Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మధుసూదన్ సతీమణి కామాక్షి, వారి ఇద్దరు పిల్లలను కలిసిన మంచు విష్ణు, దాడి జరిగిన తీరును గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. వారిని దత్తత తీసుకొని, వారి విద్యాభ్యాసం మరియు ఇతర అవసరాల కోసం నేను బాధ్యత వహిస్తాను అని విష్ణు హామీ ఇచ్చారు.
View More
Latest News
09 May 2025 09:14 AM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
దర్శి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా కపురంకు ఘన సన్మానం
ఈరోజు, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని దరిశిలోని స్థానిక తహశిల్దారు కార్యాలయ ప్రాంగణంలో, తహశిల్దార్ శ్రావణ్ కుమార్ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహశిల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లడుతూ దరిశి ఏరియాలో ఐఆర్సీయస్ తరుపున మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ తరుఫున అనేక కార్యక్రమాలు నిస్వార్ధంగా నిర్వహిస్తున్న కపురం శ్రీనివాసరెడ్డిని ఈరోజు ఘనంగా సన్మానించడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దరిశి మండల గౌరవాధ్యక్షుడనైన నేను చాలా గర్వించదగిన విషయమని కపురం శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో డీటీ వెంకట్,ఆరై శ్రీనివాసులు, వీ ఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 05:24 AM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
వివాహా శుభకార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్ .
08-05-2025 ఈరోజు దర్శి మండలం, బట్టువారిపల్లి గ్రామంలో టిడిపి నాయకులు పూజల యోగయ్యా - సుబ్బులు కుమారుని వివాహా శుభకార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులు చి|| శివ - చి||ల|| మౌనిక లను ఆశీర్వదించిన టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితోపాటు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు బట్టువారి పల్లె గ్రామంలోని టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
08 May 2025 22:09 PM
0
3
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ ప్రజలకు విన్నపము
దొనకొండలో గాలి బాగా వీచుతున్నది కరెంటు తీగలు ఎక్కడైనా మంటలు వస్తున్న తీగలు మీద ఎక్కడైనా చెట్టు కొమ్మలు. పడిన స్తంభాల దగ్గర ఎక్కడైనా మంటలు వచ్చిన కరెంటు తీగలు ఎక్కడైనా తెగిపడిన చూసిన వాళ్లు వెంటనే దయచేసి కరెంట్ ఆఫీస్ కి గాని మీకు తెలిసిన కరెంటు అధికారులకు గానీ ఫోన్ చేసి తెలియజేయగలరు Current Dkd: +919490615448‬ ‪Ae Donakonda Curent: +919440812246‬ ‪Ramakrishna Linmen: ‪+917659941607‬
View More
Breaking News
08 May 2025 18:54 PM
2
8
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ విజయం భారతీయుడు గర్వించదగ్గ విషయం - గులాం రసూల్
ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా జరగటం ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గులాంరసూల్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై చేసిన దాడికి తగిన బుద్ధి చెప్పిన భారత దేశ ప్రధాని మోడీ గారికి అదేవిధంగా భారత ఆర్మీ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. మరల మన దేశం వైపు ఎవరు కన్ను ఎత్తి చూడాలన్న భయాన్ని కలుగజేసి పహల్గాం దాడిలో మృతి చెందిన 21 మంది మృతులకు నిజమైన సంతాప సభను వారి ఆత్మను శాంతి కలగజేసిన భారత ఆర్మీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినరూ ప్రతి ఒక్క భారతీయుడు మన ఆర్మీ వారికి సెల్యూట్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది చాలా గొప్ప విజయమని పేర్కొన్నారు.
View More
Latest News
08 May 2025 15:54 PM
1
10
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
View More
Local Updates
08 May 2025 09:43 AM
1
49
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
భారత్ మాతా కీ జై అంటూ గర్జించిన దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ప్రతి చర్యను ప్రశంసించిన దర్శి తహసీల్దార్ భారత్ మాతా కీ జై అంటూ నిందించి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
View More
Local Updates
08 May 2025 03:06 AM
1
10
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ఆర్మీ ను అభినందిందిన దర్శి తహసీల్దార్ & ఎస్సై.
బుధవారం సాయంత్రం గం.5.00 లకు దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయు నిమిత్తం అభినందన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ప్రతి సైనికునికి అభినందనలు తెలిపారు, అనంతరం భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
View More
Latest News
08 May 2025 02:56 AM
0
10
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
బ్రహ్మం గారి ఊరేగింపు లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
ఈరోజు దర్శి పట్టణం లో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్బంగా ఊరేగింపు కార్యక్రమం లో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు.
View More
Latest News
07 May 2025 22:06 PM
1
13
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
View More
Local Updates
07 May 2025 17:06 PM
0
49
Newsread Image

