Select Location
Newsread Image

No.1 Short News

Newsread
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి
బ్రేకింగ్ న్యూస్ మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి. ఆఫీస్ అద్దాలు ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం కార్లు ధ్వంసం .. ఇంకా కొనసాగుతున్న దాడి స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు
View More
Breaking News
28 Jun 2025 15:28 PM
0
8
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ, ఆత్మహత్య
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్‌లో యాంకర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ పూర్ణ చందర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో తన నివాసంలో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వేచ్ఛ గతంలో తన తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లోని వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసించగా, ఇటీవల జవహర్ నగర్‌లోని ఒక ఇంటికి మారినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒక వ్యక్తితో మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా టీవీ9 సహా పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా పనిచేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె ఈసీ మెంబర్‌గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
View More
Breaking News
28 Jun 2025 05:21 AM
1
32
Newsread Image

No.1 Short News

Newsread
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్‌(D) తిమ్మాపూర్‌(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు.
View More
Breaking News
26 Jun 2025 15:41 PM
0
32
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా?
బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు సూటి ప్రశ్న.... అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.... అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యే వరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది... ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బ తింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది... లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది..!
View More
Breaking News
26 Jun 2025 15:37 PM
4
43
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Breaking News
17 May 2025 11:26 AM
1
19
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ ప్రజలకు విన్నపము
దొనకొండలో గాలి బాగా వీచుతున్నది కరెంటు తీగలు ఎక్కడైనా మంటలు వస్తున్న తీగలు మీద ఎక్కడైనా చెట్టు కొమ్మలు. పడిన స్తంభాల దగ్గర ఎక్కడైనా మంటలు వచ్చిన కరెంటు తీగలు ఎక్కడైనా తెగిపడిన చూసిన వాళ్లు వెంటనే దయచేసి కరెంట్ ఆఫీస్ కి గాని మీకు తెలిసిన కరెంటు అధికారులకు గానీ ఫోన్ చేసి తెలియజేయగలరు Current Dkd: +919490615448‬ ‪Ae Donakonda Curent: +919440812246‬ ‪Ramakrishna Linmen: ‪+917659941607‬
View More
Breaking News
08 May 2025 18:54 PM
2
21
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో భూకంపం, రెండు సెకన్ల పాటు కనిపించిన భూమి
ఏపీలో భూ ప్రకంపనలు.. ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు
View More
Breaking News
06 May 2025 16:58 PM
10
300
Newsread Image

No.1 Short News

Newsread
మెగా డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారా లోకేష్ ఆదేశాలు జారీ
అమరావతి: జూన్ 6వతేదీ నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో 3గంటలకుపైగా సమీక్షించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
View More
Breaking News
05 May 2025 23:52 PM
3
70
Newsread Image

No.1 Short News

Newsread
RTC బస్సుల్లో phone pay ఫెయిల్, ఇబ్బంది పడ్డ మహిళలు.
విజయవాడ నుంచి మేదరమెట్ల వెళ్లేందుకు ముగ్గురు మహిళలు టికెట్ తీసుకుని, కండక్టర్ కి ఫోన్ పే చేయగా అమౌంట్ పే అయింది. టికెట్ రాలేదు, మళ్ళీ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పగా వారిలో ఒక అమ్మాయి వాగ్విదాం పెట్టుకోగా సదరు కండక్టర్ మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చేస్తా, ప్రస్తుతం మీ అమౌంట్ నేను ఇస్తాను అని మానవతా దృక్పథం చేయించటం . అయితే RTC తరపున ఏ తప్పిదం జరగలేదని కేవలం కండక్టర్, ఆ మహిళల మధ్య అవగాహన లోపం వల్లనే టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందినే ప్రయాణీకులు గుర్తించారు.
View More
Breaking News
04 May 2025 18:57 PM
3
39
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య..
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. లక్ష్మీ నారాయణ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా .. కైపు వెంకటకృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ,దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
View More
Breaking News
28 Apr 2025 16:33 PM
1
41
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
View More
Breaking News
18 Mar 2025 14:54 PM
0
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. 'లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు'ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
View More
Breaking News
18 Mar 2025 13:18 PM
0
17

