

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతూర్పు గంగవరం సర్పంచికి రూ.5,00,000 అందజేత
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
25 Apr 2025 11:57 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతూర్పు గంగవరంలో ముస్లింల ప్రచారం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:21 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరు: 'నీటితొట్టెలను వేగంగా పూర్తి చేయాలి'
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు.
16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM


No.1 Short News
DR Local News - Chiralaమే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి
ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు.
చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Apr 2025 17:14 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
View More
Local Updates
03 Apr 2025 20:45 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతూర్పు గంగవరం పవర్ స్టేషన్ పనులను పరిశీలించిన అధికారులు
తూర్పు గంగవరంలోని నిర్మాణ భాగంలో ఉన్న 132/33 KV పవర్ స్టేషన్ను బుధవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరిగే విధానాన్ని, పవర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే నిర్మాణానికి నాణ్యమైన మెటీరియల్ వాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SE k. వెంకటేశ్వర్లు, EE P. శ్రీనివాసులు, AE V. శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Apr 2025 17:54 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరువెలుగువారిపాలెంలో పశువుల నీటి తొట్లు నిర్మాణం
తాళ్లూరు మండలంలోని వెలుగురిపాలెం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వేసవికాలంలో నీటికి కొరత లేకుండా చూడడమే లక్ష్యమని MPDO దారా హన్మంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, శ్యాగం కొండారెడ్డి, MPP తాటికొండ శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
02 Apr 2025 12:35 PM


No.1 Short News
Reporter Suhelకడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
View More
Local Updates
31 Mar 2025 21:09 PM


No.1 Short News
Newsreadదర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
View More
Local Updates
26 Mar 2025 08:11 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM


No.1 Short News
Newsreadపడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుజరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM


No.1 Short News
Newsreadప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
View More
Local Updates
15 Mar 2025 13:02 PM
You are offline
Please check your internet connection.
Close