No.1 Short News

Newsread
వలి బాష కుటుంబానికి న్యాయం, రక్షణ ఏర్పాటు చేయాలి - ఫారుక్ షుబ్లీ
ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నందు వలిబాష కుటుంబాన్ని MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ పరామర్శించి మేమున్నాము అన్న భరోసా కల్పించారు. 4-5-2025న తెల్లవారుజామున నమాజుకు బయలుదేరిన వలి భాష అని క్రూరాతి క్రూరంగా నరికి చంపి వేసిన ఘటన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది అన్న సంగతి అందరికి తెలిసిందే. షేక్ రెహనా మృతుడు వలిబాష భార్యమణి, షేక్ రుక్సాన మృతుడి చిన్న కూతురు, షేక్ ఫర్జానా పెద్ద కుమార్తె, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 5 సం||ల క్రితమే అనిల్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడని అదే పని అతను చెప్పిన 5 సం||ల తరువాత చేసాడని భోరున వినిపించారు. ఇప్పుడు మమ్మల్ని సైతం చంపుతారని స్పష్టంగా బెదిరిస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పూర్తిగా అండగా ఉండాలని రక్షణ కల్పించాలని అలాగే ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుటుంబానికి ఏది జరిగిన పూర్తిగా పోలీసులదే బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక సగటు తండ్రి ఆవేదన అర్థం చేసుకొని ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినాది కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని అదే విధంగా ఆ రోజు తెల్లవారి జామున వలి భాషా సందులో కరెంటు తీసివేయటంలో ఆంతర్యం ఏమిటి? ఈ హత్య వెనకాల అనిల్ ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే మృతుడి ఆత్మ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించటం జరిగింది. అలాగే స్థానిక మంత్రి జనసేన నాయకులు కందుల దుర్గేష్ Kandula Durgesh గారు ఇప్పటి వరకు మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న గౌరవ రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు వారి కార్యాలయం నుండి మృతుడి కుటుంబానికి అందుబాటులోకి రావడం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేయడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
View More
Latest News
07 May 2025 16:51 PM
1
8
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో భూకంపం, రెండు సెకన్ల పాటు కనిపించిన భూమి
ఏపీలో భూ ప్రకంపనలు.. ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు
View More
Breaking News
06 May 2025 16:58 PM
9
289
Newsread Image

No.1 Short News

Newsread
మెగా డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారా లోకేష్ ఆదేశాలు జారీ
అమరావతి: జూన్ 6వతేదీ నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో 3గంటలకుపైగా సమీక్షించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
View More
Breaking News
05 May 2025 23:52 PM
3
57
Newsread Image

No.1 Short News

Newsread
కదిరి కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లాబకష్.
ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, కదిరి నియోజకవర్గానికి సంబంధించిన పట్టణ మరియు మండల అధ్యక్షులు నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు షేక్ అల్లాబకష్ తనకి అవకాశం కల్పించి రాష్ట్ర అధ్యక్షురాలు ys షర్మిల రెడ్డి కి, CWC సభ్యులు రఘువీర రెడ్డి కి, కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ KS షానవాజ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలియజేశారు.
View More
Latest News
05 May 2025 15:31 PM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: జన్మదిన శుభాకాంక్షలు
దర్శి ప్రజల ఆశా దీపం, ఎందరో యువతులకు ఆదర్శం, కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం కి మారుపేరు, దర్శి కి మార్గదర్శి, దర్శి నియోజకవక వర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి మాతృమూర్తి కి న్యూస్ రీడ్ యాప్ యాజమాన్యం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
View More
Local Updates
05 May 2025 12:04 PM
0
23
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ముళ్ళ పొదల్లో దొరికిన అమ్మాయి, IAS కావడమే లక్ష్యం గా...
పూజా ఈమాన్: 2008లో తిరుపతి సమీపంలోని రేణిగుంటలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి ముళ్లపొదల్లో పడేయగా, స్థానికులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాపను, సమీపంలో ఉన్న తల్లిని మైలవరంలోని రాజా ఫౌండేషన్‌కు తీసుకెళ్లారు.. ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు రాజారెడ్డి, అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమాన్ అని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు రాజారెడ్డి ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ అదే స్కూల్‌లో పూజా చదువుకుంది. పదో తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ (హెచ్‌పీజీ)లో చేరింది.. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్‌లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది, ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది.. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సర్ నన్ను పెంచారు. నేను కలెక్టర్ కావాలనేది ఆయన కల, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా. పేదలకు, ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయం అని పూజా ఈమాన్ తెలిపింది.
View More
Motivation
05 May 2025 06:55 AM
3
162
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
అకాల వర్షాలు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. * చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం పొందకండి. * ఇంట్లో లేదా సురక్షితమైన భవనంలో ఉండండి. * బలమైన గాలుల వల్ల పడిపోయే అవకాశం ఉన్న వస్తువుల నుండి దూరంగా ఉండండి. News Read App లో మీ వార్తల కోసం 9948680044 కి కాల్ చేయగలరు.
View More
Latest News
05 May 2025 06:35 AM
1
25
Newsread Image