No.1 Short News

Newsread
గుంటూరు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ సరిగా లేవని విద్యార్థుల ఆందోళన.అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూములకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు. కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు.
View More
Breaking News
17 Mar 2025 14:38 PM
2
30

No.1 Short News

Newsread
దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు
ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ,భద్రత మొదట ప్రాధాన్యత అని, ఆపదలో ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా శక్తి టీమ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మహిళలు భద్రత,రక్షణకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు,బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం లో ఒక ఎస్సై, ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఇంకా మద్దతు గా సబ్ డివిజన్ లో వున్న ఉమెన్ పీసీ లందరూ సపోర్ట్ గా వుంటారని తెలిపారు.ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా ఆపద ఎదురైతే శక్తి యాప్ లో ఆప్షన్స్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చునని దర్శి డీఎస్పీ తెలిపారు.
View More
Breaking News
17 Mar 2025 12:23 PM
4
73
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.
View More
Breaking News
16 Mar 2025 22:37 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు జి.జి.హెచ్ లో కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక పరిశీలన...
అది... జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రి. శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు ఒక కారు ఈ ఆసుపత్రిలోకి వచ్చింది. కారు దిగిన ఒక మహిళ నేరుగా క్యాజువాలిటి వార్డులోకి వెళ్లారు. చికిత్స పొందటానికి కాదు.... అక్కడ ఉన్న వారికి చికిత్స అందుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లిన ఆ మహిళను చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు ! కారణం... వచ్చినది సాధారణ మహిళ కాదు !.. జిల్లా కలెక్టర్ !!. ఔను.... ఒంగోలు జి.జి.హెచ్. (రిమ్స్) లో వైద్య సేవలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా ఈ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీతో పాటు గైనిక్ వార్డు, రేడియాలజీ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. క్యాజువాలిటీ వార్డులో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఆ సమయంలో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎక్స్ రే, సిటీ , ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చిన వారికి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు, తదితర వివరాలను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెట్టేలా జాప్యం చేస్తే సహించబోనని ఆమె హెచ్చరించారు. సుమారు 11:45 గంటల వరకు ఆసుపత్రిలో గడిపిన కలెక్టర్... పలువురు రోగులతోనూ, వారి బంధువులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. పారిశుద్ధ్యం సరిగా లేదని పలువురు చెప్పగా కలెక్టర్ కూడా స్వయంగా చూశారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యులను, సిబ్బందిని హెచ్చరించారు.
View More
Breaking News
16 Mar 2025 06:00 AM
4
59
Newsread Image

No.1 Short News

Newsread
సీసీ ఫుటేజ్..మంచినీళ్లు కావాలని అడిగి మంగళ సూత్రం దొంగలించిన దొంగ
హైదరాబాద్ - KBHBలో టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళని మంచినీళ్లు ఇవ్వమని అడిగి తన మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకొని వెళ్లిన దొంగ. ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
View More
Breaking News
12 Mar 2025 15:08 PM
1
16
Newsread Image

No.1 Short News

Newsread
జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు
అమరావతి: జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ గడువు 28వ తేదీ(రేపటి)తో ముగుస్తోంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
View More
Breaking News
27 Feb 2025 19:27 PM
2
28
Newsread Image

No.1 Short News

Kristappa - Roddam Reporter
రెడ్డిపల్లి లో పండగపూట విషాదం,ఇద్దరు మృతి ఒకరికి తీవ్రగాయాలు
సత్యసాయి జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మువకులు రాత్రి సమయంలో లేపాక్షి కి జబర్ధస్త్ టీం ను చూడడానికి బైకులో బయలు దేరారు మార్గం మధ్యలో దొమ్మితిమర్రి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది వారిలో చరణ్ తిరుమలేష్ అనే ఇద్దరు యువకులు చనిపోయినారు ,భరత్ అనే యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు
View More
Breaking News
27 Feb 2025 10:35 AM
5
62
Newsread Image

No.1 Short News

Newsread
కురిచేడు: తిరిగి రాని లోకాలకు టీడిపి నాయకుడు
Kurichedu town TDP senior leaders, Mandala TDP general secretary Gandham Gurunatham died of heart attack... కురిచేడు మండల టీడిపి సీనియర్ నాయకులు, మండల టీడిపి ప్రధాన కార్యదర్శి గంధం గురునాధం గుండెపోటు తో మరణించారు.
View More
Breaking News
23 Feb 2025 20:36 PM
4
108
Newsread Image

No.1 Short News

Newsread
కాలువ లో యువకుడి గల్లంతు: యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి నుండి కురిచేడు వెళ్తున్న గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు రోడ్ లోని సాగర్ కెనాల్ వద్ద దర్శి మండలం, వెంకటాచలం పల్లి పంచాయతీ పరిది లోని నడింపల్లి గ్రామానికి చెందిన 17సం||రాల పుప్పాల వీరనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన విషయం అక్కడ గుమికుడి ఉన్న ప్రజలను చూసి ఆగి విషయం తెలుసుకొని వెంటనే దర్శి DSP బి. లక్ష్మీనారాయణ, దర్శి SI మురళి ని ఫోన్ లో సంప్రదించి గజ ఈతగాళ్ళను పిలిపించాలని, వీలైనంత త్వరగా ఈ కుర్రాడి ఆచూకీ తెలియజేయాలనీ ఆదేశించి వీరనారాయణ కి ఏమి అవ్వదని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
View More
Breaking News
22 Feb 2025 20:18 PM
2
30
Newsread Image

No.1 Short News

Newsread
నెల్లిమర్ల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం వీఆర్వో రూ. 3 లక్షల లంచం డిమాండ్ చావే దిక్కంటూ తహసీల్దార్ కార్యాలయం వద్దే పురుగులు మందు తాగేందుకు యత్నం..
View More
Breaking News
22 Feb 2025 15:49 PM
0
27

No.1 Short News

Newsread
కురిచేడు రోడ్డులో గల సాగర్ కాలువలో దూకిన యువకుడు
దర్శి లోని కురిచేడు రోడ్లో గల సాగర్ కాలువలో నడింపల్లికి చెందిన యువకుడు చెప్పులు టోపీ బైక్ కాలువ కట్ట పక్కన ఉంచి తాను కాలువలోకి దూకినట్లుగా సమాచారం. దూకిన అనంతరం నీటిలో కొట్టుకుపోవడం జరిగిందని సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
View More
Breaking News
22 Feb 2025 14:50 PM
103
121
Newsread Image

No.1 Short News

Newsread
భరతమాతను మొగల్ సంకెళ్ళ నుంచి విడిపించిన యోధుడు శివాజీ - తిండి నారాయణ రెడ్డి
ఈరోజు దర్శి లో పొదిలి రోడ్ లోని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ భరతమాతను మొగలుల సంకెళ్ల నుండి విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మేరునగ ధీరుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అమరేశ్వర రావు చెరుకూరి అనిల్ కుమార్ అడుసుమల్లి సాంబయ్య తిండి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
View More
Breaking News
19 Feb 2025 14:31 PM
0
20
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో జీబీస్ కలకలం.. 59 కేసులు నమోదు???
విశాఖపట్నం కేజీహెచ్లో ఒక మహిళ మృతి ఏపీలో జీబీస్ వైరస్ కారణంగా విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళలు మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
View More
Breaking News
17 Feb 2025 19:52 PM
0
34
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ ఆస్తుల రక్షణకై ముస్లింల ర్యాలీ
రాష్ట్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ సమి హుస్సేని, ముస్లిం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్కు, మంత్రి నారాయణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వక్స్ ఆస్తులను దోచుకోవాలని కుట్ర చేస్తోందని, ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీయడానికే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ వక్స్ ఆస్తుల రక్షణకై ముస్లిం మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రియులు రోడ్డుపై వస్తారని హెచ్చరించారు.
View More
Breaking News
17 Feb 2025 17:20 PM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. అనంతరం వల్లభనేని వంశీని గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో భాగంగానే ఆయన్ను పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వంశీని ఏ కేసులో అరెస్టు చేశారనే విషయంపై విజయవాడ వెళ్లిన తరువాత పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
View More
Breaking News
13 Feb 2025 09:03 AM
0
33
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
గొంతెండుతుంది మొర్రో.. అంటున్న బొద్దికూరపాడు హైస్కూల్ విద్యార్థులు.
తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ఏర్పాటు చేసిన రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ మొరాయించింది . అప్పుడు మూణ్ణాళ్ల ముచ్చట గా పనిచేసి తర్వాత మొరాయించింది. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఉపయోగం లేదు, ప్రస్తుతం పని చేయటం లేదు. వాటర్ , విద్యార్థుల త్రాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాటు చేయాలని ఎస్.ఎం.సి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
View More
Breaking News
09 Feb 2025 10:00 AM
0
48
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
డిల్లీ పీఠం బీజెపీ దే...
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ ఓటమిపాలైన పలువురు ఆప్‌ అగ్ర నేతలు మూడోసారి కూడా ఖాతా తెరవని కాంగ్రెస్‌.
View More
Breaking News
08 Feb 2025 13:28 PM
0
49
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
బ్రేకింగ్ న్యూస్: మాజీ సిఎం కేజ్రీవాల్ ఓటమి
బ్రేకింగ్ న్యూస్ న్యూ ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి. మరోవైపు జంగ్‌పురాలో ఓటమి పాలైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
Breaking News
08 Feb 2025 13:23 PM
0
46
Newsread Image

No.1 Short News

Newsread
నకరికల్లులో రోడ్డు ప్రమాదం.. ……ఒకరి మృతి
నకరికల్లు-అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
View More
Breaking News
07 Feb 2025 07:55 AM
1
49
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నాగర్ కర్నూల్ చారకొండ లో త్రివ ఉద్రిక్తత చిన్నారిని సైతం జిప్ లో బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయిన అధికారులు పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు
View More
Breaking News
05 Feb 2025 22:02 PM
1
71
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. డీజే సౌండ్ బాక్స్ లను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు
View More
Breaking News
05 Feb 2025 21:59 PM
0
48
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మహిళల పై పోలీసుల అరాచకం
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద మహిళా వీఆర్ఏలపై పోలీసుల దాష్టికం నా ప్రాణం బాగాలేదు.. కాళ్ళు మొక్కుత వదిలేయండి మేడం అన్నా కూడా వదలని పోలీసులు
Breaking News
05 Feb 2025 12:08 PM
0
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఐటీ అధికారులతో మిగిసిన దిల్ రాజు విచారణ
ముగిసిన దిల్ రాజు విచారణ ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం రెండు గంటలపాటు సాగిన విచారణ అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని కోరిన ఐటీ అధికారులు
View More
Breaking News
05 Feb 2025 12:06 PM
0
34
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు - ఆనందంలో రైతులు
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు.. ఆనందంలో రైతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు నీళ్లు విడుదల చేయడంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి కూడవెళ్లి వాగులోకి పంటలు ఎండిపోయే సమయంలో కాళేశ్వరం నీళ్లు రావడంతో, రైతులు హర్షం వ్యక్తం చేశారు -
View More
Breaking News
05 Feb 2025 10:59 AM
1
40
Newsread Image

No.1 Short News

Newsread
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
View More
Breaking News
04 Feb 2025 14:21 PM
2
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించి దృశ్యాలు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు చారకొండలో ఇల్లు కూల్చేస్తుంటే భోరున విలపిస్తున్న వృద్ధ దంపతులు తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బ్రతకాలంటూ పోలీసులను వేడుకున్న వృద్ధ దంపతులు - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:59 PM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
భారతీయులని వెనక్కి పంపుతున్న అమెరికా
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తున్న భారత ప్రభుత్వం -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:58 PM
0
24
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
జగిత్యాల లో మహిళ ఎస్సై స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి జగిత్యాల - గొల్లపల్లి మండలంలో , చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు, అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత , జగిత్యాల ఎస్పీ ఆఫీస్ లో అటాచ్‌గా ఉన్న ఎస్సై శ్వేత -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 12:45 PM
0
22
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పల్లె దవాఖానలు ఒక్క పూట కె పరిమితము
పల్లె దావఖానలు ఒక్క పూటకే పరిమితం కామారెడ్డి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావఖానలు మధ్యాహ్నం 1 గంటలకే ముసివేస్తున్నారు మహుబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం జయపురం 2 గంటలకే మూసివేసిన పల్లె దావాఖాన రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె దావఖానల్లో తీవ్ర మందుల కొరత ఉంది గత ప్రభుత్వంలో అద్భుతంగా రోజంతా నడిచిన దావఖానలు ఒక్కపూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు - News Credits By Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
శంకర్ దాదా MBBS సినిమా స్టైల్ లో రాత్రికి రాత్రే ఆసుపత్రి మార్పు
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పు! కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తాండూరు ఆసుపత్రికి కొడంగల్ పేరు ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీ చింపేసిన స్థానికులు వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడంతో కలకలం ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై 'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్' అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని నిలదీసిన స్థానికులు ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు ఇదీ అసలు కథ గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్ కు మార్చుకున్నారు. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్ కు తనిఖీ నిమిత్తం రానుంది. వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -news credit's by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
IT అధికారులు ఎదుట హాజరు అయిన దిల్ రాజు
ఐటీ అధికారుల ఎదుట హాజరైన FDC చైర్మైన్, నిర్మాత దిల్ రాజు గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారుల ఆరా - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బిజెపి లో వర్గపోరు
నల్గొండ బీజేపీలో వర్గపోరు నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకుల అసంతృప్తి పార్టీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని హెచ్చరించిన బీజేపీ సీనియర్లు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
గొడవకి సంబంధం లేని వృద్ధుడిని లాక్కెళ్తున్న పోలీసులు
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద ఉద్రిక్తత రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్న పోలీసులు సర్ నాకు ఏం తెల్వదని కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా లాక్కెళ్తున్న పోలీసులు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - NEWS CREDITS TELUGU SCRIBE
View More
Breaking News
04 Feb 2025 10:01 AM
0
18
Newsread image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బ్రేకింగ్ న్యూస్
బ్రేకింగ్ న్యూస్ మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన వీఆర్ఏలు.. అడ్డుకుంటున్న పోలీసులు పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
View More
Breaking News
04 Feb 2025 10:00 AM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రికార్డ్ స్థాయి లో కేటాయింపులు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు ఏపీకి రూ. 9417 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ - Video Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
1
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
అవ్వి నా భార్య , నా గల్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియోస్ - మస్తాన్ సాయి
అవి నా భార్య.. నా గర్ల్‌ ఫ్రెండ్ వీడియోలు - మస్తాన్ సాయి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు 2017లో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది -మస్తాన్ సాయి - News Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??
ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందిఅదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది.. - ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది
View More
Breaking News
03 Feb 2025 11:20 AM
1
17
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (6)
  • Latest News (647)
  • Motivation (10)
  • Crime News (17)
  • Local Ads (31)
  • Entertainment (14)
  • Local Updates (180)
  • Sports News (12)
  • Education (8)
  • Business Promotions (1)
  • Politics (63)
  • Breaking News (89)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.