిపించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.. చిన్నారి కోసం గుండెలవిశేలా రోదిస్తున్నారు.. ప్రకాశంజిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన రెండున్నరేళ్ళ బాలుడి ఉదంతం విషాదంగా ముగిసింది. రెండురోజుల క్రితం అదృశ్యం… రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్‌ ఈ నెల 8వ తేదిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి తిరిగిరాలేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊరంతా గాలించారు.. తల్లిదండ్రులు శ్రీను, సురేఖలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజులు తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై గ్రామంలో మార్కాపురం డీఎస్‌పీ నాగరాజు విచారించారు. అనంతరం బృందాలుగా పోలీసులు విడిపోయి లింగోజీపల్లితో పాటు సూరేపల్లి, ఎల్.కోట, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి, బేస్తవారపేట ప్రాంతాల్లో గాలించారు. బాలుడి ఫొటోలు, వివరాలను ముద్రించిన కరపత్రాలను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అంటించారు. రెండో రోజు 9వ తేదిన గ్రామ సమీపంలోని నల్లవాగు దగ్గర బాలుడు లక్షిత్ చెప్పులు కనిపించడంతో ఎవరైనా అపహరించారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. డ్రోన్ సాయంతో అన్వేషించినా బాలుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి 8వ తేది వచ్చిన బాలుడు ఎప్పటిలాగే ఆడుకున్నాడని, ఆ తరువాత ఇంటికి బయలుదేరి చేరకపోవడంతో తల్లిదండ్రులు విచారించారని అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది చెబుతున్నారు.
View More
Latest News
10 Jul 2025 21:07 PM
3
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గురుకుల పాఠశాల లో ఘనంగా మెగా పేరెంట్స్ డే నిర్వహణ.
ముఖ్య అతిథిగా దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్. ఈ రోజు, దర్శి లోని స్థానిక ఎన్నెస్పీ కాలనీలో గల డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకులం లో మెగా పేరెంట్స్ డే ను 550 మంది విద్యార్థులతో తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా జిల్లా కో-ఆర్డినేటర్ జయ, దరిశి తహశీల్దారు శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి డీసీసీ జయ మాట్లడుతూ, విద్యార్థుల బవిష్యత్ అద్యాపకుల మీదే కాకుండా, తల్లిదండ్రులు కూడా గురుతరమైన బాధ్యతను కలిగివుండాలన్నారు. తహశీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అన్నీ ప్రోత్సాహకాలిచ్చి, మెరుగైన భోజన సదుపాయాల కోసం సన్నబియ్యాన్నిచ్చి అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. ఈ సంధర్భంగా ఇండయన్ రెడ్ క్రాస్ ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ, విద్యార్థుల ఎదుగుదలకు గురువుల పాత్ర ఎంతుందో, వారిని కన్న తలిదండ్రుల పాత్ర అంతకంటే ఎక్కువ వుందని, గురువులు ఎంతటి ప్రావీణ్యులైనప్పటికీ, తలిదండ్రుల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు చదువులోనేగాదు, నిజజీవితంలో కూడా రాణించలేరని, ఈ రోజుల్లో విద్యార్థులను గురువులు మందలిస్తేనే కొందరు తలిదండ్రులు ఓర్చుకొనే పరిస్థితుల్లోలేరని, ఈ పద్ధతిలో పూర్తిగా మార్పువస్తేనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, ఎలాంటి చెడు అలవాట్లకు లోనుగాకుండా పిల్లలపట్ల తలిదండ్రులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, ఎల్లవేళలా తలిదండ్రులకూ పాఠశాల యాజమాన్యానికీ ఒక వారధి గా వుంటానని కపురం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో ప్రధమ, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి మరియూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ చైర్స్ మరియు బహుమతులను కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చింతా తిరుపతిరెడ్డి సహకారంతో అందజేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఆటలపోటీలో పాల్గొని బహుమతులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసెంసీ చైర్మన్ ఏసురత్నం, స్థానికులు తెల్లయ్య,ఎలీషా,సుశీలమ్మ,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
10 Jul 2025 19:52 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
పొదిలి డిపో: రేపు సాయంత్రం నాలుగు గంటలకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం
పొదిలి డిపో పరిధిలో బస్సులు తిరిగే విషయమై అవసరమగు సలహాలు సూచనల మరియు డిపో అభివృద్ధి కొరకు రేపు అనగా 11 - 7- 2025వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నేను (పొదిలి డిపో మేనేజర్ గారు) డయల్ యువర్ డిఎం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కావున పొదిలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వారి సలహాలు సూచనలు డిపో మేనేజర్ తో పంచుకోవచ్చు డయల్ యువర్ డి ఎం ఫోన్ నెంబర్ - 9959225700
View More
Latest News
10 Jul 2025 16:49 PM
0
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
పెద్దిరాజుపల్లి పాఠశాలలో మెగా పీటీఎం 2.0
బ్రహ్మం గారి మఠం మండల పరిది లోని పెద్దిరాజుపల్లి ప్రాధమిక పాఠశాల నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి. తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులు జి. ఆర్ నాగమణి, ఖాధర్ బాష, యం.అంకయ్య. సీపీఐ సహాయ కార్యదర్శి చేజర్ల రవి తల్లి దండ్రులు విధ్యార్థులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 14:54 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శికి అన్న క్యాంటీన్ రావడం నాకు ఆనందంగా ఉంది: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్ లో గురువారం అన్నా క్యాంటీన్ పునః నిర్మాణ పనులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. డా|| లక్ష్మీ తో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... ✴️ పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి కూటమి ప్రభుత్వాధికారంలోనికి రాగానే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ✴️ గత వైసిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టింది. ✴️ పేదల జీవితాలలో వెలుగులు నింపి వారి ఆకలి తీర్చాలన్న మంచి సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది. ✴️ అదే స్ఫూర్తితో దర్శి పట్టణంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించాలన్న సంకల్పంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారిని పలుసార్లు కలిసి విన్నవించడం జరిగిందని ఆమె తెలిపారు. ✴️ గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు దర్శికి అన్న క్యాంటీన్ ను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. వారికి ప్రత్యేకంగా దర్శి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ✴️ 60 లక్షల నిధులతో అన్నా క్యాంటీన్ ను సుందరంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నారు. ✴️ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి ఎజెండాగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్నారు. ✴️ నగర పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసుకోగలిగామని, దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామన్నారు. ✴️ ఇప్పటికే పట్టణంలో దాదాపు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.మౌలిక సదుపాయాల కల్పనే ద్వేయంగా రోడ్లు, డ్రైన్ లు నిర్మాణ పనులు శరవేగంగా చేయగలుగుతున్నామన్నారు. ✴️ పార్కుల అభివృద్ధి, పట్టణంలో విద్యుదీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దర్శిని తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. ✴️ జల శక్తి మిషన్ ద్వారా దర్శి పట్టణంలో తాగునీటి సమస్యను అధికమిస్తామని ఆమె వివరించారు. ✴️ మన ఏడాది అభివృద్ధి పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల అభివృద్ధి సంక్షేమం మన మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. మన అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, వైస్ చైర్మన్ గర్నపూడి స్టీవెన్, మరియు కౌన్సిలర్లు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
10 Jul 2025 13:19 PM
0
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
తల్లి దండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ మండల యువ నాయుకులు కానాల మల్లికార్జునరెడ్డి
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా టీడీపీ మండల యువనాయకులు కానాల మల్లికార్జున రెడ్డి మాజీ మండల అధ్యక్షులు మాలేపాటి సుబ్బారావు స్థానిక నాయకులు కూనపులి రాజానాయుడు పాల్గొన్నారు ఈ సమావేశంలో కానాల మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విధ్యార్థులకు తల్లికి వందనం నాణ్యమైన యూనఫామ్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలిపారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్థున్నారని తెలిపారు విద్యార్థుల సౌకర్యార్థం కోసం కొంత అభివృద్ధి పని చేయాలని ఉపాధ్యాయుల కోరగా వెంటనే తమ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతానని కానాల మల్లి కార్జున రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసులరెడ్డి స్కూల్ చైర్మన్ రామాంజనేయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 11:26 AM
1
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలనందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి మండల నాయకుడు కానాల మల్లికార్జున్రెడ్డి, కూనపులి రాజానాయుడు, గుజ్జు రామాంజనేయులు, గంగన్న, పుట్టాలశివయాదవ్, ఓబయ్య, దాసు, బ్రహ్మనాయుడు, చెన్నయ్య, వెంకటేశ్ నాయుడు, తదితరులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 10:27 AM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: మొహర్రం సందర్భంగా జ్యారతా & అన్నదాన కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం లోని జండా చెట్టు వద్ద మొహరం పండుగ పూర్తి అయినా సందర్బంగా...బుధవారం సాయంత్రం జార్త కార్యక్రమం లో పాల్గొని ముస్లిం సోదరులకు అన్నదాన కార్యక్రమం లో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, 17వ వార్డ్ కౌన్సిలర్ వలిబాబు, మౌలాలి, సుభాని మరియు నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
09 Jul 2025 21:48 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: మొహర్రం సందర్భంగా అన్నదానం లో పాల్గొన్న బూచేపల్లి
దర్శి లోని జెండా చెట్టు వద్ద మొహరం పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .
View More
Latest News
09 Jul 2025 21:39 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైయస్ జగన్ డిమాండ్
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు ను సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలు ఆరా తీసిన వైయస్‌ జగన్, ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
View More
Latest News
09 Jul 2025 20:44 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుల జాబితా సిద్ధం, ఇలా చెక్ చేసుకోండి!
సిద్ధమైన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం అర్హుల జాబితా - రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అర్హులైన రైతుల పేర్ల జాబితాలు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్​లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్‌ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని డిల్లీరావు స్పష్టం చేశారు. వివరాలు రైతులకు మరింత చేరేలా వ్యవసాయ శాఖ సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలని డిల్లీరావు ఆదేశించారు. అర్హులుగా 47.77 లక్షల రైతులు: 'అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని ఢిల్లీరావు వివరించారు. సొంతభూమి కలిగిన డీ.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు, నోషనల్‌ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతోపాటు ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలని ఢిల్లీరావు సూచించారు. అర్హత ప్రకారం అందరికి లబ్ధి చేకూరుస్తామని అక్టోబరు, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీరావు అన్నారు. వెబ్‌ల్యాండ్‌ డేటాను వారి లాగిన్లకు: రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను వీఏఏలు, వీఎస్‌ఏలు, వీహెచ్‌ఏలతో పాటు ఏవోల లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం కచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది రైతు సేవా కేంద్రాల సహాయకులు పరిశీలించి కచ్చిత వివరాలను మండల వ్యవసాయాధికారులకు వారు జిల్లా వ్యవసాయాధికారికి నివేదించాలి.
View More
Latest News
09 Jul 2025 12:27 PM
0
1
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు లో పాముతో వ్యక్తి హల్ చల్
ముండ్లమూరు సెంటరలో దర్శి -అద్దంకి రహదారి లో మద్యం మత్తులో ఓ వ్యక్తి మంగళవారం పాముతో జనాలను భయాందోళనకు గురిచేశాడు. నడి రోడ్డు పై కూర్చొని పామును చేతపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. దీం తో దారి వెంట వెళ్లే ప్రజలు, కళాశాల విద్యార్థులు చొరవ తీసుకొని అతనికి సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
View More
Latest News
09 Jul 2025 11:34 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన దర్శి ఎస్సై మురళి
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి పుట్ట బజార్ లో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, నాగేశ్వరరావు అద్యక్షతన దర్శి ఎస్సై ఎం మురళి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ మానివాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని, వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అంటే మొక్కలు పెంచాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల సురేష్, అస్సాం,షడ్రక్ , వెంకట సుబ్బయ్యా గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
09 Jul 2025 10:59 AM
0
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రేపు గురుపూజ మహోత్సవ కార్యక్రమం
కడప జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు అనగా10.07.2025 గురువారం గురుపూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఎనిమిదో తరం మనవడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఈ గురుపూజ మహోత్సవాలకు స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ , మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు
View More
Latest News
09 Jul 2025 10:56 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
నిషేధిత పొగాకు విక్రయం, నిల్వ, రవాణాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
విద్యా సంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ A.R. దామోదర్. మాదకద్రవ్యాల నిర్మూలనకై.. ప్రకాశం పోలీస్ అడుగులు. మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి పాఠశాలలు, కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు) పరిసరాలలో గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, రవాణాపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా అనుమానిత కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో పాటు విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి పై COTPA చట్టం ప్రకారం, అలాగే గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా చేసిన వారిపై NDPS చట్టం కింద కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యార్థులలో అవగాహన పెంపొందించడంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు మరియు గంజాయి ఉచ్చు నుండి యువతను రక్షించడం మనందరి సామాజిక బాధ్యత. పాఠశాలలు, కళాశాలల పరిసరాలను ఈ చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం మనందరి బాధ్యతన్నారు. యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికీ కృషి చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని, మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, జిల్లాను మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
View More
Latest News
08 Jul 2025 21:06 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం
విజయవాడ, జూలై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష ని విజయవాడలోని హజ్ హౌస్‌ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ, రాష్ట్రంలోని హాజీబంధువుల కోసం హసన్ భాష చేస్తున్న అద్భుత సేవలు, సమన్వయం, మరియు సమగ్ర దృక్పథం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన వసతి, భద్రత, రవాణా, వైద్య సదుపాయాల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంపై కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కడపలోని హజ్ హౌస్ ను వినియోగంలోకి తీసుకురావాలని మరియు హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు విజయవాడ పాయింట్ గా సూచించాలని ఆమె కోరారు, హసన్ భాషా సానుకూలంగా స్పందించి ఈ విషయాలను నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కడప హజ్ హౌస్ వినియోగంలోకి తీసుకుని వచ్చేదానికి అదేవిధంగా విజయవాడను ఎమ్బర్కేషన్ పాయింట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు... అదేవిధంగా, హజ్ కమిటీ చైర్మన్‌గా హసన్ భాష చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఆయనకు సత్కారం జరిపి, శాలువాతో సన్మానించడం జరిగింది. భవిష్యత్తులోనూ హజ్ యాత్రికుల కోసం మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.
View More
Latest News
08 Jul 2025 20:52 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ప్రారంభం
ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ప్రారంభం.విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం పోలీస్ చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మార్గనిర్దేశనలో,గుంటూరు జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ అనే ప్రత్యేక డ్రైవ్‌ను 08.07.2025 తేదీ నుండి 12.07.2025 తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ది.08.07.2025) జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, బడ్డీ కొట్టులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై దృష్టి సారించారు. అనుమానిత విక్రయదారులపై తగిన విధంగా చర్యలు తీసుకొని, ఇకపై మత్తు పదార్థాలు అమ్మకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. పాఠశాలలు, కాలేజీల సమీపంలో ఈ తరహా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగుతాయి.ఎవరైనా మత్తు పదార్థాలు నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. విద్యాసంస్థల పరిసరాలలోని షాపుల యజమానులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ షాపులో సిగరెట్లు మరియు మత్తు పదార్థాలు అమ్ముబడవు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, కాలేజీల యాజమాన్యం వారు తమ పిల్లల ప్రవర్తన మరియు నడవడికపై పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు. ఎవరి పిల్లలైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్టు తెలిసినట్లయితే, వెంటనే మీ దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని, వీరిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి అవసరమైన మార్గదర్శనం అందిస్తామని తెలిపారు. పోలీసు శాఖ మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పని చేస్తోందని, ప్రజలు ఈ లక్ష్య సాధనలో పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు.
View More
Latest News
08 Jul 2025 20:46 PM
0
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి సిపిఐ
ఏళ్ల తరబడి తిరిగిన సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ మండలంలోని సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని నరసన్న పల్లె, చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండపురం గ్రామాల ఎస్సీ మాదిగలకు భూములు చూపడం లో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కు బాధితులతో కలిసి అర్జీ లు ఇవ్వడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 18:02 PM
2
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
కడప జిల్లా సమీక్ష కమిటీ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా
కడప కలెక్టరేట్ నందు జిల్లా ఇంచార్జి మినిస్టర్ సవిత మరియు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సహచర జిల్లా ఎమ్మెల్యే లు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
View More
Latest News
08 Jul 2025 17:04 PM
1
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
థాంక్యూ ఎమ్మెల్యే సార్
మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డు ఇంచార్జీ అక్బర్ ఆధ్వర్యంలో 12వ వార్డు గానుగ వీధి నందు గత అయిదు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వీధి స్తంభాలకు మెయిన్ లైన్ లేకపోవడం వల్ల హై ఓల్టేజ్ వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఉండేది.. ప్రస్తుతం ఆ సమస్యకు పరిష్కారదిశగా ఈ రోజు విద్యుత్ అధికారులు మెయిన్ లైన్ లాగడం జరిగింది. ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపించినందుకు వీధి ప్రజలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు వార్డు ఇంచార్జీ అక్బర్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 16:10 PM
2
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ఖాజీపేట మండలం పత్తూరు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మంజూరైన పండ్లతోటల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి అందరూ పర్యావరణాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివిజా సంపతి, ఏపీడీ సుబ్బా రెడ్డి, ఖాజీపేట మండల ప్రజాప్రతినిధులు, ఏపీఓ చంద్రశేఖర్, ఉపాధి హామీ సిబ్బంది, పత్తూరు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు._
View More
Latest News
08 Jul 2025 12:43 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఈ రోజు వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్ మెంట్ చైర్మన్ అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ కాని 108 మరియు 104 కిలో 2 బియ్యం పధకం, మరియు ఫీజు రియంబర్స్ మెంట్, అలాగే ముస్లిమ్స్ కు 4% రిజర్వేషన్ పేద వాళ్లకు ఇందిరమ్మ గృహాలు ఇలాంటి ఎన్నో పధకాలు ప్రెవశపెట్టిన మహానుభావుడని ఆయనను స్మరించటం మన బాధ్యత అని అన్నారు . మళ్ళీ ఆరోజు లు రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని అలాగే రాష్టం లో షర్మిల రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారు . ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాని, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ వలి, మార్కాపూర్ టౌన్ అధ్యక్షుకు ఇమ్రాన్, తర్లు పాడు పట్టణ అధ్యక్షులు హుస్సన్, యూసుఫ్ తదితర అభిమానులు పాలొన్నారు .
View More
Latest News
08 Jul 2025 12:06 PM
2
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట పంచాయతీ వాంపల్లి చెరువు గ్రామంలోని నాగిపోగు సుధాకర్, నాగిపోగు చంద్రశేఖర్ రైతుల పొలంలో పండ్ల మొక్కలు నాటిన టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి EXMPP మాలేపాటి సుబ్బారావు మరియు ఉపాధిహామీ ఏపీఓ హరికృష్ణ ,టెక్నికల్ అసిస్టెంట్ రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
View More
Latest News
08 Jul 2025 11:57 AM
4
1
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మా పోల్లాల్లోకి దారి ఇవ్వండి రైతుల ఆవేదన
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిరశవంచపొలం నాగి శెట్టి పల్లె పొలం మధ్యలో కొంతమేర ప్రభుత్వ బంజరు భూమి ఉండేదని దాని గుండానే మా పొలాల్లోకి వెళ్లే వారమని కొంతమంది నాయకులు ఆ భూమిని ఆక్రమించుకొని తమ పొలాల్లోకి దారి లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గాని ప్రభుత్వాధికారులు గాని స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు
View More
Latest News
08 Jul 2025 10:13 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
బారా షహీద్ లో నారా లోకేష్, ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన లోకేష్
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దర్గాను సందర్శించిన మంత్రికి ముస్లిం మత పెద్దలు గలఫ్ అలంకరించారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు.
View More
Latest News
07 Jul 2025 21:23 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
అక్కడికక్కడే మృతి చెందిన రమ్య అనే యువతి అదే కత్తితో పొడుచుకొని ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన ప్రవీణ్. సంగారెడ్డి జిల్లా బండ్ల‌గూడ‌లో ఘ‌ట‌న‌. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్న పోలీసులు....
View More
Latest News
07 Jul 2025 20:50 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి లో మంద కృష్ణ మాదిగ 60 వ జన్మదిన వేడుకలు - కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. మందకృష్ణ మాదిగ లాంటి పోరాట యోధుడు పేదలు బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. గత ఐదేళ్ల వైసిపి విధ్వంసం పాలనను తరిమికొట్టాలని మన కూటమి కి అండగా నిలిచిన ప్రజల మనిషి మందకృష్ణ మాదిగ అని లక్ష్మి కొనియాడారు. ఎన్నికల సమయంలో దొనకొండలో మాదిగల ను ఏకం చేసేందుకు నాకు అండగా ప్రచారాన్ని కూడా వచ్చిన మందకృష్ణ మాదిగ ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె అభిప్రాయపడ్డారు. అదే స్ఫూర్తితో మన కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతుందని ఆమె వివరించారు. గౌరవ నరేంద్ర మోడీ ఆయన కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును కూడా మందకృష్ణ మాది కి ఇచ్చి గౌరవించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ MRPS కన్వినర్ గూడూరి యోగేశ్వరరావు మరియు ముండ్లమూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరగాని పౌలు తెల్లయ్య గారు దొనకొండ మండల MRPS కన్వినర్ యగ్గోని చిన్నయ్య గారు దొనకొండ మండల లైవ్ స్టాక్ అధ్యక్షులు పల్లే మణీందర్ దేవ్ గారు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు నూనే డేవిడ్ సన్ గారు దర్శి టౌన్ 15వ వార్డు అధ్యక్షులు పుప్పాల సురేష్ తెలుగుదేశం పార్టీ మరియు MRPS కార్యకర్తలు పాల్గోన్నారు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 20:39 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజలకు అండ తెలుగుదేశం జెండా: డా|| గొట్టిపాటి లక్ష్మి
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణం లోని కురిచేడు రోడ్డులో గల ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం లో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని 12వ వార్డులో ఇంటింటికి ఏడాది పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. డా|| లక్ష్మీ గారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర నాయకులు ఉన్నారు.
View More
Latest News
07 Jul 2025 19:10 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఆదర్శప్రాయుడు హెడ్మాస్టర్ బసవయ్య | కపురం శ్రీనివాసరెడ్డి.
దరిశి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని మండల పరషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య గత నెల(జూన్)30 వ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా...., ఆదివారం దరశిలోని స్థానిక ఆర్యవైశ్య వాసవీ కళ్యాణ మండపంలో ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవానికి ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., ఉపాధ్యాయ వృత్తిలో 39 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరము పాటుబడి,వృత్తిలో అంకితభావం,క్రమశిక్షణ, నిభద్ధతతో పనిచేసి,ప్రజలందరి మన్ననలు పొంది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా ఉపాధ్యాయులకు సేవలందించడమేగాక అనేక సామాజిక సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న అందరివాడు, నిగర్వి,నిత్య కృషీవలుడు,మృధుస్వభావిగా,ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి అందరి మన్ననలు పొంది,ఈ మధ్యన పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య అందరికి ఆదర్శప్రాయుడని కపురం శ్రీనివాసరెడ్డి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని,తన వ్యక్తిగత ప్రయోజనాలకోసంగాకుండా,దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల ధృష్ట్యా,నిరంతరం బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుబడే వ్యక్తే నిజమైన ఉపాధ్యాయుని,ఈలాంటి వ్యక్తే బసవయ్యని,తన శేషజీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని,పురుషులు ఏ రంగంలో రాణించాలన్నా, తప్పకుండా సహధర్మచారిణి(సతీమణి) అంగీకారం,సహకారం ఉండాలని, యావన్మంది మేధావులు,విద్యావంతులందరి సమక్షంలో కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.మహోన్నతమైన విలువలతో స్థాపించబడ్డ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కు బసవయ్య లాంటివారి సహయ సహకారాలు అవసరము కాబట్టి, మానవత సంస్థలో ఆయన స్థాయికి తగిన సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తామని,బసవయ్య లాంటి వ్యక్తులు ప్రస్తుతం ఈ సమాజానికి చాలా అవసరమని కపురం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,సిద్ధా సుధీర్, ఎంఈవోలు రఘురామయ్య,రమాదేవి, పీ.సంజీవయ్య,సూరె. సుబ్బారావు,వాకా.జనార్ధన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,పురప్రముఖులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 15:48 PM
3
1
Newsread Image

No.1 Short News

Newsread
వైజాగ్‌ కొకైన్‌ డ్రగ్స్ కేసులో వెలుగులోకి డాక్టర్‌.
విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన కొకైన్ కేసులో వెలుగులోకి వచ్చిన డాక్టర్‌ను కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మగా గుర్తించారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మను విశాఖ పోలీసులు అరెస్టు చేసారు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్‌కు లింకులున్నట్టు తేల్చారు.
View More
Latest News
07 Jul 2025 10:46 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
చందలూరు లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం: పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి మండలం చందలూరు గ్రామంలో గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, తన గురువు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, లక్ష్మయ్య అద్యక్షతన పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అని సురేష్ అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని అన్నారు. వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అన్న మొక్కలు పెంచాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో షడ్రక్ , శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Jul 2025 10:29 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
డ్యూటీ చేయకుండానే.. 12 ఏళ్లుగా రూ.28 లక్షల జీతం తీసుకున్న పోలీస్‌! కళ్లుమూసుకున్న సర్కార్..
ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ 12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లడం లేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం మాత్రం అందుకున్నాడు. అలా ఏకంగా రూ.28 లక్షలకుపైగా నెల జీతం తీసుకున్నాడు. తాజాగా పోలీస్‌ శాఖ నిర్వహించిన ఇంటర్నల్ తనిఖీల్లో 12 ఏళ్ల తర్వాత ఈ వ్యవహారాన్ని గుర్తించింది. ఈ విచిత్ర మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.
View More
Latest News
07 Jul 2025 09:55 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
రాహుల్ గాంధీ ప్రధాని, షర్మిల ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు: కాంగ్రెస్ నేత సైదా
తుమ్మల చెరువులో మొహరం వేడుకల్లో కాసిం స్వామి దర్గాని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు, ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి రానున్న రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు
View More
Latest News
07 Jul 2025 08:07 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారం చిక్కీలు సరఫరా చేయాలి: APTF తాళ్లూరు.
శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలు ప్రకాశం జిల్లాలో ఏజెన్సీల నుండి సరఫరా లేనందువలన జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు అందించడం లేదు. జూన్ నెలలో కూడా అందరి విద్యార్థులకు అన్ని రోజులకు సరిపడే విధంగా చిక్కీలు సరఫరా చేసి ఉండలేదు. చిక్కీలు సరఫరా చేసే ఏజెన్సీ వారిని సంప్రదించగా పైనుంచి మాకు సరఫరా లేదంటున్నారు. పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారము మెగా PTM రోజుకైనా చిక్కీలు పాఠశాలల్లో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను, కూటమి ప్రభుత్వమును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ తరఫున కోరుచున్నాము.
View More
Latest News
07 Jul 2025 07:24 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌, జులై 7: వానల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాగల ఐదు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
View More
Latest News
07 Jul 2025 06:37 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గోవిందప్రసాద్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.
ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కవలకు కుంట్ల గోవిందప్రసాద్ మాదిగ అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిసభ జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగాAITUC జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు గురుకుల పాఠశాల అధ్యాపకులు డొక్కా వినయ్ మాస్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు ఆకర్షించి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసే కార్మిక పని గంటలు 24 గంటల నుండి 18 గంటలు కుదించి అలా హక్కులను కాపాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం, గర్నెపూడి యాకోబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
View More
Latest News
06 Jul 2025 19:27 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి వేడుకలు
ఈరోజు దర్శి ఎంపీడీవో ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహర్షి ఏకలవ్యుడు జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు జీవీ రత్నం మాట్లాడుతూ మహాభారతంలో విలువిద్యలో గురువు లేకుండా విలువిద్య నేర్చుకున్న మహర్షి ఏకలవ్యుడు పాత్ర అమోఘమని గురువు అడిగిన ఎమ్మటేనే తన బొటనవేలును దానం చేసిన త్యాగజీవి మహర్షి ఏకలవ్యుడు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బహుజనుల రచయితల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అట్లూరి రామారావు, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, జూపల్లి కోటేశ్వరరావు, ఎక్స్ ఎంపిటిసి రాజ్పూడి ఇర్మియ, వెంకటేశ్వర్లు, దళిత మహిళలు తదితరులు పాల్గొన్నారు
View More
Latest News
06 Jul 2025 19:18 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
డబ్బులేక టీవీ9 జర్నలిస్టు కుటుంబ కనీటిగాధ
జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా.. భద్రతలేని ఉద్యోగాలు. భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు. అద్దె ఇల్లు.. చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ ప్రసాద్‌ శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒక బాబు. వీరి భవిష్యత్‌ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది. సొంత ఇల్లులేదు. సొంత ఊళ్లో జాగలేదు. సిరిసిల్లలో అద్దె ఇంట్లో జీవనం సాగించిన ఆయన శవం బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి. కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తూ ‘కొడుకా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. పూల దండలు సంపాదించుకుంటున్నవారా? కొడుకా.. నీ పిల్లల బతుకు ఏం కావాలిరా.. మాకు అగ్గి పెడుతావనుకుంటే.. మేం నీకు అగ్గిపెట్టాల్సి వస్తుంది కొడుకా..’ అంటూ ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. జర్నలిస్టు మిత్రులు వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. నెలవారీ జీతంలేని జర్నలిస్టులు ఆలోచించాలి. ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లోకి మారిపోవాలి . భార్యాపిల్లల్ని కాపాడుకోవాలి.
View More
Latest News
06 Jul 2025 12:52 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
నీరసానికి రూ.50 వేలు, జ్వరానికి రూ.70 వేలు, దోచుకుంటున్న ఆస్పత్రులు
రోగుల వ్యాధి నిర్ధారణ కాకుండానే పరీక్షల పేరుతో వైద్యుల అధిక రుసుము - ప్లేట్లెట్ల సంఖ్య తగ్గాయంటూ అనవసర వైద్య పరీక్షలు చేయిస్తున్న వైద్యులు. వాతావరణంలో మార్పులొచ్చాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపాటి జ్వరమొచ్చినా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు ప్రైవేటు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. ప్రజల అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని మరీ దోపిడీకి తెరదీస్తున్నారు. అంతేకాకుండా సాధారణ జ్వరానికే రూ.వేలల్లో ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారు. అస్వస్థతకు రూ.50 వేలు: తరచూ కళ్లు తిరుగుతున్నాయని ఓ వ్యక్తి తణుకు రాష్ట్రపతి రోడ్డులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎటువంటి పరీక్షలు చేయకుండానే ఏకంగా అత్వసర విభాగానికి (ఐసీయూ)కి తరలించారు. అంతేకాకుండా తర్వాత పరీక్షలు, ఇతర చికిత్సల పేరుతో రూ.50 వేలు బిల్లు వేశారు
View More
Latest News
06 Jul 2025 07:20 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ సచివాలయాల్లో బదిలీలపై విచారణ, రీకౌన్సిలింగ్.. ? కొత్త డిమాండ్లు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే జరుగుతున్న బదిలీలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సచివాలయాల ఉద్యోగులు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఇప్పటికే ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇవాళ మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. బదిలీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, రీ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇవాళ విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోనే అనేకచోట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జీవో 5ని పాటించకుండా అపారదర్శకంగా జరిగిందని ఆరోపించింది. కొన్నిచోట్ల అత్యంత పారదర్శకంగా జరిగిందని, మరికొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియార్టీలో ఉన్న ఉద్యోగులకు అన్యాయం చేశారని తెలిపింది. అనేక జిల్లాలలో బదిలీలు జరిగే కౌన్సిలింగ్ కేంద్రాలలో సచివాలయ ఉద్యోగుల సీనియార్టీ జాబితా ప్రదర్శించకుండానే, కేవలం ఆప్షన్స్ మాత్రమే ఫామ్ ద్వారా స్వీకరించి, ఉద్యోగులను వెళ్ళమనడంతో ఉద్యోగులకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం కాలేదని తెలిపింది. అలాగే జీవో 5లో పేర్కొన్న విధంగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు, కొన్ని కౌన్సిలింగ్ కేంద్రాల్లో ప్రాధాన్యత కల్పించి బదిలీలు చేపట్టలేదని తెలిపింది.
View More
Latest News
03 Jul 2025 20:39 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మైండ్‌ బ్లోయింగ్.. డాక్టర్ల కంటే 4 రెట్లు బెటర్.. మైక్రోసాఫ్ట్ కొత్త మెడికల్ AI.. ఇక మానవ డాక్టర్ల అవసరం లేదా?
