

No.1 Short News
న్యూస్ రీడ్ రిపోర్టర్ - తాళ్ళూరు*టిడిపి కార్యకర్తకు భరోసా*..
దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి కుమార్తె ఇటీవల యాక్సిడెంట్ కు గురై గుంటూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు, ట్రీట్ మెంట్ విధానం తెలుసుకొని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి...పార్టీ అండగా ఉంటుందని, అన్నీ విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.
View More
Politics
16 Mar 2025 22:34 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంజోగి రమేశ్, దేవినేని అవినాశ్ లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఏపీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంలపై దాడి కేసులపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ సహా 20 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీం విచారించింది. వీరందరికీ సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది.
View More
Politics
25 Feb 2025 15:15 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం మండలిలో లోకేశ్ వర్సెస్ బొత్స
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేశ్ మంగళవారం శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేశ్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీయే కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
View More
Politics
25 Feb 2025 12:59 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
View More
Politics
24 Feb 2025 10:34 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.
View More
Politics
08 Feb 2025 10:49 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంమంత్రులు స్లోగా ఉంటే కుదరదు... ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా... శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
View More
Politics
06 Feb 2025 18:10 PM


No.1 Short News
Saleem Sayyadసామాన్యుల అండగా MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు
ద్వారకాతిరుమలలో సామాన్యులకు అండగా MLA మద్దిపాటి వెంకటరాజు – సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేత
ద్వారకాతిరుమల మండలం, దోరసానిపాడు గ్రామానికి చెందిన సయ్యద్ ఇమామ్ సాహెబ్ గారి కుటుంబానికి MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు అండగా నిలిచారు. గత 30 సంవత్సరాలుగా భూవివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబం తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి వారికి న్యాయం చేశారు.
గోపాలపురం నియోజకవర్గానికి చెందిన MLA మద్దిపాటి వెంకటరాజు గారు, ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ద్వారకాతిరుమలలో కొత్త ఇంటి స్థలం కేటాయించి, అధికారికంగా పట్టా అందజేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, సామాన్యులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండటమే తన ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ సహాయానికి సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు MLA మద్దిపాటి వెంకటరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
View More
Politics
01 Feb 2025 08:21 AM


No.1 Short News
T Maheshముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులు గురించి తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి ని అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. శింగనమల నియోజకవర్గ పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ,అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
View More
Politics
31 Jan 2025 06:47 AM


No.1 Short News
Saleem Sayyadలోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం
ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
View More
Politics
23 Jan 2025 10:42 AM


No.1 Short News
Saleem Sayyadతిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు
ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
View More
Politics
21 Jan 2025 23:35 PM
You are offline
Please check your internet connection.
Close