No.1 Short News

Newsread
RTC బస్సుల్లో phone pay ఫెయిల్, ఇబ్బంది పడ్డ మహిళలు.
విజయవాడ నుంచి మేదరమెట్ల వెళ్లేందుకు ముగ్గురు మహిళలు టికెట్ తీసుకుని, కండక్టర్ కి ఫోన్ పే చేయగా అమౌంట్ పే అయింది. టికెట్ రాలేదు, మళ్ళీ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పగా వారిలో ఒక అమ్మాయి వాగ్విదాం పెట్టుకోగా సదరు కండక్టర్ మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చేస్తా, ప్రస్తుతం మీ అమౌంట్ నేను ఇస్తాను అని మానవతా దృక్పథం చేయించటం . అయితే RTC తరపున ఏ తప్పిదం జరగలేదని కేవలం కండక్టర్, ఆ మహిళల మధ్య అవగాహన లోపం వల్లనే టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందినే ప్రయాణీకులు గుర్తించారు.
View More
Breaking News
04 May 2025 18:57 PM
3
36
Newsread Image

No.1 Short News

Newsread
మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ వేదిక
ఈరోజు మచిలీపట్నం లోని MR ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది కి పైగా వధూవరులు విచ్చేసి వారి ప్రొఫైల్ పరిచయకార్యక్రమంలో పాల్గొన్నారు. MR ఫంక్షన్ హాల్ అధినేత దాదా గారి ఆద్వర్యం లో LED స్క్రీన్స్ మీద వధూవరుల ప్రొఫైల్ ను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే ఆలోచన చేస్తున్నట్లు నిర్వాహకులు దాదా కుమార్తె, అల్లుడు మతీన్ తెలిపారు.
View More
Local Updates
04 May 2025 18:39 PM
6
65
Newsread Image

No.1 Short News

Newsread
విజయవాడ లో దంచి కొడుతున్న వర్షం
ఈరోజు ఉదయం నుంచి విజయవాడలో ఆకాశం మేఘావృతమైంది ఆకాశం అంతా మబ్బులతో నిండుకుండలా మారింది ఇప్పుడే వర్షం మొదలైంది మొదలవడంతోనే దంచి కొడుతున్న వర్షం, కుండపోతలాగా వర్షం దంచి కొడుతుంది.
View More
Latest News
04 May 2025 08:20 AM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ఇంతమంది నాయకుల్లో మీడియా కు శుభాకాంక్షలు తెలిపిన రియల్ లీడర్
దర్శి లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, చరిత్ర కలిగిన వారుకూడా ఉన్నారు, ఆ రాజకీయ నాయకుల్లో ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినం అని గుర్తించి, మీడియా యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఈరోజు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఏకైక రియల్ లీడర్ కాంగ్రెస్ యువ నాయకుడు కైపు కృష్ణారెడ్డి. నాయకులలో మంచి మనసు ఉండాలి, అది కైపు కృష్ణారెడ్డి కి ఉంది అని చెప్పుకోవచ్చు.
View More
Local Ads
03 May 2025 21:37 PM
1
29
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
హజ్ యాత్రికులకు హామీ ఇచ్చిన సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి - ఫారూఖ్ షుబ్లీ
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం యాత్రికుడికి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని త్వరితగతంగా అమలు చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మైనార్టీ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ వర్యులు పెద్దలు శ్రీ NMD ఫరూఖ్ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి వెళ్లిన హాజీలకు మాత్రమే లక్ష రూపాయలు చెల్లిస్తామని మేనిఫెస్టో నందు పొందపరచలేదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని గుర్తు చేశారు కాబట్టి హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి హాజీకి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
View More
Latest News
03 May 2025 20:24 PM
2
30
Newsread Image

