బెంగుళూరు టు గుంటూరు డ్రగ్స్ రవాణా–స్మగ్లర్ల అరెస్ట్
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్పస్ ఫండ్ చెక్కులను పోలీస్ కుటుంబ సభ్యులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ది.17.04.2025 తేదిన అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ G.వీరయ్య సతీమణి సౌజన్య లక్ష్మీ గారికి మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ది.21.04.2025 తేదీన మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ K.క్రాంతి కుమార్ సతీమణి శ్రీమతి K. ప్రవీణ గారికి కపోలీస్ శాఖా తరపున అదనపు కార్పస్ ఫండ్ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.100,000/- చొప్పున రూ.2,00,000/-- రూపాయలను ఎస్పీ చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీ అద్దంకి. వెంకటేశ్వర రావు గారు అందజేయడం జరిగింది.
మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా..? ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇలా..
Gold Rate: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం వరకు రికార్డు స్థాయి ధరలను నమోదు చేసిన బంగారం.. క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వివాదం సర్ధుమణగడంతోపాటు.. అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ విషయంలో ఇరు దేశాలు వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 930 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ 40 డాలర్లు తగ్గి.. 3,293 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే.. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.5వేలు తగ్గింది. మరోవైపు.. వెండి ధర కూడా తగ్గింది.
జగన్ పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రెంటపాళ్ల ఎపిసోడ్ లో నెక్ట్స్ ఏం జరగబోతోంది..
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన టూర్ ముగిసి వారం అయింది. అయినా డైలీ అదే హాట్ టాపిక్గా ఉంటోంది. రోజుకో డెవలప్మెంట్..విమర్శకు, ప్రతి విమర్శ..అంతకు మించి కేసులు, నోటీసులు, కారు సీజ్తో..పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. వైసీపీ అధినేత ఏకంగా కోర్టు మెట్లెక్కారు. అటు జగన్ సెక్యూరిటీ, భద్రతకు ఢోకా లేదంటూ..పెద్ద షాకే ఇస్తుంది ప్రభుత్వం. రెంటపాళ్ల ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జగన్ను విచారణకు పిలుస్తారా? పోలీసులు వెహికల్ సీజ్ చేశారంటే..వాట్ నెక్స్ట్?
అధికారం మారిన వన్ ఇయర్లోనే ఏపీ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్లో..ఏదో ఒక టాపిక్ హెడ్లైన్గా ఉంటూనే ఉంది. లేటెస్ట్గా గుంటూరు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపింది. టూర్కు అనుమతి లేదంటూనే సెక్యూరిటీ విషయంలో సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయినా జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఈ ఇష్యూలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన డ్రైవర్, పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు పెట్టారు పోలీసులు. జగన్ డ్రైవర్ను అరెస్ట్ చేయగా..సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న జగన్కు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగమంటూ..పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..?
మరోవైపు రెంటపాళ్ల టూర్పై రచ్చ నడుస్తుండగానే జగన్పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు.!. ఇదే సమయంలో..మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారనేది కూడా అభ్యంతరం ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. అయితే ఈ కేసుపై జగన్తో సహా నిందితులుగా ఉన్నవారంతా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుంది..కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే జగన్ అలిగేషన్స్కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకున్నా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని..వైసీపీ క్యాడర్ రెచ్చిపోయినా పోలీసులు సంయమనంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది కూటమి సర్కార్.
సచివాలయంలోని తన చాంబర్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
అమరావతిః కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్.. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు.
దర్శి: పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సమావేశం.
ఎన్నికల సంబంధించి దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి అధ్యక్షతన 9-6-2025 న ఉదయం 11 గంటలకు దర్శి తహశిల్దార్ వారి కార్యాలయం నందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు దర్శి తాసిల్దార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మరణించిన వారిని ఫారం-7 ద్వారా తొలగించాలని,చిరునామా మార్పు అయినవారు వారు ఫారం-8 ద్వారా అప్లై చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు టి. దేవ ప్రసాద్, అఫ్రోజ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,పుల్లలచెరువు సత్యనారాయణ,మారెళ్ళ వెంకటేశ్వర్లు,టి బాబూరావు, మాడపాకుల శ్రీనివాసరావు, యస్ పౌలేసు, పి చిరంజీవి పాల్గొన్నారు.
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకులను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం, సోమవరపాడు, దారంవారిపాలెం గ్రామాలలో సోమవారం ఏవో ప్రసాదరావు పర్యటించారు. వర్షానికి తడిసిన వరి ఓదెలను ఆయన పరిశీలించారు. కోసిన వరి పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా బయటకి పంపించాలని రైతులకు సూచించారు. నివేదికను మండల, జిల్లా కార్యాలయాలకు తెలపాలని అన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాళ్లూరులో ఎంపీడీవో దార హనుమంతరావు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు షుగర్, బీపీ వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ ఆయా వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే
బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
భారత్ మాతా కీ జై అంటూ గర్జించిన దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ప్రతి చర్యను ప్రశంసించిన దర్శి తహసీల్దార్ భారత్ మాతా కీ జై అంటూ నిందించి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
దర్శి ప్రజల ఆశా దీపం, ఎందరో యువతులకు ఆదర్శం, కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం కి మారుపేరు, దర్శి కి మార్గదర్శి, దర్శి నియోజకవక వర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి మాతృమూర్తి కి న్యూస్ రీడ్ యాప్ యాజమాన్యం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ వేదిక
ఈరోజు మచిలీపట్నం లోని MR ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది కి పైగా వధూవరులు విచ్చేసి వారి ప్రొఫైల్ పరిచయకార్యక్రమంలో పాల్గొన్నారు. MR ఫంక్షన్ హాల్ అధినేత దాదా గారి ఆద్వర్యం లో LED స్క్రీన్స్ మీద వధూవరుల ప్రొఫైల్ ను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే ఆలోచన చేస్తున్నట్లు నిర్వాహకులు దాదా కుమార్తె, అల్లుడు మతీన్ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన పలు ప్రజాసంఘాల నాయకులు..
గత 30 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ అమలు ను మాదిగ జాతి తో పాటు 58 ఉపకులాలు జాతి ప్రజలు వినియోగించుకోవాలని పలువురు వక్తలు కోరారు. ముందుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల అంబేద్కర్ విగ్రహం నుండి దర్శి నియోజకవర్గంలోని మాదిగ జాతి ఉద్యోగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు గత 30 సంవత్సరాలలో జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఆటు పోట్లను అనుభవించారని ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగాల ఫలితమే నేటి వర్గీకరణ రావడానికి కారణమన్నారు. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఫలాలను మాదిగ జాతి తో పాటు ఉపకులాలలోని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే దిశగా ఉండాలని భక్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు నేరెళ్ల జాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జాతీయ మాదిగ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు బొంత ఏసుదాసు. ప్రకాశం జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు తాళ్లూరి ఆల్ఫ్రెడ్. తాళ్లూరి శేషు. నూనె పాల్ గాంధీ. రిటైర్డ్ ఎస్సై దారి వేముల ఎలీషా. కేసనపల్లి కోటేశ్వరరావు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ మాదిగ. నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ. మాదిగ విద్యార్థి సంఘ నాయకులు రాచపూడి కరుణానిధి. కంభం పాటి జోసెఫ్ మాదిగ. ఎమ్మార్పీఎస్ నాయకులు రాజపూడి మోషే. గూడూరి నాగమల్లేశ్వరరావు. పలువురు డప్పు కళాకారులు ఎమ్మార్పీఎస్. ఎం ఈ ఎఫ్. పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బుధవారం బంద్ నిర్వహించినట్లు వైన్స్ సిండికేట్ సభ్యులు తెలిపారు. సిండికేట్ సభ్యుల కథనం మేరకు.. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు నిరసనగా మద్యం షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. అలానే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. 600కు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల మండల టాపర్గా నిలిచాడు. టీచర్లు అతడిని అభినందించారు.
వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. 'నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా' అని సీఎం హెచ్చరించారు.
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు.
16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు
దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
హయి ఫ్రెండ్స్... నా పేరు ఉదయ్ కుమార్... వీడియోగ్రాఫర్ 2... 16 ໖໖ 2025 ໖ 09:45 10:45 సమయం లో ఒంగోలు లోని కర్నూల్ రోడ్డు నందు గల కూరపాటి కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన నా బైక్ AP 39SC 4664 నెంబర్ గల పాల్సార్ 125cc రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు... రెడ్ అండ్ బ్లాక్ కలర్ సిట్... హెడ్ లైట్ మీద UKCaptures అని మరియు లోగో.... బ్యాక్ సిట్ సైడ్ డోము ల మీద UKCaptures అని స్టిక్కర్లు వుంటాయి
ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఎవరైనా చూస్తే దయచేసి నాకూ తెలియ చేయమని కోరుతున్నారు
మీ ఉదయ్ కుమార్
9652020050
ఒంగోలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాశ్ అమెరికాలో మృతి చెందాడు. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్కు నెల క్రితమే వివాహమైంది.
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి
ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు.
చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ జాతర తిరునాళ్ల సోమవారం జరగనుంది. ఈ వేడుకలకు తాను హాజరు అవుతున్నట్లు సినీ నటి హెబ్బా పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
తూర్పు గంగవరం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ గుడిలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి టెంకాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కార్య క్రమంలో EX ఎంపీపీ పోశం సుధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
గత ప్రభుత్వంలో నిర్మాణ దిశలో ఆగిపోయిన ఇళ్లను గురువారం జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు SC, BC సామాజిక వర్గాలకు రూ.50వేలు, ST సామాజిక వర్గానికి రూ.75వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ 1లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముండ్లమూరు పోలీసులు గురువారం ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గ్రామాలలో ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తాళ్లూరు మండలంలోని విఠలాపురం, బెల్లంకొండ వారి పాలెం గ్రామాలలో రీ సర్వే అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం కలిగిన ప్రతి రైతు సహకరించాలని తహశీల్దార్ సంజీవరావు కోరారు. అలాగే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డీటీ ప్రశాంత్, మండల సర్వేర్ అధికారులు పాల్గొన్నారు.
చీమకుర్తి : ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జైలు
చీమకుర్తి - గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలను అందించాలని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలను సకాలంలో వేయాలని సూచించారు. వేసవిలో వడదెబ్బ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
తాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
తాళ్లూరు మండలంలో గురువారం DHH శ్రీనివాస ప్రసాద్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వివిధ దశలో ఉన్న హౌసింగ్ అదనపు సాయం గురించి చర్చించారు. అలాగే గ్రామంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మార వెంకారెడ్డి పాల్గొన్నారు.
తూర్పు గంగవరం పవర్ స్టేషన్ పనులను పరిశీలించిన అధికారులు
తూర్పు గంగవరంలోని నిర్మాణ భాగంలో ఉన్న 132/33 KV పవర్ స్టేషన్ను బుధవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరిగే విధానాన్ని, పవర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే నిర్మాణానికి నాణ్యమైన మెటీరియల్ వాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SE k. వెంకటేశ్వర్లు, EE P. శ్రీనివాసులు, AE V. శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండల కేంద్రంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరులో ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు అంతరాయం ఉంటుందని చెప్పారు. కావున వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ సహకరించాలని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు కోరారు.
ముండ్లమూరు - తాళ్లూరు రహదారిలోని శ్రీరామ్ మిల్క్ డైరీ వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని సైడ్ కాలవలో స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
తాళ్లూరు మండలంలోని వెలుగురిపాలెం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వేసవికాలంలో నీటికి కొరత లేకుండా చూడడమే లక్ష్యమని MPDO దారా హన్మంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, శ్యాగం కొండారెడ్డి, MPP తాటికొండ శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
తూర్పు గంగవరం: ముస్లిం సోదరులతో ఈద్గా మైదానం లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామములో రంజాన్ సందర్భంగా ఈద్గా లో నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామం లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు, ఈ కార్యక్రమంలో వేముల గ్రామం లోని పిల్లలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
* సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
* సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం
మనదే : ఉత్తమ్
* దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర: బండి
* AP: పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నేను CBNకు
మద్దతిచ్చా: పవన్
* SRHకు వరుసగా రెండో ఓటమి
దర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రావడంతో, ముండ్లమూరు ఎస్సై నాగరాజు తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
తూర్పు గంగవరంలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మల్లికార్జునరావు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. సెల్ఫోన్, అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం కొరపాటివారిపాలెంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పంచాయతీరాజ్ EE కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 58 పనులకు 3 కోట్లు మంజూరు కాగా 53 పనులు లు పూర్తయ్యాన్నారు. అలానే నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల AE వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తాళ్లూరులో అగ్ని ప్రమాదం.. రైతుకు రూ.8 లక్షలు నష్టం
తాళ్లూరు గ్రామంలో ఎడమ కంటి నాగిరెడ్డికి చెందిన పొగాకు బ్యార్ని ప్రమాదవశాత్తు బుధవారం తెల్లవారు జామున దగ్ధం అయింది. పొగగొట్టంపై పొగాకు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రైతు తెలిపారు. దాదాపు 1200 పొగాకు కర్రలు రూ.8 లక్షల నష్టం వచ్చినట్లు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.