Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ రిపోర్టర్ - తాళ్ళూరు
*టిడిపి కార్యకర్తకు భరోసా*..
దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి కుమార్తె ఇటీవల యాక్సిడెంట్ కు గురై గుంటూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు, ట్రీట్ మెంట్ విధానం తెలుసుకొని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి...పార్టీ అండగా ఉంటుందని, అన్నీ విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.
View More
Politics
16 Mar 2025 22:34 PM
0
2
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయింది
ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నా నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరు - మీడియాతో చిట్ చాట్‌లో జగ్గారెడ్డి
View More
Politics
10 Mar 2025 13:42 PM
0
37
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం
ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం
View More
Politics
09 Mar 2025 16:42 PM
1
49
Newsread Image

No.1 Short News

T Mahesh
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి: పుట్టపర్తి ఎమ్మెల్యే వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం శాసనసభలో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. వాల్మీకి బోయ కుటుంబాలు రాయలసీమ ప్రాంతంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చితే వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని వారు తెలిపారు.
View More
Politics
07 Mar 2025 09:20 AM
0
19

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డి. తెలంగాణ మీద పగతో ఉన్నాడు - రేవంత్ రెడ్డి
ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ డ్రామాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణ పట్ల సానుభూతి తోనే ఉన్నాడు.. సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ మీద పగతో ఉన్నాడు - రేవంత్ రెడ్డి
View More
Politics
03 Mar 2025 09:54 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నేడు ఢిల్లీ కి సీఎం రేవంత్ , 37 వ సారి డిల్లీ ప్రయాణం
నేడు 37వ సారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి
Politics
03 Mar 2025 09:53 AM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కట్టుబాటును దాటిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాష్ నోటీస్ జారీ చేసింది. షోకాజ్ నోటీస్ కు , సరైన సమాధానం ఇవ్వకుండా అదేపనిగా క్రమశిక్షణను ముల్లంగించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు.
View More
Politics
01 Mar 2025 13:08 PM
0
24
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కిషన్ రెడ్డి పై విరుచుకు పడ్డా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కిషన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డ సీఎం రేవంత్‌.కిషన్‌రెడ్డి మోదీ భజన చేస్తున్నారు-సీఎం రేవంత్.బిహార్‌, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం.. తెలంగాణకు ఇవ్వడంలేదు-రేవంత్ కిషన్‌రెడ్డి వల్లే మెట్రో, మూసీ ఆగింది-రేవంత్.కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారు-రేవంత్ కేంద్రకేబినెట్‌లో పెట్టకుండా..మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు-సీఎం రేవంత్ కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదు రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయి-రేవంత్ ఏపీలో మీ ప్రభుత్వమే ఉందికదా..అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలేదు.బీసీ కులగణన జరిగితే అధికారం పోతుందని భయపడుతున్నారు ఆరేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి..తెలంగాణకు ఒక ప్రాజెక్ట్‌ అయినా తెచ్చారా-రేవంత్ఏ నాడైనా తెలంగాణ ప్రాజెక్ట్‌ కోసం ప్రధానిని కలిశారా కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్
View More
Politics
01 Mar 2025 12:28 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ బడ్జెట్ 2025 పై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ కామెంట్స్.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన క్లిష్టపరిస్థితి నుండి ఆంధ్రరాష్ట్రన్ని గట్టెంకిచ్చడానికి చర్యలు చేపడుతూ 3లక్షల 22వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ విడుదల చెయ్యటంపై, అలాగే సూపర్ 6 అమలు చేస్తూ బడ్జెట్ కేటాయింపులు ఉండటంపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర చరిత్రలో బడ్జెట్ 2025 నందు అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీల) బడ్జెట్ కొరకు 5434 కోట్లు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి 5434 కోట్ల రూపాయల నిధులు సాధించిన మైనారిటీ ,న్యాయ శాఖ మంత్రి NMd ఫరూక్ ని సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియచేసారు.
View More
Politics
28 Feb 2025 20:40 PM
1
20

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు – కేఏ పాల్
ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు ? పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు – కేఏ పాల్
View More
Politics
28 Feb 2025 15:09 PM
0
17

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పోసాని కృష్ణ మురళీ భార్య కు జగన్ ఫోన్ లో పరామర్శ
పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పోసాని అరెస్ట్‌ను ఖండించిన ఏపీ వైఎస్‌ జగన్‌ పోసాని కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
View More
Politics
27 Feb 2025 14:28 PM
0
20
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
చీరాల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కరణం వెంకటేష్
శివపార్వతుల కృప కటాక్షాలు ప్రజలపై చల్లగా ఉండాలని,మహాశివరాత్రి సందర్భంగా చీరాల నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్.
View More
Politics
26 Feb 2025 15:50 PM
1
24
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
అసెంబ్లీలో గల మెత్తిన చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య
అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. సమయపాలన అద్భుతంగా చేశారని ప్రశంసించిన స్పీకర్ చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ పథకాన్ని అమలు చేసేమని గడిచిన 5 సంవత్సరాలలో ఒక కాలవలో పూడిక కూడా తీయలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాలవలు రోడ్స్ పనులు చేశామని గత ప్రభుత్వంలో దాన్యమమ్మితే డబ్బులు చెల్లించలేదని అప్పులు కూడా కూటమి ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
View More
Politics
25 Feb 2025 16:15 PM
3
39
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
జోగి రమేశ్, దేవినేని అవినాశ్ లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఏపీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంలపై దాడి కేసులపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ సహా 20 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీం విచారించింది. వీరందరికీ సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది.
View More
Politics
25 Feb 2025 15:15 PM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా తెస్తా అన్నావ్... ఏమైంది జ‌గ‌న్: మంత్రి లోకేశ్ సెటైర్లు
ఈరోజు బ‌డ్జెట్ స‌మావేశాల‌లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి శాస‌నమండ‌లిలో ధ‌న్య‌వాదాలు తెలిపే క్ర‌మంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సెటైర్లు వేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్ కేంద్రం మెడ‌లు వంచి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెస్తానంటూ ఊద‌ర‌గొట్టార‌ని, చివ‌రికి ఏమైంద‌ని ఎద్దేవా చేశారు. ఇక గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో నాలుగు ల‌క్ష‌ల మందికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించామ‌ని ముందే ఎలా చెబుతారంటూ విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. దానికి మంత్రి లోకేశ్ స‌మాధాన‌మిస్తూ... రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రానికి రూ. 13 వేల కోట్ల పెట్టుబ‌డులు తీసుకొచ్చామ‌ని తెలిపారు.
View More
Politics
25 Feb 2025 14:55 PM
0
32
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు.. మాకు కాదు: మంత్రి నారా లోకేశ్‌
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాన‌న్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్‌ సవాల్ విసిరారు.
View More
Politics
25 Feb 2025 13:50 PM
0
28
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మండలిలో లోకేశ్ వర్సెస్ బొత్స
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేశ్ మంగళవారం శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేశ్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీయే కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
View More
Politics
25 Feb 2025 12:59 PM
0
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నేడు 11:30 am కి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లపై కోర్టు లో విచారణ
నేడు 11:30 గంటలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో సృష్టంగా చెప్పాలని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు నేడు తీర్పు వచ్చే అవకాశం.. సర్వత్రా ఆసక్తి
View More
Politics
25 Feb 2025 10:51 AM
0
24
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
View More
Politics
24 Feb 2025 10:34 AM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఓవరాక్షన్
బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ ఓవర్ యాక్షన్! టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ ముసేయించిన సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల - బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ వ్యక్తిద KTR టీ స్టాల్ అని పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్నాడు ఇవ్వాళ్ళ ఉదయం బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టీ స్టాల్ వద్ద మీ ఫోటో చూసి ఆగ్రహించిన కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా, హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయం అని ప్రశ్నించగా మాకు అవన్నీ తెల్వదు కలెక్టర్ హోటల్ బంద్ చేయించమని చెప్పాడని మున్సిపల్ అధికారులు చెప్పారు
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సచివాలయంలో కూడా నాసిరకం బోజనమే
గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు. అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
తెలంగాణ సీఎం రేవంత్ హాట్ వ్యాఖ్యలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన సీఎం వ్యాఖ్యలు కొందరు IAS, IPSలతో చెడ్డపేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నారని ఫీల్డ్ విజిట్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలుజరిచేశారని కొందరు అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తుండటం తో ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్లపై చర్యలకు అవకాశం ఉందని ఎన్నికల కోడ్ ముగిశాక భారీగా ప్రక్షాళన ఉండే ఛాన్స్ CM వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో పెద్దఎత్తున చర్చమొదలైంది
View More
Politics
18 Feb 2025 19:39 PM
0
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మధు యాష్కీ తో చిట్ చాట్
హైదరాబాద్‌: మీడియాతో మధుయాష్కీ చిట్‌చాట్‌ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది కులమేంటని అడగడమే రాజ్యాంగానికి వ్యతిరేకం పాతబస్తీలో మతకలహాలకు బీజేపీనే కారణం బీసీ కులగణనపై బీజేపీ నోరు మెదపడం లేదు డైవర్ట్ చేయడానికే కుల ప్రస్తావన తెచ్చారు-మధుయాష్కీ
View More
Politics
18 Feb 2025 19:38 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.
View More
Politics
08 Feb 2025 10:49 AM
1
55
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
ఢిల్లీలో గెలుపు దిశగా బీజేపీ.. చంద్రబాబు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఆధిక్యత దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ ను ఓటర్లు పక్కన పెట్టేశారు. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఆప్ 24, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోపైపు ఎన్డీయే భాగస్వామిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
View More
Politics
08 Feb 2025 10:40 AM
0
49
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
ఈరోడ్ ఉప ఎన్నిక.. ముందంజలో డీఎంకే!
తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్లలో డీఎంకేకు చెందిన వీసీ చందరాకుమార్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 51 మంది సిబ్బంది లెక్కింపులో పాలు పంచుకుంటున్నారు.
View More
Politics
08 Feb 2025 10:27 AM
0
43
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గిన మాట నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని అన్నారు. వాస్తవాలను వెల్లడించకుండా ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం దారుణమని అన్నారు.
View More
Politics
06 Feb 2025 18:39 PM
0
42
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మంత్రులు స్లోగా ఉంటే కుదరదు... ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా... శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
View More
Politics
06 Feb 2025 18:10 PM
0
37
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ కోసం కృషి చేస్తున్న ఫతావుల్లా
కర్నూలు అబ్దుల్ హాఖ్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు కేంద్ర విద్యా శాఖ మంత్రితో మాట్లాడిన రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా స్వాగతం పలికారు.
View More
Politics
06 Feb 2025 17:28 PM
3
41
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడిన వారిని పార్టీ చూసుకోవాలి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా కలిసినట్టు నాకు వార్తలు వచ్చాయి కానీ కొన్ని విషయాలు మీతో చర్చించలేను అంతర్గత విషయాలు మాట్లాడవద్దని రాహుల్ గాంధీ చెప్పకా నేను మాట్లాడట్లేదు మా సర్కారులో మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువ ముఖ్యమైన విషయాల్లో మాత్రమే సీఎం జోక్యం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతా - జగ్గారెడ్డి
View More
Politics
05 Feb 2025 12:08 PM
0
40
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
BRS పార్టీలో కొత్త వీప్ పదవులు
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కేపీ వివేకానంద గౌడ్, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లను నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
View More
Politics
05 Feb 2025 12:07 PM
0
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఆనాటి రోజులు మళ్లీ తెచ్చిన కాంగ్రెస్
ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిన కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యూరియా కోసం ఫర్టిలైజర్ దగ్గర గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు
View More
Politics
05 Feb 2025 12:05 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
రేపు ఢిల్లీ వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్న కేటీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం
View More
Politics
05 Feb 2025 10:57 AM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఆ ఎమ్మెల్యే లకి ఊహించని షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఉద్యోగం లో పెట్టిస్తాం అని ఆ ముగ్గురు మంత్రులు చెప్పి ఇప్పుడు జైలు కి పంపుతున్నారు
మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన 80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుంది మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే.. మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైంది - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మంత్రులపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న మంత్రులు నిన్న బీసీ కులగణన రిపోర్టును విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ కులగణన రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం ఆ కులగణన రిపోర్ట్ పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్న పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిన బీసీ జనాభా నిన్న బీసీ కుల గణన రిపోర్టుపై, బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండడంతో.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మంత్రులు - News Credits Telugu Scribe
View More
Politics
04 Feb 2025 07:05 AM
0
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
View More
Politics
03 Feb 2025 16:37 PM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!!
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నాటకాలు డబ్బులు లేవంటూనే ఒకవైపు కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ.. మరోవైపు 3,900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేలా పోరు.
View More
Politics
03 Feb 2025 14:34 PM
1
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
తాడిపత్రిలోని నా ఇంటికి వెళ్లడానికి కూడా వీసా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు: పెద్దారెడ్డి
తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. వీసా ఆఫీస్ ఎక్కుడుందో చెపితే అక్కడకు వెళ్లి అప్లై చేసుకుంటానని ఎద్దేవా చేశారు. తాడిపత్రికి వెళ్లడానికి కేతిరెడ్డి ఏర్పాట్లు చేసుకోగా... అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన పోలీసులు... పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలోని నివాసంలో గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
View More
Politics
03 Feb 2025 13:23 PM
1
16
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
సామాన్యుల అండగా MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు
ద్వారకాతిరుమలలో సామాన్యులకు అండగా MLA మద్దిపాటి వెంకటరాజు – సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేత ద్వారకాతిరుమల మండలం, దోరసానిపాడు గ్రామానికి చెందిన సయ్యద్ ఇమామ్ సాహెబ్ గారి కుటుంబానికి MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు అండగా నిలిచారు. గత 30 సంవత్సరాలుగా భూవివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబం తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి వారికి న్యాయం చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన MLA మద్దిపాటి వెంకటరాజు గారు, ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ద్వారకాతిరుమలలో కొత్త ఇంటి స్థలం కేటాయించి, అధికారికంగా పట్టా అందజేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, సామాన్యులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండటమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సహాయానికి సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు MLA మద్దిపాటి వెంకటరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
View More
Politics
01 Feb 2025 08:21 AM
4
38
Newsread Image

No.1 Short News

T Mahesh
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం మంత్రి సవితమ్మ
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు M.P.ఆంజినప్ప అనారోగ్యం తో బాధపడడం మండల నాయకుల ద్వారా తెలుసుకొన్న గౌరవ రాష్ట్రమంత్రివర్యులు శ్రీమతి.సవితమ్మ గారు తక్షణమే స్పందించి తన వంతుగా ఆర్థికసహాయం చేశారు.జై సవితమ్మ ~జై జై సవితమ్మ
View More
Politics
31 Jan 2025 10:37 AM
15
48
Newsread Image

No.1 Short News

T Mahesh
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులు గురించి తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి ని అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. శింగనమల నియోజకవర్గ పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ,అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
View More
Politics
31 Jan 2025 06:47 AM
0
33
Newsread Image

No.1 Short News

T Mahesh
రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పర్యటన వివరాలు
రేపు అనగా శుక్రవారం 31/01/2025 మంత్రి సవితమ్మ పర్యటన వివరాలు సాయంత్రం 03:00 గంటలకు పెనుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతన రెండు ఆర్టీసీ బస్సులను మంత్రి సవితమ్మ ప్రారంభించనున్నారు కావున నియోజకవర్గం కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మంత్రి గారి కార్యాలయం పెనుకొండ నియోజకవర్గం
View More
Politics
31 Jan 2025 06:47 AM
0
32
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్‌లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్‌లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
View More
Politics
23 Jan 2025 10:42 AM
4
46
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
View More
Politics
21 Jan 2025 23:35 PM
3
30
Refresh Page
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel