మైనర్ విద్యార్థి పై కేసు నమోదు చేసిన పోలీసులు:
ఒంగోలు క్రైమ్: 8 నెలల గర్భం దాల్చిన దివ్యాంగ బాలిక దుర్ఘటన ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలానికి చెందిన మహిళకు పిల్లలు లేకపోవడంతో తన తమ్ముడు పిల్లల్లోని ఒక కుమార్తెను దత్తత తీసుకొని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బద్రుల ఆశ్రమంలో చేర్పించింది. అనంతరం ఇంటర్మీడియట్ కు బాపట్ల జిల్లాలో బద్రుల ఆశ్రమంలో చేర్పించింది . బాలిక కాలుల్లో నీరు చేరడం వల్ల ఒంగోలు జిల్లాలోని జిహెచ్కి తరలించి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఎనిమిది నెలల గర్భం ధరించిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని మేనత్తకు చేరవేశారు. బాలికను మేనత్త ప్రశ్నించగా ఒంగోలులో బదురుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కొన్ని నెలల క్రితం అర్ధరాత్రి తన వద్దకు వచ్చి నోరు మూసి అత్యాచారం చేశాడని .తన సైగలతో తెలియజేసింది. విషయం తెలుసుకున్న తన మేనత్త ఒంగోలులో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అడ్డు తగిలితే, తల్లిదండ్రులని కూడా లేపేస్తున్నారు.
కొన్నాళ్లగా ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని రికార్డ్ అవుతున్నాయి!
ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్ లు ఇవే కనిపిస్తున్నాయి, అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలు, అడ్డు వచ్చిన భర్తలను లేపేస్తున్నారు, అడ్డు వస్తె తల్లి నీ కూడా చంపేస్తున్నారు, అది కూడా మానవత్వం లేకుండా అతి కిరాతకంగా చంపుతున్నారు, ఈ సందర్భంగా మగవారు భయపడే పరిస్తితి వచ్చిందని కొందరు వాపోతున్నారు.
ఏపీలో దారుణం.. ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే..!
గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ను అతని భార్య ప్రియుడితో కలిసి పెళ్లయిన నెలరోజుల్లోనే హత్య చేయించిన ఘటన మరవక ముందే ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను వేరే వ్యక్తితో పెట్టుకున్న సంబంధాన్ని మందలిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్ బాబు (43), అనిత దంపతులు. వారు పిల్లలతో కలిసి నగర శివారు సదాశివకాలనీలో ఉంటున్నారు. సురేశ్ హోటల్ నడుపుతున్నాడు. భార్య అనిత ఓ హోటల్ లో దినసరి కూలీగా పనిచేస్తుంది. అదే కాలనీలో ఉంటున్న బాబావలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించిన భర్త సురేశ్ బాబు పలుసార్లు ప్రశ్నించాడు. అనుమానంతో మద్యం తాగివచ్చి వేదిస్తుండేవాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని అనిత ప్లాన్ వేసింది. భర్తను హత్య చేయాలని పదిరోజుల నుంచే భార్య పథకం పన్నింది. పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రియుడు బాబావలీకి ఫోన్ చేసి.. తన భర్త మద్యం తాగి ఒంటరిగా ఇంటికి వస్తుంటాడని, దారికాచి ఈ రోజే హత్య చేయాలని చెప్పింది. దీంతో బాబావలీ దారిమధ్యలో కాపుకాసి బీరు బాటిల్ తో సురేశ్ బాబుపై దాడి చేశాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తనతో తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపేశాడు. ఆ తరువాత బండరాయితో అతని తలపై పలుసార్లు మోది చంపేశాడు. బుధవారం తెల్లవారు జామున కొందరు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఘటనస్థలిలో గుమ్మికూడారు. అక్కడికి వచ్చిన బాబావలీ.. మృతుడి వివరాలను పూసగుచ్చినట్లు చెప్పి వెళ్లిపోయాడు. అతనిపై పోలీసులకు అనుమానం రావడంతో జాగిలంతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు.జాగిలం నేరుగా వెళ్లి నిందితుడు బాబావలీ ఇంటి పరిసరాల్లో ఆగింది. ఈ విషయం తెలుసుకున్న బాబావలీ తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. ఆటోలో వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తాను సురేశ్ బాబును హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో మృతుడు భార్య అనితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
The Market Police have arrested 18 members involved in a pre-planned dacoity executed under the guise of a gold sale. The complainant was lured with an offer of 1 kg gold at a 5% discount for liquid cash. Accused, posing as SOT Rachakonda officials, entered the premises, assaulted the complainant, and fled with cash and mobile phones.
A secondary group later intercepted the primary accused and unlawfully took possession of the stolen cash. Seized property includes ₹43.21 lakhs in cash, 57 grams of gold ornaments, 23 mobile phones, 2 cars, and 4 two-wheelers. The operation was planned on June 18 and executed in Bowenpally. 10 accused are currently absconding. Investigation involved extensive CCTV analysis and witness statements.
The case was solved under the supervision of DCP North Zone, Ms. Rashmi Perumal, IPS.
The public is advised to exercise caution and report suspicious high-value transactions to the police.
డబ్బులు డబ్బులు చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం చేసిన దుండగులు
హైదరాబాద్ –చింతల్ పరిధిలోని సూర్యనగర్ లో ఉన్న రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ (35), తండ్లే చౌదరి స్వాతి (30), గతంలో ఎల్బీనగర్, అత్తాపూర్ లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు
రూ.లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు
ఒక్కొక్కరు రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, వీరిలో కొంతమందికి అధిక వడ్డి చెల్లించిన నిర్వాహకులు.
దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు, బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు
16 నెలల గడువు ముగిసినవారు గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించని నిర్వాహకులు.
ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కర్యాలయానికి చేరుకోగా, కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్
బెట్టింగ్ యాప్స్ వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయటం తప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా MAA అసోసియేషన్కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకుడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
మలక్పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్
మలక్పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్ కుమార్ అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని హత్య చేసిన వినయ్ శిరీషకు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన వినయ్ స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి భార్యను హత్య చేసిన వినయ్ శిరీష గుండెపోటుతో చనిపోయిందని మేనమామకు తెలిపిన వినయ్ మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పిన మేనమామ శిరీష మేనమామ వచ్చేంతలోగా డెడ్ బాడీని తరలించిన వినయ్ సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ ని ట్రేస్ చేసి పట్టుకున్న మేనమామ పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని దోమలు పెంట వద్ద పట్టుకున్న మేనమామ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా హత్య చేసినట్లు నిర్ధారణ వినేయతోపాటు సోదరిని అరెస్టు చేసిన పోలీసులు
వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లు తెలిపిన వైద్యులు ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించాలని చూసిన సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా జిమ్ కి వెళ్తున్న సమయంలో పరిచయమైన సామెల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఫ్లోరా సుమంత్ రెడ్డిని చంపేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసుకున్న ఫ్లోరా, సామెల్ వరంగల్లో కారుని అడ్డగించి నడిరోడ్డుపై సుమంత్ రెడ్డిపై ఐరన్ రాడ్లతో దాడి చేసిన నిందితులు.. వీళ్లకు సహాయం చేసిన పోలీస్ కానిస్టేబుల్ దాడిలో తీవ్రంగా గాయపడి 8 రోజులు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి మరణించిన సుమంత్ రెడ్డి
5వ తరగతి విద్యార్థిని పై సైకో టీచర్ లైంగిక వేధింపులు
ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ఉ పాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్ కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
ఖమ్మం జిల్లాలో దారుణం
మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఆ చిన్నారి కేకలు వేయ్యటంతో పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ADMS ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరుతో 40 వేల కోట్ల రూపాయల భారీ స్కాం పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసిన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ADMS ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సంతోష్ కుమార్ పతనబోయిన అనే కాంగ్రెస్ నాయకుడు ఇతనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు
క్రిప్టోకరెన్సీ స్కామ్లో టాలీవుడ్ హీరోయిన్స్
పుదుచ్చేరి ఫిబ్రవరి 28,2025: తమిళనాడు పుదుచ్చేరి లోని క్రిప్టోకరెన్సీ స్కామ్ లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 60 కోట్ల స్కామ్ జరిగినట్టు నిందితుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్కు సంబంధించిన వివాదంగా మారింది. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనకు సంబంధించి, పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసుల విచారణలో తమన్నా, కాజల్ అగర్వాల్లను కూడా విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లు నిందితులు వెల్లడించారు. ఇప్పటికే, పుదుచ్చేరి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఆశోకన్ ఫిర్యాదు మేరకు, నిందితులు నీతీష్ జైన్, అరవింద్ కూమార్ అరెస్టయ్యారు. వారు చెప్పిన ప్రకారం, 2022లో కోయంబత్తూరులో జరిగిన క్రిప్టోకరెన్సీ లాంచింగ్ ఈవెంట్లో తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో వీరు ప్రమోట్ చేసిన క్రిప్టోకరెన్సీ, స్కామ్లో భాగమై ఉండవచ్చుననే అనుమానాలు పెరిగాయి.