No.1 Short News

Newsread
ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉండ తీవ్రంగా ఉండగా... సాయంత్రానికి చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
View More
Latest News
03 May 2025 19:25 PM
0
19
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కార్మిక సోదర సోదరీమణులకు చరిత్రత్మక మేడే శుభాకాంక్షలు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కు చెందిన తూర్పు గంగవరంలో ఈరోజు మే డే సందర్భంగా కార్మిక సోదరులు ర్యాలీ ద్వారా సచివాలయం నకు చేరుకొని కమిటీ హాలును కోరుతూ పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. తదుపరి జెండాను ఆవిష్కరించి కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకొని వారి చేత కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ,రాత్రనకా పగలనకా చామటను చిందించి దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు ఎంతగానో దోహదపడుతున్నారని,శ్రామిక, కర్షక,కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిదని వారు అన్నారు.
View More
Latest News
01 May 2025 17:06 PM
1
27
Newsread Image

No.1 Short News

Newsread
డ్రగ్స్, మత్తుపదార్థాల నివారణ కు అవగాహనే మార్గం -తమీం అన్సారియా
మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గం: జిల్లా క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియా 👉యువత చెడు వ్యాసాలకు దూరంగా ఉండాలి...గంజాయి/ మాదకద్రవ్యాలను దరి చేరనియ్యరాదు:ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ 👉గంజాయిని రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వారి ఆధ్వర్యం లో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. డ్ర‌గ్స్ వినియోగంవ‌ల్ల క‌లిగే దుష్ప‌లితాల‌ను పెద్ద ఎత్తున‌ వివ‌రించ‌డ‌మే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి నియంత్ర‌ణ‌కు కట్టుదిట్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో డ్ర‌గ్స్‌ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌మని అందులో భాగంగా ప్ర‌తీ విద్యాసంస్థ‌లో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేయాల‌న్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటికి అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల్లో ఈగిల్ క్ల‌బ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఔష‌ద నియంత్రాణాధికారులు సంయుక్తంగా మందుల షాపుల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. డ్ర‌గ్స్ వినియోగం, ర‌వాణాపై నిఘాను పెంచి, అరిక‌ట్టేందుకు మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు. విద్యార్ధుల‌తోపాటుగా వివిధ వ‌ర్గాల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా జిల్లాలో డ్ర‌గ్స్ ర‌వాణాను పూర్తిస్థాయిలో అరిక‌ట్ట‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, జిల్లాలో మ‌త్తు ప‌దార్ధాలు, మాద‌క ద్ర‌వ్యాలను అరిక‌ట్ట‌డానికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జిల్లాలో ఎక్క‌డా గంజాయి పంట‌ సాగు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. జిల్లా మీదుగా ర‌వాణా జ‌రుగుతోంద‌ని, దీనిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. న‌మోదు చేసిన కేసుల సంఖ్య ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం కూడా శిక్షార్హమేనని, గంజాయి, డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి మైనింగ్ పనుల కొరకు ఇతర ప్రాంతాల నుండి కూలీలు జిల్లా కు వస్తుంటారని, సంబంధిత పరిశ్రమల యాజమాన్యం వారిని సమన్వయము చేసుకొని కూలీల పై నిఘా ఉండేలా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించి 283 మందిని గుర్తించడం జరిగిందన్నారు. ఒంగోలు లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, క‌ళాశాల‌ల్లో ఈగిల్ టీమ్‌లు, డ్రాప్ బాక్సుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌త్తుప‌దార్ధాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల స‌హ‌కారంతోనే పూర్తి స్థాయిలో డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్, మరియు డాబాలలో, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లలో బోర్డ్ లు.. మత్తు పదార్థాల నివారించే చర్యలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణ పై రూపొందించిన బ్రోచర్ల ను ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అమ్మకం ,రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా పోలీస్ డయల్ 100/112 తెలియజేయాలని, అట్టివారు వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అనంతరం ముఖ్యంగా పాఠశాలలు/కళాశాలలో విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలియచేయాలని,స్వీయ రక్షణ, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసలపట్ల మరియు చట్టాలపై, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు/మహిళలు/యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా అవగాహన కల్పించాలని, MEO, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలన్నారు. పిల్లలపై నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీస్ వారికి తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదీత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా ఏడుకొండలు, డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ లక్ష్మా నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
30 Apr 2025 21:53 PM
1
42
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు..
ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
48
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం. సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వం వైద్యశాలకు తరలింపు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
37
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పాకిస్తాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: SP
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లాలో పాకిస్తాన్ వీసాలతో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
34
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య..
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. లక్ష్మీ నారాయణ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా .. కైపు వెంకటకృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ,దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
View More
Breaking News
28 Apr 2025 16:33 PM
1
35
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు శిద్దా రాఘవరావు..
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శిద్దా రాఘవరావు మరియు కుటుంబ సభ్యులు తదనంతరం ఆలయ EO శ్రీనివాసరావు స్వామి చిత్రపటాన్ని మరియు ప్రసాదాలు అందించి శిద్దా రాఘవరావుకి ఆశీర్వాదాలు అందజేశారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
0
32
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
దరిశి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం..
వేసవి విజ్ఞాన శిబిరమును దర్శి శాఖ గ్రంధాలయంలో సోమవారం దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి -1 కె.రఘురామయ్య ఎంఈఓ -2 ఏ రమాదేవి,బీడీసీఎల్ నిర్వాహకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి వలన ఉపయోగాలు చెప్పారు. వేసవిలో చక్కగా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులకువివరించడం జరిగినది. ఎంఈఓ రమాదేవి మాట్లాడుతూ చక్కటి గ్రంథాలయాలను ఉపయోగించుకొని మంచి మంచి కథలు చెప్పటం, చెప్పించడం చాలా ఉపయోగమని తెలియచేశారు. మేము కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకొని ఒక స్థాయిలో ఉండగలిగామని వారు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన గ్రంథపాలకురాలు విజయ కుమారికు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బీడీసీఎల్ నిర్వహకులు బి కోటయ్య, బి చెంచులింగం, భూషణ్ రావు, బి గోపి మరియు టీచర్ ఆదిలక్ష్మి పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
31
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
తిరుపతి లో 10 లక్షల to 150 సోలార్ కెమెరాల ఏర్పాటు: హర్షవర్ధన్ IPS
తిరుపతి: శాంతి, భద్రతల దృష్ట్యా తిరుపతి నగరంతోపాటు జిల్లా లో వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు 10 లక్షల విలువైన 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేశామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ అన్నారు.తిరుపతిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు ‌చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ మీడియా తో మాట్లాడారు. సోలార్ కెమెరాలు సౌర శక్తితో పనిచేస్తాయని, ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఆడియో మరియు వీడియో ఉంటుందన్నారు. సోలార్ కెమెరాలు విద్యుత్ అంతరాయం ఉండదన్నారు. సౌర శక్తితో పని చేస్తాయని, విద్యుత్తు లేని ప్రాంతాల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యంగా ఉంటుంది. వైర్లెస్ కనెక్టివిటీతో ఉంటుందని, స్మార్ట్ ఫోనులో మనం ఎక్కడ ఉన్న పర్యవేక్షించవచ్చున్నారు.ఇది మొబైల్ సిమ్ కార్డు ఆధారంగా పనిచేస్తుందన్నారు. ప్రధానంగా తిరుమలలో శాంతిభద్రతల దృష్ట్యా 20 సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నమన్నారు. అంతేకాకుండా తిరుపతి, చంద్రగిరి ఇతర ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సోలార్ సిసి కెమెరా అమర్చేందుకు ఎర్పాట్లు చేస్తున్నమన్నారు. ఇప్పటికే జిల్లా లోని వివిధ ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు.సోలార్ కెమెరాలు అమర్చడం ద్వారా కొంతవరకు అకతాయల, అల్లరి మూకలకు చెక్ పెట్టవచ్చన్నారు.గరుడ వారిది పై బ్లాక్ స్పాట్స్ గుర్తించి సోలార్ సిసి కెమెరాను ఏర్పాటు చేస్తాము. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సోలార్ సిసి కెమెరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో పూర్తి స్థాయి లో సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. పోలీసు సిబ్బంది వెళ్లని ప్రదేశం కూడా డ్రోన్ కెమెరాతో వెళ్ళి గాలిస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మెన్ పవర్ సేవ్ అవుతుంది. డ్రోన్ కెమెరాలతో గడిచిన కాలంలో గంజాయి స్ధావరాలతో పాటు నాటుసారాయి స్ధావరాలపై దాడులు చేసి కొంత మందిని అరెస్ట్ చేశామన్నారు. హోం స్టే కు సంబంధించిన లిస్ట్ మా వద్ద ఉంది. ప్రతి రోజు హోం స్టేలను మా సిబ్బంది చెక్ చేస్తున్నాము. హోం స్టే లో ఎదైన వివాదాలు జరిగితే అలాంటి వాటి పై యాక్షన్ సిరియస్ గా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమంలో శ్రీ కె. రావిమనోహరచారి అదనపు ఎస్పీ, శ్రీ. సాదిక్ ఆలీ సీఐ ఎస్బి, శ్రీ వినోద్ కుమార్ సీ.ఐ. సైబర్ క్రైమ్స్,శ్రీ ఈశ్వర్ సీఐ కమాండ్ కంట్రోల్ శ్రీ రమణారెడ్డి ఆర్ఐ లు పాల్గొన్నారు.
View More
Latest News
28 Apr 2025 16:32 PM
0
31
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
నేర నియంత్రణకు నిరంతర నిఘా నిర్వహిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., ఆదేశాలమేరకు పోలీసులు రాత్రిపూట నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ పహారా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వేలిముద్ర ఆధారంగా విచారిస్తూ Night patrol విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి నేరాలు జరుగకుండా పోలీసుల తనిఖీలు మరియు అనుమానితులను విచారించడం మరియు గస్తీ తిరగడం వంటివి నిరంతరం చేస్తున్నారు.
View More
Latest News
28 Apr 2025 12:28 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
శివరాజ్ నగర్: కార్యకర్త ను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి
దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ లోని శివరాజ్ నగర్ నందు వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకుడు మస్తాన్ వలి కుమారుడు ఇటీవల రోడ్ ప్రమాదం లో గాయపడగా దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు.
View More
Latest News
28 Apr 2025 12:02 PM
2
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : మద్యం మత్తులో ఆకతాయి బీభత్సం
బీర్కూర్ మండల కేంద్రం లో hp పెట్రోల్ బాంక్ వద్ద కలిక్ అనే యువకుడు తాగిన మైకం ఆదివారం రాత్రి 9.30 నిమిషలకు లో ఆగి వున్న కారు అద్దం పగలగొట్టి తలము తీసుకోని పారిపోయాడు బీర్కూర్ ps లో కేసు పెట్టటం జరిగింది సదరు వ్యక్తి పైన ps లో రెండు సార్లు ఆఖతాయి పనులు చేస్తున్నాడు అని కేసు లు నమోదు అయినాయి బీర్కూర్ మండలం కేంద్రం లో మత్తు కు బానిస అయి ఇలాంటి ఆకాతాయి పనులు జరుగుతున్నాయి దీనిపైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోనగలరు బీర్కూర్ మండలం కేంద్రం లో HP పెట్రోల్ బాంక్ పరిసరాల లో మత్తు పదార్ధాలు విక్రయము జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
View More
Latest News
28 Apr 2025 08:51 AM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. ఆదివారం రోజు తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్న కర్ణన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. గత కొంతకాలంగా ఆర్ వి కర్ణ న్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
View More
Latest News
28 Apr 2025 00:30 AM
2
41
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు గైని సాయి కిరణ్మయి
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన గైని క్యాకయ్య &హారతి గార్ల కుమార్తె అయినటువంటి గైని సాయి కిరణ్మయి అనే విద్యార్థిని కి ఇంటర్ లో రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 928 మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించి, నగదు బహుమతి ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 18:10 PM
0
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు బర్వేల్లి మానస
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన బర్వెల్లి దత్తు, అంజవ్వ గార్ల చిన్న కుమార్తె అయినటువంటి బర్వేల్లి మానస అనే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్కూరులో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 929 మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించి, నగదు బహుమతి ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 14:49 PM
2
35
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బిచ్కుంద: ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు గంధం తేజశ్రీ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు, పోషవ్వ గార్ల కుమార్తె అయినటువంటి గంధం తేజశ్రీ అనే విద్యార్థి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల కొయ్యగుట్ట (తాడ్కోల్) లో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 984/1000మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 14:47 PM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బహిరంగంగా సభకు బయల్దేరిన మల్లాపూర్ బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామాలో ఈరోజు భారతరాష్ట్రసమితి వరంగల్ లో నిర్వహిస్తున్న భారీబహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాలనుండి వందలాది మందికార్యకర్తలు తాము స్వంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో తరలివెళ్లారు. ముందుగా గ్రామాలలోభారీ ర్యాలీ లు నిర్వహించి అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి ఛలో వరంగల్, జై కె సి ఆర్ అంటూ నినాదాలు చేసుకుంటూ తరలివెళ్లారు. ఈకార్యక్రమంలో తెరాస పార్టీ బీర్కూర్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ నీరడి శ్రీనివాస్ మల్లాపూర్ యూత్ అధ్యక్షులు రవికాంత్ఉపాధ్యక్షులు బాలాజీ అరుణ్, అంజయ్య, రాజు, శ్రీను, కొల్లి సాయిలు,పోచయ్య,పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 13:26 PM
0
29
Newsread Image

No.1 Short News

Newsread
పాకిస్థానీయులు తక్షణమే వెళ్లిపోవాలి: ఏపీ ప్రభుత్వం
ఏపీలో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరిలో ఆరుగురు మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజులు గడువు విధించింది. అటు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు
View More
Latest News
27 Apr 2025 13:09 PM
1
28
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
కాశ్మీర్ ఉగ్రదాడితో మరోసారి తెరపైకి వచ్చిన బాబా వంగా జ్యోతిష్యం
పహల్గామ్ దాడి తర్వాత బాబా వాంగ జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది..2025 నుంచి ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని.. అది వినాశనానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. అయితే.. పహల్గామ్ మారణహోమం దృష్ట్యా, పెరుగుతున్న ఘోరాలు గురించి ఆమె ముందే హెచ్చరించడం.. అలాగే ప్రస్తుత సంఘటన తీరును పరిశీలిస్తే..ఇక ప్రపంచ స్థాయి లో పరిస్థితులు మారిపోవచ్చు అనే వాదన వినిపిస్తుంది.
View More
Latest News
27 Apr 2025 12:02 PM
0
24
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తెలుగుదేశం పార్టీ వార్డు నూతన వార్డు కమిటీ నియామకం
తెలుగుదేశం పార్టీ. నూతన కమిటీలు ఏర్పాట్లు భాగంగా దర్శి వార్డు కమిటీలు నియమించడం జరిగింది . ఈరోజు కొన్ని వార్డు వార్డులు. అధ్యక్షులు. డాక్టర్ టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్ గారు అభినందించడం జరిగింది. సందు జనార్ధన్, సందు కొండలు, జిసి అనిల్, కూటాల శ్రీను, నీలి శెట్టి నారాయణ, పాశం శ్రీను, నారప శెట్టి శ్రీనివాసులు, కోరి లక్ష్మీనారాయణ, పటాన్ సుభాన్, చిరుకోటి నరేష్, ఆవుల రమణారెడ్డి,నేలకుర్తి మాలాద్రి, పుప్పాల సురేష్, సారెడ్డి శ్రీనివాసరెడ్డి, దొంత శ్రీను, జెమినీ నాగేశ్వరరావు.
View More
Latest News
27 Apr 2025 11:17 AM
0
23
Newsread Image

No.1 Short News

Newsread
టూరిస్టులపై దాడి పిరికిపంద చర్య: కైపు కృష్ణారెడ్డి
టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడి పిరికి పంద చర్య అని కైపు వెంకటకృష్ణా రెడ్డి విమర్శించారు. స్థానిక గడియారం స్తంభం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దాడిలో 26 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయ పడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్ఘటన దేశంలో శాంతి భద్రతల వైపల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు గాలికొదిలేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చే పనిలో హెూం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నార ని విమర్శించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హెూంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
View More
Latest News
27 Apr 2025 10:17 AM
1
25

No.1 Short News

PRASANNA ADN NEWS TV
విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి.. : మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని RMS ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 వ వార్షికోత్సవములో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లితండ్రుల ను ఉద్దేశించి మాట్లాడుతూ వెనుకబడిన మార్కాపురంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి విద్యార్థులనకు మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం అభినందనీయమని అన్నారు.మార్కాపురం పట్టణం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నదని ఇప్పుడు కాలనీలలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టటం జరిగిందని ఒకప్పుడు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడ్డ మార్కాపురం పట్టణం నేడు పట్టణo నకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లోలు విద్యార్థులు సాధించడం ఆరుదని ఇప్పటినుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి ప్రణాళికతో చదివి దానిని సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..
View More
Latest News
27 Apr 2025 10:11 AM
0
21
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన పలు ప్రజాసంఘాల నాయకులు..
గత 30 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ అమలు ను మాదిగ జాతి తో పాటు 58 ఉపకులాలు జాతి ప్రజలు వినియోగించుకోవాలని పలువురు వక్తలు కోరారు. ముందుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల అంబేద్కర్ విగ్రహం నుండి దర్శి నియోజకవర్గంలోని మాదిగ జాతి ఉద్యోగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు గత 30 సంవత్సరాలలో జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఆటు పోట్లను అనుభవించారని ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగాల ఫలితమే నేటి వర్గీకరణ రావడానికి కారణమన్నారు. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఫలాలను మాదిగ జాతి తో పాటు ఉపకులాలలోని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే దిశగా ఉండాలని భక్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు నేరెళ్ల జాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జాతీయ మాదిగ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు బొంత ఏసుదాసు. ప్రకాశం జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు తాళ్లూరి ఆల్ఫ్రెడ్. తాళ్లూరి శేషు. నూనె పాల్ గాంధీ. రిటైర్డ్ ఎస్సై దారి వేముల ఎలీషా. కేసనపల్లి కోటేశ్వరరావు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ మాదిగ. నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ. మాదిగ విద్యార్థి సంఘ నాయకులు రాచపూడి కరుణానిధి. కంభం పాటి జోసెఫ్ మాదిగ. ఎమ్మార్పీఎస్ నాయకులు రాజపూడి మోషే. గూడూరి నాగమల్లేశ్వరరావు. పలువురు డప్పు కళాకారులు ఎమ్మార్పీఎస్. ఎం ఈ ఎఫ్. పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
View More
Local Updates
26 Apr 2025 22:35 PM
3
54
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం: జిల్లాలో అడుగడుగునా పోలీసుల విస్తృత తనిఖీలు
లాడ్జిలు, హోటల్, వాహనాలు మరియు పలు ప్రదేశాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపియస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి,డార్మిటరీస్, హోటల్,వాహనాలను మరియు పలు ప్రదేశలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని లాడ్జీల్లో పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పలు ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎం.వి చట్టంప్రకారం చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా జరగకుండా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
View More
Latest News
26 Apr 2025 21:54 PM
1
25
Newsread Image

No.1 Short News

Newsread
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!గతంలో ఒక్క నమినీకే అవకాశం
▪️మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు. ▪️ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చు. ▪️ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించవచ్చు. ▪️బ్యాంకింగ్ చట్టాల బిల్లు సవరణతో అవకాశం. బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతో పాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్ కి అవి జమ అయిపోతున్నాయి. ఖాతాదారుకి రెండు ఆప్షన్లు నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్ లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్ లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.
View More
Latest News
26 Apr 2025 19:37 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: ప్రజల వద్దకే ముఖ్యమంత్రి..
ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మిలతో మాట్లాడి, వారి జీవన విధానం, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రకటన: న్యూస్ రీడ్ లో మీ వార్తల కోసం 9948680044 నెంబర్ కి వాట్సాప్ చేయగలరు.
View More
Latest News
26 Apr 2025 19:15 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ నిరసన కరపత్రాన్ని ఆవిష్కరించిన అబ్దుల్ సత్తార్
ఒంగోలులో సోమవారం ఉదయం కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కలెక్టరు కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ జమియతే ఉలేమా, ఒంగోలు JAC, ఆల్ పార్టీ, ఆల్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది, ప్రతీ మసీదునుండి ప్రతీ వార్డు నుండీ స్వచ్ఛందంగా పాల్గొని వక్ఫ్ వ్యతిరేకతను భారీ స్థాయిలో తెలియపరచుదాం, Sdpi పార్టీ సభ్యులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు r, అసెంబ్లీ సభ్యులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, మన గళాన్ని వినిపించాలి, JAC కమిటీ వారి నినాదాల ప్రకారం మనమంతా క్రమశిక్షణతోమేలగాలని అబ్దుల్ సత్తార్ కోరారు.
View More
Latest News
26 Apr 2025 19:08 PM
0
22
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel