Select Location
Newsread Image

No.1 Short News

Newsread
ఏడాది పాలనలో రెగ్యులర్గా పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమిదే - గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు మండలం, శివరామపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... ప్రతి అవ్వ, ప్రతి తాత మోములో చిరునవ్వు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు చూడాలన్నదే సంకల్పంతో క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టివేశారు, సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే పాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం, భరోసా పెన్షన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా అందజేస్తూ, అభివృద్ధి - సంక్షేమ పాలనను ముందుకు తీసుకు వెళుతున్నాం. 2047 మిషనరీ మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా పాలన సాగుతుంది. నిన్న కడపలో జరిగిన మహానాడులో అందుకు సంబంధించిన దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది జూన్ నుండి తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కుటుంబంలోని ప్రతి చదువుకునే బిడ్డకు తల్లికి వందనం ద్వారా 15000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇక ఆగస్టు నుండి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేపట్టడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఇలా అభివృద్ధి సంక్షేమంతో మన కూటమి పాలన ఏడాదిలో ప్రజా మన్ననలు పొందిందని తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వైపు పరుగులు తీద్దామని ఆమె తెలిపారు. మన కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి సహకరించాలని దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామని డాక్టర్ లక్ష్మీ వివరించారు.
View More
Latest News
31 May 2025 13:03 PM
0
2
Newsread Image

No.1 Short News

Newsread
గుంటూరు : నందిగం సురేష్ ను మంగళగిరి ఆస్పత్రికి తరలింపు..
వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్.. నందిగం సురేష్ ను 3 రోజులు విచారించిన తుళ్లూరు పోలీసులు..
View More
Latest News
31 May 2025 12:14 PM
0
2
Newsread Image

No.1 Short News

Newsread
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారికి చలాన్లు విధిస్తూ భద్రత నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్న ప్రకాశం
ప్రకాశం జిల్లా SP ఏఆర్ దామోదర్ సూచనల మేరకు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘింస్తున్న వారికి చలాన్లు విధిస్తున్న ప్రకాశం పోలీసులు.దానితో పాటుగా వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రజలు హెల్మెట్ వాడాలి మరియు కార్ నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
View More
Latest News
31 May 2025 12:03 PM
1
7
Newsread Image

No.1 Short News

Newsread
డబ్బులు డబ్బులు చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం చేసిన దుండగులు
హైదరాబాద్ –చింతల్ పరిధిలోని సూర్యనగర్ లో ఉన్న రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ (35), తండ్లే చౌదరి స్వాతి (30), గతంలో ఎల్బీనగర్, అత్తాపూర్ లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు రూ.లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు ఒక్కొక్కరు రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, వీరిలో కొంతమందికి అధిక వడ్డి చెల్లించిన నిర్వాహకులు. దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు, బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు 16 నెలల గడువు ముగిసినవారు గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించని నిర్వాహకులు. ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కర్యాలయానికి చేరుకోగా, కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
View More
Crime News
31 May 2025 11:52 AM
1
5
Newsread Image

No.1 Short News

Newsread
రేషన్ వాహనాల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
AP: ఇంటింటికీ రేషన్ వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంపై డ్రైవర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హఠాత్తుగా తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. 2027 వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు ఆర్థిక పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి చూపలేదని పేర్కొన్నారు. దీంతో వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
View More
Latest News
31 May 2025 11:44 AM
1
2
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తూర్పు గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడుగా YSRK ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా పోతకమూరు నుండి తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడుగా YSRK. ప్రసాద్ ను నియమించడం జరిగింది. తూర్పు గంగవరంలో ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న అరుణ కుమారినీ నిడమానూరుకు బదిలీ చేయడం జరిగింది. వీరందరూ జూన్ 1st నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా తూర్పు గంగవరం లోని పలువురు YSRK. ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
30 May 2025 11:29 AM
0
6
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే లబ్ధిదారులకు రేషన్ సరఫరా
తాళ్లూరు లోని స్థానిక రెవెన్యూ కార్యాలయం నందు తహశీల్దార్ సంజీవరావు ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ సంజీవరావు మాట్లాడుతూ, రేషన్ డీలర్లు రేషన్ షాపుల వద్దనే రేషన్ అందించాలని,ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయాలని సూచించారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు,వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని, ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఇమ్మానియేల్ రాజ్ , వి.ఆర్.ఓ లు చంద్రశేఖర రావు, నాగూర్ బి, మండల రేషన్ డీలర్లు హాజరయ్యారు.
View More
Latest News
30 May 2025 11:28 AM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆంజనేయులుకు ఘన సన్మానం
తాళ్లూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండపల్లి ఆంజనేయులు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా నియమితులవటం తమకెంతో ఆనందంగా ఉందని కళాశాల బృందం అన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం, ఆయనకు పూల మాలలు వేసి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.
View More
Latest News
30 May 2025 11:28 AM
0
5
Newsread Image

No.1 Short News

Umar Fharooq
30 - 5 - 2025 సంతనూతలపాడు లో జాబ్ మేళా
సంతనూతలపాడు ఎండ్లూరు డొంకలోని మహిళా ప్రాంగణంలో 30 - 5 - 2025 శుక్రవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఇందులో 10కి పైగా బహుళ జాతీయ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వారు,10 వ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న వారు అర్హులని తెలియజేశారు.
View More
Latest News
30 May 2025 11:28 AM
0
2
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కనిగిరిలో కేంద్ర బృందం డయాలసిస్ కేంద్ర పరిశీలన
కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటితో పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర నీటి పరిశోధన సంస్థ గురువారం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించటం జరిగింది. డయాలసిస్ రోగుల సమస్యలతో పాటు, కనిగిరి ప్రాంతంలోని నీటి ఫ్లోరైడ్ శాతం తాగునీటి పథకాలకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోవడం జరిగింది.
View More
Latest News
30 May 2025 11:28 AM
0
1
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఋతుక్రమం ఆరోగ్యం - పరిశుభ్రత దినోత్సవం
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనంద ఋతుక్రమం ఆరోగ్యం-పరిశుభ్రత దినోత్సవంను డాక్టర్ మౌనిక నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, రోజు స్నానం చేయాలి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాడి పడేసిన బట్టకు బదులు శానిటరీ న్యాప్‌కిన్ వాడాలి, వాడుకున్న శానిటర్ నాప్కిన్ కాగితంలో చుట్టి డస్ట్ బిన్ లో పడవేయాలి, ప్రతి 4 - 6 గంటలకు ఒకసారి శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి. పీరియడ్స్ ఆడవారిలో 10 - 14 సంవత్సరాలలో మొదలై 46 - 49 సంవత్సరాలలో పోతుందని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పీరియడ్స్ కాలంలో తగ్గిన ఆహారం విశ్రాంతి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
29 May 2025 06:47 AM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కవులు రైతులందరూ పంట సాగుతారు హక్కుపత్రం పొందాలి
భూమిని సాగు చేసుకునే కవులు దారులు భూయజమాని యొక్క అంగీకార పత్రం పొంది వి. ఆర్. ఓ ద్వారా ధ్రువీకరించబడిన తదుపరి కౌలు రైతులందరూ సి.సి. ఆర్. సి కార్డు పొందవచ్చని మండల తహసిల్దారు K.సంజీవరావు , వ్యవసాయ అధికారి బి.ప్రసాదు రావు తెలిపారు. C.C.R.C కార్డు పొందటం ద్వారా ప్రభుత్వం అందించే ఉచిత పంటల భీమా, సబ్సిడీ ,వ్యవసాయ శాఖ ద్వారా వచ్చు రాయితీలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్ట రాయితీలు పొందుటకు ఉపయోగపడుతుందని, దేవాదాయ భూములకు కూడా పంట సాగుతారు హక్కు పత్రం పొందవచ్చని ఎ ఓ తెలిపారు. కార్యక్రమంలో వి.ఆర్.ఓ లు, వి. ఎ .ఎ లు పాల్గొన్నారు.
View More
Latest News
29 May 2025 06:47 AM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు కీలక పదవి
తాళ్లూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కే.ఆంజనేయులు ను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, ఆదేశాలు జారీ చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తీక్ శుక్లా గారు. ఈ సందర్భంగా పలువురు K. ఆంజనేయులుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
29 May 2025 06:47 AM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మహానాడులోని రక్తదాన శిబిరంలో గొట్టిపాటి లక్ష్మి కీలక పాత్ర
కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. మహానాడులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కీలకపాత్ర పోషిస్తున్న సందర్భంగా, దర్శి నుంచి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ,ఈ రక్తదాన శిబిరా కమిటీలో తాను భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని, అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని తాము ఇచ్చిన పిలుపుతో స్వతహాగా రక్తదానం చేసి,ఎంతోమంది జీవితాలను కాపాడటం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్త దాతలకు అభినందన పత్రాలు అందజేశారు.
View More
Latest News
29 May 2025 06:47 AM
0
2
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వైఎస్ఆర్ జిల్లా పేరు మారింది జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం కడప జిల్లాకు ఆయన జ్ఞాపకార్థం వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేశారు.అయితే,ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కడప పదాన్ని తొలగించి కేవలం వైఎస్సార్ జిల్లాగా వ్యవహరించడం మొదలుపెట్టింది.గతంలో, చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో జిల్లాలో పర్యటించిన సందర్భంలో,తాము అధికారంలోకి వస్తే జిల్లా పేరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి కూడా ఈ విషయమై పలు విజ్ఞప్తులు రావడంతో, కూటమి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మార్చడం జరిగింది.
View More
Latest News
29 May 2025 06:47 AM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా కమ్మేసిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా పూర్తిగా విస్తరించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పరిణామంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని ఆయన అన్నారు.
View More
Latest News
29 May 2025 06:46 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన డా|| గొట్టిపాటి లక్ష్మీ
1995 నుంచి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా అసమాన నాయకత్వంతో తెలుగుదేశం పార్టీని దేశంలోనే అగ్రగామి రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన చంద్రబాబు గారి నాయకత్వం అనితరసాధ్యం. చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ ఆలోచనలు, రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి యావత్ తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు పునరంకితం అవుతామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు.
View More
Latest News
28 May 2025 18:43 PM
2
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తూర్పువీరాయపాలెంలో వివాహిత ఆత్మహత్య
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పు వీరయపాలెం ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వెంకటరత్నం అనే గృహిణి సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. భర్త బాల సుందర రావు వంట చేయలేదని మందలించడంతో మనస్తాపానికి లోనయి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
View More
Latest News
28 May 2025 17:10 PM
0
6
Newsread Image

No.1 Short News

Umar Fharooq
సేంద్రీయ ఎరువులతోనే సాగు భూముల రక్షణ
సేంద్రీయ ఎరువు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నేల మృదువుగా గుల్ల బారేటట్లు కండ కలిగి ఉండేటట్లు చేస్తుందని ,సేంద్రియ పదార్థం వలన సూక్ష్మజీవులు పెరిగి మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు హార్మోన్లు, ఎంజైన్లు సమకూర్చి,నేలస్థితి నీటిని పట్టి ఉంచే శక్తి గాలి ప్రసరణ మెరుగుపడి పంట మొక్కల వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయని, కనుక రైతులు ప్రతి ఎకరా పొలంలో కనీసం 5 ట్రాక్టర్ ట్రక్కుల నయ్యిదిబ్బ ఎరువును తోలి కలియ దున్నాలని మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాద్ రావు తెలిపారు. విచక్షణారహితంగా వాడుతున్నా రసాయన ఎరువుల వల్ల భూములు సహజత్వాన్ని కోల్పోయి ఉప్పుచేడు, పాలచెడు ,కారుచేడు భూములుగా మారుతున్నాయని ,రసాయన కాలుష్య బారున పడినెల ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడుల పై ప్రభావం చూపుతున్నదని ఎ ఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో వి. ఎ.ఎ , k అశోక్ , రైతులు పాల్గొన్నారు.
View More
Latest News
28 May 2025 11:17 AM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు విద్యుత్ కేంద్రంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
తాళ్లూరు మండల విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలియజేశారు. తాళ్లూరు మండల కేంద్రంలో 33 కె. వి విద్యుత్ టవర్స్ వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేశారు.
View More
Latest News
27 May 2025 07:49 AM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఖరీఫ్ లో సాగుకు అనువైన వరి రకాలు
ఖరీఫ్ లో సాగుకు అనువైన వరి రకాల విత్తనాలను ధ్రువీకరించి నా సంస్థలు, దుకాణాలు, నమ్మకమైన రైతుల నుండి సేకరించుకుని మెరక భూములలో సన్న గింజ రకాల సాగు పెంచుకుంటూ పల్లపు భూములలో మద్యస్థ రకాల సాగు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. సన్న రకాలైన ఎం. టియు 1224,1271,1190, రకాలు 140 రోజుల వ్యవధి అని, దీర్ఘకాలిక రకాలు బి.పి.టి 5204, ఎం.టియు 1262, బి.పి.టి 2595,2846,2782 150 రోజుల వ్యవధి అని, చౌడు ప్రాంతాలలో ఎం.సె.యం 100,103, రకాలు 150 రోజుల వ్యవధి అని మన నేలలకు మన వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను సేకరించుకొని విత్తుకోవాలని ఎ ఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
View More
Latest News
27 May 2025 07:49 AM
0
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలో యోగ అవగాహన కార్యక్రమం
తాళ్లూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఈనెల 27 నుండి 31 వరకు, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మండల జిల్లా పరిషత్తు కార్యాలయం,వెలుగు కార్యాలయం లలో నిర్వహించబడే యోగ అవగాహన కార్యక్రమం యోగాంధ్రలో, తప్పనిసరిగా హాజరు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్‌ అన్సారియా ఆదేశాలు జారీ చేయడమైనది.
View More
Latest News
27 May 2025 07:49 AM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మహానాడుకు దర్శి పసుపు సైన్యం
దర్శి గడియార స్తంభం వద్ద గల దారం సుబ్బారావు ఆఫీస్ నందు దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ టిడిపి నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ప్రతి ఒక్కరూ కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - దారం సుబ్బారావు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, టిడిపి నాయకులు బడే, కరిముల్లా, వేణు, తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
27 May 2025 07:48 AM
0
7
Newsread Image

No.1 Short News

Newsread
దేశంలో కరోనాతో ఇద్దరు మృతి
దేశంలో కరోనాతో ఇద్దరు మృతి మహారాష్ట్ర థానేలో 21 ఏళ్ల యువకుడు.. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కేరళలో 273, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు
View More
Latest News
26 May 2025 08:16 AM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పంజా విసురుతున్న కరోనా మహమ్మారి కరోనా వచ్చిన 21 ఏళ్ల యువకుడు మృతి
మహారాష్ట్రలోని థానేలో కరోనా వైరస్ సోకిన 21 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం కరోనా వచ్చిన యువకుడు గురువారం నాడు తీవ్రమైన డయాబెటిస్ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. అనంతరం అతనికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే, చికిత్స పొందుతున్న ఆ యువకుడు మృతి చెందాడు.
View More
Latest News
25 May 2025 09:22 AM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బొద్దికూరపాడులో మెగా ఉచిత వైద్య శిబిరం
25 - 5- 2025 అనగా ఆదివారం అమెరికన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో ఉచిత మెగా వైద శిబిరం నిర్వహించనునట్లు మెడిక్యూర్ హాస్పిటల్ మేనేజర్ సుధాకర్, స్నేహ హాస్పిటల్ పిఆర్ఓ కాశిరాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలుకు చెందిన అనుభవంతులైన డాక్టర్లు కె. శ్రీధర్ బాబు, కె. రవళి, యం. శరత్, వై. స్నేహ పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయటం జరుగుతుందని మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెరికన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలియజేశారు.
View More
Latest News
25 May 2025 09:22 AM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
25 - 5 - 2025 ఆదివారం చీమకుర్తిలో రక్తదాన శిబిరం
చీమకుర్తి జవహర్ హాస్పిటల్ నందు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఎ, డివైఎఫ్ఎ, నాయకులు శనివారం తెలియజేయడమైనది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రక్తదాన శిబిరం జరుగును కావున చీమకుర్తి పరిసర ప్రాంతాల వాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎస్ ఎఫ్ ఎ, జిల్లా సహాయ కార్యదర్శి దేవరాజు కోరారు.
View More
Latest News
25 May 2025 09:21 AM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బెంగళూరులో కరోనా కలకలం 9 నెలల పసికందుకు కరోనా పాజిటివ్
బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. బెంగళూరు నగర శివార్లలోని హోస్కోటే పట్టణానికి చెందిన ఈ చిన్నారి ప్రస్తుతం వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, బెంగళూరు నగరంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
View More
Latest News
24 May 2025 15:59 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ప్రత్తిలో రసంపీల్చే పురుగులను నివారించాలి
వేసవిలో సాగు చేసిన ప్రత్తి ఎక్కువగా లక్కవరం దోసకాయలపాడు పరిధిలో ఉందని ,ఆ రైతులు సాగు చేసిన ప్రత్తి 30 నుండి 60 రోజుల వయసులో ఉందని, రసం పీల్చే పురుగులు ఆశించినట్టయితే తగు నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. లక్కవరం దోసకాయలపాడు క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి ఇమిడా క్లో ప్రడ్ 0.4 మి.లి లేదా ఏసీ ఫేట్ 1.5 గ్రా లీటరు నీటిని కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారి చేయాలని తెలిపారు. పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 25 చొప్పున అక్కడక్కడ అమర్చి తెల్ల దోమ లను గమనించి మందులు పిచికారి చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో వి ,ఎ ,ఎ A . భార్గవి, రైతులు పాల్గొన్నారు.
View More
Latest News
24 May 2025 08:13 AM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా
దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా కొవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లో ఒక కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
View More
Latest News
24 May 2025 08:13 AM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కీలకమైన 1/2019 సర్క్యులర్‌ను పునరుద్ధరిస్తూ కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.
View More
Latest News
23 May 2025 14:08 PM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ కరోనా విశాఖపట్నంలో 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్
విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో నివసిస్తున్న 28 ఏళ్ల వివాహిత మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి, వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
View More
Latest News