ఒకవైపు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వార్తల్లో నిలిచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, మరోవైపు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. మానవ వైద్యుల కంటే నాలుగు రెట్లు కచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది వైద్య రంగంలో “సూపర్ ఇంటెలిజెన్స్”కు తొలి అడుగు అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ AI అంత గొప్పదా? ఇది నిజంగానే అనుభవజ్ఞులైన డాక్టర్లను మించిపోయిందా? ప్రముఖ AI నిపుణుడు ముస్తఫా సులేమాన్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ AI యూనిట్ ఈ అద్భుతమైన టూల్‌ను రూపొందించింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. MAI-DxO ఒంటరిగా పనిచేయదు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ నిపుణులైన వైద్యుల బృందంలా పనిచేస్తుంది. వివిధ AI ఏజెంట్లు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ (“చైన్-ఆఫ్-డిబేట్” పద్ధతిలో), ఒక క్లిష్టమైన కేసును విశ్లేషించి, ఒక నిర్ధారణకు వస్తాయి. ఇది గుడ్డిగా సమాధానం చెప్పదు. ఒక రోగి వచ్చినప్పుడు డాక్టర్ ఎలా ప్రశ్నలు అడుగుతారో, ఏయే పరీక్షలు (బ్లడ్ టెస్ట్, ఎక్స్-రే) సూచిస్తారో, ఆ ప్రక్రియను స్టెప్-బై-స్టెప్ అనుకరిస్తుంది. “మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్” భవిష్యత్తు ఇదేనా? మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వైద్య రంగంలో ఒక విప్లవానికి నాంది. “వివిధ AI ఏజెంట్లు కలిసి చర్చించుకునే ఈ పద్ధతి, మనల్ని ‘మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్’ వైపు వేగంగా తీసుకెళ్తుంది” అని చెప్పారు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒకేసారి అనేక వైద్య విభాగాల (కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అరుదైన వ్యాధులను సైతం వేగంగా గుర్తించి, వైద్యులకు సాయం చేస్తుంది. రోగులు తమ ఆరోగ్యం గురించి మరింత తెలుసుకోవడానికి, వారి కేసులను మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. తొందరపడకండి.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. ఈ ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నా, మైక్రోసాఫ్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. “ఈ టూల్ ఇంకా క్లినికల్ వాడకాల కోసం రెడీగా లేదు” అని చెప్పింది. ఇది ప్రస్తుతం క్లిష్టమైన, అరుదైన కేసులపై మాత్రమే పరీక్షిస్తున్నాం. జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలపై దీని పనితీరును ఇంకా పరీక్షించాల్సి ఉంది. కాబట్టి, ఇది ఇప్పుడప్పుడే మీ స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ స్థానాన్ని భర్తీ చేయదు. మైక్రోసాఫ్ట్ MAI-DxO అనేది మానవ వైద్యులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదు. వైద్యులకు బాగా ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది వైద్యులపై పనిభారాన్ని తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీ మానవ మేధస్సు , కృత్రిమ మేధస్సు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ.
View More
Latest News
03 Jul 2025 19:40 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
Movierulz , ibommma లో మూవీస్ పెట్టె వ్యక్తి అరెస్టు
మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు పైరసీ మూవీలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఒక్కో మూవీని రూ.40వేలు-రూ.80 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం పైరసీ కేసులో అరెస్టైన కిరణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల 2024లో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు రూ.3,700 కోట్లు నష్టం ఇప్పటివరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించిన పోలీసులు తన ఫోన్‌తోనే థియేటర్లో చిత్రం రికార్డ్ చేసి.. దానిని మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు అమ్ముతున్నట్లు గుర్తింపు ఈస్ట్ గోదావరికి చెందిన కిరణ్ వనస్థలిపురంలోని NGOs కాలనీలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తింపు
View More
Latest News
03 Jul 2025 16:17 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి సీఐ ఎస్సై ఆధ్వర్యం లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Y. రామారావు , ఎస్సై M. మురళి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన విద్యార్థులతో చర్చిస్తూ, బాగా చదువుకోవాలని, సమాజంలో క్రమశిక్షణతో ప్రవర్తించాలని, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మీరు చదువులో మెరుగ్గా ప్రవర్తించి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. అలాగే, పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ల మధ్య తేడా ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో పెద్దల సహాయం తీసుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన కల్పించారు. పిల్లలు ఎటువంటి అనుమానాస్పద పరిస్థితిని ఎదుర్కొన్నా భయపడకుండా గురువులకు లేదా పోలీసులకు చెప్పాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, పిల్లల పట్ల ప్రేమతో, శాంతంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎలా మార్గనిర్దేశనం చేయాలో కొన్ని విలువైన సూచనలు చేశారు. చివరిగా, విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ తరఫున పెన్నులు అందజేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
View More
Latest News
02 Jul 2025 21:11 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
పోగొట్టుకున్న బంగారాన్ని బాదితులకు తిరిగి అందచేసిన ప్రకాశం పోలీసులు
యర్రగొండపాలెం మండలం, అయ్యంబోట్లపల్లి గ్రామానికి చెందిన పెదపోగు కోటయ్య అనే వ్యక్తి 31/05/2025 తేదీన యర్రగొండపాలెంలోని ఓ బ్యాంకులో గోల్డ్ పెట్టి తన కుటుంబ అవసరార్థం డబ్బులు తీసుకుందామనే క్రమంలో యర్రగొండపాలెం వచ్చాడు. పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సోడా తాగుతూ గోల్డ్ జారవిడుచుకొని వెళ్ళి పోయినాడు. బ్యాంకు కి వెళ్లి చూస్తే గోల్డ్ ఉండదు తిరిగి వెళ్లి ఆ సోడా బండి దగ్గర వెతుకుతూ ఉండగా సోడా బండి యజమాని ఏమైందని అడుగుగా, ఇక్కడ సోడా తాగుదామని వచ్చి గోల్డ్ పోగొట్టుకున్నాను బ్యాంకు కి వెళ్లి ఎంత చూసినా కనిపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సోడా బండి యజమాని అతను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి సోడా తాగిన విషయాన్ని గమనించి సోడా బండి అతనికి ఫోన్ పే చేసిన విషయాన్ని అతనికి చెప్పాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్సై పి చౌడయ్య వెంటనే స్పందించి ఫోన్ పే నెంబర్ ను ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. బాధిత వ్యక్తికి గోల్డ్ అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ పోయిన తన బంగారంను వెతికి తనకు అప్పగించేందుకు కృషి చేసిన ఎస్సై పి చౌడయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
02 Jul 2025 08:03 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: కపురం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమాలు
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా.., ప్రకాశం జిల్లా (ఐఆర్సీయస్)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, దరిశి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చేతన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజన,ప్రకాశం జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూధనరావు,ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ సుజన మాట్లాడుతూ.., సీజనల్ వ్యాదులపట్ల అప్రమత్తంగా వుండాలని సిబ్బందికి సూచించారు.మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక విషజ్వరాలు రాకుండా ప్రతి శుక్రవారం దోమల నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు తెలిపారు.జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఉద్దేశించి కపురం శ్రీనివాసరెడ్ఢి మాట్లడుతూ...., వైద్యులు కనిపించే దేవుళ్ళని,ప్రజలకోసం అహర్నిశలూ శ్రమిస్తుంటారని, ప్రపంచంలో వైద్యుల సేవలు వెలకట్టలేమని కపురం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ డే సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజనను,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూధన్ రావును కపురం శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్నెమ్ లు,ఆశావర్కర్లు,వైద్యశాల సిబ్బంది కలిసి డాక్టర్ చేతన్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి సుబ్బారెడ్డి,దరిశి మలేరియా ఇంచార్జి బసవారెడ్డి,హెచ్.వీ సుహాషిణి,జె.సుశీలమ్మ యావన్మంది వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
02 Jul 2025 07:42 AM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
భారీ పేలుడు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
TG: పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు పరిసర ప్రాంతాల్లో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా మరణించారని అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అటు పటాన్చెరు ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
View More
Latest News
01 Jul 2025 17:45 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు యువతకు ఇప్పుడే సరైన అవకాశం: జగన్
వైయస్‌ఆర్‌సీపీలో యూత్‌ వింగ్‌ అనేది చాలా క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర , పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు యువతకి గొప్ప అవకాశం ఉంది అని ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు.
View More
Latest News
01 Jul 2025 14:29 PM
4
1
Newsread Image

No.1 Short News

Newsread
జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన డా||గొట్టిపాటి లక్ష్మి
వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే డాక్టర్లను దేవునితో సమానంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతారు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వైద్యులకు నా శుభాకాంక్షలు. జూలై 1 ప్రఖ్యాత వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా.బిడన్ చంద్ర రాయ్ గారి పుట్టిన మరియు మరణించిన రోజు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. ప్రతి ప్రాణం కోసం పోరాడే యోధులు వారు. వైద్యుడు తన చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నప్పుడు, అది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. డాక్టర్ల కృషి, త్యాగం సమాజానికి వెలకట్టలేనిది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటంలో వైద్యులు చేస్తున్న కృషి మరువలేనిది. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనారోగ్య సమస్యలతో, వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదు. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం పూర్తిస్థాయి వైద్య సేవలు అందాలన్నదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.
View More
Latest News
01 Jul 2025 13:21 PM
4
1
Newsread Image

No.1 Short News

Newsread
వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు సులబంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఆహరం కూడా. అందుకే, వర్షాకాలంలో తీసుకునే ఆహరం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను, కూరగాయలను ఈ వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటి? వాటిని ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో తినకూడని కూరగాయలు: 1.బీరకాయ, సొరకాయ: ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి. అలాగే బాక్టీరియా, ఫంగస్ త్వరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రకం కూరగాయల్లో ఏది మంచిది. ఏది పాడైంది అని గుర్తించడం చాలా కష్టం. అందుకే వర్షాకాలంలో ఈ కూరగాయలను తక్కువగా తీసుకోవడం మంచిది. 2.ముల్లంగి: ముల్లంగి భూమిలోపల పెరిగే కూరగాయ. వర్షాకాలంలో ఇలా మట్టి నుంచి వచ్చే కూరగాయల్లో సూక్ష్మజీవులు, బాక్టీరియా, పరాన్నజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన శరీరంలో చేరి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. 3.పచ్చి కూరగాయలు: వర్షాకాలంలో పచ్చిగా ఉండే కూరగాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీరు, తడి వాతావరణం వల్ల బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మ సమస్యలకు కారణం కావచ్చు. 4. ఆకు కూరలు: నిజానికి మనిషి ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. కానీ, వర్షాకాలం మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, ఈ కాలంలో ఆకు కూరలపై మట్టితో పాటు ఫంగల్ స్పోర్లు ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. సరిగ్గా శుభ్రపరచకపోతే వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు. అయినా సరే తినాలని అనుకుంటే మాత్రం బాగా ఉడికించి తినాలి. 5.మష్రూమ్స్: ఇవి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇవి చాలా త్వరగా పాడవుతాయి. వాటిని గుర్తించకపోవడం వల్ల అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలం మష్రూమ్స్ తినడం మంచిది కాదు. కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీటి శాతం తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. బాగా ఉడికించి లేదా వేడిగా ఉండే ఆహారంగా తీసుకోవాలి. రంగు మారిన కూరగాయలు తినకూడదు. వర్షాకాలంలో శరీరం సహజంగానే కొంత బలహీనంగా ఉంటుంది. పైగా తడి వాతావరణం, వైరస్‌లు, బ్యాక్టీరియా అనారోగ్యాలకు గురి చేస్తాయి. అందుకే కొన్ని కూరగాయలు తినడాన్ని తాత్కాలికంగా నివారించడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది.
View More
Latest News
30 Jun 2025 13:56 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
ఇక మొబైల్ యాప్తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్లో అమలు
బీహార్ : కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు.
View More
Latest News
29 Jun 2025 23:25 PM
1
21
Refresh Page
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (706)
  • Motivation (10)
  • Crime News (20)
  • Local Ads (37)
  • Entertainment (15)
  • Local Updates (194)
  • Sports News (12)
  • Education (10)
  • Business Promotions (1)
  • Politics (64)
  • Breaking News (96)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.