అశ్లిల వీడియోస్ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ని బెదిరించి రూ, 2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త
అశ్లీల వీడియోల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త
నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్పల్లిలో హాస్టల్లో నివసిస్తుంది
అదే హాస్టల్లో చిన్ననాటి స్నేహితురాలు కాజా అనుషా దేవి పరిచయం అయింది. అనుషా దేవి భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను కూడా పరిచయం చేసింది
ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్.. భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు
ఫోనులో వేరే సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు
తానే బెదిరిస్తున్నాడని తెలియక బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్ కు చెప్పింది. ఆ విషయం సెటిల్ చేస్తానని.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని, అనేక సాకులు చెప్పి రూ.2,53,76,000 తీసుకున్నాడు
మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
నిందితుడు దేవానాయక్ను అరెస్టు చేసిన పోలీసులు రూ.1,81,45,000 స్వాధీనం చేసుకున్నారు
రెండో పెళ్లి చేసుకున్న భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
మరో పెళ్లి చేసుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
పల్నాడు - రెండేళ్ల క్రితం ఆకుల వాసు, నవ్యశ్రీకి వివాహం చేసిన పెద్దలు
అయితే వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్న వాసు
కొంతకాలం నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరిగిన వాసు, గాయత్రి
సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో వెళ్లిన మొదటి భార్య నవ్యశ్రీ
నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడి - news credits by Telugu Scribe
వృద్ద మహిళలకు మత్తుమందు ఇచ్చి వరుస దొంగతనాలు చేసున్న కిలాడీ లేడిని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు
మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న మరియు ఆభరణాల షాప్ ల్లో బంగారం కొనడానికి అని వెళ్ళి దొంగతనాలు చేస్తున్న మహిళ ను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి సుమారు Rs 35,00,000/- విలువ గల 460 గ్రాముల బంగారు ఆభరణాలు. మత్తు టాబ్లెట్లు స్వాదీనం చేసుకోవడం జరిగినది. ముద్దాయి గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చినట్టు, ఆమె టీవి లో వస్తున్న ఒక టీవీ సీరియల్ చూసి ఒంటరి వృద్ధ మహిళలని టార్గెట్ చేసి, వారికి మాయమాటలు చెప్పి, వారితో తెలిసినా మహిళగా మెలిగి, కూల్ డ్రింక్స్ లో కలిపి వారికి ఇచ్చి వారు నిద్రపోయ్యాక వారి వంటి మీద ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేసుకొని పోతుంది. ఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచినఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోతోందని అత్తింటి వారి వేధింపులు.. మహిళ ఆత్మహత్య
ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోవడమే ఆమెకు శాపమైంది. దానినే పట్టుకుని భర్త, అత్తింటివారు వేధించడంతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మళప్పురంలో జరిగిందీ ఘటన. కాలేజీ విద్యార్థిని అయిన షహానా ముంతాజ్ ఈ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంగ్లిష్ రాదంటూ అత్తింటి వారు నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.