23 May 2025 14:08 PM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఆంధ్ర ప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేస్ నంద్యాలలో 75 ఏళ్ల మహిళకు కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
View More
Latest News
23 May 2025 14:07 PM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వర్షపు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
సాధారణంగా మే నెలలో రోహిణి కార్తిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ దానికి భిన్నంగా వాతావరణంలో వచ్చిన అనుప్యమైన మార్పుల వలన ఈ నెలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందేలా రైతులు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. అల్లూరు క్షేత్ర పర్యటనలో భాగంగా మే నెలలో 9,16,18,19, 20 తేదీలలో 84.1 మి.మి వర్షపాతం నమోదయింది ఇది ఎంతో ఆశాజనక పరిస్థితి కనుక, ఈ వర్షాలను ఉపయోగించుకొని రైతులు పచ్చి రొట్ట విత్తనాలు, జనువం ,జిలుగా ,పిల్లి పెసర, మినుము, పెసర, ఉలవలు ,అలసందలు, సోయాచిక్కుడు, చల్లి పశువులకు మేతగా వినియోగించుకుని 40 రోజుల తదుపరి భూమిలో బాగా కలియదున్నాలని ఎ ఓ తెలిపారు.
View More
Latest News
22 May 2025 15:53 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
షర్మిల దీక్షకు మద్దతుగా కైపు వెంకటకృష్ణారెడ్డి
విశాఖ స్టీల్ కర్మాగారంలో కార్మికుల తొలగింపునకు నిరసనగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, విశాఖ స్టీల్ కర్మాగారంలో 2000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుండి తొలగించడం సరికాదని, వారందరినీ వెంటనే విధులలోకి తీసుకోవాలని,తాను కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ దీక్షలో షర్మిలకు మద్దతుగా రాష్ట్ర అసంఘటిత కార్మికుల,ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది.
View More
Latest News
22 May 2025 15:52 PM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
23న ఒంగోలులో APWJF జిల్లా మహాసభ
ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు APWJF జిల్లా మహాసభ ఒంగోలు డీ మార్ట్ సమీపంలోని ఎమ్మెస్ కల్యాణమండపంలో జరుగుతుంది.మహాసభ కార్య క్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిద పార్టీల నేతలు హాజరు కానున్నారు.జిల్లా నలు మూలల నుంచి జర్నలిస్టు మిత్రులు 23 వ తేది ఉదయం 9.30 కల్ల హాజరు కాగలరు. APWJF రాష్ట్ర నాయకులు వి భక్తవత్సలం,జిల్లా అధ్యక్ష, కార్యదర్శి గొట్టిపాటి నాగేశ్వరరావు,యస్ వి బ్రహ్మం
View More
Latest News
21 May 2025 11:14 AM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పించిన అసంఘటిత కార్మికుల,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి .
View More
Latest News
21 May 2025 10:33 AM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరులో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి
తాళ్లూరులోని ఎంపీడీవో ఆఫీసులో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ,టంగుటూరి ప్రకాశం పంతులు నెహ్రూ సమకాలికుడిగా, సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం వాసి కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ,ధైర్యానికి ,సాహసానికి, జాతీయ భావానికి చిరునామా టంగుటూరి ప్రకాశం పంతులు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ,మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి , ఐ శ్రీనివాసరెడ్డి రాచకొండ వెంకట్రావు,జనసేన నేత మారిశెట్టి హనుమంతు రావు పాల్గొన్నారు.
View More
Latest News
21 May 2025 08:16 AM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండల విద్యుత్ కేంద్రంలో అంతరాయం
21 -5 -2025 అనగా బుధవారం తాళ్లూరు విద్యుత్ కేంద్రంలో మధ్యాహ్నం 1.30గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు మండల ఇన్చార్జి జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలియజేస్తూ, విద్యుత్ టవర్స్ కు వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
View More
Latest News
21 May 2025 08:16 AM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
రాయపాటి శైలజకు శుభాకాంక్షలు
19-05-2025 సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజ.
Latest News
21 May 2025 08:16 AM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తుఫాను వలన నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
రాష్ట్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలోని ప్రజలు అసలే పండించిన పంటకు గిట్టిపాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రకృతి విపత్తు వల్ల రైతుల పరిస్థితి మరీ దారుణం కానుంది వరి పంట కోసి కుప్పలుగా పెట్టుకొని వేల ఎకరాలలో ధాన్యం పాడైపోతుంది తక్షణమే అధికారులు ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనాలి అని రాష్ట్ర ఆసంగటిత కార్మికుల ,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ,దర్శి నియోజకవర్గ ఇన్చార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.
View More
Latest News
21 May 2025 08:15 AM
0
10
Newsread image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో వరి పంటల పరిశీలన
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం, సోమవరపాడు, దారంవారిపాలెం గ్రామాలలో సోమవారం ఏవో ప్రసాదరావు పర్యటించారు. వర్షానికి తడిసిన వరి ఓదెలను ఆయన పరిశీలించారు. కోసిన వరి పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా బయటకి పంపించాలని రైతులకు సూచించారు. నివేదికను మండల, జిల్లా కార్యాలయాలకు తెలపాలని అన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు ఎంపీడీవో సూచనలు
తాళ్లూరులో ఎంపీడీవో దార హనుమంతరావు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు షుగర్, బీపీ వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ ఆయా వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
7
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండల నూతన టిడిపి అధ్యక్షులకు శుభాకాంక్షలు
తాళ్లూరు మండలం టిడిపి నూతన అధ్యక్షులు గా నియమితులైన మేడగం వెంకటేశ్వర రెడ్డిని తాళ్లూరు ఎంపీపీ ఛాంబర్ లో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ,మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి , ఐ శ్రీనివాసరెడ్డి రాచకొండ వెంకట్రావు, గా.వెనుబాబు, జనసేన నేత మారిశెట్టి హనుమంతు రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
20 May 2025 22:34 PM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
రేషన్ వ్యాన్లు రద్దు, మళ్లీ పాత పద్దతి లొనే డీలర్ ల ద్వారా రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు.. రేషన్ షాపులలో డీలర్ల ద్వారా.బియ్యం తీసుకోవాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
View More
Latest News
19 May 2025 20:10 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బొద్దికూరపాడు లో స్వయం ఉపాధి శిక్షణ
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో పాత బ్యాంకు ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్ సెట్ ) ఒంగోలు వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న 35 మంది మహిళల టైలరింగ్ శిక్షణ కార్యక్రమం టైలరింగ్ ఫ్యాకల్టీ కె అరుణ, బాపూజీ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు థియరీ , ప్రాక్టికల్స్ విధానంలో టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.ఈ శిక్షణ కార్యక్రమం రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, లీలా కృష్ణ, సుధీర్ పర్యవేక్షణలో జరుగుతుంది.
View More
Latest News
18 May 2025 15:44 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో శనివారం జూనియర్ ఎన్టీఆర్ 42 వ జన్మదినోత్సవం సందర్భంగా బీసీ కాలనీ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఒంగోలు వారి ద్వారా గ్రామానికి చెందిన 37 మంది యువతీ యువకుల నుండి రక్తం సేకరించి ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను రక్తదాతలకు అందించారు. ప్రమాద సమయంలో, ఆపద సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడేటటువంటి రక్తదానం గ్రామంలోని హిందూ, ముస్లిం యువతీ యువకులు పార్టీలకు, వర్గాలకు,మతాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల గ్రామానికి చెందిన పలువురు నిర్వాహకులను అభినందించారు.రక్తదాతలకు, అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూల్ డ్రింక్స్ , పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.
View More
Latest News
17 May 2025 16:13 PM
0
21
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం
శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య అధికారి మౌనిక తమ సిబ్బందితో కలిసి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వైద్య అధికారి మౌనిక మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసర ప్రాంతాల్లో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, నీటి తొట్టెల్లో వర్షపు నీటిని నిలువ చేయరాదని ఈ డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు పగలు మాత్రమే దాడి చేస్తాయని తెలియజేస్తూ, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు నిర్మూలనకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
View More
Latest News
17 May 2025 15:11 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Breaking News
17 May 2025 11:26 AM
1
16
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Latest News
17 May 2025 11:23 AM
0
9
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel